కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక.

కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
ఇస్సీపేట కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పెండ్లి ఇంద్రారెడ్డి

నేటిధాత్రి మొగుళ్ళపల్లి

 

భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ఇస్సిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పెండ్లి ఇంద్రారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమన్వయ కమిటీ సభ్యులు ఏలేటి శివారెడ్డి, మోటె ధర్మారావు, తెలిపారు. సభ్యులు మాట్లాడుతూ. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాల మేరకు. ఇసిపేటలో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతన గ్రామ శాఖ అధ్యక్షుడు పెండ్లి ఇంద్రారెడ్డి మాట్లాడుతూ. తన నియ మకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజేశ్వరరావు ( రాజు), గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు మల్లారెడ్డి, ముకుందా రెడ్డి, కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యక్షులుగా పొన్నాల ఆది రెడ్డి, ఎండిగ బొజ్జరాజు, ప్రధాన కార్యదర్శిగా గాజుల కుమారస్వామి, పెంతల కిరణ్ పాల్, కోశాధికారిగా పొన్నాల సుమన్, కార్యదర్శిగా పండుగ మల్లయ్య, ఓరుగంటి రఘు , కార్యవర్గ సభ్యులుగా దివిటీల సంపత్, మేడిద లింగారెడ్డి, ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

జిల్లా కమిటీలో మార్పులు చేర్పులు.

జిల్లా కమిటీలో మార్పులు చేర్పులు

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

తెలంగాణ ఆర్ఎంపి అండ్ పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా కమిటీ రిజిస్టర్ నెంబర్ 89 /2019,జిల్లా కమిటీ లో మార్పులు చేర్పులు గురించి గత 11 సంవత్సరముల నుండి మంచిర్యాల జిల్లాలో ఈ కమిటీ కొనసాగుచున్నది. దానిలో భాగంగా ఆర్ఎంపి అండ్ పి.ఎం.పి ఐక్యత కొరకు వారి సమస్యలపై పనిచేస్తు,మహాసభలు పెడుతూ,అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, ఆర్ఎంపి మరియు పి.ఎం.పి ల సమస్యల పైన చర్చలు జరిపి మన పరిధి వరకు ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటిస్తూ ప్రాథమిక వైద్యం చేయవలెనని అవగాహన కల్పించడం జరిగినది.అనివార్య కారణాలవల్ల ఈ జిల్లా కమిటీలో మార్పులు చేర్పులు చేయడం జరిగినది ప్రస్తుతం నిర్ణయించిన జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడు దొంతుల మొoడయ్య,ఉపాధ్యక్షుడు శైలేంద్ర రాము చారి,ప్రధాన కార్యదర్శి మేడిపల్లి విజయ్,సహాయ కార్యదర్శి కొయ్యల రాజు, కోశాధికారిగా తంగేళ్లపల్లి రాజేందర్,గౌరవ అధ్యక్షుడు డిఆర్ బెంజిమెన్,ముఖ్య సలహాదారు కుంచాల శంకరయ్య గా నిర్ణయించడం జరిగింది.

టిడిపి నూతన కమిటీ ఎన్నిక.

టిడిపి నూతన కమిటీ ఎన్నిక

పట్టణ అధ్యక్షునిగా చిరురాల రామన్న

పరకాల నేటిధాత్రి:

 

తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు,అరవింద్ కుమార్ గౌడ్,తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త నన్నూరి నర్సిరెడ్డి ఆదేశాల మేరకు పరకాల పట్టణ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.పరకాల పట్టణ కమిటీ అధ్యక్షులుగా చిదురాల రామన్న,ఉపాధ్యక్షులుగా కొత్తపల్లి శంకర్,ప్రధాన కార్యదర్శిగా బోయిని రాజశేఖర్,క్రిస్టఫర్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా మహారాజ్,బేగం,రవీందర్,స్వామి,మంజుల లక్ష్మీలను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంటు అడా కమిటీ కన్వీనర్ అర్షనపల్లి విద్యాసాగర్ రావు,రాష్ట్ర పరిశీలకులు ముంజ వెంకట రాజ్యం గౌడ్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీర రాజు నాయక్,అడా కమిటీ సభ్యులు కందుకూరి నరేష్, లు పాల్గొన్నారు.

ఎంజీఎం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ.!

ఎంజీఎం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడిగా సయ్యద్ మోసిన్

వరంగల్ తూర్పు నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద హాస్పిటల్ అయిన, ఎంజీఎం హాస్పిటల్ నూతన డెవలప్మెంట్ కమిటీ శుక్రవారం హాస్పిటల్ ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎంజీఎం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడిగా వరంగల్ నగరం 25వ డివిజన్ కు చెందిన సయ్యద్ మోసిన్ నియామకం అయ్యారు. శుక్రవారం రోజు ఎంజిఎం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడిగా మోసిన్ ఎంజీఎం ఆస్పత్రి లో ప్రమాణ స్వీకారం చేశారు. తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గోపాల్ నవీన్ రాజ్, స్థానిక కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంజీఎం డెవలప్మెంట్ కమిటీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సయ్యద్ మోసిన్ ను స్థానిక కాంగ్రెస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

అంబేద్కర్ సంఘం నూతన కమిటీ ఎన్నిక.

అంబేద్కర్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొరటపల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్, మాజీ సర్పంచ్ మన్నె దర్శన్ రావు, ఉపాధ్యాయులు మేకల ప్రవీణ్ కుమార్ ల ఆధ్వర్యంలో నూతనంగా అంబేద్కర్ సంఘం కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈయొక్క కమిటీ గౌరవ అధ్యక్షులుగా మన్నె కిషన్ చందర్, కమిటీ సలహాదారునిగా మేకల విజేందర్, అధ్యక్షులుగా మేకల ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి దాసరి రమేష్, ఉపాధ్యక్షులుగా చిలుముల హరీష్, మేకల కిరణ్ లు, కోశాధికారిగా సుమన్, కార్యదర్శిగా మేకల అభిషేక్, జాయింట్ సెక్రెటరీగా రవితేజ, సహాయ కార్యదర్శిగా గడ్డం రాజు, కార్యవర్గ సభ్యులుగా దాసరి సుధీర్ కుమార్, కనకం సతీష్, గుడిసే శ్రీకాంత్, కలిగేటి శ్రీకాంత్, వడ్లూరి మహేష్, మన్నే విక్రం, గోల్కొండ సంతోష్, మేకల విని కుమార్, తదితరులను ఎన్నుకోవడం జరిగింది.

Mekala Praveen Kumar.

ఈసందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ కొరుటపల్లి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయడానికి కలిసికట్టుగా మావంతు కృషి చేస్తామని తెలిపారు.

కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో.!

కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామదేవతలకు పూజలు

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వైశాఖమాసం వసంత రుతువు ఉత్తరాయణం శుక్ల విదియ కృత్తిక నక్షత్రం మంగళవారం పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి నెల నిర్వహించే పూజా కార్యక్రమాల్లో భాగంగా గ్రామ దేవతలకు పంచామృతాలతో అభిషేకం పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా కోట గుళ్ళు ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు గ్రామదేవతలకు హారతి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు నాగపురి శ్రీనివాస్ గౌడ్, కమిటీ సభ్యులు రౌతు కిషోర్, పాణిగంటి గణేష్, తదితరులు పాల్గొన్నారు.

ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సభ్యుల ఎన్నిక.

ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సభ్యుల ఎన్నిక…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి…

ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి స్వామి,సారంగారవు, అమర్నాథ్ రెడ్డి.

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

సంవత్సరానికి ఒకసారి జరిగే ప్రెస్ క్లబ్ ఎన్నికలు గత నెలలో ముగియడంతో ప్రెస్ క్లబ్ క్యాతనపల్లి నూతన కార్యవర్గాన్ని క్లబ్ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ గౌరవ గౌరవ అధ్యక్షులుగా పిలుమాల్ల గట్టయ్య(మెట్రో ఈవినింగ్), గౌరవ సలహాదారులు గా కలువల శ్రీనివాస్ (జర్నలిస్టు దినపత్రిక)ఎన్నికయ్యారు. ప్రెస్ క్లబ్ పూర్వపు అధ్యక్షులు పిలుమాల్ల గట్టయ్య ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు ఆరెంద స్వామి(సిటీ కేబుల్),ప్రధాన కార్యదర్శి ఈదునూరి సారంగారావు (జనం సాక్షి), కోశాధికారి బండ అమర్నాథ్ రెడ్డి(వుదయం )లకు పదవీ బాధ్యతలు అప్పగించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గాంగారపు గౌతమ్ ( ప్రజా పక్షం), ప్రచార కార్యదర్శి ఆరెల్లి గోపి కృష్ణ( మన సమాజం),ఉపాధ్యక్షులు నాంపల్లి గట్టయ్య( నేటి ధాత్రి), ఎం వేణుగోపాల్ రెడ్డి( వాస్తవం), కొండ శ్రీనివాస్ ( మనతెలంగాణ),కార్యనిర్వాహణ కార్యదర్శి పి రాజేంద్ర ప్రసాద్ (తెలంగాణ గళం),సహాయ కార్యదర్శులు ఎన్ శ్రీనాథ్ (సూర్య ) పి గంగులు యాదవ్ (సామాజిక తెలంగాణ) లు నూతనంగా ఎన్నికయ్యారు. క్లబ్ సభ్యులుగా ఎం ప్రవీణ్, కె సదానందం, ఎం రవీందర్, డి స్వామి, డి వెంకటస్వామి లు ఉన్నారు. సమావేశంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం తో పాటు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం తో పాటు పలు అంశాలను చర్చించారు. నూతన కమిటీని శాలువాలతో సత్కరించారు. అనంతరం నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ,కోశాధికారి లు మాట్లాడారు. కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ప్రెస్ క్లబ్ క్యాతనపల్లి ని సమిష్టిగా కలిసి మెలిసి పని చేసి ఆదర్శ ప్రెస్ క్లబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని అన్నారు. ప్రెస్ క్లబ్ నియమనిబంధనలు ప్రతి ఒక్క జర్నలిస్ట్ పాటించాలని, నియమ నిబంధనలు ఎవరు అతిక్రమించినా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని అన్నారు.

సోమశిల పుణ్యక్షేత్రంలో టీ యూ డబ్ల్యూ జె ఐ జే యు.!

సోమశిల పుణ్యక్షేత్రంలో టీ యూ డబ్ల్యూ జె ఐ జే యు రాష్ట్ర కార్యవర్గ సమావేశం

వనపర్తి నేటిదాత్రి :

సోమశిల శివుని పుణ్యక్షేత్రంలో టీ యూ డబ్ల్యూజే ఐ జే యు విలేకరుల సమావేశం
నిర్వహించారు ఈ సమావేశములో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి జాతీయ నాయకులు దేవులపల్లి అమర్ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్ పాల్గొన్నారు . రాష్ట్ర విలేకరుల కమిటీ సోమశీల లో సమావేశం నిర్వహించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి దేవులపల్లి అమర్ ను విలేకరులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే ఐ జే యు మాజీ జాతీయ కౌన్సిల్ సభ్యులు సీనియర్ విలేకరులు మల్యాల బాలస్వామి పోలిశెట్టి బాలకృష్ణ కొంతం ప్రశాంత్ డి మాధవరావు కల్వరాల రాజేందర్ విజయ్ డి మన్యం అంజి వహీద్ నరసింహ రాజు శ్రీనివాసరావు నాకొండ అరుణ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మల్ల రాములు  పాల్గొన్నారు

సిరిసిల్ల జిల్లా (IAP) చిన్నపిల్లల వైద్యుల.!

సిరిసిల్ల జిల్లా (IAP) చిన్నపిల్లల వైద్యుల కార్యవర్గం ఎన్నిక. 

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని పిల్లల వైద్యులు (పీడియాట్రిషియన్లు) ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) రాజన్న సిరిసిల్ల శాఖ కొత్త కార్యవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అధ్యక్షుడిగా డా. నల్ల మధు మరియు జనరల్ సెక్రటరీగా డా. తడుకా సాయికుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రానున్న సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై చర్చలు జరిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రముఖ సీనియర్ పిల్లల వైద్యులు డా. కె ప్రసాద్ రావు, డా. మురళీధర్ రావు, డా. శ్రీనివాస్, డా. సురేంద్రబాబు గారులతో పాటు, ఇతర పీడియాట్రిషియన్లు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా( IAP) రాజన్న సిరిసిల్ల శాఖ సామూహిక కార్యకలాపాల శక్తివంతమైన ఆరంభాన్ని సూచిస్తూ, భవిష్యత్తులో పిల్లల ఆరోగ్య అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించనుంది అని వైద్యులు తెలిపారు.

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ).!

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)కరీంనగర్ నగర నూతనకమిటీఎన్నిక

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

సిపిఐ కరీంనగర్ నగర 11వ మహాసభలో నగర నూతన కమిటీని శుక్రవారం రోజున ఎన్నుకోవడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. సిపిఐ నగర కార్యదర్శిగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులుగా పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, కోశాధికారిగా బీర్ల పద్మలతో పాటు పదకోండు మంది కార్యవర్గ సభ్యులు ఇరవై తోమ్మిది మంది కౌన్సిల్ సభ్యులను నూతనంగా ఎన్నుకోనైనదని వారు తెలిపారు. నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ నగరంలో సిపిఐ పార్టీని వాడవాడనా బలోపేతం చేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ జెండా మున్సిపల్ పై ఎగిరే విధంగా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేస్తామన్నారు. నగరంలో అభివృద్ధి పనుల్లో పూర్తిగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని వీటిపై రానున్న కాలంలో ఉద్యమాలు చేస్తామని వారు పేర్కొన్నారు. నగరంలో వేలాది మంది ప్రజలు ఇండ్లు లేక కిరాయి ఇండ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇండ్లులేని నిరుపేదలకు ఇండ్లు వచ్చేంతవరకు పోరాటాలు చేస్తామని, రేషన్ కార్డులు,పెన్షన్లు ఇతర సంక్షేమ పథకాలన్నీ పేద ప్రజలకు అందేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్నికకు సహకరించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామికి ధన్యవాదాలు తెలియజేశారు.

అంబెడ్కర్ జయంతి వేడుకలు. 

సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో అంబెడ్కర్ జయంతి వేడుకలు. 

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితి సమితి అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్య నిర్వహణలో లక్ష్మణ్ ప్రింటర్స్ లో 11 గంటలకు అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి .అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ రచనల్లో ప్రధాన పాత్ర వహించిన డాక్టర్ అంబేద్కర్ సేవలు ఎనలేనివి. దేశ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచన చేసిన భారతరత్న బాటలో అందరం కలసి నడుద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, సహధ్యక్షులు కోడం నారాయణ, ఉపాధ్యక్షులు బూర దేవానందం, ముడారి సాయి మహేష్, గుండెల్ని వంశీ, దొంత దేవదాసు ,సిరిసిల్ల తిరుపతి, అంకారపు రవి కవులు, రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

క్రమశిక్షణ కమిటీ చైర్మన్ సంకా నారాయణ.

పి ఆర్ టి యు ఎన్నికల క్రమశిక్షణ కమిటీ చైర్మన్ సంకా బద్రి నారాయణ నియామకం

మహబూబాబాద్/ నేటి ధాత్రి

 

 

పి ఆర్ టి యు టి ఎస్ ఎన్నికల క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా పి ఆర్ టి యు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సంకా బద్రినారాయణ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్ రెడ్డి, ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసిన పి ఆర్ టి యు మండల శాఖ అధ్యక్షులు భూక్యా రామోజీ నాయక్ మరియు మండల ప్రధాన కార్యదర్శి కాపర బోయిన సుజాత మరియు జిల్లా రాష్ట్ర బాధ్యులు. మరియు ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కి రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణ్ కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు.

శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నూతన కమిటీ ఎన్నిక.

శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నూతన కమిటీ ఎన్నిక. 

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కేంద్రంలో నూతన హనుమాన్ సేవ కమిటీ అధ్యక్షులుగా చిలువేరి కనకయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా కడారి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా సముద్రాల రమేష్, క్యాషియర్ గా జవ్వాజి అజయ్, కమిటీ మెంబర్ లుగా బొజ్జ తిరుపతి, నీలం ప్రశాంత్, మాడిశెట్టి జయంత్, మండల లక్ష్మణ్, మూల వంశీ, పూరెల్ల రాహుల్, చిట్యాల కమలాకర్, చిట్యాల శివకుమార్, మాడిశెట్టి శ్రీసాయి, బాసరవేణి కళ్యాణ్, కీర్తి కుమార్, బొమ్మరవేణి శ్రీనివాస్ ఈరెళ్ళ అంజయ్య, బసవేణి మధు, ఒంటెల ఆదిత్య రెడ్డి, మామిడి రాజకుమార్, తదితరులను ఎన్నుకున్నారు.

దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన,.!

దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన, శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయ నూతన కమిటీ చైర్మన్ గా ఎన్నికైన ఎ. చంద్రశేఖర్ పాటిల్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న

★ జహీరాబాద్ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్ గారు
★ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఎ చంద్రశేఖర్ గారు

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండల కేంద్రంలో నెలకొన్న శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయ నూతన కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని ఛైర్మెన్ మరియు కమిటీ సభ్యులు సత్కరించిన జహీరాబాద్ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్, మరియు మాజీ మంత్రివర్యులు డాక్టర్ చంద్రశేఖర్.మరియు వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ఎల్లవేళలా అండగ ఉండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం అని పేర్కొన్నారు.

Sangameshwara Temple.

 

అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి,ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా గ్రంథయాల చైర్మన్ అంజయ్య ,మాజీ జిల్లా పరిషత్ ఛైర్మెన్ సునీతా పాటిల్ , జహీరాబాద్ నియోజకవర్గ మండలాల అధ్యక్షులు హన్మంతరావు పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,రామలింగారెడ్డి, కండేం నర్సింలు ,మాక్సూద్,నర్సాసింహ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ,మాజీ ఇండస్ట్రియల్ ఛైర్మెన్ తన్వీర్, మాజీ ఎంపిపి దేవదాస్ గారు,మాజీ ఎంపిటిసిలు అశోక్ ,శంకర్ పాటిల్,వైస్ ఎంపిపి షాకిర్ , కాగ్రెస్ నాయకులు హుగ్గేలి రాములు,యువజన జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, మాజీ యువజన జిల్లా అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్,మరియు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తథిదరులు పాల్గొన్నారు.

ఆహ్వాన పత్రిక ఆవిష్కరిస్తున్న కమిటీ సభ్యులు.

ఆహ్వాన పత్రిక ఆవిష్కరిస్తున్న కమిటీ సభ్యులు

విగ్రహప్రతిష్ట ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

-యాదవుల కులదేవతకు నూతనఆలయ నిర్మాణం

-గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన

-భక్తులు భారీగా హాజరుకావాలి: ఆలయ కమిటీ సభ్యులు.

మరిపెడ నేటిధాత్రి.

 

 

యాదవుల కులదేవత ఇంటి ఇలవేల్పు శ్రీశ్రీగంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో భక్తులు భారీగా పాల్గొనాలని రాంపురం శ్రీశ్రీగంగమ్మ తల్లి ఆలయ కమిటీ యాదవ కుల సంఘ పెద్దలు భక్తులను కోరుతున్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీగంగమ్మ తల్లి ఆలయంలో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రిక ను ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 9 నుండి 13వ తారీకు వరకు వేద పండితులు బ్రహ్మశ్రీ అప్పి రవిశంకర్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులతో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవములు నిర్వహించడం జరుగుతుందని, ఏప్రిల్ 9న విగ్రహాల ఊరేగింపు, ఏప్రిల్ 11న గణపతి పూజ,హోమాలు మొదలైన పూజా కార్యక్రమాలు, ఏప్రిల్ 12న స్థాపిత దేవత హవానములు, రుద్ర దుర్గా హోమాలు, కలన్యాస వాహనము, ధాన్యాది,పుష్పాది,ఫలాది, శయ్యది వాసములు, షోడ, శోపచార పూజ, మంత్ర పుష్పము తీర్థప్రసాద వితరణ ఉంటాయని, ఏప్రిల్ 13 ఆదివారం చైత్ర బహుళ పాడ్యమి రోజున ఉదయం 8 గంటల 31 నిమిషములకు చిత్త నక్షత్ర యుక్త వృషభ లగ్న సుముహూర్తములో యంత్ర విగ్రహ ప్రతిష్ట, బలి ప్రధానము, అవృదస్థానము నేత్ర దర్శనము వేద పండితులచే ఆశీర్వచనము ఉంటాయని తెలిపారు. కావున ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు నియమ నిష్ఠలతో వచ్చి గంగమ్మ తల్లిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు యాదవ కుల సంఘ పెద్దలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటీసీ కొమ్ము నరేష్,కొమ్ము చంద్రశేఖర్,కోడి శ్రీకాంత్,వల్లపు లింగయ్య, కొమ్ము లింగయ్య,కొమ్ము ఉప్పలయ్య, కొమ్ము ఐలయ్య,కోడి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

భక్తాంజనేయ స్వామి ఆలయకమిటీ చైర్మన్ గా.!

భక్తాంజనేయ స్వామి ఆలయకమిటీ చైర్మన్ గా అంబీరు మహేందర్ ప్రమాణ స్వీకారం

 

పరకాల నేటిధాత్రి

మండల పరిధిలోని మల్లక్కపేట గ్రామంలో బుధవారం రోజున ఉదయం 9:45 నిమిషాలకు శ్రీ భక్తాంజనేయ స్వామి పాలకవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.మల్లక్కపేట గ్రామానికి చెందిన అంబీరు మహేందర్ ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పరకాల మండల మరియు పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు,జడ్పిటిసిలు,ఎంపీపీలు,ఎంపీటీసీలు సర్పంచులు,వార్డ్ మెంబర్లు మరియు పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్,డైరెక్టర్స్, పిఎసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్,కౌన్సిలర్స్ పరకాల మండల మరియు పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు,కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ మహిళా కాంగ్రెస్ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావలని అంబీరు మహేందర్ కోరారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత.

సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం బదనపల్లి గ్రామంలో సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి వాటి ఆరోగ్యాల గురించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల పశువులకు పాల దిగుబడి తగ్గకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అలాగే ఆసుపత్రులు అందుబాటులో లేని గ్రామాలకు మార్కెట్ కమిటీ ద్వారా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని అలాగే గర్భకోశ వ్యాధులు ఎక్కువగా ఎదురవుతున్నందున రైతులు ఎప్పటికప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో పశువులకు వైద్యం నిర్వహించాలని సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నందున బొత్త వాపు గాని జబ్బ వాపు గాని రావడం జరుగుతుందని సీజన్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వ్యాక్సిన్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉందని రైతులు పశువులపై ప్రత్యేక దృష్టి కేటాయించి ఇటువంటి వైద్య శిబిరాలకు తీసుకువచ్చి తగిన వైద్యం తీసుకోవాలని రైతులకు సూచించారు అలాగే గ్రామంలో రైతులందరికీ పశువులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారుఇట్టి ఉచిత పశు వైద్య శిబిరంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల స్వరూప తిరుపతిరెడ్డి వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహ గౌడ్ డైరెక్టర్లు నక్క నరసయ్య దుబాల వెంకటేశం భరత్ గౌడ్ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

టీఆర్పీఎస్ మండల కార్య వర్గం ఎన్నిక.

టీఆర్పీఎస్ మండల కార్య వర్గం ఎన్నిక

శాయంపేట నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం(టీఆర్పీఎస్ ) మండల కార్యవర్గాన్ని గురువారం మండల కేంద్రంలోని చేనేత సహకార సొసైటీలో ఎన్ను కున్నారు.

మండల అధ్యక్షుడి గా సామలమధుసూదన్ ఇటీవల ఎన్నిక కాగా, గౌరవ అధ్యక్షులుగా వావిలాల వేణుగోపాల్ ప్రసాద్, కందగట్ల ప్రకాష్, ఉపాధ్యక్షులుగా బాసని చంద్రమౌళి, గుర్రం అశోక్, ప్రధాన కార్యదర్శి సామల రవీందర్, కోశాధికా రిగా రంగు శ్రీధర్, సహాయ కార్యదర్శులు బడుగు రవీందర్, బాసని సదాశివుడు, కార్యనిర్వాహకులు బాసని నాగభూషణం, సోషల్ మీడియా ఇంచార్జిలు బడుగు అశోక్, దాసి శ్రావణ్ కుమార్, ముఖ్య సలహాదారులు పల్నాటి జలేందర్, బాసని లక్ష్మీ నారాయణ, బూర ఈశ్వరయ్య, సామల మల్లయ్య, బాసని కుమార స్వామిలు ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు రాష్ట్రనాయకుడు బాసని చంద్ర ప్రకాష్ వెల్లడించారు.

ఈ సందర్భంగా చంద్రప్రకాశ్ పాటు పలువురు నూతన కార్యవ ర్గానికి శుభాకాంక్షలు తెలిపి, గ్రామాలలో సంఘసభ్యత్వా లు చేయించాలని సభ్యత్వ పుస్తకాలను గ్రామ కమిటీలకు అందజేశారు. పద్మశాలి సంఘం సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు.

మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు పశువులకు వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని పశువులకు ఇచ్చే వ్యాక్సినేషన్ సకాలంలో ఇప్పించి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా చింత వైద్య శిబిరంలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ నర్సింగ్ గౌడ్ డైరెక్టర్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు

ఐకె 1ఎ గనిని సందర్శించిన ఏఐటియుసి గుర్తింపు సంఘం నాయకులు.

ఐకె 1ఎ గనిని సందర్శించిన ఏఐటియుసి గుర్తింపు సంఘం నాయకులు

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్ లోని ఇందారం 1ఎ గని లో ఏఐటియుసి కార్మిక నేతలు సందర్శించారు.శనివారం గనిలోని అన్ని విభాగాల కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కార్మికులు ఎదుర్కొనే పలు సమస్యలను పరిష్కరించాలని గని మేనేజర్ దృష్టికి తీసుకెళ్లి చర్చించారు.వారు సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ సందర్భంగా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కంది కట్ల వీరభద్రయ్య మాట్లాడుతూ పని ప్రదేశాల్లో రక్షణ పరికరాలు,పనిముట్లు అందుబాటులో ఉంచాలని,వేసవికాలం ముందస్తు చర్యలు తీసుకోవాలని, వాహనాల పార్కింగ్ కోసం షెడ్లు ఏర్పాటు చేయాలని,ఓసి లోని పలు సమస్యలు పరిష్కరించాలని వివిధ అంశాలపై మేనేజర్ తో చర్చించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కె బాబా సైదా,సహాయ కార్యదర్శి మోత్కూర్ కొమరయ్య,ఫిట్ కార్యదర్శి నవీన్ రెడ్డి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అప్రోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version