ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా పాండవుల రాంబాబు.

ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా పాండవుల రాంబాబు.

#సంఘ అభివృద్ధి కొరకై కృషి చేస్తా.

#నాపై నమ్మకంతో 5వ సారి అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు సంఘానికి కృతజ్ఞతలు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

 

 

మండల కేంద్రంలోని ముదిరాజ్ కుల అధ్యక్షుని ఎన్నిక సోమవారం కుల దైవమైన పెద్దమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షునిగా పోటీలో పాండవుల రాంబాబు, పప్పు మొగిలి బరిలో నిలవగా ఎన్నికల నిర్వాహకులు రావుల రవి, కేశవ వర్మ, జక్కుల రవి, పోతు రెడ్డి రవిఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా సంఘ సభ్యులు ఓటును హక్కును వినియోగించుకున్నారు ఈ ఎన్నికల్లో పాండవుల రాంబాబు అధిక మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా సంఘానికి అన్ని విధాలుగా సహకరిస్తూ పార్టీలకు అతీతంగా కుల సమస్యలపై పోరాడి అభివృద్ధి దిశగా నడిపిస్తూ. కుల బాంధవులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సాధక బాధలను తీర్చడం జరిగిందని. కుల సంఘానికి పనిచేసే వ్యక్తి కావాలని 5 సారిగా మరోసారి నాకు అవకాశం కల్పించిన కుల బాంధవులకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆయన తెలిపారు. అదేవిధంగా కుల సంఘానికి ఎలాంటి సమస్యలు వచ్చిన పెద్ద చిన్న అని తేడా లేకుండా సమస్యల పరిష్కరణ కొరకై అనునిత్యం పనిచేస్తానని ఆయన కుల సంఘానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్దలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version