బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం.!

బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం

-అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికే ఈ ఒప్పందం

-కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కల్లపల్లి రాజు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ వాళ్లు బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కల్లపల్లి రాజు విమర్శించారు. గురువారం ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దొంగల ముఠాల రాష్ట్రాన్ని పదేండ్లు దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, వారు చేసిన అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోకుండా ప్రధాని మోడీకి దాసోహమయ్యారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల బలహీనతలను ఆసరాగా చేసుకున్న బీజేపీ రాష్ట్రానికి స్వయంగా రావాల్సిన వాటాలను, నిధులను ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. గత పదేండ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతిచ్చింది బీఆర్ఎస్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. కవితను లిక్కర్ స్కాం నుంచి కాపాడేందుకు బీజేపీ ఊడిగం చేసింది నిజం కాదా? అని అడిగారు. సంఖ్యా బలం లేని బీజేపీ ఏ అండ చూసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకే బీఆర్ఎస్ పార్టీ తాపత్రయపడుతుందన్నారు. 15 నెలల స్వల్ప కాలంలోనే తమ సర్కార్ గొప్ప పనులను చేపట్టిందని, అలాంటి సర్కార్ ను విమర్శించడం బీఆర్ఎస్ నేతలకు తగదన్నారు.

బాండు సమస్త, రైతుల మధ్య ఒప్పందం జరగాలి..

బాండు సమస్త, రైతుల మధ్య ఒప్పందం జరగాలి..

బాండు మిర్చితో రైతుల ఆవేదన ..

పురుగుల మందుల షాప్ల కు అధిక లాభాలు ఎలా…

నూగూర్ వెంకటాపురం మార్చి 01(నేటి దాత్రి ):-

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని పాత్రపురం గ్రామంలో తుడుం దెబ్బ అత్యవసర సమావేశం వెంకటాపురం మండల అధ్యక్షులు బాడిస. కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో,తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు చింత సోమరాజు మాట్లాడుతూ రైతులు పండించిన మిర్చి పంటకు గిట్టు బాటు ధర కల్పించాలని అన్నారు. రైతు శ్రమను గుర్తచక కంపెనీల పేరుతో అగ్రిమెంట్ లేకుండా వ్యవసాయం చేయిస్తూ మోసం చేస్తున్నారని అన్నారు. విత్తనాలు విత్తనా శుద్ధి లేకుండా రైతులకు సరఫరా చేసి రైతులను నట్టేట ముంచారాని అయన అన్నారు. రైతులకు, సమస్త కు మధ్య ఒప్పంద పత్రాలు రాసుకోవాలి. రైతులకు పంట నష్టం జరిగినప్పుడు పోయినప్పుడు,సమస్యే రైతులకి నష్టపరిహారం అందించాలని అయన నన్నారు. .సంబంధిత అధికారులపర్యవేక్షణ లోపించిందని అయన తెలిపారు. దీనిపై ప్రభుత్వం ద్రుష్టి సారించి చాలని అయన డిమాండ్ చేశారు . ఈకార్యక్రమంలో ప్రశాంత్, సతీష్, నర్సింహారావు, రాంకి, గణేష్, తిలక్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version