చేర్యాల ప్రచారంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

చేర్యాల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

పదవ వార్డు అభ్యర్థి మేడిశెట్టి ఉమా శ్రీధర్ గెలిపించాలి

చేర్యాల నేటిధాత్రి

చేర్యాల మున్సిపల్ పరిధిలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన బిఆర్ఎస్ నాయకులను గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా పలు వార్డులలో తిరిగి ప్రచారం చేశారు10 వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి మేడిశెట్టి ఉమా-శ్రీధర్
ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు, తెలుసుకుని వాటి అమలుకు కచ్చితంగా కృషి చేస్తానని అభ్యర్థి మేడిశెట్టి ఉమా శ్రీధర్ ప్రజలకు మాట ఇచ్చారు. గెలిచిన, ఓడిన ప్రజలలోనే, రాజకీయాలలోనే ఉన్నామని ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించామని, ఇక ముందు కూడా వార్డు సభ్యులకు ఏ సమస్య వచ్చినా దగ్గర ఉండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ఎన్నికలలో ప్రజలందరూ సహకరించిన ఒక ఓటుతో ఓడిపోయామని అదృష్టం వరించలేదని అన్నారు. ఈసారి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు..
మీ అందరి సహకారంతో చేరాలలోనే అగ్రగామిగా మన వార్డును చేర్చిదిద్దామని మాట ఇచ్చారు ఈ సందర్భంగా ఔషర్ల కిషోర్ కాసుల శ్రీనివాస్ పచ్చిమడ్ల పరశురాం గుడాల శీను పెద్ద ఎత్తున బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు

చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు బంద్ విజయవంతం..

చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు బంద్ విజయవంతం

రెవెన్యూ డివిజన్ ప్రజల చిరకాల ఆకాంక్ష

ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన జేఏసీ

జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ళ పరమేశ్వర్

చేర్యాల నేటిదాత్రి

చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు ఈప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చడం కోసం జేఏసీ నిర్వహించిన బంద్ ఎంత బలంగా ఉందో ప్రభుత్వానికి తెలిసి రావాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ అన్నారు. శుక్రవారం జేఏసీ తలపెట్టిన బంద్ తో పట్టణంలో వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బందు పాటించాయి.చేర్యాల,మద్దూరు,కొమురవెల్లి, ధూల్మీట్ట మండల మండల కేంద్రాలతో పాటు మేజర్ గ్రామపంచాయతీలు సైతం ఉదయం నుండే జేఏసీ నాయకులు రోడ్డుపైకి వచ్చి పాదయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ రామగళ్ళ పరమేశ్వర్ మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాటి పీసీసీ అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చిన సందర్భంలో 18 నెలల కాలంలో వారి హామీని నెరవేర్చకపోవడం ఈప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చకపోవడంపై మండిపడ్డారు. ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలే నాయకులై స్వచ్ఛందంగా బందు చేశారని, ఇందుకు నిదర్శనమే రెవెన్యూ డివిజన్ ఆకాంక్ష ప్రజల్లో ఎంత ప్రభలంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఇది ఒక భౌతిక అంశం మాత్రమే కాకుండా ఈప్రాంత ప్రజల ఆకాంక్ష అస్తిత్వం, ఉనికి ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్నదని ఈ బందు ద్వారా ప్రజల ఆకాంక్షను వెలిబుచ్చారు. ఇదే స్ఫూర్తితో రెవెన్యూ డివిజన్ సాధించేవరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేశారు. వ్యాపార వాణిజ్య వర్గాలు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నామన్నారు. త్వరలో విద్యాసంస్థల బంద్, రహదారి దిగ్బంధం, చలో కలెక్టరేట్, వంటావార్పు తదితర అంశాలపై తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు , అందె బీరయ్య, అందే అశోక్ .బుట్టి సత్యనారాయణ, పిల్లి చంద్రం, పోలోజు వెంకటాద్రి, ఎక్కలదేవి సుధాకర్, ఈరి భూమయ్య, సుతారి రమేష్, కత్తుల భాస్కర్ రెడ్డి,పొన్నబోయిన మమత,సనవాల ప్రసాద్, పోషబోయిన పరమశేఖర్, భూమిగారి మధూకర్, పుల్ల ఆంజనేయులు, నంగి కనకయ్య, పోనుగోటి శ్రీనివాస్ రెడ్డి, అరుట్ల లింగం, కడుదూరి పుల్లారెడ్డి, పొన్నబోయిన శ్రీనివాస్, కర్రె నర్సిరెడ్డి, భూర సీతారాముల, పుల్ల కుమార్, ముద్దల్ల యాదయ్య, కత్తుల లక్ష్మరెడ్డి, బింగి పోశయ్య, మురళి, మహేందర్, రాజు,తదితరులు పాల్గొన్నారు.

బిజెపిలో చేరిన చీర్యాల గ్రామం మాజీ సర్పంచ్ .!

బిజెపిలో చేరిన చీర్యాల గ్రామం మాజీ సర్పంచ్ కోల అశోక్ యాదవ్

కీసర నేటి దాత్రి :

 

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా

కీసర మండల చీర్యాల గ్రామ మాజీ సర్పంచ్ కోల అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సమక్షంలో బండారు నరసింహ యాదవ్, గూడ నరేష్ గౌడ్, సాయికుమార్ గౌడ్, తదితరులు బిజెపిలో చేరారు వారిని ఈటల రాజేందర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ యొక్క కార్యక్రమము బిజెపి కీసర మండల అధ్యక్షులు కోళ్ల బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, పట్లోళ్ల విక్రం రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version