బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి

“బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి”

బాలానగర్ నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో భవానిమాత దేవాలయంలో సోమవారం మండల బీజేవైఎం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల బీజేవైఎం అధ్యక్షులుగా కుమార్ నాయక్, ఉపాధ్యక్షులుగా శ్రీరామ్, నవీన్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా భరత సింహాచారి, సందీప్ కుమార్, ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గోపాల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమార్ నాయక్ మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version