జహీరాబాద్ లో డీ ఎల్ పి ఓ కార్యాలయం జడ ఎక్కడ…
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్రము ఏర్పడి దాదాపు 11 సంవత్సరాల పూర్తి అయి డివిజన్ లు ఏర్పడి అన్ని డివిజల్ కార్యాలయాలు ఏర్పడినప్పటికి పంచాయతీ రాజ్ మరియు రూరల్ డిపార్ట్మెంట్ నుండి మాత్రం ఇప్పటి వరకు డి ఎల్ పి ఓ కార్యాలయం నేటికీ లేకపోవడం అందరికి విస్మయానికి గురించేస్తుంది.. సంబంధిత డి ఎల్ పి ఓ కి పెన్ గన్ న్యూస్ ప్రతినిధి వివరణ అడిగిన ఎమ్ పట్టనట్టు గా వేవహరిస్తుంది..
సంబంధిత అధికారి జహీరాబాద్ లో ఉండకపోవడం వలన గ్రామాలలో పర్యవేక్షణ లేకపోవడం వలన గ్రామాలలో చెత్త చెదారం పెరుకపోవడం,డంపింగ్ యార్డ్ తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ లేకపోవడం, వైకుంఠ దామలు ఉపయోగంలోకి రాకపోవడం ఇలా ఎన్నో సమస్యలు గ్రామాలలో పేరుకుపోవడం వలన ప్రజలు అనారోగ్యలకు గురి కావడం జరుగుతుంది.. అంతే కాకుండా సంగారెడ్డి కి ఎంతో దూరంగా ఉన్న గ్రామలు అనేకం… రాయికోడ్ మండలంలోని పంపాడు, మరి కొన్ని గ్రామాల ప్రజలు, మొగుడంపల్లి, న్యాల్కల్ మండలం లోని గ్రామాలు పూర్తిగా బీదర్ సరిహద్దులలో ఉండడం వలన సంబందించిన అధికారికి ఏమైనా సమస్య లు
చెప్పుకొందమన్న కార్యాలయం లేకపోవడం విడ్డురంగా ఉంది..డి ఎల్ పి ఓ కార్యాలయం లేకపోవడం పై సంబంధిత అధికారికి కొందరు ప్రజల ప్రశ్నించగా ఎవరికైన చెప్పుకోండి అని దాటావేయడం సరి కాదని ప్రజల కోరుకుంటున్నారు.
. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సంబంధిత అధికారులు స్థానికంగాo ఉండాలని నిబంధనలు ఉన్నపటికీ… ఈ అధికారికి మాత్రం అవిఏవి పట్టీపు లేన్నట్టు గా ఉండడం విడ్డురం గా ఉంది..ఇప్పటికైనా ఇలాంటి అధికారి పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసికొని,ప్రజలకు అందుబాటులో ఉండే అధికానిరి నియమించలని జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారు
