బోధించు – సమీకరించు- పోరాడు .!

బోధించు – సమీకరించు- పోరాడు అనే నినాదంతో* ముందుకు వెళ్ళాలి.

ఏ వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అంబేద్కర్ ఆశయాలు సిద్దాంతాలు భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని 2023-24&25 -లలో వేసిన కమిటీ లు మినహా మిగిలిన గ్రామ కమిటీలను వేయాలని అందుకబోదించు -సమీకరించు – పోరాడు* అనే నినాదంతో గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రజలకు మహానీయుల గురించి తెలియజెప్పాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* అన్నారశని వారం రోజున చిట్యాల మండల కేంద్రంలో మల్లయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కమిటీ లను 2023–24-& 25 సంవత్సరా, లలో వేసిన కమిటీలు మిసహ మిగిలిన కమిటీ లు ఏర్పాటు చేయాలని అన్నారు. అంబేద్కర్ గారి తో పాటు మహనీయుల ఆశయాలను సిద్ధాంతాలను భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని గ్రామాల్లో ప్రజలకు చెప్పాలన్నారు . రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో దళితుల పట్ల కుల వివక్షత ఇంకా గ్రామాల్లో కొనసాగుతుందన్నారు. దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలకు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను భారత రాజ్యాంగం గురించి తెలియజెప్పి వారిని చైతన్య వంతులను చేయాలన్నారు. బోధించు సమీకరించు పోరాడు అనే నినాదంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మే నెల 31* వరకు అన్ని గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘాలను పూర్తి చెయ్యాలని మండల కమిటీలు భాద్యతలు తీసుకుని గ్రామ కమిటీలు పూర్తి చెయ్యాలన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version