బాధిత కుటుంబలను పరామర్శంచిన.

బాధిత కుటుంబలను పరామర్శంచిన కుంజ కుసుమంజలిసూర్య

కొత్తగూడ, నేటిధాత్రి:

 

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం దుర్గారాం గ్రామానికి చెందిన జంగా సంపత్ ఎల్లయ్య ఇద్దరు సోదరులు వారి కుమార్తెలైన
జంగా మౌనిక జంగా నవ్యలత అను అక్కాచెల్లెలు. బుధవారం రోజు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగిన సంగతి విధితమే.. బాధితుల బాధను కన్నీళ్లను చూసిన స్థానిక నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు ధనసరి సీతక్క కు విషయం చెప్పడం జరిగిందని మంత్రివర్యులు సీతక్క ఆదేశాల మేరకు వారి కోడలు ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుంజ కుసుమాంజలిసూర్య గురువారం రోజు దుర్గరాం గ్రామానికి విచ్చేసి బాధిత కుటుంబాలను ఓదార్చి కన్నింటి పర్యంతమయ్యారు
బోలెడు భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయిలు రోడ్డు ప్రమాదాలు చనిపోవడం చాలా బాధాకరమని వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చి వారికీ ప్రగడ సానుభూతిని తెలియజేసి ప్రభుత్వపరంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని కుంజ కుసుమాంజలిసూర్య, అన్నారు వారి వెంట మాజీ ఎంపీపీ బానోత్ విజయ, రూపు సింగ్ ,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకర బోయిన మొగిలి,మాజీ జడ్పిటిసి పుల్సం పుష్పలత, టీపీసీసీ సభ్యులు చల్ల నారాయణరెడ్డి, మాజీ జెడ్పిటిసి కారోజు రమేష్, డిసిసి సభ్యులు వీరనేని వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ కాడబోయిన జంపాయ్య, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కర్ర జనార్దన్ రెడ్డి,నోముల ప్రశాంత్ యాదవ్, ఉపేంద్ర చారి, ముస్కు, వెంకన్న గొందిరాజు పల్లె రమేష్ గ్రామ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…

తీవ్ర ఎండతో పడిపోయిన ఉపాధి హామీ కూలీకి.

తీవ్ర ఎండతో పడిపోయిన ఉపాధి హామీ కూలీకి మెరుగైన వైద్యం అందించాలి- కొయ్యడ సృజన్ కుమార్

కరీంనగర్, నేటిధాత్రి:

 

తీవ్ర ఎండతో ఉపాధి హామీ పనులకు వెళ్లి పడిపోయిన సిరిసిల్ల గణపతికి మెరుగైన వైద్యం అందించి వారికీ ఆర్ధిక సహాయం అందించి వారి కుటుంబాన్ని ఆడుకోవాలని బికెయంయు రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు.

శనివారం తీవ్ర ఎండతో పడిపోయిన గణపతిని 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ అస్పత్రిలో చేర్చగా వారిని పరమార్శించి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు.

ఈసందర్బంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ శంకరపట్నం మండలం చింతలపల్లి గ్రామంలో రోజులాగే ఉపాధి హామీ పనికి వెళ్లిన కార్మికులు పని ప్రదేశం గట్టిగా ఉండడం వల్ల ముందు రోజే ఆప్రదేశంలో నీటితో తడిపి శుక్రవారం రోజున పనికి వెళ్లగా ఎండ తీవ్రంగా ఉండడం వల్ల నీటితో పని ప్రదేశాన్ని తడిపిన చెట్ల పొదలు ఎంత తీసిన రాకపోయే సరికి ఇంటికి వెళ్లి గడ్డపార తీసుకు రావడానికి వెళ్ళుతుండగా ఎండ ఎక్కువ ఉండడంతో అక్కడే కల్లు తిరిగి పడిపోవడంతో 108కు ఫోన్ చేయగా అంబులెన్సు వచ్చి కరీంనగర్ ప్రభుత్వ అస్పత్రిలో చేర్చారని, ఇప్పటికి సంబంధిత అధికారులు అస్పత్రికి రాలేదని, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ కూలికి ప్రమాదం జరిగిన ఇప్పటివరకు అధికారులు బాధితున్ని పరమార్శించకపోవడం బాధ్యత రహిత్యమని, ఆగ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం అని వేంటనే ఉపాధి హామీ అధికారులు స్పందించి వారికీ మెరుగైన వైద్యం అందించాలని, వారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆడుకోవాలని అన్నారు, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పని ప్రదేశాల్లో మంచినీటి సౌకర్యం, నీడ సౌకర్యం తో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ పంపిణి చేయాలని, ఎండ ప్రమాదాల నుండి కూలీలకు రక్షణ కల్పించాలని సృజన్ కుమార్ డిమాండ్ చేశారు.

ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బ్రాహ్మణపల్లి యుగేందర్, నాయకులు నల్లగొండ శ్రీనివాస్, రాజయ్య, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version