కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు.

కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు
హైకోర్టును ఆశ్రయించిన కౌశిక్ రెడ్డి
ఈనెల 28 వరకు అరెస్టు వద్దని ఆదేశించిన హైకోర్టు
జమ్మికుంట: నేటిధాత్రి

 

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై 21వ తారీకు రోజు కమలాపూర్ మండలం గుండేడు క్వారీ యజమాని అయిన కట్ట మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి హనుమకొండ పోలీస్ స్టేషన్లో నా భర్తను డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు 50 లక్షలు కావాలని వేధిస్తున్నాడని మానసికంగా కృంగిపోతున్నాడని మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి ఫిర్యాదు చేయగా దానిపై కేసు నమోదయింది అది అలా ఉండగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి వాదన ఏమనగా గతంలో క్వారీ చుట్టూ ప్రక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు దానివల్ల నష్టం జరుగుతుంది కనుక మా ఊరికి ఏదైనా ఒక అభివృద్ధి చేయాలని చెప్పడం వల్ల అప్పుడు 25 లక్షలు ఒప్పుకున్నాడు 15లక్షలు ఇచ్చాడు ఇంకా మిగతా 10 లక్షల రూపాయలు ఇవ్వలేదని నాకు గ్రామస్తులు నా దగ్గరికి రావడం వల్ల ఫోన్ చేసి ఇవ్వాలని చెప్పాను దాని విషయంపై నాపై నేనే వసూలు చేస్తున్న నేనే అడుగుతున్నాను నేనే ఒత్తిడి చేస్తున్న అని దురుద్దేశంతో బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభ 27వ తారీకు ఉంది ఆ సభకు నేను ఉండకూడదని ప్రత్యర్థులు ఆలోచించి నాపై అక్రమ కేసును బనాయించి నన్ను అరెస్టు చేసి ఉండకుండా నేను సభలో ఉంటే ఆ సభకు పూర్తిస్థాయిలో జనాన్ని సమీకరిస్తా సక్సెస్ అవుతది కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి లేకుంటా ఉంటే ఈ సభ నీరుగారిపోతుంది అనేటువంటి ఉద్దేశంగా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టే ఆ సభను ఆపడానికి ఆ సభను విజయవంతంగా జరగకుండా ఉండడానికి ఎన్నో రకాల పాచికలు రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ రైతుల అనుమతి లేకుండా రైతుల భూములను స్వాధీన పరచుకొని మీటింగ్ పెడుతున్నారు కొన్ని కాలువలు మొరంతో కూడిపినారని కూడా ఆరోపణ చేసినారు నన్ను అరెస్టు చేసి నేను ఉండకుండా చేస్తే ప్రభావం తగ్గుతది అనేటువంటి ఉద్దేశంతో దేశ పూర్వకంగా తప్పుడు కేసు పెట్టారు దానిపై నేను హైకోర్టును సంప్రదించగా ఈరోజు నాకు స్టే వచ్చింది నా ప్రజల వైపున కొట్లాడుతున్న భగవంతుని ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కనుకనే న్యాయం గెలిచింది న్యాయ పరంగానే నేను వెళ్తా న్యాయ పరంగానే నాకు స్టే వచ్చింది ఎవరు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు సభను ఆపాలన్న ఆగదు ఎందుకంటే ప్రజల మద్దతు ఉంది ప్రజల యొక్క సంఘీభావంతో ఆ సభ జరుగుతుంది కనుక సభ విజయవంతం అయితది కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత ఈ సభతో ని   తెలుస్తది.

బీ ఆర్ ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలి.!

బీ ఆర్ ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలి

పరకాల మాజీ ఎంపీటీసీ చందుపట్ల సాయి తిరుపతి రెడ్డి

పరకాల నేటిధాత్రి:

టిఆర్ఎస్ రజతోత్సవ సభకు తెలంగాణ ప్రజలు తరలిరావాలని పరకాల మాజీ ఎంపీటీసీ,మలిదశ ఉద్యమకారుడు చందుపట్ల సాయి తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు.ఆయన మాట్లాడుతూ కష్ట నష్టాలకు ఓర్చి తెచ్చుకున్న తెలంగాణ, మోసపూరిత కాంగ్రెస్ చేతుల్లో పడి ఆగమైపోతున్నదని,వారి పాలనను ఎండగట్టి తెలంగాణను కాపాడుకునే దశలో ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బీ ఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీగా జనాలు తరలివచ్చి విజయవంతం చేయాలని పేర్కొన్నారు.కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదువులను లెక్కచేయలేదని, చావుదాకా వెళ్లి తెలంగాణను సాధించినట్లు గుర్తు చేశారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్నిరంగాల్లో దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.ఈ నెల 27న ప్రతి ఒక్కరు గులాబీ జెండాతో సభకు కదలాలని కోరారు.

పహాల్గమ్ లో పర్యాటకుల పై జరిగిన దాడి.!

పహాల్గమ్ లో పర్యాటకుల పై జరిగిన దాడిని నిరసిస్తూ విధులను బహిష్కరించిన న్యాయవాదులు:-

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

 

 

గురువారం రోజున హన్మకొండ మరియు వరంగల్ న్యాయవాదుల ఆధ్వర్యంలో కాశ్మీర్ లోని పహాల్గమ్ లో మంగళవారం యాత్రికుల పై ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ కోర్టు విధులను బహిష్కరించి కోర్టు గేట్ ముందు బైఠాయించారు. ఆతర్వాత న్యాయవాదులు ర్యాలీ గా వెళ్లి తీవ్ర వాదుల మారణహోమాన్ని నిరసిస్తూ వరంగల్ మరియు హన్మకొండ జిల్లాల కలెక్టర్లకు భారత ప్రభుత్వానికి మరియు ఆర్మీకి మద్దతుగా లేఖలు ఇవ్వడం జరిగింది.

 

Lawyers

తీవ్ర వాదుల దాడిలో మరణించిన కుటుంబాలకు న్యాయవాదులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఇట్టి కార్యక్రమంలో హన్మకొండ/వరంగల్ బార్ అసోసియేషన్ ల అధ్యక్షులు పులి సత్యనారాయణ, వలస సుదీర్ మరియు ఇరు బార్ అసోసియేషన్ ల ప్రధాన కార్యదర్శులు రవి, రమాకాంత్, ఇరు బార్ అసోసియేషన్ల కమిటీ సభ్యులు, సీనియర్, జూనియర్  న్యాయవాదులు మరియు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబంమును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.!

బాధిత కుటుంబంమును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

మంథని :- నేటి ధాత్రి

 

 

మంథని మండలం పుట్టపాక గ్రామంలో దుర్కి లక్ష్మయ్య ప్రథమ వర్థంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు

చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్.!

చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

ముత్తారం నేటి ధాత్రి:

ముత్తారం మండల కేంద్రంలో మొగిలి కిరణ్ – స్వప్న పుత్రిక సౌధమిని నూతన వస్త్రాలంకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ అత్తె చంద్రమౌళి బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.!

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారీ సొంత నిధులతో బోర్ ఏర్పాటు

జహీరాబాద్. నేటి ధాత్రి:

డైవర్స్ కాలనీలో నీటి సమస్యను స్థానిక ప్రజలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారీ దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి బోర్ వేయిస్తానని హామీ ఇచ్చారు.దీంతో గురువారం రోజున బోర్ డ్రిల్ చేసేందుకు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టి బోర్ తవ్వకాన్ని ప్రారంభించారు.ప్రజలు నీటితో కష్టాలు పడకుండా ఉండేందుకు బోర్ డ్రిల్ చేయిండం పట్ల స్థానిక ప్రజలు హర్షవ్యక్తం చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డా౹౹ఉజ్వల్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ భీమయ్య,పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ళ.శ్రీకాంత్ రెడ్డి,యూత్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి,అశ్విన్ పాటిల్, ప్రతాప్ రెడ్డి,రంగా అరుణ్ కుమార్,యూత్ కాంగ్రెస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్ గౌడ్,సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,మైనార్టీ సెల్ టౌన్ అధ్యక్షుడు జావిద్,బి.మల్లికార్జన్,అక్బర్,హర్షద్ పటేల్,ముస్తఫా,నిజాం,బర్కత్ మరియు డైవర్స్ కాలనీ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబలను పరామర్శంచిన.

బాధిత కుటుంబలను పరామర్శంచిన కుంజ కుసుమంజలిసూర్య

కొత్తగూడ, నేటిధాత్రి:

 

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం దుర్గారాం గ్రామానికి చెందిన జంగా సంపత్ ఎల్లయ్య ఇద్దరు సోదరులు వారి కుమార్తెలైన
జంగా మౌనిక జంగా నవ్యలత అను అక్కాచెల్లెలు. బుధవారం రోజు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగిన సంగతి విధితమే.. బాధితుల బాధను కన్నీళ్లను చూసిన స్థానిక నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు ధనసరి సీతక్క కు విషయం చెప్పడం జరిగిందని మంత్రివర్యులు సీతక్క ఆదేశాల మేరకు వారి కోడలు ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుంజ కుసుమాంజలిసూర్య గురువారం రోజు దుర్గరాం గ్రామానికి విచ్చేసి బాధిత కుటుంబాలను ఓదార్చి కన్నింటి పర్యంతమయ్యారు
బోలెడు భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయిలు రోడ్డు ప్రమాదాలు చనిపోవడం చాలా బాధాకరమని వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చి వారికీ ప్రగడ సానుభూతిని తెలియజేసి ప్రభుత్వపరంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని కుంజ కుసుమాంజలిసూర్య, అన్నారు వారి వెంట మాజీ ఎంపీపీ బానోత్ విజయ, రూపు సింగ్ ,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకర బోయిన మొగిలి,మాజీ జడ్పిటిసి పుల్సం పుష్పలత, టీపీసీసీ సభ్యులు చల్ల నారాయణరెడ్డి, మాజీ జెడ్పిటిసి కారోజు రమేష్, డిసిసి సభ్యులు వీరనేని వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ కాడబోయిన జంపాయ్య, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కర్ర జనార్దన్ రెడ్డి,నోముల ప్రశాంత్ యాదవ్, ఉపేంద్ర చారి, ముస్కు, వెంకన్న గొందిరాజు పల్లె రమేష్ గ్రామ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…

ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు మానసిక.

జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు మానసిక,ఆరోగ్య అవగాహన సదస్సు

శాంతి భద్రతల పరిరక్షణకు ముందుండే అధికారుల,సిబ్బంది యొక్క భద్రత,ఆరోగ్యం మాకు ముఖ్యమైనవి

పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరు మానసిక పరిపక్వత పెంపొందించుకోవాలి.

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతి భద్రతల పరిరక్షణకు ఎప్పుడూ ముందుండే పోలీస్ సిబ్బంది,అధికారులకు మానసిక స్థితి ఎంతో కీలకం వారి మానసిక ఆరోగ్యం కాపాడటం అనేది తక్షణ అవశ్యకతగా గుర్తించి రాష్ట్ర డిజిపి శ్రీ జితేందర్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు గురువారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవతో ప్రఖ్యాత మానసిక నిపుణులు డాక్టర్ అశోక్ కుమార్& టీం చే మానసిక ఆరోగ్య అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ యొక్క కార్యక్రమనికి ముఖ్య అతిదిగా జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐ.పీ.ఎస్ హాజరైనరు.

ఈఅవగాహన సదస్సులో పోలీసు అధికారులు,సిబ్బంది ఎదుర్కొంటున్న వివిధ మానసిక ఒత్తిడులపై సమగ్ర అవగాహన ఇచ్చారు.

 

ముఖ్యంగా నిరంతర ఒత్తిడిలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఎలాంటి మానసిక సమస్యలు ఎదురవుతాయో, వాటిని ఎలా గుర్తించాలి ఎలా పరిష్కరించుకోవలెనే మార్గాల, ఒత్తిడి నిర్వహణ,మానసిక స్థైర్యం,ఆత్మవిశ్వాసం పెంపు, కుటుంబ వ్యక్తిగత జీవితానికి సమతుల్యత ,ఫైన్షియల్ మేనేజ్మెంట్ వంటి పలు అంశాల పై అవగాహన, పలు సూచనలు అందించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.

శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్ , ఆర్ముడ్ పోలీస్ సిబ్బంది పాత్ర కీలకమని అట్టి సిబ్బంది సంక్షేమానికి తెలంగాణ పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.

సిబ్బంది అధికారుల మానసిక స్థితి ,మానసిక ఆరోగ్యం కాపాడటం అనేది తక్షణ అవశ్యకతగా గుర్తించి రాష్ట్ర డి.జి.పి జితేందర్ ఐ.పి.ఎస్ ఆదేశాలమేరకు జిల్లా పొలిస్ అధికారులకు,సిబ్బందికి మానసిక ఆ అగహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

పోలీస్ సిబ్బందికి శాఖపరమైన, వ్యక్తిగత సమస్య వుంటే ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకరవలని ఆయా సమస్యల పరిష్కరనికి కృషి చేయడం జరుగుతుందన్నారు.

వ్యక్తిగత సమస్యలకు గురై ఒంటరిగా ఉన్నామనే భావన నుండి బయటకు రావాలని మీ భద్రత,ఆరోగ్యం మాకు ముఖ్యమైనవి అని సిబ్బందికి భరోసా కల్పించారు.

ప్రతి ఒక్కరు మానసిక పరిపక్వత కలిగి ఉండాలని ఆయా పోలీస్ స్టేషన్ అధికారులు ప్రతి నెల సిబ్బందితో సవేశాలు నిర్వహించి వారి సమస్యలు, ఇబ్బందులు అడిగి తెలుసుకోవలన్నారు.

తాత్కాలిక ఆనందాల కోసం ప్రాణాలను,కుటుంబ సభ్యులను ప్రమాదంలో పెట్టవద్దని అధికారులు, సిబ్బంది విరామ సమయంలో కుటుంబలతో గడపాలని తెలిపారు.

మహిళ సిబ్బందికి సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుందని,మహిళ సిబ్బందికి అన్ని రకాల అండగా ఉంటామని ఎస్పి తెలిపారు.

జిల్లా పోలీస్ శాఖ జిల్లా సిబ్బంది సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అధికారులకు, సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య శిబిరాలు,యోగ తరగతులు, క్రీడలు,చేపడుతు సిబ్బందిలో నూతనోత్సాహం నింపడం జరుగుతుందన్నారు.

నిత్యం యోగ,వ్యాయామం లాంటివి అలవాటు చేసుకోవడం ద్వారా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటూ ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదురుకోవచ్చని అధికారులకి,సిబ్బంది సూచించారు.

పిలువగానే వచ్చి జిల్లా అధికారులకు, సిబ్బందికి పలు అంశాలపై అవగాహన కల్పించిన రాష్ట్ర ఆత్మహత్యలు నివారణ సంస్థ టీమ్ సబ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,ఆత్మహత్యలు నివారణ సంస్థ చైర్మన్ డాక్టర్ అశోక్, సభ్యులు రామకృష్ణ ,సైకాలజిస్ట్ లు శైలజ,రామోజిరావు, బోడా అరుణ,సి.ఐ మొగిలి, మధుకర్, ఆర్.ఐ లు రమేష్, మధుకర్, యాదగిరి, ఎస్.ఐ లు రమాకాంత్, రామ్మోహన్, ప్రశాంత్ రెడ్డి, శ్రీకాంత్, ఆర్.ఎస్.ఐ లు శ్రవణ్, సాయి కిరణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం.!

బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం

-అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికే ఈ ఒప్పందం

-కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కల్లపల్లి రాజు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ వాళ్లు బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కల్లపల్లి రాజు విమర్శించారు. గురువారం ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దొంగల ముఠాల రాష్ట్రాన్ని పదేండ్లు దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, వారు చేసిన అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోకుండా ప్రధాని మోడీకి దాసోహమయ్యారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల బలహీనతలను ఆసరాగా చేసుకున్న బీజేపీ రాష్ట్రానికి స్వయంగా రావాల్సిన వాటాలను, నిధులను ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. గత పదేండ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతిచ్చింది బీఆర్ఎస్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. కవితను లిక్కర్ స్కాం నుంచి కాపాడేందుకు బీజేపీ ఊడిగం చేసింది నిజం కాదా? అని అడిగారు. సంఖ్యా బలం లేని బీజేపీ ఏ అండ చూసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకే బీఆర్ఎస్ పార్టీ తాపత్రయపడుతుందన్నారు. 15 నెలల స్వల్ప కాలంలోనే తమ సర్కార్ గొప్ప పనులను చేపట్టిందని, అలాంటి సర్కార్ ను విమర్శించడం బీఆర్ఎస్ నేతలకు తగదన్నారు.

పండించిన ధాన్యం కొనుగోలు చేయాలి.

పండించిన ధాన్యం కొనుగోలు చేయాలి

– వీర్నపల్లి మండలం వన్పల్లి రైతులు

– ధాన్యం కొనుగోలు చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా

– ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో

సిరిసిల్ల/కలెక్టరేట్(నేటి ధాత్రి):

 

 

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో దయనీయంగా తయారైంది.

 

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్ పెళ్లి గ్రామ రైతులు గురువారం కలెక్టరేట్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని సుమారు 45 కిలోమీటర్ల ప్రయాణించి ఎర్రటి ఎండలో ధర్నా చేశారు.

 

కలెక్టర్ సందీప్ కుమార్ ఝానీ కలిసి సమస్య పరిష్కరించేలా చూడాలని కలెక్టరేట్ వద్దకు రాగా పోలీసులు గేట్లు అమర్చి లోనికి వెళ్లకుండా రైతులను అడ్డుకున్నారు.

 

సుమారు గంటపాటు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన కలెక్టర్ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో రైతులు కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రైతులు ఎర్రటి ఎండలో ప్రధాన రోడ్డుపై పిక్కలు కాలుతున్న బైఠాయించగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

 

పోలీసులు చేరుకొని వారిని సముదాయించి కలెక్టర్ వద్దకు ఐదుగురునీ తీసుకుని పోయేలా ఒప్పించి రాస్తారోకో విరవింప చేశారు.

 

ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద రైతులు మాట్లాడుతూ…

గత రెండు నెలల క్రితమే కోతలు పూర్తయ్యాయని వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మా కడుపు మండి పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్దకు సమస్య పరిష్కరించాలని చేరుకున్నామన్నారు.

సందీప్ కుమార్ స్పందించాలని రైతులు 6 నెలలు కష్టపడి పండించిన పంట వెంటనే కొనుగోలు చేస్తే రైతు కుటుంబాలు బాగుపడతాయి అన్నారు.

పక్కనే ఉన్న నిజాంబాద్ జిల్లా సిరికొండ మండలంలో వరి ధాన్యం కొనుగోలు పూర్తి డబ్బులు కూడా రైతులకు అందించారన్నారు.

అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు పూర్తయ్యాయని కేవలం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇలా ఎందుకు ఈ వివక్ష అని ప్రశ్నించారు.

ప్రభుత్వం రైతును రాజులు చేస్తామని వాగ్దానాలు చేయడమే కానీ రైతు నేడు బిచ్చగాడులా మారుతున్నాడని మండిపడ్డారు.

ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన ధాన్యం బార్దాన్లో ఆరబోస్తే బార్ధాన్లు చెదలు పట్టి చెడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులు తమ పంటను పండించేందుకు మందు బస్తాలు కూలీల కోసం అప్పులు చేసి వ్యవసాయం చేస్తారని అన్నారు.

ఇప్పుడు కేవలం వీర్నపల్లి మండలం బొంపల్లి గ్రామస్తులు మాత్రమే ధర్నాకు వచ్చామని సమస్య పరిష్కరించకుండా ప్రతి గ్రామం నుండి గ్రామాలన్నీ కాళీ చేసి కలెక్టరేట్ వద్దకు చేరుకుంటామని రైతులు హెచ్చరించారు.

కార్యక్రమంలో సుమారు వందమంది వరకు గ్రామ రైతులు పాల్గొన్నారు.

జహీరాబాద్: ఉగ్రవాదుల దాడులకు నిరసనగా ర్యాలీ.

జహీరాబాద్: ఉగ్రవాదుల దాడులకు నిరసనగా ర్యాలీ

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులకు నిరసనగా బుధవారం యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పట్లోళ్ళ నాగిరెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి, ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఉగ్రవాదుల దాడులలో 26 మంది మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ విభాగం రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

విద్యాశాఖ కరీంనగర్ మరియు అల్ఫోర్స్ సంయుక్తంగా.

పాఠశాల విద్యాశాఖ కరీంనగర్ మరియు అల్ఫోర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఒలంపియాడ్ ఫౌండేషన్ తరగతులో భాగంగా హాజరై స్టడీ మెటీరియల్ మరియు పుస్తకాలను పంపిణీ చేసిన నిర్వాహకులు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా పరిపాలన అధికారి పామెల సత్పత్తి, ఐఏఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒలంపియాడ్ ఫౌండేషన్ కోచింగ్ లో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని అల్ఫోర్స్ హైస్కూల్ ని సందర్శించి ప్రభుత్వ పాఠశాల 8&9వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, పుస్తకాలను అల్ఫోర్స్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేసిన నిర్వాకులు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వి.నరేందర్ రెడ్డి. విద్యార్థులకు ఇరవై ఒక రోజులపాటు ఉచిత భోజన వసతితో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే చక్కటి ప్రణాళికలతో కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలుపుతూ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మొదటి దశలో మూడు వందల యాభై మంది విద్యార్థులో ఎనభై మంది విద్యార్థులు ఎంపికైనరని ఆఎంపికైన వారికి రెండో దశలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం వ్యాయామం, యోగా, సాయంత్రం డ్యాన్స్ తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థులకు సేవనందించే అవకాశం కల్పించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమెల సత్పతి, ఐఏఎస్ కి, జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్ విఎస్ జనార్దన్ రావుకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

ఈనెల 25న జరిగే కార్మిక సంఘాల జిల్లా సదస్సును.!

ఈనెల 25న జరిగే కార్మిక సంఘాల జిల్లా సదస్సును జయప్రదం చేయండి – ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ పిలుపు

కరీంనగర్, నేటిధాత్రి:

నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని మే 20వ తేదీన కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈనెల 25వ తేదీన బద్దం ఎల్లారెడ్డి భవన్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సన్నాహక సదస్సు జరుగుతుందని కావున జిల్లాలోని కార్మిక లోకం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ లోని బైపాస్ రోడులో గల సిమెంట్ గోదాం హమాలీ కార్మికుల సమావేశం జంగం తిరుపతి అధ్యక్షతన గోదాం వద్ద జరిగింది. ఈసందర్భంగా బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకోండు సంవత్సరాలైనా శ్రమిస్తున్న ప్రజల జీవితాలు మరియు జీవన ఉపాధిపై తన కార్పోరేట్ కుతంత్రాలు అమలు చేయాలని ప్రయత్నిస్తుందని దీనివల్ల దేశంలో పేదరికం, ఆకలి, పోషకాహార లోపం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కోడులు అనేవి శ్రామిక ప్రజలపై బానిసత్వం విధించే బ్లూప్రింట్ లాంటివని సంఘంలోని కార్మికులకు సంబంధించిన అన్ని హక్కులు కార్మికుల నుండి లాక్కుంటున్నారని పని గంటలు, కనీస వేతనాలు, సామాజిక భద్రత పని పరిస్థితులకు సంబంధించిన అన్ని ప్రాథమిక హక్కులను తీవ్రమైన సవాలుగా పరిగణించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. యూనియన్ హక్కులు గుర్తింపు సమిష్టి నిరసనల హక్కు బావ వ్యవస్థీకరణ హక్కు తీవ్రమైన సవాలుగా మారాయని కార్పొరేట్ యజమానుల ప్రయోజనాల కోసం శ్రామిక ప్రజలపై బానిసత్వం యొక్క షరతులను విధించే బ్లూప్రింట్ లాంటివని కార్మికులు యూనియన్ నాయకులను నాన్ బెలబుల్ జైలు శిక్షలతో సహా కఠినమైన పోలీస్ చర్యలకు దారితీస్తుందని యజమాన్యానికి లేదా కార్మిక శాఖకు సమిష్టి ఫిర్యాదులను నిరాకరిస్తుందని ఇలాంటి చట్టాలను కార్మిక లోకం వ్యతిరేకించాలన్నారు. అసంఘటిత కార్మికుల జీవన ఉపాధికి సంబంధించిన ప్రాథమిక హక్కులను దూరం చేస్తుందని అందుకని కేంద్ర కార్మిక సంఘాల ఫెడరేషన్లు దేశవ్యాప్త సమ్మెను చేస్తున్నాయని దీని విజయవంతం చేయాలని చార్టర్ ఆఫ్ డిమాండ్స్ తయారుచేసి మే20న దేశవ్యాప్త నిరవధిక సమ్మె చేయాలని అందుకోసమే సదస్సు నిర్వహించడo జరుగుతుందని దీనిలో కార్మికలోకం జిల్లా వ్యాప్తంగా భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఈసమావేశంలో సిమెంట్ గోదాంహమాలీ అధ్యక్షులు జంగం తిరుపతి ఉపాధ్యక్షులు బాగోతం వీరయ్య, నాయకులు ననవేని కొమరయ్య ననవేని శ్రీనివాస్, పల్లెర్ల రాములు గౌడ్, ముత్యాల శ్రీనివాస్, దానవేని కొమరయ్య, ఉప్పారం శ్రీనివాస్, జక్కుల ఐలయ్య, దొంగల శ్రీనివాస్, బోయిని ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.

గల్లీగల్లీ కెసిఆర్ సభకు తరలిరండి.

గల్లీగల్లీ కెసిఆర్ సభకు తరలిరండి

బిఆర్ఎస్ యూత్ నాయకుడు మడికొండ ప్రవీణ్

పరకాల నేటిధాత్రి

 

27 తేదీన బిఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని యూత్ నాయకుడు మడికొండ ప్రవీణ్ తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షల ప్రతిరూపంగా 2001 ఏప్రిల్ లో ఆవిర్భవించిన టిఆర్ఎస్ ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపి తెలంగాణ ప్రజలను ఏకతాటిపై నడిపి ఎన్నో కష్టనష్టాలకు అవమానాలకు అణిచివేతకు వెనకడుగు వేయకుండా ప్రజలను అంటిపెట్టుకొని రాష్ట్ర సాధనకై అలుపెరగని పోరాటం చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని
నాడు స్వరాష్ట్ర సాధనకై జరిగిన ఉద్యమంలో
ఆ తర్వాత 10 యేండ్లు అధికారంలో,నేడు ప్రతి పక్షంలో,తెలంగాణ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ప్రజల తరుపున నిలబడ్డది కేసీఆర్ స్థాపించిన టిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా మాత్రమేనన్నారు.టిఆర్ఎస్ 25 ఏళ్ల మహాప్రస్థానం సందర్భంగా ఈనెల ఏప్రిల్ 27న మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది.తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ప్రజా పాలన కాదని రాక్షస పాలనని దాన్ని తిప్పికొట్టేందుకు ప్రజలకు రజతోత్సవ సభ భరోసానిస్తుందని,పరకాల మాజీ శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి పిలుపుమేరకు పరకాల ప్రాంత ప్రజలు యువత మహిళలు కార్మికులు రైతాంగం ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకై జరుగుతున్న మహోద్యమంలో భాగస్వాములు కావాలని అన్నారు.

చీకటి ని అంతం చేయాలి.

చీకటి ని అంతం చేయాలి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణ కేంద్రంలో గల మేరీ మాత చర్చి ఎదురుగా ఓపెన్ గ్రౌండ్లో మూడు రోజులకు గాను ఏర్పాటు చేసిన ప్రార్థన కూడికలు బుధవారం మూడవ రోజు విశ్వాసులు భారీగా తరలివచ్చి ప్రార్థన కూడికలో పాల్గొని ఆరాధించారు. ఈ ప్రార్థన కూడికలు ఘనంగా జరిగాయి.మనోహరమైన పునరుత్థాన పండుగలలో ముఖ్య వర్తమానికులు రెవరెండ్ చార్లెస్ పి.జాకబ్ ఫిలదె ల్ఫియాఎజిచర్చ్ విజయవాడ పాస్టర్ దైవ సందేశాన్నఅందించారు. చీకటి ని ప్రతి ఒక్కరు అంతం చేయాలని తన ఇంటికి చీకటి ని పంపియాలి అని చక్కటి ప్రసంగాని వినిపించడం జరిగింది. ఎప్పుడు జరుగాని కానివిని ఎరుగని రీతిలో ఈ పండుగలు జరిగాయి.

ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ హోంగార్డులను.!

ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ హోంగార్డులను స్వరాష్ట్రానికి బదిలీ చేయాలి -భావండ్లపల్లి యుగంధర్ డిమాండ్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ హోంగార్డులను స్వరాష్ట్రానికి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హోంగార్డుల పక్షాన (డిసిపి)డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణకీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈసందర్భంగా ఎఐవైఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేందర్ మాట్లాడుతూ గత పదకోండు సంవత్సరాలుగా తెలంగాణ స్థానికతకు చెందిన హోంగార్డులు ఆంధ్రప్రదేశ్ లో విధులు, అదే విధంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ హోంగార్డులు పనిచేస్తున్నారన్నారు. తెలంగాణ స్థానికతకు చెందిన హోంగార్డులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెలక్ట్ అయినారు. రాష్ట్ర విభజన జూన్, 2014 తరువాత వారంతా ఆంధ్రప్రదేశ్ లో ఉండిపోయారని, అన్ని ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులను వారి స్థానికత ప్రకారం మార్చడం జరిగినా, హోంగార్డులను మార్చలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణకు చెందిన హోంగార్డులు పనిచేస్తున్నారని, ఆకుటుంబాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. దీనివలన వారు ఉద్యోగం ఆంధ్రప్రదేశ్ లో, కుటుంబం తెలంగాణలో ఉండటంవలన, మానసికంగా, కుటుంబపరంగా, విధులకి హాజరుకావడానికి, రవాణాపరంగా, ఆర్థికంగా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. హోంగార్డుల తల్లితండ్రులు వృద్దాప్యంలో ఉండంటం వలన, వారి బాగోగులు చూసుకోలేకపోతున్నారన్నారు. కొంతమంది పిల్లలు ఆంధ్రప్రదేశ్ లో విద్యను కొనసాగిస్తున్నారనివారు భవిష్యత్తులో తెలంగాణ స్థానికతను కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన జూన్ 2014 నుంచి దాదాపుగా పదకోండు సంవత్సరాలుగా స్వరాష్ట్రాలకు వెళ్ళాలని ఎదురుచూస్తున్నా, వారి సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలం చెందారని వాపోయారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ కు హోంగార్డ్స్ బదిలీ చేయడానికి అభ్యంతరం లేదని తెలిపినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ స్పందించటంలేదన్నారు. తెలంగాణ హోంగార్డులకు మద్దతుగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణకీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈకార్యక్రమంలో రాజేష్, నగేష్, మురళి, విజేందర్, సురేందర్, సుకుమార్, తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు పై అధికారుల తో సమీక్ష

ధాన్యం కొనుగోలు పై అధికారుల తో సమీక్ష
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రానున్న 10 రోజుల్లో వర్షాలు లేవు, వాతావరణ శాఖ వెల్లడి
రైతులు అధైర్య పడవద్దు / ఆందోళన చెందవద్దు
మిల్లుల అలాట్మెంట్ జరగని కొనుగోలు కేంద్రాల ధాన్యాన్ని ఇంటర్మీడియట్ గోదాములకు తరలించాలి
ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద 2 లారీలను అందుబాటులో పెట్టాలి

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని యాసంగి పంట కొనుగోలు లో వేగం పెంచాలని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన వరి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ,రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతముగా జరగాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలని అన్నారు. మన జిల్లాలో ఇప్పటి వరకు 246 కొనుగోలు కేంద్రాలకు గాను 244 కేంద్రాల ప్రారంభం చేసి 224 కొనుగోలు కేంద్రాల నుంచి 28వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు జమ అయ్యేలా చూడాలని అన్నారు. సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసిల్దార్ లు సిరిసిల్లలో అపెరల్ పార్క్ లో మరియు ఇతర చోట్ల అవసరమైన ఇంటర్మీడియట్ గోదాములను గుర్తించి ధాన్యం తరలింపు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాలకు ట్యాగ్ చేసిన రైస్ మిల్లర్లకు సామర్థ్యం ప్రకారం ధాన్యం అలాట్మెంట్ చేయాలని అన్నారు. జిల్లాలో రానున్న 10 రోజుల్లో వర్షాలు లేవనీ వాతావరణ శాఖ వెల్లడించినందున రైతులు ఆందోళన చెందవద్దని, అన్ని సెంటర్లలో టార్ఫాలిన్ కవర్లు, అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన వసతులు కల్పించాలని, ప్యాడీ క్లీనర్, టార్ఫాలిన్ కవర్లు, వెయింగ్ యంత్రాలు తేమ యంత్రాలు మొదలగు సామాగ్రి అందుబాటులో పెట్టుకొవాలని అన్నారు. కోనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలు పరిశీలించి, భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు.మిల్లు అలాట్మెంట్ కాని కోనుగోలు కేంద్రాలకు సమీపంలో గల అపెరల్ పార్క్ లో ఇంటర్మీడియట్ గోదాము నందు ధాన్యం భద్రత కోసం బుక్ చేయాలని అన్నారు. రైస్ మిల్లుల సమస్య కారణంగా ఎక్కడా ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడానికి వీలు లేదని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని కలెక్టర్ సూచించారు.
సిరిసిల్ల జిల్లాలో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని అన్నారు. జిల్లాలో 500 లారీలు అందుబాటులో ఉన్నందున ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద 2 లారీలను పెట్టాలని, ధాన్యం రవాణా ఎటువంటి ఇబ్బందులు ఉండవద్దని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సమీక్షా సమావేశంలో డిఆర్డిఓ శేషాద్రి, డి.ఎం.పౌర సరఫరాల శాఖ రజిత, అదనపు డిఆర్డిఓ శ్రీనివాస్, ఏ.పి.ఎం, తదితరులు పాల్గొన్నారు.

పహల్గం ఉగ్రదాడిని నిరసిస్తూ.!

పహల్గం ఉగ్రదాడిని నిరసిస్తూ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేసిన బిజెపి నాయకులు

రామడుగు, నేటిధాత్రి:

పహల్గం ఉగ్రదాడిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా రామడుగు మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ హిందువుల మీద దాడి పరికిపంద చర్య అని తీవ్రంగా ఖండించారు. హిందువుల మీద దాడులు జరుగుతుంటే కనీసం ఏపార్టీ స్పందించడం లేదని,హిందువుల కోసం మాట్లాడే పార్టీ, హిందువుల పక్షాన కొట్లాడే పార్టీ ఒక బీజేపీ పార్టీయేనని వారు తెలిపారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మాజీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు వేముండ్ల కుమార్,కారుపాకల అంజిబాబు, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, వంచ మనోజ్, సుదగోని మహేష్ గౌడ్, బూత్ కమిటీ అధ్యక్షులు కడారి శ్రీనివాస్, రాగం కనకయ్య,బొజ్జ తిరుపతి, అనుపురం శంకర్ గౌడ్, భూస మధు, చేవెళ్ల అక్షయ్, తదితరులు పాల్గొన్నారు.

నెక్కొండ పౌరులు అందరికీ ఆదర్శప్రాయులు.

నెక్కొండ పౌరులు అందరికీ ఆదర్శప్రాయులు

వాట్సాప్ గ్రూప్ ద్వారా సామాజిక చేయూత

శభాష్ నెక్కొండ వాట్సాప్ గ్రూప్ అంటూ పలువురు ప్రశంసలు

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

 

నెక్కొండ అభివృద్ధికైనా, సామాజిక సేవా కార్యక్రమానికైనా, రైల్వే స్టేషన్ సంబంధించి రైలు ఆపడంలో, రాజకీయ బహిరంగ చర్చ కైనా నెక్కొండలో జరిగే ప్రతి అంశానికి ఆతిథ్యమిస్తూ ఏకైక గ్రూప్“ నెక్కొండ పౌరులు“ఈ వాట్సాప్ గ్రూప్ గత పది సంవత్సరాల క్రితం సేవ కార్యక్రమాలలో పాల్గొనేందుకు నెక్కొండ నగరానికి సంబంధించి మంచి చెడు తెలుసుకోవడానికి 2014 సంవత్సరంలో దుంప నాగరాజు అనే ఓ పారిశ్రామికవేత్త గ్రూప్ క్రియేట్ చేసి నెక్కొండలో జరిగే ప్రతి విషయాన్ని మంచి చెడులను నెక్కొండ ప్రజలకు తెలిసే విధంగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని గ్రూపులో చేరవేస్తూ ఆపద వస్తే మేమున్నామంటూ నిరుపేదలకు మేమున్నామంటూ ఒక భరోసాను కల్పిస్తూ వందల మందికి ఆదర్శంగా నిలుస్తున్న నెక్కొండ పౌరులు అనే గ్రూపు ఇప్పుడు అన్ని వాట్సాప్ గ్రూపు లలో చర్చనీ అంశంగా మారింది. వాట్సాప్ గ్రూప్ అంటే ఎవరికి ఇష్టం వచ్చిన పోస్టు వారు పెట్టకుండా నెక్కొండ అభివృద్ధికి సామాజిక సేవా కార్యక్రమాలకు రాజకీయ చర్చలకు ప్రజా అభిప్రాయాల సేకరణకు నెక్కొండ కేంద్ర బిందువుగా పనిచేస్తున్న నెక్కొండ పౌరులు పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

వాట్సాప్ గ్రూపు ద్వారా పలువురికి సహాయం

నెక్కొండ పౌరులు అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా కరోనా సమయంలో నిరుపేదలకు నిత్యవసర సరుకులు ఏర్పాటు చేయడంలో దీనస్థితిలో చనిపోయిన వ్యక్తులకు ఆర్థిక సహాయం అందించడంలో నెక్కొండ పౌరులు అనే గ్రూప్ లో ఉన్న సభ్యులు ఎవరికి తోచినంత వారు గ్రూప్ అడ్మిన్ అయినా దుంప నాగరాజుకు ఆన్లైన్లో అమౌంట్ చేరవేసి ఇలా చేరవేసిన అమౌంట్ ను పేదరికంతో చనిపోయిన వ్యక్తులకు, సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. ఇప్పటికీ ఈ గ్రూపు ద్వారా ఎన్నో కుటుంబాలకు చేయూతనందించడం గమనార్ధం.

పహాల్గం మృతుల చిత్రపటాలకు నివాళులర్పించిన.

పహాల్గం మృతుల చిత్రపటాలకు నివాళులర్పించిన జూనియర్ సివిల్ జడ్జి శాలిని లింగం

ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ పరకాల న్యాయవాదులు నిరసన

పరకాల నేటిధాత్రి

 

పహాల్గంలో పర్యటకులపైన చేసిన ఉదగ్రవాదుల దాడికి నిరసిస్తూ పరకాల కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి షాలినిలింగం మరణించిన పర్యాటకుల చిత్రపటాలకు కొవ్వాత్తులతో నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ గురువారాన్ని దేశ ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని ఉగ్రవాదులను త్వరగా పట్టుకుని శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ నవీన్,కిరణ్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

 

Terrorist Attack

 

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన

పరకాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ పరిధిలోని అడ్వకేట్స్ దాడులకు తెగబడుతున్న ఉగ్రవాదులను శిక్షించాలని ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహిస్తూ స్థానిక బస్టాండ్ కూడలిలో నిరసన వక్తం చేసారు.ఈ సీనియర్ న్యాయవదులు పి.రాజి రెడ్డి, రాజమౌళి,మెరుగు శ్రీనివాస్, స్వామి,చంద్రమౌళి,గండ్ర నరేష్ రెడ్డి,రమేష్ రాహుల్ విక్రమ్, సురేష్,రాజు,చంద్ర మోహన్, పవన్ కళ్యాణ్ మరియు కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version