మీకు మధుమేహం ఉన్నా రోజూ మామిడిపండు తినొచ్చు.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
జహీరాబాద్. నేటి ధాత్రి:
‘మీకు మామిడి పండ్లంటే చాలా ఇష్టమా..? రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని భయపడుతున్నారా..? అయితే ఈ చిన్నపాటి జాగ్రత్తలు మీకు ఎంతో తోడ్పడుతాయి’ అనే క్యాప్షన్ ఇస్తూ ఆమె తన ఇన్స్టా హ్యాండిల్లో కొన్ని టిప్స్ సూచించారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ప్రతి ఏడాది ఎండాకాలంతోపాటే మామిడిపండ్ల సీజన్ వస్తది. మామిడిపండు రుచికరంగానే కాక అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ ఎ, కాపర్, ఫోలేట్, మెగ్నీషయం, పొటాషియం, విటమిన్ బీ6, విటమిన్ కే తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. జీర్ణకోశం, చర్మం, కురుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో మామిడిపండులోని పోషకాలు తోడ్పడుతాయి. అంతేగాక బరువును తగ్గిస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.అయితే మామిడిపండ్లు రుచిలో చాలా తియ్యగా ఉంటాయి కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి మంచివి కావని, రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయని చెబుతుంటారు. అయితే కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మధుమేహులు కూడా హాయిగా మామిడిపండ్లను ఆస్వాదించవచ్చని ప్రముఖ పోషకాహార నిపుణురాలు లవనీత్ బాత్రా తెలిపారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టా ఖతాలో ఒక పెట్టారు.
Mangoes
‘మీకు మామిడి పండ్లంటే చాలా ఇష్టమా..? రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని భయపడుతున్నారా..? అయితే ఈ చిన్నపాటి జాగ్రత్తలు మీకు ఎంతో తోడ్పడుతాయి’ అనే క్యాప్షన్ ఇస్తూ ఆమె తన ఇన్స్టా హ్యాండిల్లో కొన్ని టిప్స్ సూచించారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
1. మితంగా తీసుకోవాలి
మీరు మధుమేహులు అయినప్పటికీ రోజుకు ఒకటికి మించకుండా మామిడి పండు తినడంవల్ల ఆరోగ్యానికి వచ్చిన నష్టమేమీ లేదని లవనీత్ బాత్రా తన పోస్టులో పేర్కొన్నారు. ఒక మీడియం సైజు మామిడిపండులో 50 గ్రాముల వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయని, అలాంటి పండును రోజుకు సగం లేదా ఒకటి తినడంవల్ల వచ్చే నష్టమేమీ లేదని తెలిపారు.
2. పోషకాల బ్యాలెన్సింగ్
మధుమేహులు మామిడిపండును తీసుకున్నప్పుడు శరీరంలో కార్బోహైడ్రేట్లు, చక్కెరల పరిమాణం బ్యాలన్స్ తప్పకుండా చూసుకోవాలని బాత్రా తెలిపారు. అందుకోసం మామిడిపండును తినడానికి ముందే కొవ్వులు, ఫైబర్లు ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే మామిడిపండును ఫైబర్స్, కొవ్వులు లాంటి ఇతర పోషకాలతో కలిపి తీసుకోవడం చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. అంటే మామిడిపండును తినడానికి ముందు ఒక కప్పు నిమ్మరసంతోపాటు వాల్నట్స్, నానబెట్టిన చియా గింజలు లేదా బాదామ్ గింజలు తీసుకోవాలని సూచించారు. ఇలా చేయడంవల్ల మామిడిపండు తిన్నప్పటికీ గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉంటాయని తెలిపారు.
3. టైమింగ్ పాటించాలి
మధుమేహులు మామిడి పండును ఎప్పుడుపడితే అప్పుడు కాకుండా సరైన టైమ్లో మాత్రమే తీసుకోవాలని లవనీత్ బాత్రా సూచించారు. ఏదైనా పనిచేయడానికి ముందు, నడవడానికి ముందు, వ్యాయామం చేయడానికి ముందు మామిడి పండును తీసుకోవాలని తెలిపారు. దాంతో పెరిగిన కార్బోహైడ్రేట్స్ వెంటనే అదుపులోకి వస్తాయని పేర్కొన్నారు.
4. సరైన పద్ధతిలో తినాలి
డయాబెటిక్స్ మామిడిపండును తినాల్సిన పద్ధతిలో మాత్రమే తినాలని బాత్రా సూచించారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే మామిడిపండును జ్యూస్ల రూపంలో, మిల్క్ షేక్స్ రూపంలో కాకుండా ఉన్నది ఉన్నట్టుగా తినాలని తెలిపారు. ప్రకృతి ఇచ్చిన పండును ప్రకృతి సిద్ధంగా తినడంవల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ చైర్మన్ శివకుమార్,నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు బి ఆర్ ఎస్ పార్టీ జహీరాబాద్ మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే, చైర్మన్ గార్లు మాట్లాడుతూ.
Silver Jubilee
27న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు తరలిరావాలని ,ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్ తెలంగాణ ప్రజల భవిష్యత్ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,మాజి న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి,వీర రెడ్డి,రాజు పటేల్,రాజ్ కుమార్,ప్రవీణ్ కుమార్,రాజేందర్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,అశోక్,హనీఫ్ పటేల్,యువత అధ్యక్షులు ఉమేష్ ,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవి కుమార్, మాజి సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు , గ్రామ పార్టీ అధ్యక్షులు,నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు శంకుస్థాపన, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్న లింగగూడెం గ్రామ పంచాయతీ కేంద్రంలో మంగళవారం ఇందిరమ్మ ఇల్లులు శంకుస్థాపన చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇల్లు ఇపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కూడా అందరూ వినియోగించుకోవాలని యువత కు చాలా ఉపయోగ కరమయిన పథకం అని తెలియజేసారు. ఈ మధ్య ప్రవేశ పెట్టిన భూ భారతి పథకం ద్వారా ఎలాంటి భూమి సమస్యలు ఉన్న పరుష్కరించ పడతాయని పూర్వం ఉన్న ధరణి పథకం ద్వారా అనేక మంది ప్రజలు ఇబందులు పడ్డారని భూభారతి ద్వారా అలాంటి సమస్యలన్నీ పరిష్కారం దొరుకుతుంది అని ఏ సమస్య ఉన్న ఎమ్మార్యో ని సంప్రదించండి అని తెలియజేసారు. నన్ను గెలిపించినందుకు అనుక్షణం మీ కోసం పని చేస్తానని ఎలాంటి సమస్య ఉన్న నన్ను సంప్రదించండి అని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్న లింగగూడెం గ్రామ పంచాయతీ రాష్ట్రానికే మార్గదర్శకంగా నిలవాలని అధికారులు కూడా అందుకు అనుకూలంగా పని చేయాలనీ ఆదేశాలిచారు. అనంతరం కళ్యాణి లక్ష్మి అర్హులైన వారికి మొత్తంగా రు.27,03132 (ఇరవై ఏడు లక్షల మూడు వేల నూట ముప్పై రెండు రూపాయలు ) అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొడెం ముత్యమాచారి, పిఎస్ఆర్,పీవీఆర్ యువసేన కో-ఆర్డినేటర్ ఎస్కె ఖదీర్, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, ఏఏంసి డైరెక్టర్ ఊకె బుచ్చయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
రైతులు కొనుగోలు కేంద్రాలనుసద్వినియోగం చేసుకోవాలి. పి ఏ సి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు …………
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలలోరంగాపురం, ఇస్సిపేట, మొగుళ్ళపల్లి, కొరికిశాల, మొట్లపల్లి గ్రామాలలో. ధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పిఎసి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు తో కలిసి ముందుగా తూకానికి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ధాన్యాన్ని తూకం వేశారు . అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే సహించేది లేదని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సూచించిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పాటు ప్రభుత్వం అందిస్తున్న 5 వందల బోనస్ పొందాలని రైతులు ధాన్యంలో. తాలు, మట్టి గడ్డలు లేకుండా. తెమ శాతం తక్కువగా ఉండేవిదంగా చూసుకోవాలి.
MLA
పిఎసిఎస్ సిబ్బంది హమాలీల కొరత లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించిన మిల్లులకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని మీ ఇష్టానుసారం మిల్లులకు తరలించి రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఆ మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈగతసీజన్ లో జిల్లాలో రైతులకు 30 కోట్ల బోనస్ ఇచ్చామని రైతులవద్ద ధాన్యం కొనుగోలు చేసిన పది రోజుల్లో. ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఇక్కడ ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని, అధికారులకు సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ. రవి, తహసీల్దార్, జాలి సునీత, ఎంఎఓ. సురేందర్ రెడ్డి, చిట్యాల ఎఎంసి చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నర్సింగారావు, మోటె ధర్మారావు, తక్కళ్లపెల్లి రాజు,క్యాతరాజు రమేష్, పోల్నేని లింగారావు, బక్కిరెడ్డి, శివారెడ్డి, గుండారపు తిరుపతి, లింగయ్య, సొసైటీ డైరెక్టర్లు నాయకులు రైతులు పాల్గొన్నారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి స్వామి,సారంగారవు, అమర్నాథ్ రెడ్డి.
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సంవత్సరానికి ఒకసారి జరిగే ప్రెస్ క్లబ్ ఎన్నికలు గత నెలలో ముగియడంతో ప్రెస్ క్లబ్ క్యాతనపల్లి నూతన కార్యవర్గాన్ని క్లబ్ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ గౌరవ గౌరవ అధ్యక్షులుగా పిలుమాల్ల గట్టయ్య(మెట్రో ఈవినింగ్), గౌరవ సలహాదారులు గా కలువల శ్రీనివాస్ (జర్నలిస్టు దినపత్రిక)ఎన్నికయ్యారు. ప్రెస్ క్లబ్ పూర్వపు అధ్యక్షులు పిలుమాల్ల గట్టయ్య ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు ఆరెంద స్వామి(సిటీ కేబుల్),ప్రధాన కార్యదర్శి ఈదునూరి సారంగారావు (జనం సాక్షి), కోశాధికారి బండ అమర్నాథ్ రెడ్డి(వుదయం )లకు పదవీ బాధ్యతలు అప్పగించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గాంగారపు గౌతమ్ ( ప్రజా పక్షం), ప్రచార కార్యదర్శి ఆరెల్లి గోపి కృష్ణ( మన సమాజం),ఉపాధ్యక్షులు నాంపల్లి గట్టయ్య( నేటి ధాత్రి), ఎం వేణుగోపాల్ రెడ్డి( వాస్తవం), కొండ శ్రీనివాస్ ( మనతెలంగాణ),కార్యనిర్వాహణ కార్యదర్శి పి రాజేంద్ర ప్రసాద్ (తెలంగాణ గళం),సహాయ కార్యదర్శులు ఎన్ శ్రీనాథ్ (సూర్య ) పి గంగులు యాదవ్ (సామాజిక తెలంగాణ) లు నూతనంగా ఎన్నికయ్యారు. క్లబ్ సభ్యులుగా ఎం ప్రవీణ్, కె సదానందం, ఎం రవీందర్, డి స్వామి, డి వెంకటస్వామి లు ఉన్నారు. సమావేశంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం తో పాటు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం తో పాటు పలు అంశాలను చర్చించారు. నూతన కమిటీని శాలువాలతో సత్కరించారు. అనంతరం నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ,కోశాధికారి లు మాట్లాడారు. కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ప్రెస్ క్లబ్ క్యాతనపల్లి ని సమిష్టిగా కలిసి మెలిసి పని చేసి ఆదర్శ ప్రెస్ క్లబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని అన్నారు. ప్రెస్ క్లబ్ నియమనిబంధనలు ప్రతి ఒక్క జర్నలిస్ట్ పాటించాలని, నియమ నిబంధనలు ఎవరు అతిక్రమించినా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీని వీడి బి.ఆర్.ఎస్. పార్టీలో చేరిన నాయకులు మాజీ మంత్రి దయాకర్ రావు సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్న మాజీ సర్పంచ్ ఉప, సర్పంచ్ కక్కిరాల పల్లిలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ
నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ:-
ఐయినవోలు మండలం కక్కిరాల పల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ కంచర్ల రమేష్, ఉప సర్పంచ్ బొల్లం ప్రకాష్ మంగళవారం మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బి. ఆర్. ఎస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మోసపూరిత కాంగ్రెస్ మాటలు విని మేం మోసపోయామని ప్రజలు అంటున్నారని,కెసిఆర్ ఒక విజన్ తో పని చేస్తే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవగాహన లోపంతో ప్రజలను ఆగం పట్టిస్తున్నారని విమర్శించారు. బోగస్ మాటలు చెప్పి ప్రజలను బోల్తా కొట్టించిన ఈ కాంగ్రెస్ పార్టీని తొందరలోనే బొంద పెట్టే రోజులు వస్తున్నాయని వారు అన్నారు.వీరితోపాటు బీ. ఆర్. ఎస్ పార్టీలో కాటబోయిన కుమారస్వామి, గాడుదల లింగయ్య, చిర్ర రాజేందర్, తల్లపెల్లి నాగరాజు, మడ్లపల్లి రాజు,ఆరూరి అరుణ్, నూనె సాంబరాజు, జోగు సతీష్, జోగు రమేష్, గుబ అరుణ్ కుమార్, కోల శ్రీనివాస్, ఆరూరి లలిత, ఆరూరి పూల, బర్ల సుమలత, ఆరూరి అనిత ఇంకా భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నుండి కార్యకర్తలు పార్టీలో చేరటం జరిగింది.ఈ కార్యక్రమంలో బి. ఆర్. ఎస్ మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కలపల్లి చందర్ రావు మండల కన్వీనర్ తంపుల మోహన్, మండల ఇంచార్జ్ గుజ్జ గోపాలరావు, నాయకులు పల్లకొండ సురేష్, గ్రామ పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షుడు అల్లం సోమయ్య, టిఆర్ఎస్ నాయకులు మరుపట్ల దేవదాస్,దుప్పెల్లి కొమురయ్య, గడ్డం రఘువంశీ గౌడ్ పాల్గొన్నారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
రైతులు కొనుగోలు కేంద్రాలనుసద్వినియోగం చేసుకోవాలి. పి ఏ సి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు …………
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలలోరంగాపురం, ఇస్సిపేట, మొగుళ్ళపల్లి, కొరికిశాల, మొట్లపల్లి గ్రామాలలో. ధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పిఎసి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు తో కలిసి ముందుగా తూకానికి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ధాన్యాన్ని తూకం వేశారు . అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే సహించేది లేదని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సూచించిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పాటు ప్రభుత్వం అందిస్తున్న 5 వందల బోనస్ పొందాలని రైతులు ధాన్యంలో. తాలు, మట్టి గడ్డలు లేకుండా.
MLA
తెమ శాతం తక్కువగా ఉండేవిదంగా చూసుకోవాలి. పిఎసిఎస్ సిబ్బంది హమాలీల కొరత లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించిన మిల్లులకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని మీ ఇష్టానుసారం మిల్లులకు తరలించి రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఆ మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈగతసీజన్ లో జిల్లాలో రైతులకు 30 కోట్ల బోనస్ ఇచ్చామని రైతులవద్ద ధాన్యం కొనుగోలు చేసిన పది రోజుల్లో. ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఇక్కడ ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని, అధికారులకు సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ. రవి, తహసీల్దార్, జాలి సునీత, ఎంఎఓ. సురేందర్ రెడ్డి, చిట్యాల ఎఎంసి చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నర్సింగారావు, మోటె ధర్మారావు, తక్కళ్లపెల్లి రాజు,క్యాతరాజు రమేష్, పోల్నేని లింగారావు, బక్కిరెడ్డి, శివారెడ్డి, గుండారపు తిరుపతి, లింగయ్య, సొసైటీ డైరెక్టర్లు నాయకులు రైతులు పాల్గొన్నారు.
భూ-భారతి చట్టంపై నిర్వహించే అవగాహన సదస్సు వాయిదా మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఈనెల 23న నిర్వహించాల్సిన భూ-భారతి చట్టం అవగాహన సదస్సును అనివార్య కారణాల వలన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు ఈనెల 24న నిర్వహించనున్నట్లు తహసిల్దార్ జాలీ సునీత ఒక ప్రకటనలో తెలిపారు. కాబట్టి మండలంలోని రైతులు ఇట్టి విషయాన్ని గమనించి ఈ నెల 24న మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో నిర్వహించే భూ-భారతి చట్టం అవగాహన సదస్సుకు అధిక సంఖ్యలో హాజరై, వారికున్న భూ సమస్యలను నివృత్తి చేసుకోగలరని ఆమె తెలిపారు.
పట్టణంలో మంగళవారం రోజున ఎల్తూరి సంమృత వర్ధన్(చిన్ను)ఆధ్వర్యంలో చింతల్ గ్రౌండ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన పరకాల క్రికెట్ టోర్నమెంట్ 2025 ని మాజీ శాసనసభ్యులు మోలుగూరి బిక్షపతి,క్రాంతి కుమార్,వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొయ్యాడా శ్రీనివాస్ లు ప్రారంభించారు.అనంతరం క్రీడాకారుల పరిచయ కార్యక్రమం నిర్వహించి ఆటను ప్రారంభించారు.
Cricket Tournament
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బిక్షపతి మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి శారీరికంగా స్నేహభావంతో ఆడుకోవాలి గెలుపు ఓటుములు సహజంగా తీసుకోవాలి మంచిగా ఆట ఆడిన వారికి జిల్లా స్థాయిలో రాష్ట్రస్థాయిలో సెలక్షన్లు అయినప్పుడు తప్పకుండా తగిన గుర్తింపు వస్తుందన్నారు.అందుకే ప్రతి క్రీడాకారుడు పట్టుదలతో ఆట ఆడి సాధించాలి అప్పుడే వారికి తగిన గుర్తింపు ఊరుకో జిల్లాకు రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా ఆటలు ఆడాలని అన్నారు.ఈ కార్యక్రమం మాజీ కోఆప్షన్ సభ్యులు ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి,సమన్వయ కమిటీ నాయకులు దుబాసీ వెంకటస్వామి,కొలనుపాక సిద్దు,మంద టునీట్,జిల్లెల్ల వినయ్,వినాయక హాస్పిటల్ యజమాన్యం,దార సతీష్,ఏకు లడ్డు,మడికొండ లడ్డు,అఖిల్,ప్రణయ్,రమెష్ తదితరులు పాల్గొన్నారు.
వివాహా వేడుకలలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి నేటిదాత్రి :
ముసాపెట్ మండలం.మహ్మద్ హుసేన్ పల్లి గ్రామాని కి చెందిన మాజీ సర్పంచ్ నిర్మల కాశీ నాథ్ సాగర్ సోదరుడు వెంకటయ్య కుమారుడు శేఖర్ దీపిక వివాహా వేడుకలకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ఆశీర్వదించారు మాజీ మంత్రి వెంట బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు గొల్ల శేషయ్య సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్ చెన్నారెడ్డి బీ ఆర్ ఎస్ కార్యకర్తలు ఉన్నారు
రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని
సన్నబియ్యం పంపిణీ నిరుపేదలకు వరంగల్ మారిందని
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన దారకొండ నాగరాజు నివాసంలో గ్రామానికి చెందిన నాయకులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ బడిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికను మంగళవారం రోజున భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం వల్ల రైతులకు ఎంతో ఉపయోగం ఉందని.పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ధరణి వంటి చట్టాలు దరిద్రంగా మారిందని, ధరణితో అధికారులకి.. అధికారాలు లేకుండా పోయాయన్నారు. ధరణి వల్ల ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలకు భూభారతి చట్టం ద్వారా మోక్షం లభిస్తుందని, కొత్త చట్టంలో సమస్యలపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో కలిపి భూభారతిని తీసుకొచ్చారన్నారు. భూ భారతి చట్టం ప్రకారం.. భూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని, సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చని, ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
opportunity
ధరణిలో రెవెన్యూ కోర్టులను తొలగించడం వల్ల భూ వివాదాల విషయంలో రైతులు సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని గుర్తు చేశారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుత భూభారతి చట్టం ద్వారా గతంలో మాదిరిగా రెవెన్యూ కోర్టులు పునరుద్ధరించిందని వివరించారు. భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునేందుకు తహసీల్దార్ రెవెన్యూ డివిజన్ అధికారికి, కలెక్టర్కు అధికారాలు కల్పించామని తెలిపారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు భావిస్తే అప్పీల్ చేసుకోవచ్చని సూచించారు. ఆర్థిక స్థోమత లేని పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా ప్రస్తుత చట్టంలో సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. పెండింగ్లో ఉన్న సాదాబైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అదనపు కలెక్టర్ అశో,క్ డి ఆర్ డి ఎ పి డి నరేష్, తాసిల్దార్ హేమ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, జిల్లా అధికారులు మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి కాంగ్రెస్ నాయకులు దొడ్డికిష్టయ్య బుర్ర లక్ష్మణ్ గౌడ్, మధు వంశీకృష్ణ రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రభంజనం
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మంగళవారం రోజున వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ సెకండియర్ లో 90%, ఫస్ట్ ఇయర్లో 62% ఉత్తీర్ణతతో మంచి ప్రదర్శన కనబరిచారని కళాశాల ప్రిన్సిపాల్ బి శ్రీదేవి తెలియజేశారు.ఎంపీసీ సెకండ్ ఇయర్ లో జి అనిల్ 969/1000, ఎన్ సౌమ్య 924/1000, ఏ నవ్య 900/1000, బైపిసి సెకండియర్ లో ఏం శ్రీవాణి 900/1000, ఎన్ ప్రియాంక 880/1000, బి అజయ్ 880/1000, సీఇసి సెకండ్ ఇయర్ లో ఏ శివ 608/1000, హెచ్ ఈ సి సెకండ్ ఇయర్ లో పి చందు 632/1000, ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఎన్ అంజలి 457/470, జి మానసి 446/470, ఏం అంజలి 432/470, ఏం శరణ్య 427/470, బైపిసి ఫస్ట్ ఇయర్ ఎం హర్షిత 405/440, ఏ వైష్ణవి 393/440, ఫస్ట్ ఇయర్ ఇ రాహుల్ 362/500, ఓ సమత 354/500 మార్కులు సాధించారని ప్రిన్సిపల్ బి శ్రీదేవి తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, లెక్చరర్లను ప్రిన్సిపాల్ శ్రీదేవి అభినందించారు.
వరంగల్ ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.
జహీరాబాద్. నేటి ధాత్రి:
వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు నాయకులకు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు
Silver Jubilee Celebration
బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే, మాట్లాడుతూ.ఈనెల 27న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు తరలిరావాలని ,ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్ తెలంగాణ ప్రజల భవిష్యత్ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Silver Jubilee Celebration
ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,పెంట రెడ్డి, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,బీసీ సెల్ మండల అధ్యక్షులు అమిత్ కుమార్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు హీరు రాథోడ్,మైనార్టీ మండల అధ్యక్షులు వహీద్,మండల పార్టీ జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డి,మాజి సర్పంచ్ లు చిన్న రెడ్డి,విజయ్ ,అబ్రహం,మాజి ఎంపీటీసీ లు బస్వరాజు,రాములు,శంకర్,గ్రామ పార్టీ అధ్యక్షులు,నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్ గారి అదేశాలతో
◆ 6,22,500 సీఎం రిలీఫ్ ఫండ్ ( సీఎంఆర్ఎఫ్ ) చెక్కుల పంపిణీ
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాలకల్, కోహిర్, జహీరాబాద్ మండలాల గ్రామాల లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, నాయకులు న్యాలకల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కోహిర్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు హుగెల్లి రాములు గారు పంపిణీ చేశారు.అనంతరం లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాజీ మంత్రి డా౹౹ఏ. చంద్రశేఖర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.లబ్ధిదారుల వివరాలు మల్లెగారి. అరుణ్ కుమార్ 60,000,జహీరాబాద్ కోహిర్. చంద్రయ్య 60,000 కోహిర్ బంగ్లాదొడ్డి. స్వప్న 60,000 ఆర్య నగర్, జహీరాబాద్ చెంగోలి. పుణ్యమ్మ 22,500 పైడిగుమ్మల్ కంట్టం. నాగరాజు 60,000 జహీరాబాద్ శెట్టి రాథోడ్ 60,000 హుగేల్లి బ్యాతా. శ్రీకాంత్ 60,000 న్యాలకల్ అశ్వక్ 60,000 జహీరాబాద్ బాయిని. క్రాంతి కుమార్ 60,000 వెంకటేశ్వర కాలనీ,జహీరాబాద్ బి.ధనరాజ్ 60,000 అసిఫ్ నగర్ కొన్నదొడ్డి.పద్మ 60,000 రేగోడ్. వీరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.
విద్యార్థులు ఇష్టపడి చదవాలి పాఠశాల వార్షికోత్సవంలో ఎమ్మెల్యే జీఎస్సార్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో ఈరోజు మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో ప్రాథమికొన్నత పాఠశాల, గణపురం మండలంకేంద్రంలోని మోడల్ స్కూల్ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన పాఠశాలల వార్షికోత్సవ వేడుకల్లో భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు.విద్యార్థుల నృత్యాలు, కోలాటాలు చాలా ఆకర్షించాయి. ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ ఏడాది పాఠశాలల్లో నిర్వహించే వార్షికోత్సవాలు బడి పట్ల విద్యార్థుల్లో నమ్మకం, విశ్వాసాన్ని నింపుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రులతోడ్పాటు ఉంటే అద్భుతాలను సృష్టిస్తారన్నారు.
MLA
తల్లిదండ్రులు పిల్లలకు ప్రతీ రోజు కొంత సమయం కేటాయించి, వారితో విద్యాపరమైన సామాజిక అంశాలపై చర్చించడం ద్వారా వారిలో భయం పోతోందన్నారు. చదవుతో పాటు ఆటపాటలు కూడా చాలా అవసరం అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. ప్రతి విద్యార్థి తమ లక్ష్యాలను ఎంచుకొని ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరారు.విద్యార్థుల కళా ప్రదర్శన అద్భుతంగా ఉందని అన్నారు.చెల్పూర్ పాఠశాలలో వాష్ రూమ్స్ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తాను అన్నారు.పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు టెంకాయ కొట్టి ఇట్టి నిర్మాణ పనులను ప్రారంభించాలని చెప్పారు. గణపురం మండలం మోడల్ పాఠశాలలో డైనింగ్ హాల్, సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం పోటీ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉపాధ్యాయులను శాలువాతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి , జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ , మండల ఎంపిడిఓ ఎల్ భాస్కర్ ,ఉపాధ్యాయులు , విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
జమ్మికుంట మండల సిపిఐ నూతన కమిటీ ఎన్నిక జమ్మికుంట :నేటిధాత్రి
అంతరాలు లేని సమ సమాజ స్థాపన కోసం పేదల పక్షాన సిపిఐ నిరంతరం పోరాడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల సిపిఐ పదవ మహాసభ జరిగింది. ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి హాజరై మాట్లాడారు.ఈ సభలోలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పంజాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలపై ఉద్యమ పోరాటాలు చేస్తున్న కమ్యూనిస్టులకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుటకు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు సిపిఐ నిరంతరం కృషి చేస్తుందన్నారు. గ్రామాల్లో సిపిఐ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. .సిపిఐ పార్టీ ఆవిర్బవించి వంద సంవత్సరాలు అవుతుందని, మార్కిసిజం లేనినిజం సిద్ధాంతాలతో సమ సమాజ స్థాపనే లక్ష్యంగా దోపిడీ లేని సమాజం కోసం అంతరాలు లేని వ్యవస్థ కోసం దేశంలోనే మొట్టమొదటి రాజకీయ పార్టీ సిపిఐ అన్నారు. నాటి నుండి నేటి వరకు కార్మిక, కర్షకుల సమస్యలతో పాటు దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతూ హక్కుల సాధన కోసం, సమస్యల పరిష్కారం పోరాడుతున్న ఏకైక పార్టీ అని అన్నారు. దేశాన్ని పాలిస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి కేవలం కార్పొరేట్ బహుళజాతి సంస్థలకు సంపన్న వర్గాలకు అనూకూల నిర్ణయాలు చేస్తూ దేశ సంపదను కోళ్లగొడుతూ కాలయాపన చేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కేంద్రంలో,రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న వారిని హామీలను అమలు పరుచాలని సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలని ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని కలిగించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను వే వేగవంతంగా అమలు చేసి పేదలను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఆలస్యం అవుతుందని,ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, పెన్ష్షన్స్ పెంపు, రైతుల ఋణమాఫీ తదితర హామీలను వెంటనే నేర వేర్చాలని, లేకుంటే ప్రజా ఉద్యమాలు తప్పవని హేచ్చరించారు. అనంతరం జమ్మికుంట మండల సిపిఐ నూతన కమిటీ ని ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా గజ్జి అయిలయ్య, సహాయ కార్యదర్శిగా గరిగే రాములు, శీలం రాజేందర్, 11 మంది సభ్యులతో కార్యవర్గం ఎన్నుకున్నారు. ఈ సభలో ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ కళ్యాణ్, మహిళా సమాఖ్య నాయకురాలు, శారద, ఐల రాజేందర్, శ్రీరాములు, సీపీఐ కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో శాయంపేట మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభంజనం సృష్టించింది.
results
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కందగట్ల కోటేష్ మాట్లాడుతూ ఇంటర్ ప్రధమ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారు అన్నారు ముఖ్యంగా ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470 మార్కుల గాను భానుశ్రీ 450 మార్కు లతో కాలేజ్ టాపర్ గా, బూర వరుణ్ 444 మార్కులు సాధించారు.
results
అదేవిధంగా బైపిసి రెండవ సంవత్సరం ఇంజపూరి కావ్య శ్రీ 1000మార్కులకు గాను 623, కొమ్ముల కీర్తన 585 మార్కులను సాధించారు. సి ఈ సి రెండవ సంవత్సరం మహమ్మద్ యాశ్రిన్ 723, వంగరి ప్రవళిక 706 మార్కులు సాధించారు.
results
ఏడాది ఇంతటి అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులకు సహకరించిన అధ్యాపకులు వారి తల్లిదండ్రు లకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మన్నారు. ఇదే స్పూర్తితో భవిష్యత్తులో మరిన్ని గొప్ప ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు.
రైతులకు ఇబ్బంది కలుగకుండా ధాన్యం సేకరించాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని యాసంగి పంట కొనుగోలు లో రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన వరి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని, ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద రెండు లారీలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలని అన్నారు. మన జిల్లాలో ఇప్పటి వరకు 241 కొనుగోలు కేంద్రాలకు గాను 239 కేంద్రాల ప్రారంభం చేసి 198 కొనుగోలు కేంద్రాల నుంచి 16 వేల 22 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు జమ అయ్యేలా చూడాలని అన్నారు. మిల్లు అలాట్మెంట్ కాని కోనుగోలు కేంద్రాలకు సమీపంలో గల అపెరల్ పార్క్ లో ఇంటర్మీడియట్ గోదాము నందు ధాన్యం భద్రత కోసం బుక్ చేయాలని అన్నారు. రైస్ మిల్లుల సమస్య కారణంగా ఎక్కడా ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడానికి వీలు లేదని అన్నారు. కోనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలు పరిశీలించి, భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని అన్నారు.ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద 2 లారీలను అందుబాటులో పెట్టాలని, ధాన్యం రవాణా ఎటువంటి ఇబ్బందులు ఉండవద్దనిపేర్కొన్నారు.ఈ సమీక్షా సమావేశంలో డిఆర్డిఓ శేషాద్రి, డిఏఓ అఫ్జలి బేగం, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, పౌర సరఫరాల శాఖ అధికారులు రజిత, వసంత లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.