నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో జరిగిన సామూహిక అత్యాచార సంఘటనలో నిందితులు ఎవరైనా వదిలేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ వారిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీని కోరానని వెల్లడించారు. ఊర్కొండలోని ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో ఆరుగురు యువకులు ఒక వివాహిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తో ఫోన్లో మాట్లాడిన అనిరుద్ రెడ్డి పవిత్ర ప్రదేశంలో ఈ దురాగతానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. అత్యాచారానికి పాల్పడిన వారు బిఆర్ఎస్ పార్టీకి చెందిన వారని తన దృష్టికి వచ్చిందని అయితే ఈ సంఘటనకు పాల్పడింది ఎవరైనాప్పటికీ తాను రాజకీయాలు చేయదలుచుకోలేదని బాధిత యువతికి న్యాయం చేయాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. ఈ సంఘటనలో బాధిత యువతికి అండగా ఉంటానని అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సంఘటన నేపథ్యంలోని ఊర్కొండ పోలీసులతో కూడా మాట్లాడి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి రాత్రి పూట బస చేసే భక్తులకు రక్షణ కల్పించాలని కోరారు. గ్రామంలోనీ యువతులు కూడా జరిగిన సంఘటన పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కూడా అనిరుధ్ రెడ్డి ఆదేశించారు.
ఈద్గ ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి నేటిధాత్రి
ముస్లిం సోదరులకు,వారి కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి. ముస్లింల పవిత్రదినం రంజాన్ పండుగ సందర్బంగా భూపాలపల్లి బాంబులగడ్డలోని ఈద్గలో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రార్ధన కార్యక్రమంలో పాల్గొన్ని ముస్లిం సోదరీ సోదరులకు వారి కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపి,మీ కష్ట నష్టాలల్లో, ముస్లిం మైనారిటీ ప్రజల అభ్యున్నతిలో బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సోదరులు పాల్గొన్నారు
ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన మేరు సంఘం జిల్లా నాయకులు
చిల్పూర్(జనగాం)నేటి ధాత్రి
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అన్ని విధాల కృషి చేస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
ఈ సందర్భంగా స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని హనుమకొండలోని ఆయన స్వగృహంలో మేరు సంఘం జిల్లా కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసినారు.
ఈ సందర్భంగా మేరు సంఘ సభ్యులు ఎమ్మెల్యే తో మాట్లాడుతూ మేర కులానికి అందవలసిన ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో పాటు జిల్లా, నియోజకవర్గంతో పాటు మండల కేంద్రంలో మేరు సంఘ భవన నిర్మాణంతోపాటు జనగాం జిల్లాలోని మేరు కుటుంబాలకు జూకి మిషన్లు అందించాలన్నారు.
దీంతోపాటు ఇల్లు లేని మేరు కులస్తులకు ఇందిరమ్మ ఇల్లు అందించాలన్నారు.
అంతేకాకుండా ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాల్లో జిల్లాలోని మేరు కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా మేర సంఘం కమిటీ సభ్యులు పేర్కొంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మెమోరండం అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి వారితో మాట్లాడుతూ ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాల్లో మేరు కులస్తులకు ప్రాధాన్యత కల్పించే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మేరు సంఘం స్టేషన్గన్పూర్ మండల అధ్యక్షుడు దీకొండ మురళి, కార్యదర్శి వెన్ను సంపత్, కోశాధికారి సోమ రాజేందర్, పట్టణ అధ్యక్షులు దీకొండ సత్యనారాయణ, ముఖ్య సలహాదారులు గూడూరు నరేందర్,రాపర్తి సుధాకర్, మేరు సంఘం జిల్లా కమిటీ సభ్యులు అధ్యక్షులు రాపర్తి ప్రశాంత, కొత్తకొండ అజయ్ కుమార్,దీకొండ విష్ణు తో పాట లింగాల గణపురం, రఘునాథ్ పెళ్లి, జఫర్గడ్, చిల్పూర్, మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
రామాయంపేట మార్చ్ 31 నేటి ధాత్రి (మెదక్)
మెదక్ జిల్లా కేంద్రం గాంధీనగర్ లోని ఈద్గా వద్ద మైనారిటీ సోదరులు రంజాన్ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి. సుభాష్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు బట్టి జగపతి,అకిరెడ్డి కృష్ణారెడ్డి,మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ లు పాల్గొని ముస్లిం మతం పెద్దలకు, సోదరులకు రంజాన్ (ఈద్ ముబారక్) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్గా వద్ద ముస్లిం మత పెద్దలు సర్దార్ మమ్మ హుస్సేన్, శంషుద్దీన్, మహ్మద్ అలీ, కురనోద్దిన్ యూసుఫ్ లు ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పద్మదేవేందర్ రెడ్డి, శేరి. సుభాష్ రెడ్డి లు మాట్లాడుతూ రంజాన్ పవిత్రత త్యాగం, శాంతి, సమానత్వానికి ప్రతీక అని అన్నారు. మత సామరస్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి వేడుకలు ఎంతో దోహదపడతాయన్నారు. అన్ని మతాల ప్రజలలు స్నేహభావంతో కలిసి ఉండాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదర సోదరీమణులంతా పండగ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ మాజీ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, కొ కన్వీర్ కృష్ణ గౌడ్, జుబేర్ అహ్మద్, నాయకులు మహమ్మద్, ఫజిల్, మధు, మోహన్, నాగేందర్, సంతోష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని పేద ప్రజల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రం లోని సింగరకొండ రమేష్ గుప్తకు చెందిన రేషన్ షాపు వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని ఆహార భద్రతకార్డు ఉన్న లబ్దిదారులకు భూపాల పల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణరావు ప్రారం భించి పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లా డుతూ రాష్ట్రంలో ఈ సంవ త్సరం ఉగాది పండుగ చరిత్ర పుటల్లో లిఖించదగ్గ రోజుగా నిల్వనున్నదని ,దేశంలోనే తొలిసారిగా పేద ప్రజల ఆహార భద్రతకు మన ముఖ్య మంత్రి ఎనుములరేవంత్ రెడ్డి సారథ్యంలో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టిందని దారిద్రరేఖకు దిగువన ఉన్న పేదలతో పాటు మధ్యతరగతి ప్రజలకు ఆహార భద్రత కల్పిం చాలన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కలను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని అన్నారు.
Congress
ఈ పథకం కింద రాష్ట్ర జనాభాలో సుమారు 80% ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం లబ్ది చేకూరుతుందని,రాష్ట్రంలోని పేద ప్రజల ఆహారభద్రతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు.
దొడ్డు బియ్యం తినేందుకు ప్రజలు అనాసక్తత కనపరచడంతో పాటు దళారులకు అమ్ముకోవ డం వలన పక్కదారి పడు తున్నాయని అన్నారు.
వీటన్నింటిని అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకానికి నిర్ణయం తీసుకుం దని అన్నారు అర్హులందరికీ నూతన రేషన్ కార్డులు అందజేస్తామన్నారు.
పేద ప్రజలకు సన్న బియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.
Congress
అనంతరం 32 మంది సిఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు రూ. 10,63,500/- విలువ గల చెక్కులను అందజేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది.
లక్షలు ఖర్చుచేసి ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశా లల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా నిలుస్తుంద న్నారు.
ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ,శాయంపేట ఎమ్మార్వో మండలములోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్ని గ్రామాల కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆకస్మిక తనిఖీ
సమయానికి హాజరుకాని సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు
పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని పరిస్థితిని నేరుగా పరిశీలించిన వారు అక్కడి నిర్వహణ, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత వంటి అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలో కొంతమంది వైద్యులు, సిబ్బంది విధుల్లో హాజరు కాని పరిస్థితిని గమనించారు. ప్రజలకు సేవ చేయాల్సిన వారే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించటం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా వైద్యాధికారికి డిఎం అండ్ హెచ్ ఓ కి ఫోన్ చేసి, డ్యూటీలో గైర్హాజరైన సిబ్బంది పై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడే విధంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది వ్యవహరించటం సరికాదు. సమయానికి విధులకు హాజరు కావడం ప్రతి ఉద్యోగి బాధ్యత. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవు అని ఎమ్మెల్యే ఘాటుగా హెచ్చరించారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి, అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, అవసరమైన ఔషధాల సరఫరా, శానిటేషన్ మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. అలాగే, మాతా-శిశు విభాగాన్ని కూడా పరిశీలించి, ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ తనిఖీలో వారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మండల అధికారులు కూడా పాల్గొన్నారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు, పనితీరు పట్ల ప్రజల్లో దీర్ఘకాలంగా ఉన్న అసంతృప్తికి ఈ ఆకస్మిక తనిఖీ ఓ సందేశంగా నిలిచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాలని చూస్తున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నాయకుడు రాజకీయ నిబద్ధతకు నిజాయితీకి నిదర్శనమైన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డికి మంత్రిపదవి కేటాయించాలని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ప్రభుత్వాన్ని కోరారు.
శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామానంద్ మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నోవ్యాయ ప్రయాసాలు ఒడిదుడుకులను అనుభవిస్తూ నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన నాయకుడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అని అన్నారు.
నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామ సర్పంచిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి సొసైటీ చైర్మన్ గా డిసిసిబి చైర్మన్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేసి పిసిసి సభ్యులుగా ఏఐసీసీ సభ్యులుగా పదవులు చేపట్టి నిబంధత క్రమశిక్షణ కమిట్మెంట్ కు మారుపేరుగా నిలిచి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం జీవితాన్ని దారపోసి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు పొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ వారు చేపట్టిన పాదయాత్రలో చురుకైన పాత్ర పోషించారని పేర్కొన్నారు.
2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల పొత్తులో భాగంగా నర్సంపేట టికెట్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంభంపాటి లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయిస్తే కలత చెందకుండా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను ఏకతాటిపై నడిపించి లక్ష్మారెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించాడని అన్నారు.
2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కొద్దిపాటి తేడాతో ఓటమి చెందినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తూ వచ్చారని 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దొంతి మాధవరెడ్డికి టికెట్ కేటాయించకుండా మోసంచేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నియోజకవర్గ ప్రజల బలమైన కోరికతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రవ్యాప్తంగా దొంతి మాధవరెడ్డి ప్రభంజనం సృష్టించారని వివరించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు నీతిమాలిన రాజకీయాలు చేస్తూ పదవుల కోసం జంపుజిలానిలుగా మారి టిఆర్ఎస్ పార్టీలో కిరాయిప్పులకు పాల్పడుతుంటే అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వతంత్ర ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని టిఆర్ఎస్ పార్టీకి ఆహ్వానించినప్పటికీ అలాగే మంత్రి పదవి ఇస్తామని కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఆఫర్లు చేసిన ఆశపడకుండా కాంగ్రెస్ పార్టీని వీడకుండా మాతృపార్టీపై ప్రేమతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో చేరి తన రాజకీయ నిబద్ధతను చాటుకోవడం జరిగిందని గుర్తుకు చేశారు.
2014 నుండి 2018 వరకు ఎమ్మెల్యేగా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తూ అప్పటి అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన నిఖర్సగా ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిన గొప్ప నాయకుడు దొంతి మాధవరెడ్డి అని అభివర్ణించారు.
2018 ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్రను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముందుండి నిర్వహిస్తూ నడపారన్న విషయాన్ని గుర్తు చేశారు.
2018 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పార్టీ కోసం నిలబడే వ్యక్తిగా గుర్తింపు పొందిన నాయకుడని దాదాపు నర్సంపేట నియోజకవర్గం ఏర్పడి 45 ఏళ్ల చరిత్రలో చేతి గుర్తుపై గెలిచిన దాఖలాలు లేకపోగా మొదటిసారి నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై గెలిచి చరిత్ర తిరిగరాశాడన్నారు.
కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ అధిష్టానం పార్టీలు ఫిరాయింపులు చేసిన వారికి కొత్తగా వివిధ పార్టీల నుండి పదవుల కోసం పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులను ఇవ్వడం వరంగల్ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని గుర్తించి మంత్రిపదవి ఇవ్వకుండా వరంగల్ ఉమ్మడి జిల్లా అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను నిరాశకు గురి చేయడం సరికాదని వాపోయారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంలో భర్తీ చేయనున్న మంత్రి పదవుల్లో రాజకీయ నిబద్ధతకు నిదర్శనంగా ఉన్న ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారికి మంత్రి పదవిని కట్టబెట్టి నర్సంపేట ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు భూసాని సుదర్శన్, బీరం భరత్ రెడ్డి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి జన్ను మురళీ, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనీష్, పున్నం రాజు, భూక్య గణేష్, కొత్తగట్టు ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు
మంత్రి సీతక్క ( ఆదివాసీ ) కు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ క్షమాపణ చెప్పాలి
ఆదివాసీలు అంటే అంత చులకనా
*రాష్ట్ర మొదటి అధికార భాష తెలుగు తెలుగు తెలియనిమీరు తెలంగాణ శాషనసభలోఉండడం సబబా? సాగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
జమ్మికుంట :నేటిధాత్రి
మంత్రి గారికి హిందీ, ఇంగ్లీష్ రాదు .. సరే .. మరి మీకు తెలుగు ఎందుకు రాదు ? రాష్ట్ర మాతృబాష తెలుగు రాష్ట్ర మొదటి అధికార భాష తెలుగు. అలాంటి తెలుగు తెలియని తెలంగాణ శాషన సభలో మీరు ఉండటం సబబా . హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిగారు కదా ! రాష్ట్రం లో మెజారిటీ ప్రజలు మాట్లాడే మొదటి అధికార బాషా తెలుగు నేర్చుకోవాలనే సామజిక బాధ్యత మీకు ఉండాలి కాని లేదు.
అసెంబ్లీ లో అందరు సభ్యులు మంత్రులు తెలుగులోనే మాటాడుతున్నప్పుడు ఏం అర్ధం అవుతుంది మీకు ?
ఏదోకటి అసెంబ్లీ లో ఇంగ్లీష్ లో స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోతుందా ?
రాష్ట్రం లో సమస్యలు నీకు ఎలా అర్ధం అవుతాయి మీకు ?
ఇతరులకు హిందీ , ఇంగ్లీష్ రాకపోతే వారిపై అంత చిన్న చూపా ?
ఆదివాసీలు ( ఎస్టీ ) లు అంటే అంత చిన్న చూపా ?
మీ అహంకారాన్ని తగ్గించుకొని ,
ఆదివాసీ బిడ్డ అయిన గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి మీరు క్షమాపణ చెప్పాలి.
అప్పుడే మీరు ఉన్న శాసన సభ కు , శాసన సభ్యులు గా ఉన్న మీకు గౌరవం ..
కొసమెరుపు…
మంత్రి సీతక్క ను అవమానించిన అక్బరుద్దీన్ ఓవైసీ మాటలను ఖండించక పోవడం , శాసన సభలో ఎవరూ కూడా సీతక్కకు క్షమాపణ చెప్పాలి అని నిలదీయక పోవడం ఆశ్చర్యం.
నిమ్స్ పనులను వేగవంతం చేయాలి అసెంబ్లీ ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం లో గతం లో ఏర్పడి నిమ్స్ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని నేడు అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని కోరిన *గౌరవ శాసనసభ్యులు శ్రీ కోనింటి మాణిక్ రావు …. గతం లో (2011 వ సంవత్సరం లో ) ఏర్పాటైన నిమ్స్ ప్రాజెక్ట్ లోని కంపెనీలకు సంబంధించి పనులు ప్రారంభించిన ఎటువంటి పనులు ముందుకు సాగడం లేదు అని *కావున ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి , పనులను త్వరగా పూర్తి చేయాలని దీని ద్వారా జహీరాబాద్ నియోజవర్గ ప్రజలకు ఉపాధి కలుగుతుంది అని కోరారు.. అలాగే జహీరాబాద్ నియోజవర్గం లోని బాలికల ఉర్దూ మీడియం కళాశాలలో లెక్చరర్లు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు అని వెంటనే ప్రభుత్వ లెక్చరర్లు ను నియమించాలని నియోజకవర్గ విద్యార్థినిల భవిషత్తును కాపాడాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు..
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని అభినందించిన ఎమ్మెల్యే
పలమనేరు(నేటి ధాత్రి) మార్చి 23:
పలమనేరు బారసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎల్. భాస్కర్ ను పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమర్నాథ్ రెడ్డి ఆయన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఎల్.భాస్కర్ కు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్.భాస్కర్,గౌరవ అధ్యక్షులు కె.లక్ష్మీపతి,కార్యదర్శి బర్కత్, ఉపాధ్యక్షులు షేక్ షరిఫ్, చంద్రశేఖర్, సహ కార్యదర్శి జి. ఆర్. రవి, సీనియర్ న్యాయవాదులు భగీరథ కుప్పరాజు, ఎస్. రెడ్డెప్పశెట్టి, రాజా రెడ్డి, కె.జగదీశ్, ఎస్.లక్ష్మణ్ రెడ్డి,ఇ.కృష్ణ, ఎన్. నారాయణ రెడ్డి,పి.ఆర్.లోకేష్, బి.గిరీష్,రాజు,రాజీవ్ గాంధీ, రాజశేఖర్,సుబ్బారామయ్య,సంధ్య, పుష్పాంజలి,చాందిని పలువురు న్యాయవాదులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు..
బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట మార్చ్ 24(నేటిదాత్రి).
గుడి కడితే బిచ్చగాళ్ళు తయారవుతారు అని మాట్లాడి హిందూ మతాన్ని అగౌరవ పరిచిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈరోజు ఒక మతాన్ని గౌరవిస్తూ మరో మతాన్ని వ్యతిరేకించడం చాలా విడ్డూరంగా ఉందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుని విమర్శించారు.
ఒక మతం కి చెందిన ఓట్లను ప్రామాణికంగా తీసుకొని వాళ్లని మాత్రమే ఓటర్లుగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ మిగతా మతాలను కులాలను పట్టించుకోకుండా వారికోసం విందులు ఏర్పాటు చేసి ప్రభుత్వ ధనాన్ని వాడుకొని విందులు ఇవ్వడం వల్ల వారి స్వలాభాన్ని మాత్రమే చూసుకుంటున్నారు తప్ప మిగతా మతాల వారిని మిగతా కులాల వారిని నియోజకవర్గ ప్రజలుగా వారి ఓటర్లుగా భావించడం లేదని కుందూరు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మరియు ఎమ్మెల్యే గారిని విమర్శించారు.
నియోజకవర్గంలో ఎన్నో కులాలు మతాలు ఉన్న వారందరినీ కలుపుకొని పోకుండా కేవలం ఒక వర్గాన్ని వారి ఓటర్లుగా సృష్టించుకోవడం విడ్డూరంగా ఉందని మహేందర్ రెడ్డి అన్నారు.
గ్రామాల్లో కులాల వారిగా వారి వారి కులదేవతలను మొక్కుకుంటూ ఎన్నో పండుగలు జరుపుకుంటున్న వారి కోసం విందులు ఏర్పాటు చేసిన సందర్భాలు లేవు కానీ ఒక వర్గం కోసం ఎంపీ గారు ఎమ్మెల్యే గారు విందులు ఏర్పాటు విందులు ఇవ్వడం వారి ఓటు బ్యాంకు రాజకీయానికి నిదర్శనం అని కుందూరు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.
ఇప్పటికైనా మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ చేసే మోసాలను గమనించి వారికి చేస్తున్న అన్యాయాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానిక సంస్థల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని వారికి విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గంలోని హిందూ బంధువులంతా ఒకటై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ధ్యేయంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మహేందర్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.
ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించడానికి ఆకాశానికి నిచ్చెన వేద్దామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలను దేశ్ పాండే ఫౌండేషన్ బృందంతో కలిసి ఆయన సందర్శించారు.
MLA
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ గా తెలంగాణ రాష్ట్రం లోని డిగ్రీ కళాశాలలో ప్రథమ స్థానంలో నిలపాలన్నదే తన ఆశయం అన్నారు. చివరి సంవత్సరం డిగ్రీ చదువుతున్న 500 విద్యార్థులకు మందికి దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రీజనింగ్, ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ లలో శిక్షణ ఇస్తారని, వారు డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఏదేని సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశ్ పాండే ఫౌండేషన్ వారి శిక్షణ మీకు ఉపయోగపడుతుంది అని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, దేశ్ పాండే ఫౌండేషన్ బృందం ప్రవీణ్ ముత్యాల, శేఖర్, విశ్రాంత ప్రిన్సిపాల్ మురళీమోహన్, ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రోఫెసర్ వి.రాజేంద్రప్రసాద్, నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, గుండా మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మాణిక్ రావు గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు…
జహీరాబాద్. నేటి ధాత్రి:
రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని జహీరాబాద్ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సంధర్బంగా శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ,డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ మతాలకతీతంగా ఇఫ్తార్ విందులో పాల్గొనడం సోదరాభావాన్ని పెంచి లౌకిక విలువలను కాపాడుతాయని, ముస్లిం సోదరులు నెలరోజుల పాటు అత్యంత కఠిన నియమాలతో అల్లాను ప్రార్థిస్తారని, అల్లా దయతో ప్రజలందరు సుఖ సంతోషాలతో జీవించాలన్నారు.
అనంతరం ముస్లిం సోదరులకు ఖర్జూరం తినిపించి ఉపవాసన్ని విరమింప చేశారు.
Iftar dinner
ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ లు గుండప్ప, రామకృష్ణ రెడ్డి ,మాజి ఆత్మ చైర్మన్ లు విజయ్ కుమార్, పెంట రెడ్డి,మాజి మున్సిపల్ చైర్మన్ లు అల్లాడి నర్సింలు, తాంజిమ్,మాజి పట్టణ అధ్యక్షులు మోహి ఉద్దీన్,డి ఆర్ యు సిసి మెంబర్ షేక్ ఫరీద్ , మొగుడంపల్లి మండల అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , పాక్స్ చైర్మన్ మచెందర్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,న్యాల్కల్ మాజి మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి,మాజి ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్,బి ఆర్ ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,
కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
యాదాద్రి భువనగిరి , నేటి ధాత్రి
చౌటుప్పల్:రాష్ట్ర వ్యాప్త పర్యటన భాగంగా కేటీఆర్ నేడు సూర్యాపేటలో భారీ బహిరంగ సభలో పర్యటించిన నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ వద్ద కేటీఆర్ కు మునుగోడు బిఆర్ఎస్ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి ఘన స్వాగతం పలికిన టిఆర్ఎస్ కార్యకర్తలు.. కేటీఆర్ కు ప్రత్యేకంగా శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ,పాల్వాయి స్రవంతి ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షులు ,ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం దామాగ్నాపూర్ గ్రామంలో దేవరకద్ర మండలానికి చెందిన పలువురికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి గురువారం లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం వద్ద రాజగోపురం ముందు షెడ్డు నిర్మాణం సంబంధించిన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి ____________________ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్
జహీరాబాద్. నేటి ధాత్రి:
Arrested
యుత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ దళితుడైన శాసనసభాపతిని అగౌరవపరుస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ ను గౌరపరచడం సిగ్గు చేటాని అన్నారు. గతంలో ఇలాంటి సంస్కృతి లేదని అన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు, అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్, ఐ ఎన్ టి యు సి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్ , నియోజకవర్గ మహీళ అధ్యక్షురాలు అస్మా నాయకులు ఖాజా మీయ , గౌస్ భాయ్ , ఇనాయత్ , జయరాజ్ , విష్ణువర్ధన్ రెడ్డి, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ పట్టణం సమీపంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న జంతు వధశాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శనివారం అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్ పట్టణం లోని కోయిల్ కొండ చౌరస్తా రోడ్ లో నూతనంగా నిర్మిస్తున్న జంతు వధశాల పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జంతు వధశాలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి గారికి సూచించారు. జంతు వధశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని , పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి , ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, రఘుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సూర్యాపేట శాసన సభ్యులు జగదీష్ రెడ్డి ని సస్పెండ్ చేయడం హేయమైనా చర్య జహీరాబాద్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ నాయకులు
జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడం పట్ల, నిరసన తెలిపిన జహీరాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినందుకు,కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు & స్థానిక శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు గార్ల పిలుపు మేరకు జహీరాబాద్ నియోజకవర్గం పార్టీ నాయకులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
BRS leaders
పేరుకేమో ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకొంటూ ఆరు గ్యారంటీలు ఇస్తామని ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ప్రజల తరఫున మాట్లాడే మా పార్టీ శాసన సభ్యుల గొంతు నొక్కడం ఏమిటి’ అని ప్రశ్నించారు.తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ విలువలకు పాతరేస్తూ నిరాధార ఆరోపణలతో బీఆర్ఎస్ శాసన సభ్యుడు జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయటం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనని మాటలు అన్నట్టు ఆరోపించి అబద్ధాల ఆధారంగానే జగదీశ్ రెడ్డి ని కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సభలో ఉంటే మా ఆటలు సాగవని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ పార్టీ ఎమ్మెల్యేల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని దెప్పిపొడిచారు.పథకం ప్రకారమే జగదీశ్రెడ్డి సస్పెన్షన్ అని విమర్శించారు.‘ప్రశ్నిస్తే కేసులు,అక్రమ అరెస్టులు,సభలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే గొంతు నొక్కటం,సస్పెండ్ చేయటం ఇదేనా ప్రజా పాలన?’ అని నిలదీశారు సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
BRS leaders
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ,ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, న్యాల్కల్ మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు బాస్కర్,పట్టణ మాజీ అధ్యక్షులు యాకుబ్,కేతకి ఆలయ మాజీ చైర్మన్ నర్సింహ గౌడ్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా ,మహిళ పట్టణ అధ్యక్షురాలు మంజుల , అనుషమ్మ ,బిఅర్ఎస్వి అధ్యక్షులు రాకేష్ తాజా మాజి సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు ,గ్రామ పార్టీ అధ్యక్షులు,మున్సిపల్ బి ఆర్ ఎస్ పార్టీ వార్డ్ అధ్యక్షులు,ఉద్యమకారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి మొదటి దివంగత మాజీ ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి పార్కులో చెత్తాచెదారం
పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది
వనపర్తి నెటిదాత్రి:
Media Cell
వనపర్తి మొదటి ఎమ్మెల్యే దివంగత సురవరం ప్రతాప్ రెడ్డి పార్కులో చెత్తాచెదారం పేరుకుపోయిందని బీ ఆర్ ఎస్ మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ నందిమల్ల రమేష్ బీ ఆర్ ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు జోహెబ్ హుస్సేన్ యుగంధర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు .వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పానగల్ రోడ్డు బస్టాప్ దగ్గర పార్క్ ఉన్నదని వారు తెలిపారు . మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూతురు ప్రత్యూష సహకారంతో దివంగత ఎమ్మెల్యే సురవరం ప్రతాప్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ పార్క్ ఏర్పాటు చేయించారని వారు పేర్కొన్నారు. వనపర్తి పట్టణంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సహకారంతో అన్ని పార్కులలో ఆహ్లాదకరమైన చెట్లు పిల్లలకు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏర్పాటు చేయించారని వారు తెలిపారు. వెంటనే వనపర్తి లో మున్సిపల్ కమిషనర్ పార్కులను సందర్శించి ప్రతి ఒక్క పార్కు దగ్గర మున్సిపల్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని వనపర్తి మొదటి మాజీ ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి పార్కులో చెత్తాచెదారం మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకొని తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ను కోరారు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.