రాజన్న సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆకుల జయంత్.
సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి)
సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఆదివారం హోరహోరి మధ్య జరిగాయి. నూతన అధ్యక్షుడిగా ఆకుల జయంత్, ఉపాధ్యక్షుడిగా బొడ్డు పరశురాములు, ప్రధాన కార్యదర్శిగా ఆడెపు మహేందర్, సహాయ కార్యదర్శిగా కంకణాల శ్రీనివాస్, కోశాధికారిగా వంకాయల శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులుగా చౌటపల్లి వెంకటేష్, బుస్స రామనాథం, దుమాల రాము, జంగిలి రాజు, ముండ్రాయి శ్రీనివాస్, పి వేణు కుమారులు గెలుపొందారు.గెలుపొందిన వారికి ఎన్నికల అధికారులు తడుక విశ్వనాథం, కరుణాల భద్రచలం, టీవీ నారయణ లు నియామక పత్రాలు అందజేశారు. నూతన కార్యవర్గాన్ని సభ్యులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
చేనేత కార్మికులకు మద్దతుగా బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )
ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ని స్థానిక అంబేద్కర్ చౌక్ లో సిఐటియు వారి ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు కూలి పెంచే విషయంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది అట్టి నిరాహార దీక్షలో పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన మద్దతు ఇస్తూ జిందాం చక్రపాణి మాట్లాడుతూ చేనేత కార్మికుల కోసం సిరిసిల్ల చేనేత చీరలకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చినటువంటి దానికి కూలి పెంచాలని, వైపని కార్మికులకు, వర్పిన్ కార్మికులకు మర మొగ్గల పవర్ లుమ్ కార్మికులకు కూలి పెంచాలని , తెలంగాణ రాష్ట్రంలోని చేనేత చీరలకు అత్యధికoగా ధర కల్పించాలని కోరుతూ ఈరోజు చేనేత కార్మికులకు మద్దతు పలకడం జరిగింది. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోదండ రమణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు ముషం రమేష్, మాజీ వార్డ్ కౌన్సిలర్ దార్ల సందీప్ కీర్తన, తదితర నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హిందూ రాష్ట్ర సభ అధ్యక్షురాలు దంతులను సన్మానం చేసిన బీజేపీ నేతలు వనపర్తి నేటిదాత్రి :
హిందూ రాష్ట్ర సభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా వనపర్తి పట్టణ మాజీ కౌన్సిలర్ శ్రీమతి నారాయణ దాస్ జ్యోతి రమణ దంపతులను ఎంపికైనందున వనపర్తి పట్టణ 11 వ వార్డు రామ్ నగర్ కాలనీ కి చెందిన కాటమోనీ కృష్ణ గౌడ్ బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శాలువతో సన్మానించారు ఈ కార్యక్రమంలో 11వ వార్డు రాంనగర్ కాలనీ బిజెపి నాయకులు బోడా భాస్కర్ పట్టణ కార్యదర్శి అక్కల శివ గౌడ్ పట్టణ బీజేవైఎం నాయకులు అడ్డాకుల రాణా ప్రతాప్ 11వ వార్డు బూత్ అధ్యక్షులు 11వ వార్డు బిజెపి నాయకులు ప్రవీణ్ ముదిరాజ్ చంద్రకాంత్ రాజు రవి తదితరులు ఉన్నారు
హన్మకొండ జిల్లా పరకాల పట్టణ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా పెండెల భద్రయ్య ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షునిగా కూకట్ల శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శిగా,మేకల శ్రవణ్ కుమార్,జాయింట్ సెక్రెటరీ గా దొగ్గేల రమేష్,ఆర్గనైసింగ్ సెక్రటరీ గా ఎండి.సబీర్, ట్రేసరర్ గా రాహుల్ విక్రమ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా గుర్రం ప్రవీణ్ లు ఎన్నికైనట్లుగా ఎన్నికల అధికారి పెద్దబోయిన వేణు ప్రకటించారు.
కాంగ్రెస్ గ్రామ యూత్ కమిటీ అధ్యక్షులుగా కట్ల మహేష్ ఎన్నిక.
చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాలమండలం లోని చల్లగరిగే గ్రామంలో శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ ఆదేశాల మేరకు గురువారం రోజున చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లకొండ కుమార్* అధ్యక్షతన చల్లగరిగే యూత్ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది..చల్లగరిగే గ్రామ యూత్ అధ్యక్షులు గా కట్ల మహేష్ ఉపాధ్యక్షులుగా:దూడపాక శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్*గా: సిరిపేల్లి నరేష్ ప్రధాన కార్యదర్శి*గా దూడపక సురేందర్ సహాయ కార్యదర్శిగా పినగాని సురేష్, గొల్లపెల్లి నగేష్ సెక్రటరీగా అల్లె ప్రవీణ్ ప్రచార కార్యదర్శులుగా గువ్వ శ్రీకాంత్.కార్యవర్గ సభ్యులు గా .గొల్లపెల్లి అనిల్ దూడపాక లక్ష్మణ్ .అల్లె తిరుపతి దూడపాక రాజు .వేమునూరి రాకేష్ లను ఎన్నుకున్నారు, ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు బండిరాజు మండల యూత్ నాయకులు గోపగాని శివ చిరంజీవి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డ బోయిన గోపి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నిన్నటి రోజున గౌరవ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్లకు వచ్చి సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించి.ఏదో కాగితాలు తెచ్చాడు.
అవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని. అంతేకాకుండా నిన్న ప్రారంభించినటువంటి సన్న బియ్యం కార్యక్రమం కోట సంవత్సరానికి అయ్యే ఖర్చు పదివేల కోట్ల రూపాయలు అందులో ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ మైనటువంటి బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నారు.
అంతేకాకుండా కేవలం రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి రాష్ట్రం వాటాన చెల్లిస్తుందని తెలియజేశారు.
అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గరీబ్ యోజన కింద ప్రతి మనిషికి ఐదు కిలోల బియ్యం కేంద్రం నుండి లభిస్తుంది మిగిలిన ఒక కిల బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుండి లభిస్తుందని తెలియజేశారు.
BJP
మంత్రి పొన్నం తేవాల్సింది సన్న బియ్యం కాగితాలు తేక బీజేపీకి ఎక్కడ పేరు వస్తుందో అని వేరే ముచ్చట్లు చెయ్యడం కరెక్ట్ కాదు.
అని సిరిసిల్ల బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు, ఉరవకొండ రాజు,మెరుగు శ్రీనివాస్, తదితర నాయకులు పాల్గొన్నారు.
వనపర్తి కాంగ్రెస్ నేత న్యాయవాది బార్ కౌన్సిల్ అధ్యక్షులు కిరణ్ కుమార్ ను సన్మానం చేసిన మిత్రులు
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత డి కిరణ్ కుమార్ వనపర్తి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు న్యాయవాది కిరణ్ బాల్య మిత్రులు వై వెంకటేష్ మెడి కల్ ఏజెన్సీ నిర్వహికులు కె బి శ్రీనివాసులు శెట్టి పంపు కటకం చందు గట్టు రవి సాగర్ కొండూరు ప్రవీణ్ కుమార్ శాలువతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా వై వెంకటేష్ మాట్లాడుతూ మిత్రుడు న్యాయవాది కాంగ్రెస్ పార్టీ నేత డి కిరణ్ కుమార్ భవిష్యత్తులో మరెన్నో పదవులు ఆకాంక్షించాలని కోరారు
హిందూ రాష్ట్ర సభ అధ్యక్షురాలుగా జ్యోతి రమణ నియామకం
వనపర్తి నేటిదాత్రి :
హిందూ రాష్ట్ర సభ అధ్యక్షురాలుగా వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన నారాయణదాసు జ్యోతి రమణ నియామకం అయ్యారు ఈ మేరకు ఢిల్లీ నుండి హిందూ సభ జాతీయ అధ్యక్షులు స్వామి సౌ పర్ణిక విజయేంద్రపురి నియామక పత్రం పంపారని జ్యోతి రమణ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు తెలంగాణ పాండి చ్చేరి 5 రాష్ట్రాలకు హిందూ సభ ఇన్చార్జిగా నియమించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ చిన్నయ్య నంద్ సరస్వతి నిర్మల్ వైడ్ సి గాయత్రి దేవేంద్ర కుమార్ చౌదరి బిజెపి జాతీయ రాష్ట్ర నాయకులకు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన మాజీ కౌన్సిలర్ జ్యోతి రమణ హిందూ సభ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమకమైనందుకు వనపర్తి జిల్లా బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు ఏర్పుల సుమిత్రమ్మ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు
కెటిఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగాని మనోహర్ అదేశాలమేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేటీఆర్ సేన మండల అధ్యక్షులు గా మురహరి తిరుపతి (ట్రిమ్స్) ను నియమించినట్టు కెటిఆర్ సేన జిల్లా అధ్యక్షుడు వీసం భరత్ రెడ్డి మరియు నియోజకవర్గ అధ్యక్షులు పిన్నింటి మణిదీప్ రావు ప్రకటించారు.. వారికి నియమకపత్రాన్ని చిట్యాల టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అల్లం రవీందర్ గారితో కలిసి చిట్యాల మండల కేంద్రంలో అందించారు..ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్, మాజీ జడ్పీటిసి గొర్రె సాగర్, పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, ఏరుకొండ రాజేందర్, పెరుమాండ్ల రవీందర్, దూదిపాల తిరుపతి రెడ్డి, ఆరె పల్లి సమ్మయ్య, యూత్ నాయకులు గుండు నగేష్ తదితరులు. పాల్గొన్నారు…
మొగుళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్
నేటిధాత్రి మొగుళ్ళపల్లి :
మొగుళ్లపల్లి మండల ప్రజలకు మరియు, ,పరిసర ప్రాంతాల ప్రజలకు వేసవి ఎండల తీవ్రతలకు ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ప్రజలు వడ దెబ్బకు గురయ్యే అవకాశం వుంది వడదెబ్బ సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఉపాధి హామీ పనులతో పాటు వ్యవసాయ పనుల నిమిత్తం కుళి పనులకు వెళుతున్న కూలీలు వడ దెబ్బ సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించామని చెప్పారు. వడ దెబ్బ నివారణకై ప్రజలు,కూలీలు అందరూ రోజుకి 10 గ్లాసుల కన్నా ఎక్కువ నీరు త్రాగాలన్నారు.బయటికి వెళ్లినప్పుడు గొడుగు,టోపీ, తలపాగ,తెల్లని కాటన్ దుస్తులు ధరించాలని సూచించామన్నారు. ఉదయం,సాయంత్రం ఎండ లేని సమయంలో పనులు చేసుకోవాలని,ఎండ వేడిమికి డి హైడ్రెషన్ కాకుండా ఉండడానికి ఓఆర్ఎస్ ద్రావణాన్ని త్రాగాలని సూచించారు.
నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా సంజయ్ కుమార్
2025 – 26 బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా కొడిదేల సంజయ్ కుమార్ 9 ఓట్ల తేడాతో గెలుపొందారు.2025 – 26 సంవత్సరానికి గాను నర్సంపేట కోర్టు బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి.ఈ నేపథ్యంలో బార్ అసోసియేషన్ నర్సంపేట 2025 – 26 ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షుని ఎన్నికల్లో ఆర్ లక్ష్మీ నారాయణకు 13 ఓట్లు రాగా కొడిదేల సంజయ్ కుమార్ 22 ఓట్లు వచ్చి 9 ఓట్ల తేడాతో గెలుపొందారు.అలాగే ఉపాధ్యక్షుని ఎన్నికలో నారగోని రమేష్ కు 15 ఓట్లు రాగా కొంగరీ రాజు 20 ఓట్లు పోలై 5 ఓట్ల తేడాతో ఉపాధ్యక్షునిగా గెలుపొందారు.ప్రధాన కార్యదర్శి ఎన్నికలో దొంతి సాంబయ్యకు11 ఓట్లు రాగా మోటురి రవి 24 ఓట్లతో 13 ఓట్ల భారీ మెజారిటీతో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు.మొత్తం బార్ అసోసియేషన్ లో 39 ఓట్లు ఉండగా 35 మంది ఓట్లు వినియోగించుకున్నారు.ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల్లో నూతన అధ్యక్షుడుగా కోడిదేల సంజయ్ కుమార్, ఉపాధ్యక్షుడుగా కొంగరి రాజు,ప్రధాన కార్యదర్శిగా మోటురి రవి ఎన్నికైనట్లు అదికారులు తెలిపారు.
2025 – 2026 జనరల్ బాడి..
2025 – 2026 జనరల్ బాడి కమిటీలో అధ్యక్షుడు కొడిడేలా సంజయ్ కుమార్,ఉపాధ్యక్షుడు కొంగరి రాజు, ప్రధాన కార్యదర్శి మోటురి రవి, సహాయ కార్యదర్శి కాంసాని అశోక్, కోశాధికారి దాస్యం రంగనాథస్వామి, ఈ.సి మెంబర్లుగా బొడ్డుపెల్లి అజయ్, లావుద్య తిరుమాల్ చౌహాన్,ఎం.ప్రభాకర్,ఎం.ఎం కృష్ణలు ఎన్నిక జరిగినట్లు ఎన్నికల అధికారులు కొమ్ము రమేష్ యాదవ్,పుట్టపాక రవి తెలిపారు.
కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ రైస్ మిల్లర్స్ ఎన్నికలు బుధవారం జరిగినవి. కల్వకుర్తి డివిజన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బీచని బాలకృష్ణను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. డివిజన్ రైస్ మిల్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నాగెలుపునకు కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు.
ఐ ఎన్ టి యు సి ఎఫ్, కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షులుగా అంబాల శ్రీనివాస్ ఎన్నిక
కార్మికుల సమస్యల పట్ల నా వంతు కృషి చేస్తా
నూతన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంబాల శ్రీనివాస్
జమ్మికుంట :నేటిధాత్రి
తెలంగాణ రాష్ట ( ఐ ఎన్ టి యు సి ఎఫ్, )అధ్యక్షులు మురారి బుద్దరం, మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జిర్లపెల్లి రాజు, హైదరాబాద్ కార్మిక సంఘం భవనంలో, కార్మిక సమావేశంలో కరీంనగర్ జిల్లా (ఐ ఎన్ టి యు సి,) అధ్యక్షులు గా హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం, బేతీగల్ గ్రామానికి చెందిన అంబాల శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా.. అంబాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. నా నియామకానికి కృషి చేసిన కార్మిక సంఘం నాయకులకు మరియు వివిధ ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకం ద్వారా అసంగటిత కార్మికులు మరియు సంగటిత కార్మికుల సమస్యలను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానని, వారు అన్నారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని అభినందించిన ఎమ్మెల్యే
పలమనేరు(నేటి ధాత్రి) మార్చి 23:
పలమనేరు బారసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎల్. భాస్కర్ ను పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమర్నాథ్ రెడ్డి ఆయన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఎల్.భాస్కర్ కు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్.భాస్కర్,గౌరవ అధ్యక్షులు కె.లక్ష్మీపతి,కార్యదర్శి బర్కత్, ఉపాధ్యక్షులు షేక్ షరిఫ్, చంద్రశేఖర్, సహ కార్యదర్శి జి. ఆర్. రవి, సీనియర్ న్యాయవాదులు భగీరథ కుప్పరాజు, ఎస్. రెడ్డెప్పశెట్టి, రాజా రెడ్డి, కె.జగదీశ్, ఎస్.లక్ష్మణ్ రెడ్డి,ఇ.కృష్ణ, ఎన్. నారాయణ రెడ్డి,పి.ఆర్.లోకేష్, బి.గిరీష్,రాజు,రాజీవ్ గాంధీ, రాజశేఖర్,సుబ్బారామయ్య,సంధ్య, పుష్పాంజలి,చాందిని పలువురు న్యాయవాదులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు..
భారత రాష్ట్రపతిని కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
జైపూర్,నేటి ధాత్రి:
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ,ఇతర సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రపతితో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రజా సంబంధిత అంశాలు మరియు ఇతర కీలక విషయాలపై చర్చ జరిపారు.రాష్ట్రపతిని కలిసిన ప్రత్యేక సందర్భంలో గడ్డం వంశీకృష్ణ రాష్ట్ర అభివృద్ధికి,పెద్దపెల్లి అభివృద్ధికి కేంద్రం యొక్క తోడ్పాటును అందించాలని కోరారు.
మౌలిక వసతులు లేని పాఠశాలల పై వెంటనే చర్య తీసుకోవాలి
బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ
సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి)
సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న సువర్ణ అనే అమ్మాయి పై కుక్క కాటుదాడి జరిగినందున
సిరిసిల్ల జిల్లా బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ మరియు బిజెపి మహిళ కార్యకర్తలు మొన్నటి రోజున గురుకుల పాఠశాలను చెక్ చేయడానికి వెళ్లడం జరిగినది.
కానీ అక్కడ ఎలాంటి గురుకుల పాఠశాల పిల్లలకు సదుపాయాలు లేకుండా ఉన్నందున ప్రిన్సిపాల్ ని అడగడం జరిగినది.
ఆ పాఠశాలలో కనీస వసతులు లేకుండా ఉండడం ఇలాంటివి జిల్లాలో ఎన్ని ఉన్నాయో, అవన్నీ గురుకుల పాఠశాలలను గుర్తించి వెంటనే కలెక్టర్ చర్య తీసుకోవాల్సిందిగా కోరడం జరిగినది.
అంతేకాకుండా ఇలాంటి సిరిసిల్ల జిల్లాలో సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు ప్రెస్ మీట్ సందర్భంగా మహిళ బీజేపీ పక్షాన కోరడం జరిగినది.
అంతేకాకుండా హాస్టల్ లోనికి రాకుండా చాలా సేపు బయట వెయిట్ చేయించడం జరిగిందని అన్నారు.
హాస్టల్ యొక్క పరిస్థితులు బాగా లేవని ఎక్కడ బయట పడుతుందో అని మమ్మల్ని లోనికి రాకుండా చేయడం ఇబ్బందికరంగా అనిపించిందని తెలిపారు.
ఒక మహిళా విలేఖరిని కూడా లోనికి రానివ్వలేదని తెలిపారు.
సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని పత్రికా ముఖంగా కలెక్టర్ కి విన్నవిస్తున్నామని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ,జిల్లా ఉపాధ్యక్షురాలు పండుగ మాధవి,జిల్లా కార్యదర్శి దుంపెన స్రవంతి, పట్టణ అధ్యక్షురాలు వేముల వైశాలి, ఎల్లారెడ్డిపేట అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ, కోనరావుపేట అధ్యక్షురాలు తీగల జయశ్రీ, వేములవాడ టౌన్ అధ్యక్షురాలు వెల్డి రాధిక, ఎల్లారెడ్డిపేట సీనియర్ నాయకురాలు బర్కం సంగీత, బిజెపి మహిళా నాయకురాలు కర్నే హరీష తదితరులు పాల్గొన్నారు.
50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దళిత ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారు
గణపురం బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి
గణపురం నేటి ధాత్రి:
గణపురం మండలం కాంగ్రెస్ పార్టీనే దళిత వ్యతిరేక పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దళిత ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారన్నారు. అగ్ర కులస్తులకు పెద్దపీట వేసింది, దళితులను సేవకులుగా చూసిన నీచమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో దళిత నాయకులకు సరైన గౌరవం లేదని, ఇప్పటివరకు మాదిగ కులస్తులకు ఒక్క మంత్రి పదవిని కూడా ఇవ్వకుండా దళితులను అవమానించిందన్నారు. దళిత నాయకుల పట్ల దళిత ప్రజా ప్రతినిధుల పట్ల అమర్యాదగా మాట్లాడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆయన స్పీకర్ పై ఏక వచనంతో ఎక్కడ కూడా మాట్లాడలేదని, ఈ సస్పెన్షన్ అక్రమం, అన్యాయం అని అన్నారు. సభ సంప్రదాయాలు ఎక్కడ కూడానూ ఉల్లంగించలేదని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించినందుకు సస్పెండ్ చేశారని కాంగ్రెస్ నిరంకుశ విధానాలకు ఇదే నిదర్శనమని అదే విదంగా దళితులపట్ల గాని దళిత ప్రజా ప్రతినిధుల పట్ల గాని అనుచితంగా అమర్యాదగా మాట్లడింది కాంగ్రెస్ పార్టి అనిను ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అదికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇంకా మా బిఅర్ఎస్ పార్టి మిద ఏడవడం ఎందుకని ముందు ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చండి అనిటూ మెము ఇంకా ప్రతిపక్షాల్లోనే ఉన్నామనే భ్రమలో కాంగ్రెస్ పార్టి ఉందని వారు విమర్శించారు. అలాగె జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ను ఏఎత్తివేయాలని డిమాండ్ చేశారు
అన్ని వర్గాల ప్రజలకు సంతృప్తినిచ్చే తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కఅభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చిన్నారెడ్డి స్పందిస్తూ తెలంగాణా రాష్ట్రంలో గడ్డు ఆర్థిక పరిస్థితులు వున్నప్పటికీ, వాటిని అధికమించే విధంగా 3,04,965 కోట్ల ప్రణాళికతో బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు బడ్జెట్ మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లబ్ది చేకూరేలా బడ్జెట్ ప్రవేశపెట్టారని అద్యక్షులు చిన్నారెడ్డి అన్నారు. వ్యవసాయ రంగానికి, రైతు భరోసాకు, నీటిపారుదల శాఖలకు పెద్దపీట వేసి రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి వున్నా చిత్తశుద్ధిని తెలిపింది అని కొమ్ముల చిన్నారెడ్డి తెలిపారు.
ఆమె ఉపన్యాసాలతో బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేసి దొరల గుండెల్లో తూటాలను పేల్చిన వీర వనిత మల్లు స్వరాజ్యం అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు డి సీతాలక్ష్మి అన్నారు. బుధవారం స్థానిక చంద్ర భవనంలో ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోదురాలు మల్లు స్వరాజ్యం గారి 3వ వర్ధంతి సభలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు నాదెళ్ల లీలావతి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వరాజ్యం గారి చిత్రపటానికి నాదెళ్ల లిలావతి పూల మాలా వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సీతా లక్ష్మి మాట్లాడుతు మల్లు స్వరాజ్యం సంపన్న కుటుంబంలో పుట్టి అతి చిన్న వయసులోనే 13 ఏల కే తుపాకి పట్టి నిజం ప్రభుత్వం కి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య చైతన్యవంతులను చేశారని అన్నారు. తుపాకి పట్టి గెరిల్లా పోరాట నిర్మించిన మల్లు స్వరాజ్యం నీ నిజాం సైన్యాలు యెదుర్కోలేక ఇంటిని సైతం తగలబెట్టారని అన్నారు.ఆ నాడు ఆమె ను పట్టిస్తే 10 వేల రూపాయిలు ఇస్తాము అని ప్రభుత్వం ప్రచురించింది గుర్తు చేశారు. స్వరాజ్యం రజాకర్ల పాలిట సింహా స్వప్నం అయ్యి నిలిచారని కొనియాడారు.ఆమె జానపద బాణీల్లో కవి కట్టి స్వయం గా ఆమె పాడి గ్రామంలోని ప్రజలను ఐక్యం చేసేదని తెలిపారు . ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ కు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పోటీచేసి 2 పర్యాయాలు సీపీఎం పార్టీ తరపున ఎన్నికై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. మల్లు స్వరాజ్యం స్పూర్తి తో మహిళలందరూ ఐద్వా ఇచ్చే పిలుపులో, పోరాటలలో భాగస్వాములు అయినప్పుడే నిజమైన ఘన నివాలి అర్పించినట్టు అని సీత లక్ష్మి స్పష్టం చేశారు..ఈ కార్యక్రమం లో ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు జీవన జ్యోతి , వై పూర్ణిమా దేవి, గౌతమి యే జే, ఆఫీస్ భేరర్స్ సక్కుభాయి, జీ నాగలక్ష్మి, ఎమ్ సుబ్బలక్ష్మి , పట్టణ కమిటీ సభ్యులు కే సుసిల , గణపతమ్మ,సి యెచ్ దనమ్మ,డి నాగలక్ష్మి ,సౌదామిని ,సౌభాగ్యం తడితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఎస్సీ ఎస్టీ యూనియన్ జిల్లా అధ్యక్షులు పరామర్శించిన రమేష్ మేడి
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ లో ఎస్సీ ఎస్టీ యూనియన్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ ఏఏఓ గత నెల బైక్ యాక్సిడెంట్లో గాయపడిన విషయాన్ని తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ & ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల అసోసియేషన్ సెక్రటరీ జనరల్ (ప్రధాన కార్యదర్శి) రమేష్ మేడి వచ్చి పరామర్శించడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డివిజన్ నూతన కమిటీ కూడా పాల్గొనడం జరిగింది కమిటీని కార్యక్రమాలను అభినందించడం జరిగింది భవిష్యత్తులో ఏ కార్యక్రమం నిర్వహించిన అందరూ చురుకుగా పాల్గొనాలని చెప్పారు రాహుల్ (సబ్ ఇంజనీర్) డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ (సబ్ ఇంజనీర్) సెక్రటరీ మొగులప్ప ( ఆర్టిజన్ ) వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ (సబ్ ఇంజనీర్) అడిషనల్ సెక్రటరీ రాములు (జే ఏ ఓ) ట్రెజరర్ కిరణ్ ( ఏ ఎల్ ఎం ) ఉపాధ్యక్షులు ,సంగమేష్ (ఎల్ ఎం) మాజీ అధ్యక్షులు , ఏఎల్ఎంలు జేఎల్ఎంలు ఆర్టిజన్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహించిన మేము సైతం అని ముందుకు రావడానికి జహీరాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎప్పుడూ ముందుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగ అరుంధతి సంఘం నాయకులు వరాలు , స్వామి దాస్, జయరాజ్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.