ట్రాన్స్ ఫార్మర్ షాట్ సర్క్యూట్ తో వరిధాన్యం దగ్ధం.

ట్రాన్స్ ఫార్మర్ షాట్ సర్క్యూట్ తో వరిధాన్యం దగ్ధం..

వంద బస్తాల వరిధాన్యం దగ్ధం..1.5 లక్షల నష్టం.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..

ప్రభుత్వం ఆదుకోవాలని రైతు బిక్షపతి విజ్ఞప్తి..

అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికే వరిధాన్యం దగ్ధం

నర్సంపేట నేటిధాత్రి:

విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్ కు షార్ట్ సర్క్యూట్ కావడంతో నోటి కాడికి వచ్చిన వరిధాన్యం దగ్ధమయింది ఈ సంఘటన నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామ శివారులో శనివారం మధ్యాహ్నం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చంద్రయ్య పల్లి గ్రామానికి చెందిన బాధిత రైతు కుక్కముడి బిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం యాసంగి వరి పంటకాలం పూర్తికాగా హార్వెస్టర్ సహాయంతో పంట కోత పూర్తి చేసినట్లు తెలిపారు. మరి ధాన్యాన్ని అమ్మకం కోసం సిద్ధంగా ఉంచగా పొలము సమీపంలో గల వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్ కు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ అయ్యి పక్కనే ఉన్న గడ్డికి ద్వారా మంటలు వ్యాప్తించి వరిధాన్యం కాళీ దగ్ధమైందని రైతు బిక్షపతి ఆవేదన వ్యక్తం చేశారు.

short circuit

షార్ట్ సర్క్యూట్ కు అద్భుతమైన వరి ధాన్యం సుమారు 100 బస్తాలు ఉంటాయని చెప్పారు. అలాగే గడ్డికట్టలు, వ్యవసాయ పైపులు, కరెంటు వైర్లు కాలి బూడిద అయ్యాయని మొత్తం విలువ 1,50 వేలు ఆస్తినష్టం జరిగిందని రైతు బిక్షపతి వివరించారు. మా వరిధాన్యంతో పాటు మరికొందరు రైతుల గడ్డి అరుధాన్యం కూడా దద్దమయ్యాయని తెలిపారు. ఆరగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం ట్రాన్స్ఫార్మర్ తప్పిదం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి తనకు నష్టం వాటిల్లిందని కాగా ప్రభుత్వం నష్టపరిహారంగా ఆర్థిక సహాయాన్ని అందించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత రైతు కుక్కముడి బిక్షపతి ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

short circuit

షార్ట్ సర్క్యూట్ అయ్యి అగ్ని ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి అగ్నిమాపక కేంద్రం అధికారులకు సమాచారం ఇవ్వగా సుమారు రెండు గంటల ఆలస్యంగా వచ్చారని అయినప్పటికీ పక్కనే ఉన్న చెరువులోని నీటితో గ్రామస్తులు రైతుల సహకారంతో మంటలు అదుపులోకి తెచ్చినట్లు రైతు బిక్షపతి తెలిపారు.ఈ సంఘటన పట్ల స్థానిక పోలీస్ స్టేషన్, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నట్లు బిక్షపతి తెలిపారు.

32 ఏళ్లుగా సేవలు.

32 ఏళ్లుగా సేవలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఓవైపు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం నిర్వహిస్తూ.. మరోవైపు కద లలేని స్థితిలో ఉన్న కుమారుడిని కం టికి రెప్పలా కాపాడుతోంది ఓ మాతృ మూర్తి. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పానగర్కు చెందిన ఈశ్వ రమ్మ, రాములుకు 32 ఏళ్ల క్రితం మనోజ్ కుమార్ జన్మించాడు. పుట్టుకతోనే కదలలేని స్థితిలో ఉన్న కుమారుడికి బాగవుతుం దని నమ్మకంతో పలు ఆస్పత్రులలో సంప్రదించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. పుట్టినప్పటి నుంచి నేటి వరకు కుమారుడికి అన్ని విధాలుగా సేవలు చేస్తూ కనుపాపలా చూసుకుంటోంది ఆ తల్లి. స్నానం చేయించడం, తినిపించడం, వంటి అన్నీ తానై సేవలు అం దిస్తున్నారు. ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే కొడుకుకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు.

శిక్షణ ట్రైనర్ ని సన్మానించిన మహిళలు.

శిక్షణ ట్రైనర్ ని సన్మానించిన మహిళలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణంలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జి అండ్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో కుట్టు పూర్తయిన మహిళలు, శిక్షణ ఇచ్చిన ట్రైనర్ కవితకి, ఇన్స్టిట్యూట్ చైర్మన్ కొత్త కాపు శిరీష. రెడ్డికి ఆదివారం శిక్షణ పొందిన మహిళలు ఘనంగా సన్మానించి, బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పట్లోల రాజేశ్వరి, సోని, శ్రావణి మంజుల, కవిత, వాణి, లక్ష్మి, అనసూయ, స్వప్న, గాయత్రి, పున్నమ్మ, శిక్షణ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినికి 692 వ ర్యాంకు.

విద్యార్థినికి 692 వ ర్యాంకు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన హానిక EAPCET లో 692వ ర్యాంకు సాధించింది. కనిక తల్లిదండ్రులు నవీన, శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. అధ్యాపకులు, తల్లిదండ్రుల కృషితో తనకు మంచి ర్యాంకు వచ్చిందని హానిక తెలిపారు.

కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక పూజలు .!

శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక పూజలు

మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్

జవహర్ నగర్ నేటి దాత్రి:

 

 

మేడ్చల్ మార్కాజిగిరి జిల్లా

జవహర్ నగర్ మున్సిపాలిటీలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమం లో భాగంగా యాదవ సంఘం మరియు జవహర్ నగర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్,మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్,సీనియర్ నాయకులు కల్లేపల్లి సదానంద,తదితరులు పాల్గొన్నారు

బీసీ పల్లెబాట యాత్రని విజయవంతం చేద్దాం .!

బీసీ పల్లెబాట యాత్రని విజయవంతం చేద్దాం

బీసీ జే.ఏ.సీ నాయకులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున జరగబోయే గ్రామ,గ్రామీన జాగృతికై మేమెంతో.. మాకంత పల్లేబాట యాత్రను విజయవంతం చేయాలని బీసీ జే.ఏ.సీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ…. బిసి ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయా అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ గ్రామ,గ్రామీన జాగృతికై మేమెంతో.. మాకంత పల్లేబాట యాత్రను గత కొన్ని రోజుల క్రితం కొండ లక్ష్మణ్ బాపూజీ స్వగ్రామమైన వాంకిడి,అసిఫాబాద్ జిల్లా నుంచి ప్రారంభించారు.యాత్ర రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారీగా తిరుగుతూ బీసీ సబ్బండ వర్గాలను ఒకటి చేసి సభలను,రౌండ్ టేబుల్ సమావేశాలను ర్యాలీలను నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.అలాగే ఈ యాత్ర మే10 తేదీ ఆదివారం రోజున మంచిర్యాల పట్టణానికి చేరుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు. యాత్రకు స్వాగతం తెలిపి, సాయంత్రం 4:00 గంటలకు మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్ నుంచి ఐ.బి చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ యొక్క గ్రామ,గ్రామీన జాగృతికై మేమెంతో.. మాకంత పల్లేబాట యాత్ర కార్యక్రమానికి జిల్లాలో ఉన్న విద్యార్థిని,విద్యార్థులు, రాజకీయ నాయకులు,వివిధ కులసంఘాల నాయకులు,కవులు,కళాకారులు,ప్రజా సంఘనాయకులు,ప్రజాప్రతినిధులు బీసీ కుటుంబ సభ్యులు,బీసీ మద్దతుదారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు పరికిపండ్ల అశోక్,వడ్డేపల్లి మనోహర్,గుమ్ములశ్రీనివాస్, విద్యార్థి నాయకులు చేరాల వంశీ,హరీష్ గౌడ్,బీసీ జిల్లా నాయకులు గజ్జలి వెంకన్న, బీసీ యువజన నాయకులు లతీఫ్,ఎర్రోళ్ల రాజు,సందీప్ మరియు తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీట్ల తొలగింపు మేలా.!

రౌడీ షీట్ల తొలగింపు మేలా…

మహబూబాబాద్ సబ్ డివిజన్ లో రౌడీ షీట్ల తొలగింపు మేళా.. 28 మంది రౌడీ షీటర్లపై రౌడీషీట్‌ ఎత్తివేత

మార్పు కోసమే ఈ ప్రయత్నం

డిఎస్పీ తిరుపతి రావు

మహబూబాబాద్/ నేటి ధాత్రి:

 

 

మహబూబాబాద్ డివిజన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన ప్రశాంతవంతమైన జీవితం గడుపుతున్న 28 మంది రౌడీ షీటర్లపై రౌడీషీట్‌ ను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపీఎస్ ఆదేశాలమేరకు తొలగించినట్లుగా డిఎస్పీ తిరుపతి రావు ప్రకటించారు. మహబూబాబాద్ డివిజన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన వున్నవారిపై రౌడీ షీట్ల తొలగించపు మేళా మహబూబాబాద్ తోన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించారు. ఇందులో ప్రశాంవంతమైన జీవితంతో పాటు ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలపాలలో పాల్గోకుండా సాధారణ జీవితాన్ని గడుపుతున్న రౌడీ షీటర్లను గుర్తించి వారిపై రౌడీ షీట్‌ తొలగించేందుకుగాను జిల్లా పరిధిలో రౌడీషీట్ల తోలగింపు మేళాను ఏర్పాటు చేశామని, అధికారులు నెల రోజుల పాటు కసరత్తు చేసి రౌడీ షీట్ల తొలగించడం జరిగిందని తెలిపారు.

దీని కోసం పరిధిలోని రౌడీషీటర్ల ప్రస్తుత జీవనవిధానంపై సంబంధిత స్టేషన్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో సమీక్షా జరిపి రౌడీషీట్‌ తొలగింపు జాబితాను రూపొందించారని . ఈ జాబితాను అనుసరించి సత్ప్రవర్తన కలిగిన వారిపై జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపీఎస్, రౌడీ షీట్‌ తొలగింపు మేళా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మేళాను ఉద్దేశించి మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతి రావు మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా సాధారణ జీవితం గడుపుతున్న వారిపై రౌడీ షీట్లను ఎత్తివేస్తున్నట్టు తెలిపారు.సత్ప్రవర్తన కలిగిన వారిపై రౌడీ షీట్లను ఎత్తివేశామని ఎస్పీ తెలిపినట్లుగా డిఎస్పీ వివరించారు.

.ఇక గత కొద్దికాలంగా రౌడీషీటర్లుగా గుర్తింపబడిన వ్యక్తులు సత్ప్రవర్తనతో జీవితాన్ని కొనసాగిస్తూ ఎలాంటి నేరాలకు పాల్పడకపోవడాన్ని గుర్తించడం జరిగిందని అందుకే ఇలాంటి ఎవరైనా నేరాలకు పాల్పడుతూ, ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగిస్తూ , శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే రౌడీ షీట్లు తెరుస్తామని , అలాంటి వారిపై పోలీసుల నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు 28మంది పై రౌడీషీట్‌ తొలగింపు చేశామని చెప్పారు. రౌడీషీట్‌ తొలగించబడిన వ్యక్తులు భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు.అలాగే ఏదైనా ,ఎక్కడైనా నేరం జరిగితే పోలీసులకు సమాచారాన్ని అందించే భాధ్యాతయుతమైన పౌరులుగా వుంటూ పోలీసులకు అందించి సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఆధే విధంగా వీరిని చూసి మిగితా వారిలో కూడా మార్పు రావాలని రౌడీషీట్లను తొలగించాం అని అన్నారు.ముఖ్యంగా హింసతో ఏది సాధించలేమని, ప్రతికార చర్యలతో కాకుండా పరస్పరం చర్చించుకోని సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో టౌన్ సీఐ దేవేందర్, డోర్నకల్ సీఐ రాజేష్, బయ్యారం సీఐ రవి, ఎస్.ఐ తిరుపతి, రూరల్ ఎస్.ఐ దీపిక, పాల్గొన్నారు.

గుడిలేని దైవం..అమ్మ..

గుడిలేని దైవం..అమ్మ..

అమ్మ లేకపోతే సృష్టే లేదు..

కడుపున పుట్టిన పిల్లలకు పెద్దదిక్కు అమ్మ..

మాతృత్వాన్ని పంచుతున్న కన్నతల్లులు.

“నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం..

అమ్మ.. పేరులో ప్రేమని.. పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న అమృతమూర్తి అమ్మ అమ్మ. ప్రేమ అంత తీయన కనుకనే ఆ భగవంతుడు తనకు కూడా అమ్మ కావాలనుకున్నాడు. ఈ లోకాన్ని సృష్టించిన ఆ దేవాది దేవుడు కూడా అమ్మ కడుపునే పుట్టాడు. అంత గొప్పది అమ్మ. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. త్యాగం. ప్రేమ కలిస్తే అందులో నుంచే అమ్మే పుట్టుకొస్తుంది.
అమ్మకు ప్రత్యామ్నయం లేదు. అమ్మ ఉన్నచోట అదృష్టం పురివిప్పి ఆడుతుంది. ప్రపంచంలో కనిపించే భగవత్ స్వరూపులు తల్లిదండ్రులు.. ఇందులో మొదటి స్థానం అమ్మకే. అందుకే మాతృదేవోభవ అంటూ కొనియాడుతుంటారు. కన్నతల్లిని కంటికి రెప్పలా చూసుకోవలసిన బాధ్యత బిడ్డలందరిపైనే ఉంది. అందుకోసమే ప్రతి ఏటా అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటూ అమ్మను గౌరవించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మే రెండో ఆదివారాన్ని మాతృ దినోత్సవం గా జరుపుకుంటున్నాం. ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా జన్మించిన తల్లిని ఆరాధిద్దాం.. పూజిద్దాం..

రామాయంపేట మే 10 నేటి ధాత్రి (మెదక్)

 

 

తను పునర్జన్మనేత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే తన్యమిచ్చి ఆకలి తీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వ పెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. అమృతం ఎలా ఉంటుందో తెలియదు గానీ అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే ఆమె ప్రేమ ఈ జగాన్ని మురిపింప జేస్తుంది. ఆ పదానికి అంతటి మహాత్మామ్యం ఉంది. అంతేకాదు దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు. మన పెద్దలు ప్రపంచంలో కనిపించే భగవత్ స్వరూపులు తల్లిదండ్రులు.. ఇందులో మొదటి స్థానం అమ్మకే.. అందుకే మాతృదేవోభవ అంటూ కొనియాడుతుంటారు. తల్లిదండ్రులను గౌరవించని వారు వాడు సమాజాన్ని కూడా గౌరవించడం లేదు.. అందుకే కన్నతల్లిని కంటికి రెప్పలా చూసుకోవలసిన బాధ్యత బిడ్డలందరి పైన ఉంది. ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా జన్మనిచ్చిన తల్లిని ఆరాధిద్దాం..
పూజిద్దాం..

పొగబారిన బతుకుతో ప్రేమను పంచుతూ…

 

A templeless god..mother..

 

-బతుకు చక్రం నడుపుతున్న మర్కు సంతోష.

కడుపున పుట్టిన కన్నవారే ఆనందంగా భావిస్తూ తన మాతృత్వాన్ని పంచుతూ
రోజంతా బీడీలు చుడుతూ బతుకు చక్రాన్ని నడుపుతున్న మాతృమూర్తి రామాయంపేటకు చెందిన మర్కు సంతోష, తాళికట్టిన భర్త మర్కు సత్యనారాయణ మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని వెళ్లధీస్తుండగా 2017లో రోడు ప్రమాదం రూపంలో భర్త ప్రాణాలు హరించింది. దీంతో ఒక్కసారిగా ఒంటరితనంతో పాటు కండ్లముందు చిన్నారులైన ఇద్దరు కుమారులు కండ్లముందు మెదిలారు. ఎలాగైనా వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని భావించి తన ఇద్దరు కన్న వాళ్లకు ఎలాంటి లోటు రాకుండా కాపాడుతుంది. మాతృ దినోత్సవం సందర్భంగా చిన్నారులు తన తల్లి పడుతున్న కష్టానికి ఫలితంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

A templeless god..mother..

 

బీడీలు చుడుతూ కుటుంబాన్ని కాపాడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ప్రమీల రామాయంపేట.

రామాయంపేట కు చెందిన మేస్త్రి దుర్గయ్య కాయ కష్టంతో సంపాదించిన దాంట్లో తృప్తిగా జీవితం సాగిస్తున్న సమయంలో అనారోగ్యంతో 2011లో మృతి చెందాడు. దీంతో కుటుంబవారం భార్య ప్రమీల మీద పడింది. తను బీడీలు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. కొడుకు వెంకటేష్ ను చదివించలేక పోవడంతో ప్రస్తుతం కూలీ పనులకు వెళుతున్నారు. పెద్ద కూతురు సింధుజ మానసిక దివ్యాంగురాలు నడవలేక కుర్చీకే పరిమితమైంది. చిన్న కూతురు శిరీష ఇంటర్ చదువుతుంది తన పిల్లలు ఎవరికి భారం కాకుండా తన రెక్కల కష్టంతో వారి కడుపును నింపుతున్న ప్రమీలకు అభినందనలు తెలపాల్సిందే..

 

A templeless god..mother..

 

కుటుంబం భారమై అన్ని తానై మాతృత్వానికి నిదర్శనం.. మర్కు భాగ్య రామాయంపేట..

జీవితాంతం తోడుండాల్సిన భర్త గుండెపోటు తో మరణించడం తో అన్ని తానై.. తనువు పుండై తన కూతుర్లను ఉన్నత స్థాయిలో ఉంచాలని పరితపిస్తుంది మాతృమూర్తి వరకు భాగ్య. మెదక్ జిల్లా రామయంపేట పట్టణానికి చెందిన మరుకు భాగ్య భర్త మరుకు శ్యామ్ రాజ్ 2024లో గుండెపోటుతో మృతి చెందాడు. భర్త చనిపోయే సమయంలో ఇద్దరి కూతుర్లు చిన్న వయసు ఉండడంతో తండ్రి లేని లోటు తీర్చుతూ తాను బీడీలు చుడుతూ కూతుర్లను ఉన్నత చదువులు చదివిస్తుంది. చిన్న వయసులో భర్త చనిపోయి కూతుర్ల పోషణ చదువు తన భుజాన వేసుకుని వారిని ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేసేలా భాగ్య పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. తన తనువు పుండైన కూతుర్ల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న మాతృమూర్తి మర్కు భాగ్యకి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..

 

A templeless god..mother..

మ్యాప్ – రామాయంపేట : తను పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వపెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే. ఆమె ప్రేమ ఈ జగాన్ని మరిపింపజేస్తుంది. ఆ పదానికి అంతటి మహత్మ్యం ఉంది. అంతేకాదు దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడంటారు మన పెద్దలు. ప్రపంచంలో కనిపించే భగవత్ స్వరూపులు తల్లిదండ్రులు.. ఇందులో మొదటిస్థానం అమ్మకే. అందుకే మాతృదేవోభవ అంటూ కొనియాడుతుంటారు. తల్లిదండ్రులను గౌరవించని వాడు సమాజాన్ని కూడా గౌరవించడం లేదు.. అందుకే కన్నతల్లిని కంటికిరెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత బిడ్డలందరిపైనా ఉంది. ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా జన్మనిచ్చిన తల్లిని ఆరాధిద్దాం… పూజిద్దాం.

కుటుంబం భారమై.. అన్నీ తానై

మాతృత్వానికి నిదర్శనం.. సజ్జెనరలక్ష్మీ, శివ్వంపేట

జీవితాంతం తోడుండాల్సిన భర్త ఆకాల మరణం చెందడంతో అన్నీ తన కొడుకులను తానై.. తనువు పుండై

ఉన్నత స్థాయిలో ఉంచాలని పరితపిస్తుంది. మాతృమూర్తి వజ్జెవరలక్ష్మి, నర్సాపూర్ నియోజకవర్గం శివ్వంపేట మండల కేంద్రానికి చెందిన వజ్జె వరలక్ష్మి భర్త వెంకటేశం డిసెంబర్ 2004లో చనిపోయాడు. భర్త చనిపోయే సమయంలో పెద్ద కొడుకు హనుమంతు వయస్సు 8 సంవత్సరాలు, చిన్న కొడుకు సాయికిరణ్ నాలుగేళ్ళ వయస్సు, అప్పటి నుండి తండ్రిలేని లోటు తీర్చుతూ తాను వ్యవసాయం చేస్తూ కొడుకులను ఉన్నత చదువులు చదివించింది. ప్రస్తుతం పెద్ద కుమారుడు హనుమంతు డిగ్రీ పూర్తి చేసి ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అలాగే గచ్చిబౌలిలో ఫైనాన్స్ కన్సల్టెంట్ గా పనిచేసుకుంటున్నాడు. చిన్న కొడుకు సాయికిరణ్ డిగ్రీ చదువుతున్నాడు. చిన్న వయస్సులో భర్త చనిపోయి కొడుకుల పోషణ, చదువు

కన్నవాళ్ళకు ఎలాంటి లోటురాకుండా కాపాడుతుంది. మాతృ దినోత్సవం సందర్భంగా చిన్నారులు తన తల్లి పడుతున్న కష్టానికి ఫలితంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

చీడీలు చుగుతూ.. కుటుంబాన్ని కాపాడుతూ… -కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ప్రమీల, రామాయంపేట రామాయంపేటకు

చెందిన మేస్త్రీ దుర్గయ్య

కాయకష్టంతో సంపాదించిన దాంటో తృప్తిగా జీవితం సాగిస్తున్న సమయంలో అనారోగ్యంతో

2011లో మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం భార్య ప్రమీల మీద పడింది. తాను బీడీలు చేస్తూ కుటుంబాన్ని నెటుకొస్తుంది. కొడుకు వెంకటేశు చదివించలేక పోవడంతో ప్రస్తుతం అతను కూలీ పనులకు వెళ్తున్నాడు. పెద్ద కూతురు సింధూజ మానసిక దివ్యాంగురాలు. నడవలేక కుర్చీకే పరిమితమైంది. చిన్నకూతురు శిరీష ఇంటర్ చదువుతుంది. తన పిల్లలు ఎవరికి భారం కాకుండా తన రెక్కల కష్టంలో వారి కడుపులు నింపుతున్న ప్రమీలకు అభినందనలు తెలపాల్సిందే.

కుమారులు

మర్కు సిద్దార్థ. మర్కు నందులకు చదువు సంధ్యలు నేర్పిస్తుంది. ఉన్న ఒక్క గూడుతో ఎలాంటి అస్తిపాస్టులు లేకున్నా రోజంతా బీడీలు చుడుతూ పిల్లల చదువుకు వెచ్చిస్తుంది. కుమారులతో పాటు అరు సంవత్సరాల కూతురు కూడా ఉండడంతో ముగురి భవిష్యత్తును భుజాన వేసుకుంది. సంపాదన కుటుంబ పోషణకే సరిపోకున్నా తన

చెరువులో పడి వ్యక్తి మృతి .

చెరువులో పడి వ్యక్తి మృతి

బాలానగర్ /నేటి ధాత్రి :

 

 

చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని బోడ జానంపేట గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేకల వెంకటయ్య (42), చిట్టెమ్మ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం.. కుమారుడు కార్తీక్ ను ఇంటికి పంపించి వెంకటయ్య గ్రామంలోని మైసమ్మ చెరువులో పడి మృతి చెందాడు. శనివారం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

మందమర్రి రజక వృత్తిదారుల సంఘం.!

మందమర్రి రజక వృత్తిదారుల సంఘం సర్వసభ్య సమావేశం

మందమర్రి నేటి ధాత్రి

 

 

మందమర్రి పట్టణంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సమావేశం….. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైల్ల ఆశన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్తు పథకాన్ని రజక అభివృద్ధి దారులకు కూడా అమలు చేయాలని మందమర్రి పట్టణంలో ఇతర ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ధోబిఘాట్లను పూర్తి చేయాలని అంతేకాకుండా రాజీవ్ యువ వికాస్ యోజన పథకం కింద రజకులకు ప్రత్యేకంగా యూనిట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

General Meeting

 

అంతేకాకుండా దేశవ్యాప్తంగా అమలవుతున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రజకుల కోసం కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాయిరాల రాములు జిల్లా అధ్యక్షులు తంగేళ్లపల్లి వెంకటేష్ జిల్లా ఉపాధ్యక్షులు ముస్కే చందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టణ అధ్యక్షుడు గంగరాజుల రామచందర్ ఉపాధ్యక్షులు కొత్తకొండ నరసయ్య బండి పోశయ్య రాసర రాములు పెనుగొండ సమ్మయ్య తోటపల్లి కళావతి తడిగొప్పుల భాగ్య తదితరులు పాల్గొన్నారు

క్రిమినల్స్ పంపాల్సిన పోలీలులే క్రిమినల్స్ అయ్యారు .

క్రిమినల్స్ చేంజ్ పట్టుకొని కటకటాల్లోకి పంపాల్సిన పోలీలులే క్రిమినల్స్ అయ్యారు .
మిక్రిమినల్స్ చేంజ్ పట్టుకొని కటకటాల్లోకి పంపాల్సిన పోలీలులే క్రిమినల్స్ అయ్యారు

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

 

 

క్రిమినల్స్ చేంజ్ పట్టుకొని కటకటాల్లోకి పంపాల్సిన పోలీలులే క్రిమినల్స్ అయ్యారు. జైల్లో ఖైదీలకు కాపలాగా ఉండే పోలీస్ కాస్తా ఖైదీల బట్టలు వెళుకోవడానికి సిద్ధం అయ్యాడు. సిగరెట్లు డిస్టిబ్యూటీ చెస్తున్న వ్యక్తులను భయబ్రాంతులకు గురి చేసి డబ్బులు వసూలు చేస్తు సిగరెట్ ప్యాకెట్లను తీసుకెళ్తున్న ఇద్దరు పోలీసులతో సహా మరో ఇద్దరిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 3.5 లక్షలు విలువ చేసే పలు కంపెనీలకు చెందిన సిగరెట్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చెలుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలు మియాపూర్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ కుమార్ వెల్లడించారు. వారసిగూడా కు చెందిన గాయని శ్రీకాంత్ (36) కంది జైల్లో జైల్ వార్డెన్ గా పని చేటున్నాడు. కడప జిల్లాకు చెందిన చిదిరి అమర్నాథ్ (41) ఎపి లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ పలు కెసుల్లో జైల్ కి వెళ్లి వచ్చాడు. ఇద్దరు సస్పెన్షన్ లో ఉండగాఆరో ఇద్దరు మల్కాజిగిరి దాయనంద్ నగర్ కి చెందిన ఎండి ఇమ్రాన్ (32), మలక్ పెట్, మూసరం బాగ్ కి చెందిన వాసం శ్రీకాంత్ (32) లతో పరిచయం ఏర్పడింది. ఇమ్రాన్ డెలివరీ బాయ్ గా శ్రీకాంత్ పెయింటర్ గా పనిస్తున్నారు. నలుగురు ముఠా గా ఏర్పడి ఇటిసి నుండి సిగరెట్లు షాప్ లలో సప్లై చేసే వారే టార్గెట్ గా పెట్టుకొని రెక్కీ నిర్వహించేవారు. వారు బైక్ పై వెళ్తున్న సమయంలో ఆపి మేము క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీసులం మీరు తిఅంకెళ్తున్న సిగరేట్లలో గంజాయి కలిపి అమ్ముతున్నారు అని భయబ్రాంతులకు గురి చేసేవారు. సిగరేట్లతో పాటు గంజాయి, డ్రగ్స్ సప్లై చేటున్నందుకు కేసులు పెడతామని బెదిరిస్తారు. వాటిని పరిశీలించి లోకల్ పోలీసులకు అప్పగించాలి అంటూ బెదిరించి డబ్బ, సిగరెట్ ప్యాకెట్లు తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు. కాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాతృ శ్రీ నగర్ లో ఏప్రిల్ 28 వ తేదీన సిగరెట్ సప్లైర్ బెదిరించి సిగరెట్ ప్యాకెట్లు తీసుకెళ్లారు. అనుమానం వచ్చిన సప్లర్ శ్రీహరి వెంటనే మియాపూర్ పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేయాయడంతో నిందితులను అదుపులోకి తిఆకున్నారు. వారి నుండి 3.5 లక్షల విలువ చేసే పలు రకాల కంపెనీలకు చెందిన సిగరెట్ ప్యాకెట్లను పోలీసుల స్వాధీనం చెలుకున్నారు. ఈ విధంగా వారిపై అల్వాల్, మియాపూర్, సైఫాబాద్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో నాలుగు కేసులు ఉన్నాయి. ఈ మేరకు నిందితులను రిమాండ్ కు తరలించి కేసును చేధించిన పోలీసులని ఏసీపీ, శ్రీనివాస్ కుమార్ అభినందించారు ఈ కార్యక్రమంలో, క్రాంతి కుమార్, రవీందర్, రమేష్ నాయుడు,విజయ్ కుమార్, శ్రీకాంత్, చంద్రశేఖర్, ప్రేమ్ కుమార్, పుల్య నాయక్, సుభాష్

వేతనాన్ని విరాళంగా అందజేసిన ఎమ్మెల్యే .!

దేశ రక్షణ నిధికి ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునందుకొని తాను సైతం దేశ రక్షణ నిధికి ఒక నెల వేతనాన్ని అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం

సరిహద్దులో పాకిస్తాన్ ముష్కరులను తరిమి కొడుతున్న భారత ఆర్మీ వీరులకు నా సెల్యూట్

గంగాధర నేటిధాత్రి :

 

 

నేను భారతీయుడను- నేను భారత సైన్యానికి మద్దతుగా నిలబడతానని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి భారతీయుడు ఇండియన్ ఆర్మీకి మద్దతుగా నిలబడవలసిన సమయం వచ్చిందన్నారు. సరిహద్దులో పాకిస్తాన్ ముష్కరులను తరిమి కొడుతున్న భారత ఆర్మీ వీరులకు నా సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు. దేశ ప్రజలు గర్వించే విజయాలను అందిస్తున్న భారత సైన్యానికి పూర్తి సంఘీభావం తెలుపుతూ, తమ కర్తవ్యం గా దేశ రక్షణ నిధికి ప్రజా ప్రతినిధులు ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుమేరకు విరాళం అందజేసినట్లు తెలిపారు.పహాల్గంలో అమాయక ప్రజల ఉసురు తీసి విర్రవీగుతున్న ఉగ్రముకలు, వారిని భారతదేశం పైకి ఉసిగలిపిన పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఆర్మీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీకి భారతదేశ పౌరులు మద్దతుగా నిలబడే సమయం వచ్చిందన్నారు. నేను భారతీయుడిని, దేశ సరిహద్దుల్లో విరోచితంగా పోరాడుతున్న భారత వీర జవాన్లకు సంఘీభావం తెలియజేస్తున్నట్లు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమకు తోచిన విధంగా దేశ రక్షణ నిధికి విరాళం అందజేయాలని సూచించారు.

బిజెపిలో చేరిన చీర్యాల గ్రామం మాజీ సర్పంచ్ .!

బిజెపిలో చేరిన చీర్యాల గ్రామం మాజీ సర్పంచ్ కోల అశోక్ యాదవ్

కీసర నేటి దాత్రి :

 

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా

కీసర మండల చీర్యాల గ్రామ మాజీ సర్పంచ్ కోల అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సమక్షంలో బండారు నరసింహ యాదవ్, గూడ నరేష్ గౌడ్, సాయికుమార్ గౌడ్, తదితరులు బిజెపిలో చేరారు వారిని ఈటల రాజేందర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ యొక్క కార్యక్రమము బిజెపి కీసర మండల అధ్యక్షులు కోళ్ల బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, పట్లోళ్ల విక్రం రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

సోమశీల నదిలో కోటి గౌరమ్మల నిమజ్జనం .

సోమశీల నదిలో కోటి గౌరమ్మల నిమజ్జనం

వనపర్తి నేటిధాత్రి :

 

 

వనపర్తి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘంఅధ్యర్యములో పసుపుతో తయారు చేసిన కోటి గౌరమ్మల నిమజ్జనం సోమశిల సంగమేశ్వర నదిలో నిమజ్జనము చేశారు నిమజ్జన కార్యక్రమంలో వనపర్తి ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజు మహిళా అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి అనంత పద్మావతి గుబ్బ మాధవి కొండూరు మంజుల ప్రవీణ్ కొంపల. శ్రీలక్ష్మి ఆకుతోట సుప్రియ యావజన సంఘము అధ్యక్షులు బచ్చు వెంకటేష్ పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షులు బచ్చురాము లగిశెట్టి సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారని బచ్చురామ్ ఒక ప్రకటన లో విలేకరులకు తెలిపారు

బీసీల విద్యా స్థాయిని పెంచాలి.

బీసీల విద్యా స్థాయిని పెంచాలి

నేటిధాత్రి :

బలహీనవర్గాల విద్యా స్థాయిని పెంచడానికి తీసుకోవలసిన చర్యలపై తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి ఒక నివేదికను అందజేశామని బీసీ నాయకులు డాక్టర్ తిరునహరి శేషు, డాక్టర్ తండు నాగయ్య తెలియజేసినారు. శుక్రవారం హైదరాబాద్ ఎడ్యుకేషన్ కమిషన్ కార్యాలయంలో జరిగిన ఎడ్యుకేషనల్ స్టేటస్ ఆఫ్ బీసీస్ ఇన్ తెలంగాణ అనే అంశంపై జరిగిన వర్క్ షాప్ లో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి పాల్గొన్న డాక్టర్ శేషు డాక్టర్ నాగయ్య తెలంగాణ రాష్ట్రంలో బీసీల విద్యాస్థాయి, విద్యా విషయాలలో బిసిలు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యా స్థాయిని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య, ప్రొఫెషనల్, సాంకేతిక విద్యలలో బీసీల విద్యా స్థాయిని పెంచడానికి చెప్పటాల్సిన చర్యలపై కమిషన్ కి నివేదిక అందజేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి పథకాన్ని ఆంక్షలు లేకుండా అమలు చేయాలని, పూలే విదేశీ విద్యా జ్యోతి లాంటి పథకం ద్వారా లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్యను పెంచాలని ప్రాథమిక విద్యలో డ్రాప్ ఔట్ ని తగ్గించాలని కమిషన్ దృష్టికి తీసుకువెళ్లినారు. ఈ సందర్భంగా విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలను క్రోడీకరించి బలహీన వర్గాల విద్యా స్థాయిని పెంచటానికి కమిషన్ పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుందని తెలియజేసినారు.

పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం .

పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

పాల్గొన్న శాసన మండలి వైస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గండ్ర

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో ముదిరాజ్ ల ఆరా ధ్య దైవం పెద్దమ్మతల్లి ఆశీస్సు లతో ప్రజలందరూ సుఖసంతో షాలతో జీవించాలని కోరిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ బండా ప్రకాష్, భూపాలపల్లి మాజీ . ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయoలో అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని జరుపుకు న్నారు

ceremony.

.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘరాష్ట్ర నాయకులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు,ముదిరాజ్ సోదర సోదరీమణులు,బిఆర్ ఎస్పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బోధించు – సమీకరించు- పోరాడు .!

బోధించు – సమీకరించు- పోరాడు అనే నినాదంతో* ముందుకు వెళ్ళాలి.

ఏ వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అంబేద్కర్ ఆశయాలు సిద్దాంతాలు భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని 2023-24&25 -లలో వేసిన కమిటీ లు మినహా మిగిలిన గ్రామ కమిటీలను వేయాలని అందుకబోదించు -సమీకరించు – పోరాడు* అనే నినాదంతో గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రజలకు మహానీయుల గురించి తెలియజెప్పాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* అన్నారశని వారం రోజున చిట్యాల మండల కేంద్రంలో మల్లయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కమిటీ లను 2023–24-& 25 సంవత్సరా, లలో వేసిన కమిటీలు మిసహ మిగిలిన కమిటీ లు ఏర్పాటు చేయాలని అన్నారు. అంబేద్కర్ గారి తో పాటు మహనీయుల ఆశయాలను సిద్ధాంతాలను భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని గ్రామాల్లో ప్రజలకు చెప్పాలన్నారు . రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో దళితుల పట్ల కుల వివక్షత ఇంకా గ్రామాల్లో కొనసాగుతుందన్నారు. దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలకు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను భారత రాజ్యాంగం గురించి తెలియజెప్పి వారిని చైతన్య వంతులను చేయాలన్నారు. బోధించు సమీకరించు పోరాడు అనే నినాదంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మే నెల 31* వరకు అన్ని గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘాలను పూర్తి చెయ్యాలని మండల కమిటీలు భాద్యతలు తీసుకుని గ్రామ కమిటీలు పూర్తి చెయ్యాలన్నారు.

నిజాంపేట మండల అధ్యక్షునికిగా చంద్రశేఖర్ .

నిజాంపేట మండల అధ్యక్షునికిగా చంద్రశేఖర్

నిజాంపేట: నేటి ధాత్రి 

 

 

భారతీయ జనత పార్టీ మండల మండల అధ్యక్షునిగా చిన్మనమైన చంద్రశేఖర్ ను నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మరోసారి మండల అధ్యక్ష పదవి ఇచ్చినందుకు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ కి, జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.

ధాన్యం కొను గోలు సెంటర్ లో గన్ని సంచుల ‘గోల్ మాల్ .

ధాన్యం కొను గోలు సెంటర్ లో గన్ని సంచుల ‘గోల్ మాల్

గన్నీ సంచుల కొరతతో అమ్ముకుంటున్న నిర్వాహకు డు
చిన్నాల ధనుంజయ్

అధికారుల నిర్లక్ష్యం

తొర్రూర్ (డివిజన్) నేటి ధాత్రి :

 

 

ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులకు ధాన్యాన్ని అమ్ముకునేందుకు అష్ట కష్టాలు తప్పడం లేదు. మద్దతు ధర కల్పించే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసిన వాటిని ఆసరా చేసుకుని నిర్వాహకులు కొందరిని నియమించుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. డివిజన్ పరధిలోని మండలంలోని హరిపిరాల, గ్రామం వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు కన్నెత్తి చూడడం లేదు.

గన్ని బ్యాగులను అమ్ముకున్న సెంటర్ నిర్వాహకుడు

Farmers

కొనుగోలు కేంద్రంలో గన్ని బ్యాగుల కొరతతో మండలంలోని అరిపిరాల గ్రామ పిఎసిఎస్ సెంటర్ లో చీకటాయపాలెం గ్రామానికి చెందిన రైతుకు గన్ని బ్యాగులను అమ్ముకోవడంతో పిఎసిఎస్ సెంటర్ నిర్వాకుడు ధనుంజయ్ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల అనుమతి లేకుండా రైతులు అనుమతి లేకుండా బస్తాలను వేరే గ్రామానికి చెందిన రైతులకు అమ్ముకోవడం ఏంటి అని నిలదీశారు, హరిపిరాల గ్రామానికి వచ్చిన బస్తాలను చీకటాయపాలెం గ్రామానికి ఎలా అమ్ముతారు అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల చేతివాటంతోటి బస్తాలను అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల ఆందోళనతో గ్రామాలలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి గన్ని బ్యాగుల కొరత లేకుండా చూసి సెంటర్ నిర్వాహకుని పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

మెట్ ల్లి పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న . .

మెట్ పల్లి మే 10 నేటిధాత్రి :

 

 

మెట్ ల్లి పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో మల్లాపూర్, చిట్టపూర్, సాతారం డబ్బా, మేడిపల్లి గ్రామ చౌరస్తాలలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరుశురాం గౌడ్ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ జరిగింది . అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరశురాం గౌడ్ మాట్లాడుతూ 12వ తారీకు సోమవారం రోజున మల్లాపూర్ మెట్పల్లి గ్రామం మండలాలలో సర్దార్ సర్వాయి పాపన్న ఐదు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ధర్మపురి అరవింద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగారావు విగ్రహావిష్కరణ చేస్తారని గీతా కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని నియోజకవర్గ గౌడ సంఘ నాయకులు మరియు నియోజకవర్గ గౌడ సంఘ ప్రజలు అత్యధిక మంది పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వాని అందని వారు ఇదే ఆహ్వానంగా అనుకొని మన కార్యక్రమం మనం ముందు ఉండాలని ఉద్దేశంతో అందరూ రావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంపునూరి మల్లేశం గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చెర్లపల్లి రాజేశ్వర్ గౌడ్, గొల్లపల్లి రామా గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రంగు రామా గౌడ్ ,జిల్లా అధ్యక్షులు చెట్ల చంద్రశేఖర్ గౌడ్, కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షులు ఏపూరి శ్రీనివాస్ గౌడ్, ఆరెల్ల నరస గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version