జర్నలిస్టుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ సారయ్య
జర్నలిస్టులతో నాకున్న వ్యక్తిగత అనుబంధంతో సందర్శించాను
ఈ దీక్షను రాజకీయం చేయదలుచు కోలేదు.
జర్నలిస్టుల కోసమే ఈ డబుల్ బెడ్రూమ్స్ నిర్మాణం జరిగింది
ఇండ్లులేని పేద జర్నలిస్టులకు న్యాయం జరగాలి
….మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
వరంగల్ తూర్పు,నేటిధాత్రి
వరంగల్ తూర్పు నియోజకవర్గం వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా జరుగుతున్న దీక్షను మంగళవారం మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన జర్నలిస్టులతో తొమ్మిది రోజులుగా జరిగిన దీక్షల సమీకరణలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అయన మాట్లాడుతూ, ఉమ్మడి వరంగల్ జిల్లా పాత్రికేయులతో వ్యక్తిగత సంబంధం ఉంది. ఆ అభిమానంతోనే జర్నలిస్టుల శిభిరాన్ని వ్యక్తిగతంగ సందర్శించినట్లు తెలిపారు. దీక్షలు, నిరసనలు శాంతియుతంగా చేయడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు. జర్నలిస్టుల న్యాయం కోసం తన వంతు సహాయ సహకారాలు చేస్తానని ఈ సందర్బంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.