జిల్లా కమిటీలో మార్పులు చేర్పులు.

జిల్లా కమిటీలో మార్పులు చేర్పులు

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

తెలంగాణ ఆర్ఎంపి అండ్ పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా కమిటీ రిజిస్టర్ నెంబర్ 89 /2019,జిల్లా కమిటీ లో మార్పులు చేర్పులు గురించి గత 11 సంవత్సరముల నుండి మంచిర్యాల జిల్లాలో ఈ కమిటీ కొనసాగుచున్నది. దానిలో భాగంగా ఆర్ఎంపి అండ్ పి.ఎం.పి ఐక్యత కొరకు వారి సమస్యలపై పనిచేస్తు,మహాసభలు పెడుతూ,అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, ఆర్ఎంపి మరియు పి.ఎం.పి ల సమస్యల పైన చర్చలు జరిపి మన పరిధి వరకు ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటిస్తూ ప్రాథమిక వైద్యం చేయవలెనని అవగాహన కల్పించడం జరిగినది.అనివార్య కారణాలవల్ల ఈ జిల్లా కమిటీలో మార్పులు చేర్పులు చేయడం జరిగినది ప్రస్తుతం నిర్ణయించిన జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడు దొంతుల మొoడయ్య,ఉపాధ్యక్షుడు శైలేంద్ర రాము చారి,ప్రధాన కార్యదర్శి మేడిపల్లి విజయ్,సహాయ కార్యదర్శి కొయ్యల రాజు, కోశాధికారిగా తంగేళ్లపల్లి రాజేందర్,గౌరవ అధ్యక్షుడు డిఆర్ బెంజిమెన్,ముఖ్య సలహాదారు కుంచాల శంకరయ్య గా నిర్ణయించడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version