రైతులు పండించిన ప్రతి చివరి గింజల వరకు.!

రైతులు పండించిన ప్రతి చివరి గింజల వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కానీ జిల్లాలో కానీ ఆరుగాసాల కష్టపడి రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఐకెపి సెంటర్ ద్వారా కొనుగోలు చేస్తుందని దయచేసి రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం మే మాసంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని గత ప్రభుత్వ పాలకులు ఏం చేశారు ప్రజలందరికీ తెలుసునని ఇప్పుడు కూడా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తద్వారా కొద్దిగా గన్నిసంచులు లారీల కొరత ఉన్నది వాస్తవమే అని రైతులు పండించిన ధాన్యాన్ని ఐకెపి సెంటర్ ద్వారా విక్రయించాలని అలాగే రైతులకు బ్యాంకు అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నారని విషయం పై అధికారులదృష్టికి వచ్చిన పై అధికారులు తగు చర్యలు తీసుకుంటారని అలాగే రేపు జరగబోయే రైతు అవగాహన సదస్సు పై ప్రభుత్వ వీప్ఆది శ్రీనివాస్. సిరిసిల్లనియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులు రైతులతో అవగాహన సదస్సు నిర్వహించి రైతుల అమూల్యమైన సలహాలు తీసుకుంటారని దీనిపై భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని తెలియజేస్తూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు మీ మండలంలో పనిచేసే ఒక అధికారి పని ఒత్తిడి భారమో. మీ నాయకులు చేస్తున్న ఒత్తిడి వల్ల కానీ సమస్యలు వస్తున్నాయని దృష్టికి వచ్చిందని దీనిపై వివరణ . కోరగా జరిగిన మాట వాస్తవమే కానీ. అసలు ఏం జరిగింది అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరక లేక ఆమె వ్యక్తిగత అవసరాల గురించా తెలియదు కానీ దీనిపై సంబంధిత అధికారులు తగు విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని దీనిపై మండల కాంగ్రెస్ పార్టీ లో పనిచేసే నాయకులు కార్యకర్తలు ఉన్నారని ఆరోపిస్తుండడం కరెక్టే కానీ దీనిపై విచారణకు సిద్ధమై. అధికార పార్టీ నాయకులైన కార్యకర్తలైన ఏ నాయకులైన చట్టానికి చుట్టం కాదని దీనిపై తగు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో యూత్ నియోజకవర్గ ఇన్చార్జి. చుక్క శేఖర్. మునిగల రాజు. సత్తు శ్రీనివాస్ రెడ్డి. పొన్నాల లక్ష్మణ్. గుగ్గిళ్ళ భరత్ గౌడ్. భాస్కర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పండించిన ధాన్యం కొనుగోలు చేయాలి.

పండించిన ధాన్యం కొనుగోలు చేయాలి

– వీర్నపల్లి మండలం వన్పల్లి రైతులు

– ధాన్యం కొనుగోలు చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా

– ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో

సిరిసిల్ల/కలెక్టరేట్(నేటి ధాత్రి):

 

 

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో దయనీయంగా తయారైంది.

 

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్ పెళ్లి గ్రామ రైతులు గురువారం కలెక్టరేట్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని సుమారు 45 కిలోమీటర్ల ప్రయాణించి ఎర్రటి ఎండలో ధర్నా చేశారు.

 

కలెక్టర్ సందీప్ కుమార్ ఝానీ కలిసి సమస్య పరిష్కరించేలా చూడాలని కలెక్టరేట్ వద్దకు రాగా పోలీసులు గేట్లు అమర్చి లోనికి వెళ్లకుండా రైతులను అడ్డుకున్నారు.

 

సుమారు గంటపాటు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన కలెక్టర్ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో రైతులు కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రైతులు ఎర్రటి ఎండలో ప్రధాన రోడ్డుపై పిక్కలు కాలుతున్న బైఠాయించగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

 

పోలీసులు చేరుకొని వారిని సముదాయించి కలెక్టర్ వద్దకు ఐదుగురునీ తీసుకుని పోయేలా ఒప్పించి రాస్తారోకో విరవింప చేశారు.

 

ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద రైతులు మాట్లాడుతూ…

గత రెండు నెలల క్రితమే కోతలు పూర్తయ్యాయని వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మా కడుపు మండి పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్దకు సమస్య పరిష్కరించాలని చేరుకున్నామన్నారు.

సందీప్ కుమార్ స్పందించాలని రైతులు 6 నెలలు కష్టపడి పండించిన పంట వెంటనే కొనుగోలు చేస్తే రైతు కుటుంబాలు బాగుపడతాయి అన్నారు.

పక్కనే ఉన్న నిజాంబాద్ జిల్లా సిరికొండ మండలంలో వరి ధాన్యం కొనుగోలు పూర్తి డబ్బులు కూడా రైతులకు అందించారన్నారు.

అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు పూర్తయ్యాయని కేవలం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇలా ఎందుకు ఈ వివక్ష అని ప్రశ్నించారు.

ప్రభుత్వం రైతును రాజులు చేస్తామని వాగ్దానాలు చేయడమే కానీ రైతు నేడు బిచ్చగాడులా మారుతున్నాడని మండిపడ్డారు.

ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన ధాన్యం బార్దాన్లో ఆరబోస్తే బార్ధాన్లు చెదలు పట్టి చెడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులు తమ పంటను పండించేందుకు మందు బస్తాలు కూలీల కోసం అప్పులు చేసి వ్యవసాయం చేస్తారని అన్నారు.

ఇప్పుడు కేవలం వీర్నపల్లి మండలం బొంపల్లి గ్రామస్తులు మాత్రమే ధర్నాకు వచ్చామని సమస్య పరిష్కరించకుండా ప్రతి గ్రామం నుండి గ్రామాలన్నీ కాళీ చేసి కలెక్టరేట్ వద్దకు చేరుకుంటామని రైతులు హెచ్చరించారు.

కార్యక్రమంలో సుమారు వందమంది వరకు గ్రామ రైతులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version