విద్యాశాఖ కరీంనగర్ మరియు అల్ఫోర్స్ సంయుక్తంగా.

పాఠశాల విద్యాశాఖ కరీంనగర్ మరియు అల్ఫోర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఒలంపియాడ్ ఫౌండేషన్ తరగతులో భాగంగా హాజరై స్టడీ మెటీరియల్ మరియు పుస్తకాలను పంపిణీ చేసిన నిర్వాహకులు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా పరిపాలన అధికారి పామెల సత్పత్తి, ఐఏఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒలంపియాడ్ ఫౌండేషన్ కోచింగ్ లో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని అల్ఫోర్స్ హైస్కూల్ ని సందర్శించి ప్రభుత్వ పాఠశాల 8&9వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, పుస్తకాలను అల్ఫోర్స్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేసిన నిర్వాకులు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వి.నరేందర్ రెడ్డి. విద్యార్థులకు ఇరవై ఒక రోజులపాటు ఉచిత భోజన వసతితో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే చక్కటి ప్రణాళికలతో కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలుపుతూ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మొదటి దశలో మూడు వందల యాభై మంది విద్యార్థులో ఎనభై మంది విద్యార్థులు ఎంపికైనరని ఆఎంపికైన వారికి రెండో దశలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం వ్యాయామం, యోగా, సాయంత్రం డ్యాన్స్ తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థులకు సేవనందించే అవకాశం కల్పించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమెల సత్పతి, ఐఏఎస్ కి, జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్ విఎస్ జనార్దన్ రావుకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version