గురువులను సన్మానము చేసిన బిజెపి మహిళా మోర్చా నేతలు

గురువులను సన్మానము చేసిన బిజెపి మహిళా మోర్చా నేతలు

వనపర్తి నేటిదాత్రి :

గురుపౌర్ణిమ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రం ము ఎన్ టి ఆర్ లలిత కళాతోరణం లో తెలంగాణ బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర పిలుపుమేరకు గురువులను మహిళ మోర్చా నేతలు గురువులు రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీవెంకటేశ్వర ఆలయ చైర్మన్ అయ్యలూరి రంగనాథచార్యులు విజయకుమార్ శ్రీమతి శ్యామల,

స్వర్ణముకి అకాడమీ చైర్మన్ నాట్యకలా వి నీరజ దేవి లను ఘనంగా సన్మానము చేశారు వారు గురువుల ఆశీర్వాదం తీసున్నారు సన్మానము చేసిన వారిలో తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా కోశాధికారి శ్రీమతి నారాయణదాసు జ్యోతి రమణ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కవిత మాజీ జిల్లా అధ్యక్షురాలు మహిళా మోర్చా కల్పన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి సుమిత్రమ్మ, ప్రధాన కార్యదర్శి సుగూరు లక్ష్మి, అర్చన తదితరులు.ఉన్నారు

తాహసిల్దార్ కు గౌడ కులస్తుల సన్మానం.

తాహసిల్దార్ కు గౌడ కులస్తుల సన్మానం

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

 

మండల కేంద్రంలోని మండల తాహసిల్దార్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బిఎస్ఎస్ వరప్రసాద్ ను గౌడ కులస్తులు సాల్వతో ఘనంగా సత్కరించారు. గ్రామాల్లో నెలకొన్న గౌడ కులస్తుల సమస్యలను తాహసిల్దార్ కు వివరించారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఏ గ్రామంలో నైతే గౌడ కులస్తులకు ఐదు ఎకరాల భూమి లేదు వాటిని గుర్తించి వారికి అందజేయాలని విజ్ఞప్తి చేశారు. భూ సమస్యలు నెలకొన్న వాటిని భూభారతిలో పరిష్కారం చేసి గౌడ కులస్తుకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా నాయకులు చెట్ల చంద్రశేఖర్ గౌడ్, చర్ల పళ్లి సత్యనారాయణ గౌడ్, సీనియర్ న్యాయవాది కట్ట నరస గౌడ్ మండల నాయకులు నేరెళ్ల సుభాష్ గౌడ్, భూసారపు సాయిరాం గౌడ్, కట్ట ఆంజనేయులు గౌడ్ పలు గ్రామాల గౌడ సంఘాల నాయకులు, ఎలుక అశోక్ గౌడ్, కుంట రాజగౌడ్, గంగా నరసయ్య గౌడ్, రాంప్రసాద్ గౌడ్, నారాయణ గౌడ్, రాజేశ్వర్గౌడ్, శంకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రామ్ కిషన్ గౌడ్, రఘు గౌడ్, అంజయ్య గౌడ్, రాములు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల సన్మానం.

‘సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల సన్మానం’

మహబూబ్ నగర్ నేటి ధాత్రి:

మహబూబ్ నగర్, జడ్చర్ల సమీపంలోని చిట్టిబోయిన్ పల్లి దగ్గర 41.02 ఎకరాలలో ట్రిపుల్ ఐటీ కళాశాల మంజూరు చేసిన నేపథ్యంలో గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి,G మధుసూదన్ రెడ్డి, మెఘారెడ్డి, పర్ణిక రెడ్డిలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. దేశంలోనే వెనుకబడిన జిల్లాగా పేరుపొందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఐఐఐటీ మంజూరు కావడం హర్షనీయమన్నారు. వలస జిల్లా పేరునుండి.. విద్యాభివృద్ధి చెందిన జిల్లాగా పేరు రానున్నదని ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు.

ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ కు ఘన సన్మానం.

ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ కు ఘన సన్మానం

మెట్ పల్లి మే 22 నేటి ధాత్రి

 

 

ఉత్తమ ఎస్ హెచ్ ఓ గా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ,డి జి పి నుండి ప్రశంస పత్రం అందుకున్న ఎస్ ఐ అనిల్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.
తెలంగాణ రాష్ట్రంలో 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లో ఎస్ హెచ్ ఓ లుగా ఎంపిక కాగ అందులో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం ఉత్తమ ఎస్ హెచ్ ఓ గా ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ ఎంపిక కావడం గర్వకారణం అన్నారు.. క్యూఆర్ కోడ్, సిటిజన్ ఫీడ్ బ్యాక్ లో ఉత్తమ ప్రతిభ కనబరచి తెలంగాణ డిజిపి డాక్టర్ జితేందర్ చేతుల మీదుగా బుధవారం ఇబ్రహీంపట్నం ఎస్ ఐ అనిల్ బెస్ట్ ఎస్ హెచ్ ఓ గా అవార్డును, క్యాష్ రివార్డును డిజిపి చేతుల మీదుగా హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో అందుకోవడం గొప్ప విషయం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి మాజీ పట్టణ అధ్యక్షులు ఖుతుబోద్దిన్ పాషా, కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కొడిమ్యాల దీపక్ రాజ్ , యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నల్లూరి సాగర్,ఎన్ఎస్ యుఐ కార్యదర్శి చీమల రాజు,మాజీ ఎంపీటీసీ తిమ్మని రాములు, కనుక దినేష్ ,హరిదాసు, కోరే రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సన్మానించిన ముదిరాజ్ కులస్తులు.

ఎమ్మెల్యేను సన్మానించిన ముదిరాజ్ కులస్తులు

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా చోప్పదండి నియోజకవర్గం రామడుగు మండల కేంద్రంలోని శ్రీపెద్దమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా ముఫై ఒకలక్షల రూపాయలు కేటాయించిన సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యంను రామడుగు ముదిరాజ్ కులస్తులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా శ్రీపెద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా పునర్నిర్మాణానికి నోచుకోని శ్రీపెద్దమ్మ తల్లి ఆలయాన్ని నూతనంగా నిర్మించుకోవడానికి తన వంతు సహాయం చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు దీనికి సహకరించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి ముదిరాజ్, ముదిరాజ్ సంఘం పెద్దమనుషులకు, సొసైటీ సభ్యులకు, ముదిరాజ్ యువతకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యక్షులు జిట్టవేణి రాజు, సదరు పెద్దమనిషి జిట్టవేణి రమేష్, వైస్ చైర్మన్ నీలం రవి, డైరెక్టర్లు, పెద్దమనుషులు ఉత్తం రాయమల్లు, సామంతుల తిరుపతి, రాగం రాజయ్య, మామిడి సుదర్శన్, రాగం వెంకటి, జిట్టవేణి అంజిబాబు, పెసరి రాజమౌళి, సామంతుల తిరుపతి, రాగం లచ్చయ్య, ఈగ రాజేశం, రాగం సంపత్, చిలువేరి కనకయ్య, ఉప్పరి మహేష్, నీలం లక్ష్మణ్ బొమ్మరివేని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version