నల్ల బ్యాడ్జి ధరించి నిరసన తెలిపిన.

నల్ల బ్యాడ్జి ధరించి నిరసన తెలిపిన
మండల వైద్యాధికారి అమరేందర్ రావు

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారీ మీద జరిగిన దాడిని ముత్తారం వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ రావు ఖండించారు వారు మాట్లాడుతూ ఇటీవలె జిల్లాలోని ప్రైవేటు హాస్పిటల్స్ లో ఏలాంటి పర్మిషన్స్ లేకుండా నిర్వహిస్తున్న స్కాన్ సెంటర్స్ ను పర్మిషన్ తీసుకోవాల్సిందని ఆదేశించిన సందర్భంలో జిల్లా వైద్యాధికారినీ అగౌరపరుస్తూ ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది చేసిన తప్పుడు మరియు అబద్ధపు ఆరోపణలను ఖండిస్తూ మండల వైద్యాధికారి అమరేందర్ రావు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడం జరిగింది అని తెలిపారు

పహల్గం ఉగ్రదాడిని నిరసిస్తూ.!

పహల్గం ఉగ్రదాడిని నిరసిస్తూ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేసిన బిజెపి నాయకులు

రామడుగు, నేటిధాత్రి:

పహల్గం ఉగ్రదాడిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా రామడుగు మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ హిందువుల మీద దాడి పరికిపంద చర్య అని తీవ్రంగా ఖండించారు. హిందువుల మీద దాడులు జరుగుతుంటే కనీసం ఏపార్టీ స్పందించడం లేదని,హిందువుల కోసం మాట్లాడే పార్టీ, హిందువుల పక్షాన కొట్లాడే పార్టీ ఒక బీజేపీ పార్టీయేనని వారు తెలిపారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మాజీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు వేముండ్ల కుమార్,కారుపాకల అంజిబాబు, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, వంచ మనోజ్, సుదగోని మహేష్ గౌడ్, బూత్ కమిటీ అధ్యక్షులు కడారి శ్రీనివాస్, రాగం కనకయ్య,బొజ్జ తిరుపతి, అనుపురం శంకర్ గౌడ్, భూస మధు, చేవెళ్ల అక్షయ్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version