ఎరువుల షాపులను తనిఖీ.!

ఎరువుల షాపులను తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి

రైతులకు ఎరువుల కొరత ఉండదు… ఏ ఓ వెంకన్న

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న కేసముద్రం మండలంలోని పలు ఎరువుల దుకాణాలు, మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సెంటర్ లను తనిఖీ చేయడం జరిగింది, వారు మాట్లాడుతూ ప్రతి ఎరువుల డీలరు యూరియా మరియు ఇతర ఎరువులను ఈపాస్ మిషన్ ద్వారా మాత్రమే విక్రయించాలని, స్టాక్ రిజిస్టర్ బ్యాలెన్స్ మరియు, గోదాం బ్యాలెన్స్, ఈపాస్ బ్యాలెన్స్ సమానంగా ఉండేటట్లు ప్రతిరోజు చూసుకోవాలని వారు సూచించారు, స్టాక్ బోర్డులు, ఇన్వైస్లు, ఓ ఫామ్సు ప్రాపర్ గా మెయింటైన్ చేయాలని వారు సూచించారు, ఎవరైనా డీలరు ఎరువుల కొరత సృష్టించిన, అధిక ధరలకు విక్రయించిన, ఎరువులు నియంత్రణ చట్టం 1985 ప్రకారం, మరియు నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం చర్యలు తీసుకుంటామని, వారు సూచించారు.

వారు మాట్లాడుతూ కేసముద్రము మండలంలో, ప్రైవేటు ఎరువుల దుకాణాలు మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద యూరియా 323 మెట్రిక్ టన్నులు, డిఏపి 53 మెట్రిక్ టన్నులు ,పోటాష్ 44 మెట్రిక్ టన్నులు, సూపర్ 115 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 534 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నది కావున రైతు సోదరులు ఎటువంటి అధైర్యపడవద్దని వారు సూచించారు, కావలసిన రైతులు ఆధార్ కార్డు తీసుకువెళ్లి, యూరియా మరియు ఇతర ఎరువులను పొందాలని వారు సూచించారు, వారు మాట్లాడుతూ ప్రస్తుతము పత్తి మరియు మొక్కజొన్న పంట 25 నుంచి 30 రోజుల వయసులో ఉన్నందున పంటలలో మోతాదుకు మించి యూరియా వాడినట్లయితే రసం పీల్చే పురుగుల బెడద, కలుపు బెడద ఎక్కువై పంటకు నష్టం జరిగే అవకాశం ఉన్నందున, యూరియా మరియు ఇతర కాంప్లెక్స్ ఎరువులను మొక్కకు కావలసిన మోతాదులోనే అందియాలని వారు సూచించారు , అదేవిధంగా వ్యవసాయ అధికారి రైతులకు నానో యూరియా మీద అవగాహన కల్పించడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version