కార్మికుల చట్టాలకు వ్యతిరేకంగా రాస్తారోకో…
కొత్తగూడ, నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లో అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలకు అమలు చేసిన విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు రాస్తారోకో నిర్వహించారు భారతదేశంలో కార్మికులందరూ జూలై 9న సార్వత్రిక సమ్మెను పిలుపులో భాగంగా కొత్తగూడ లో నిర్వహించారు పలువురు నాయకులు మాట్లాడుతూ కార్మికులపై పాలక -పెట్టు బడి దారి వర్గాలు మోపుతున్న వేతన బానిసత్వం పని గంటల పెంచిందని . కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కార్మిక చట్టాలను వెంటనే విరమించుకోవాలని కార్మికులకు కనీస వేతనాలు కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూ(న్యూ) బిఆర్ఎస్. నాయకులు అంగన్వాడి కార్యకర్తలు ఆశ వర్కర్లు పాల్గొన్నారు,,