ముత్తారం మండలం పారుపెల్లి గ్రామం సలాకుల సారయ్య పుత్రుడు అందీప్ – సమత వివాహ రిసెప్షన్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోతి పెద్ది కిషన్ రెడ్డి వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్ రావు నాంసాని సమ్మయ్య బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు
లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవముల ఎమ్మెల్యే జిఎస్ఆర్ కు ఆహ్వానం
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కోడవటంచ (కోటంచ) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం యందు బ్రహ్మోత్సవాలు మార్చి 09 తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగు బ్రహ్మోత్సవాలకు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావుని ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఆహ్వాన పత్రికను ఆలయ ఈవో మహేష్,చైర్మన్ బిక్షపతి ఆధ్వర్యంలో అందించి జాతర వేడుకలు పాల్గొనాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు,సభ్యులు తదితరులు పాల్గొన్నారు
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే నన్నపనేని
వరంగల్ తూర్పు, నేటిధాత్రి
వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ శుక్రవారం నాడు నగరంలో జరుగుతున్న వివిధ వివాహ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ క్రమంలో వరంగల్ భద్రకాళి రోడ్డు, కీర్తి గార్డెన్స్ లో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు బారాస పార్టీ సీనియర్ కార్యకర్త మాలకుమ్మరి పరుశరాములు కుమార్తె వివాహానికి హాజరైన వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తో పాటు, గ్రేటర్ వరంగల్ కాశీబుగ్గ మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, పులి రజనీకాంత్, నేటిధాత్రి పత్రిక వరంగల్ స్టాఫ్ రిపోర్టర్ కందికొండ గంగరాజు తదితరులు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
మన్నపుర్ గ్రామంలోని ఏస్. వి. కె ఫంక్షన్ హాల్ లో జరిగిన. కొంగల్ అంజన్న గారి కుమారుడి కొంగల్ వెంకట్ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించిన. శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు , మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, మోగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, పాక్స్ చైర్మన్ మచ్చేందర్, మాజి సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి, గోవింద్ పూర్ సర్పంచ్ రాజు, వీరితో పాటు తిరుపతి రాజు, మండల నాయకులు అంజన్న ,రాములు ,యువ నాయకులు మిథున్ రాజ్, దీపక్ అపి తదితరులు.
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మల్లికార్జున సత్రం డైరెక్టర్ ఉప్పు అంజనేయులు జన్మదిన వేడుకలను హైదరాబాదులో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని ఆంజనేయులుకు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున అన్న సత్రం చైర్మన్ మిడిదొడ్డి శ్యాంసుందర్,, డైరెక్టర్లు బచ్చు రామకృష్ణ, ఆగిరి రవి, మేడిశెట్టి సురేష్,మిరియాల రాజయ్య, కల్మచర్ల రమేష్, శివ జగదీశ్వర్, చిగుళ్ళపల్లి శ్రీధర్ తదితరులున్నారు.
ఎమ్మెల్యే దొంతిని కలిసిన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
నర్సంపేట, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన పిఆర్టియు అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి హనుమకొండలోని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఈ కార్యక్రమంలో పిఆర్టియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-రాజకీయంగా భవిష్యత్తు అంధకారం చేసుకున్నని మధనపడుతున్నారు
హైదరాబాద్,నేటిధాత్రి:
తొందర పాటు గ్రహపాటైంది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి చేజేతులా తవ్వుకున్నట్లైంది. అత్యాశ దురాశగా, పేరాశా మిగిలిపోయింది. సముద్రం లాంటి కాంగ్రెస్లో అందరూ కలవలేరు. ఒక్కసారి ఆ పార్టీలో కలిస్తే మాత్రం పార్టీని వదులుకోలేరు. అందువల్ల మొదటి నుంచి కాంగ్రెస్లోవున్న వారికి ఆ పార్టీ ఎంతో గొప్పది. కాంగ్రెస్ పార్టీలో వున్నంత అంతర్గత ప్రజాస్వామ్యమం మరే పార్టీలో వుండదు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలలో అసలే వుండదు. కాని తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేకు అక్కడా దక్కలేదు. ఇక్కడా విలువలేకుండాపోయింది. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నా, కాంగ్రెస్ నాయకులమని చెప్పుకోలేకపోతున్నారు. అటు బిఆర్ఎస్ పార్టీని తిట్టలేకపోతున్నారు. అటు కాకుండా, ఇటు కాకుండా పోయి, రాజకీయ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసుకున్నారు. ఇప్పుడు మధనపడినా వచ్చేది లేదు. ఒరిగేది లేదు. అంతో ఇంత కాంగ్రెస్లోనే ఏదైనా ఆదరణ దొరకాలే గాని, తిరిగి ఘర్ వాపసీ అంటే మాత్రం అక్కడ ఇసుమంతైనా గౌరవం దక్కకపోవచ్చు. ప్రాదాన్యత పెద్దగా వుండకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్దితుల్లో టికెట్ దక్కకపోవచ్చు. కాంగ్రెస్లో కొనసాగినా అదే జరగొచ్చు. రెంటికీ చెడిన రేవడిగా మారింది ఎమ్మెల్యేల పరిస్దితి. పార్టీ మారేముందు కొంచె ఆలోచిస్తే ఇంత దూరం వచ్చి వుండేది కాదు. కాంగ్రెస్పార్టీ పదేళ్ల కాలం పాటు అధికారం కోల్పోయింది. కాంగ్రెస్నుంచి బిఆర్ఎస్లో నాయకులు చేరుతూ వుండడంతో చతికిలపడిపోయింది. ఒక దశలో చితికిపోతుందనుకున్నారు. కాని ఆ పార్టీకి వున్న నాయకులు, కార్యకర్తల మూలంగా, కాంగ్రెస్ పార్టీ నిలబడిరది. ఆ పార్టీకి ఇప్పటికీ చెక్కు చెదరని కార్యకర్తలున్నారు. నాయకులు నాడు బిఆర్ఎస్కు వెళ్లినా అప్పటి ద్వితీయ శ్రేణి నాయకులు ముందు వరసలోకి వచ్చారు. పదేళ్లపాటు కాంగ్రెస్ను కాపాడుకుంటూ వచ్చారు. బిఆర్ఎస్ పాలనలో నానా ఇబ్బందులు పడ్డారు. కేసులు ఎదుర్కొన్నారు. నిర్భందాలను కూడా చూశారు. పోలీసుల దెబ్బలుతిన్నారు. అనేక ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. పార్టీ మారాలని పెట్టిన నిర్భంధాలను కూడా లెక్క చేయకుండా పార్టీ కోసం నిలబడ్డారు. అలాంటి నాయకులున్న కాంగ్రెస్పార్టీలోకి అవకాశవాద రాజకీయాలను చేయానుకున్నవారు వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ ఇమలేక, కాంగ్రెస్లో నెగలేకపోతున్నారు. ఏదో జరుగుతుందని ఆశపడితే ఏదో అయ్యిందన్నట్లు మారింది. కాంగ్రెస్లోవిలువ లేదు. గుర్తింపు అసలే లేదు. కార్యకర్తలు అసలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గౌరవమే ఇవ్వడం లేదు. అసలు ఎమ్మెల్యేలుగా వారిని పార్టీ శ్రేణులే గుర్తించడం లేదు. అటు కాంగ్రెస్ పట్టించుకోకపోవడమే కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్నారు. బిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవాల్సిన సమయంలో కాంగ్రెస్ నాయకులే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రావొద్దంటున్నారు. దాంతో దిక్కు తోచని పరిస్ధితిలో ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ మారితే బిఆర్ఎస్ నుంచి సమస్యలు ఎదురౌతాయి. బిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటాయి. అధికారం చేతిలో వుంటుంది. బిఆర్ఎస్ను అణచివేయొచ్చు. బిఆర్ఎస్ను తమ తమ నియోజకవర్గాలలో ఖాళీ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ మెప్పు పొందొచ్చు. ఇతర పదవులు, నిధులు తెచ్చుకోవచ్చనుకున్నారు. కాని కాంగ్రెస్ పార్టీ నాయకులే రాజకీయం చేస్తారని అనుకోలేదు. కాని కాంగ్రెస్ పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేక ఏర్పడుతుందని ఊహించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరించలేరు. వారితో కలిసి సఖ్యతను పొందలేకపోతున్నారు. మేమిక్కడ నెగలలేకపోతున్నామంటూ ఆంతరంగికుల వద్ద బోరు మంటున్నారు. వెళ్లి తప్పు చేశామంటూ మధనపడుతున్నారట. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదరిస్తారనుకుంటే దూరం కొడుతున్నారు. కాంగ్రెస్లో కలిసినా, నాయకులతో కలవలేకపోతున్నామంటున్నారు. తాము ఎంత చొచ్చుకెళ్లినా, కాంగ్రెస్ నాయకులను ఎంత భుజ్జగించినా వినడం లేదంటున్నారు. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఎదురౌతోంది. ఎమ్మెల్యేలమన్న గౌరవం కనీసం కాంగ్రెస్ కార్యకర్తలే ఇవ్వడం లేదు. దాంతో బిఆర్ఎస్ శ్రేణులు చూసి సంబరపడుతున్నారు. తమకు మొత్తం మీద గుర్తింపు లేకుండాపోతోందంటున్నారు. ప్రజల ముందు ఎలాగూ చులకనయ్యాం. కాని కాంగ్రెస్ శ్రేణులతోనైనా కలిసిపోదామనుకుంటే ఎమ్మెల్యే వస్తున్నాడని తెలిసినా ఎవరూ వెళ్లడం లేదట. అటు అనుచరులకు కూడా లోకువయ్యే పరిస్ధితులు ఎదురౌతున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలతో కనీసం మాట్లాడలేని పరిస్ధితుల్లో ఎలా కొనసాగాలో అర్ధం కాకుండా వుందంటున్నారు. పార్టీ మారి పడరాని పాట్లు పడుతున్నామంటూ బిఆర్ఎస్ నాయకులకు గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఎదుకంటే పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులును వేదించింది ఈ ఏ ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. అప్పుడు అధికారం చెలాంయించి ఇబ్బందులకు గురి చేసింది వీళ్లే. ఇప్పుడు కాంగ్రెస్లో చేరి పెత్తనం చేయాలని చూస్తున్నది వీల్లే. దాంతో కాంగ్రెస్ నాయకులకు సుతారం నచ్చడం లేదు. పై నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా, ఆదేశాలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది కాంగ్రెస్లో ఎప్పుడూ వుండే సంస్కృతే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను వేధించిన ఎమ్మెల్యేపై రివెంజ్ తీర్చుకుందామనుకున్నారు. కాని వాళ్లే ఇప్పుడుకాంగ్రెస్లో చేరడంతో వాళ్లంతా విస్తుపోతున్నారు. పాత బకాయిలు తీర్చుకోలేకపోతున్నామని కాంగ్రెస్ నాయకులు మధనపడుతున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ద్వితీయ శ్రేణి నాయకులయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆదరించకపోవడంతో బిక్కు బిక్కు మంటున్నారు. రాజకీయం అందకారం చేసుకున్నామంటూ చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఎలాగూ ఇమడలేకపోతున్నాం. కనీసం సొంత గూటికి చేరుకుందామా? అని కొంత మంది ఎమ్మెల్యేలు అనుకుంటున్నారట. బిఆర్ఎస్ ఛీప్తో కలవాలని ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నారట. తప్పయ్యింది. మేమొస్తాం తలుపులు తీస్తారా? అని కేటిఆర్, హరీష్రావులను వేడుకుంటున్నారట. క్షమించి మమ్మల్ని రమ్మని చెప్పండంటూ సందేశాలు పంపుతున్నారా? కొంత మంది కాంగ్రెస్ నాయకులతో గొడవలు పడుతూ తమలో గులాబీ రక్తమే వుందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారట. క్షమించి రమ్మనండి? అని వెడుకుంటున్నారట. రమ్మంటే పరుగెత్తుకొస్తామంటూ నాయకులతో కబురు పంపిస్తున్నారట. ఈ ఎమ్మెల్యేలకు కారులో చోటు వుండదని తెలుసు. వచ్చే ఎన్నికల్లో కేసిఆర్ టికెట్ ఇవ్వడని తెలుసు. అయినా కాంగ్రెస్లో వుండి చేసేదేమీ లేదు. రోజు తలనొప్పి తప్ప మరేం లేదనుకుంటున్నారట. నిదులొస్తాయని అనుకుంటే మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పోల్చితే వస్తున్న నిధులేమీ లేవు. అసలైన కాంగ్రెస్ నాయకులకు వున్న విలువ, గౌరవం ఎలాగూ దక్కడం లేదు. నిధులు మంజూరు తమ వల్ల కావడం లేదు. కాంగ్రెస్ నాయకులు కోరిన నిధులు ఇస్తున్నారు. పాత కాంగ్రెస్ నాయకుల చేతనే అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారు. వారి చేతనే కొబ్బరి కాయలు కొట్టిస్తున్నారు. ఎమ్మెల్యేలను కనీసం దగ్గరకుకూడా రానివ్వడం లేదు. ఇలాంటి పరిస్ధితి ఒక వైపు వుంటే మరో వైపు సుప్రింకోర్టులో కేసు తీర్పు ఎలా వుంటుందన్న భయం మరో వైపు వెంటాడుతోంది. తాజాగా మార్చి 4న సుప్రింకోర్టు మరిన్ని సీరియస్ వ్యాఖ్యలు చేసింది. గడువు కోరిన ప్రభుత్వ తరుపు న్యాయవాదుల పేరుతో ఎమ్మెల్యేల పదవీ గడువు పూర్తయ్యే వరకు కావాలా? అంటూ ఎదురు ప్రశ్నించింది. ఇలాగైతే ప్రజాస్వామ్యం విలువలు పడిపోతాయని సుప్రిం కోర్టు ఘాటుగా హెచ్చరించింది. అంతే కాదు మార్చి 23 వరకు ఏ విషయమైన కోర్టుకు తెలపాలని ప్రభుత్వ తరుపు లాయర్లకు సుప్రింకోర్టు సూచించింది. ఇక మార్చి 23 లోగా స్పీకర్ ఏదో ఒక నిర్ణయం ప్రకటించే పరిస్దితి ఎదురైంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేయకపోతే సుప్రింకోర్టు వారిపై వేటు వేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అందుకే ఈలోపే బిఆర్ఎస్ గూటికి తిరిగి వెళ్లడం ఎంతో ఉత్తమమని కొంత మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఒక వేళ వెళ్లినా కనీసం తమను గడప కూడా తొక్కనీయరని కొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ వేటు పడినా మళ్లీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా? ఇచ్చినా గెలిచే పరిస్థితి వుందా? అనుకుంటున్నారట. తొందరపడ్డామా..చేజేతులా చెడగొట్టుకున్నామా? అన్నది అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారట.
ఆలయాధ్వజస్తంభాల ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్.
చిట్యాల, నేటిధాత్రి :
భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలం ఒడితల గ్రామంలో మూడు రోజుల నుండి శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం, శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థానం మరియు బద్ది పోచమ్మ తల్లి దేవాలయాలల్లో ధ్వజ స్తంభాల ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. కాగా, సోమవారంరోజున జరిపిన ధ్వజస్తంభాల ప్రతిష్టాపన మహోత్సవంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ నిర్వాహకులు, కాంగ్రెస్ నేతలు, గ్రామస్తులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేణుగోపాలస్వామి, రామలింగేశ్వరస్వామి, బద్ది పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఒడితల గ్రామంలోని కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయాలను అభివృద్ది చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేకు పలువురు శాలువాలు కప్పి సన్మానం చేశారరు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మన వంశ కృష్ణ జిల్లా నాయకులు చిలుకల రాయ కొమురు కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటయ్య పల్లి గ్రామంలో శుక్రవారం మైలారం మల్లన్న స్వామి జాతర మహోత్సవాలలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మల్లన్న స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్, స్కూల్ కాంపౌండ్ హాల్, సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. తదనంతరం జేఈఈలో అత్యుత్తమ మార్కులు సంపాదించిన దేవరకద్ర పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఖాదర్ కుమారుడు సల్మాన్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఓటుహక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన రూరల్ ఏసిపి
అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రులు….
గంగాధర నేటిధాత్రి :
MLA Medipalli Satyam
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గంగాధర లోని ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఉదయం నుండి పోలింగ్ ప్రశాంతంగా సాగుతుండగా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు కల్పించారు. గంగాధర పోలింగ్ కేంద్రాన్ని కరీంనగర్ రూరల్ ఏసిపి శుభం ప్రకాష్ సందర్శించి పోలింగ్ సరళిని భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అయన వెంట స్థానిక ఎస్సై నరేందర్ రెడ్డి ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఊహించిన విధంగా ఓటేసేందుకై పట్టభద్రులు అధిక సంఖ్యలో హాజరై ఓటు వేసేందుకు బారులు తీరడం కనిపించింది. అధిక సంఖ్యలో చిన్నారులను తీసుకొని పోలింగ్ కేంద్రాల్లో ఓట్టు వేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు పోటా పోటీగా బరిలో దిగగా వారికి ధీటుగా ఓటర్లు కూడా అధిక శాతం హాజరు కావడం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఏదేమైనప్పటికిని గతంలో ఎన్నడు లేని విధంగా పట్టభద్రులుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి స్థానిక ఎన్నికలను తలపించే విధంగా ఓటర్లు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా /పిట్లం నేటిధాత్రి: నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గురువారం కామారెడ్డి జిల్లా పిట్లం పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు మరియు బాధ్యత అనీ అలాగే మన ఓటు ద్వారా మన భవిష్యత్తును మనం రూపొందించుకోవచ్చు. కాబట్టి, అందరూ పట్టభద్రులు, ఉపాధ్యాయులు తప్పకుండా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలి,” అని ఆయన పిలుపునిచ్చారు.
కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు.
జహీరాబాద్. నేటి ధాత్రి:
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో ఉన్న శివలింగానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రంలో దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు శ్రీ కొనింటీ మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,మోగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,ఝరసంఘం మాజి ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ మాజి చైర్మన్ నర్సింహ గౌడ్,పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా,నాయకులు ప్రభు పటేల్ ,ప్రవీణ్ పాటిల్ ,విజయ్ రాథోడ్ శివశంకర్ ,తదితరులు పాల్గొన్నారు .
ముత్తారం మండలం రామకృష్ణపూర్ గ్రామంలో బుర్ర పోచ గౌడ్ ఇటీవల మరణించగ వారి కుటుంబంమును మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు వారి వెంట మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు కుటుంబాన్ని పరామర్శించినారు
పరకాల నేటిధాత్రి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు మాజీ కౌన్సిలర్ మార్క ఉమా రఘుపతి గౌడ్ ల కుమారుడు ఎన్ఎస్యుఐ జాతీయ కోఆర్డినేటర్ మార్క అభినయ్ వివాహ మహోత్సవ కార్యక్రమానికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డికి పెండ్లి శుభలేఖ అందజేశారు.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు పరకాల మున్సిపల్ మాజీ చైర్మన్ సోదా రామకృష్ణ,ఏఎంసీ చైర్మన్ చందుపట్లరాజిరెడ్డి,కుంకుమేశ్వర ఆలయ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు, పరకాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్,ఏకు రాజు,నల్లెల్ల జ్యోతి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యే గండ్ర పై వ్యాఖ్యలు బాధించాయి
కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భూపాలపల్లి హత్య కేసుపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామిరెడ్డి పై చేసిన వాక్యాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. మైలారం గ్రామం మాజీ సర్పంచ్ అరికెళ్ల ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి కేవలం కావాలని గండ్ర వెంకటరమణా రెడ్డి పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని బిఆర్ఎస్ పార్టీకి గండ్ర వెంకట రమణారెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక భూపాల్ పల్లిలో నిన్న జరిగిన రాజలింగ మూర్తి హత్య విషయంలో రాజకీయం చేసి కేవలం కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడిగడ్డ మ్యారేజ్ విషయంలో ఉన్న కోర్టు కేసులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పై అన వసరమైన ఆరోపణలు చేయ డం సరికాదని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఇలాంటి హత్య రాజకీయాలు మా ప్రభుత్వంలో గాని, గండ్ర రమణారెడ్డి ఇప్పటివరకు చేయలేదని హత్యా రాజకీ యాలు కాంగ్రెస్ పార్టీ నాయకు లకు కొత్తేమి కాదని ఇరువ ర్గాల మధ్య భూ వివాదంమే ప్రధాన కారణమని అందరూ చెపుతున్నారని,హత్య జరిగిందని దానిని బీఆర్ ఎస్ నాయకులకు రుద్దడం సిగ్గు చేటని ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు పద్ధతి మార్చుకొని ప్రజా పాలన చేయాలని హత్య రాజకీయాలు మీరు చేస్తారు మా నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి ప్రజలకు సేవ చేసే నాయకుడిగా కొనియాడారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపిటిసి గడిపే విజయ్ బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ యూత్ మండలాధ్యక్షుడు మారేపల్లి మోహన్ కరణ్ బాబు మస్కే భాస్కర్ బిఆర్ఎస్వి జిల్లా నాయకులు వెంకట్ ఉన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
మంథని :- నేటి ధాత్రి
మంథని మండలం ఎక్లాస్ పూర్ శివ సాయి గార్డెన్ లో సల్ల రమేష్ పుత్రుడు పవన్ కళ్యాణ్ –శ్వేత రాణి వివాహ వేడుకల్లో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు అనంతరం ఖానాపూర్ గ్రామం లోని అమ్మకంటి భాగ్యలక్ష్మి శివకుమార్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమం లో పాల్గొని శుభాకాంక్షలు తెలియచేసి ఆశీర్వధించారు బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు
మంథని పట్టణం పోచమ్మ వాడ లోని శ్రీ శివనాగేంద్ర దేవాలయ ప్రాంగణంలో ఉత్తర బోయలింగం జీర్ణోధారణ మరియు పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పత్తి రైతుల ఇబ్బందులపై స్పందించారు.అదే క్రమంలో వారు సంయుక్తంగా మంచిర్యాల జిల్లాలో పత్తి కొనుగోలు జాప్యం పై బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి చర్చించారు.ఈ సందర్భంగా వారు పత్తి కొనుగోలు విషయంలో సీసీఐ నుంచి రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు.ఆన్లైన్ సర్వర్ పనిచేయని నేపథ్యంలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆధార్ కార్డుతో మాన్యువల్ ద్వారా పత్తి కొనుగోలు చేపట్టాలని కోరినారు.సీసీఐ షరతుల కారణంగా చిన్న సన్నకారు రైతులు అవస్థలను గుర్తించాలన్నారు.సానుకూలంగా స్పందించిన కిషన్ రెడ్డి కేంద్ర టెక్స్ టైల్ మినిస్టర్,సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎండి లలిత్ కుమార్ తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లుగా జిల్లాలోని రైతాంగానికి సమాచారం ఇచ్చారు.
నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుట్టలపల్లి గ్రామంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైన సందర్భంగా.. నూతన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి ఎమ్మెల్యే కూచకుళ్ళ రాజేష్ రెడ్డి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ డబుల్ బెడ్రూంలు ఇల్లు ఇస్తామని, మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల ఇస్తున్నామన్నారు. మొదటగా గుట్టలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశామన్నారు. అనంతరం పొల్మూరు గ్రామంలో రూ.5 లక్షలతో మంజూరైన నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.