సింగరేణి మండల కేంద్రములో పట్ట పగలే అక్రమ మట్టి తోలకాలదందా.

సింగరేణి మండల కేంద్రములో పట్ట పగలే అక్రమ మట్టి తోలకాలదందా.

పట్టించుకోని అధికారులు.

కారేపల్లి నేటి ధాత్రి

ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రము లో యదేశ్య గా పట్ట పగలే ప్రతిరోజు జేసీబి తో మట్టిని తవ్వి అనేక ట్రాక్టర్ల తో ఉదయం నుండి సాయంత్రం వరకు కారేపల్లి లో చుట్టూ పక్కల ఉన్న గ్రామాల్లో ప్రతినిత్యం అక్రమ మట్టి తోలకాలు జోరుగా కోనసాగిస్తున్నారు ఎవ్వరైనా ప్రజలు అడిగితె ఇందిరమ్మ ఇళ్ల కు అని చెప్పి పబ్లిక్ గానే ప్రతిరోజూ అక్రమ మట్టి తోలకాల దందా జోరుగా కోనసాగిస్తున్నారు.సింగరేణి మండల కేంద్రములో కూత వేటు దూరంలోనే ప్రభుత్వ అధికారులు ఉన్న కానీ ప్రతిరోజు అక్రమ మట్టి తోలకాల దందా జోరుగా కోనసాగిస్తున్నారు ఒక్క ట్రాక్టర్ మట్టి ఆరు వందల నుండి ఎనిమిది వందల వరకు బైట వెంచర్ల లో కూడా మట్టి విక్రయాలు కోనసాగిస్తు మట్టి మాఫియా దారులు లక్షలు గడిస్తున్నారు.మట్టితోలకాలపై ప్రజల్లో అనేక అనుమానాలు తావేత్తుతున్నాయి. మైనింగ్ అనుమతులు ప్రభుత్వ అధికారుల అనుమతులు ఉండాలని అవి ఉన్న లేకున్నా కాని అదికారుల అండదండలతో వారి కనుసన్నల్లోనే ఈ అక్రమ మట్టి తోలకాల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోందని ప్రజలు అనుకుంటున్నారు. కావున ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఈ అక్రమ మట్టి తోలకాల దందాను ఆపాలని ప్రజలు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version