ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి( సి ఎం ఆర్ ఎఫ్ )..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-24T143753.341.wav?_=1

 

ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి( సి ఎం ఆర్ ఎఫ్ )

◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ : పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ యన్.గిరిధర్ రెడ్డి నివాసంలో బుధవారం జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన 19 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్( సి ఎం ఆర్ ఎఫ్ ) చెక్కులను తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు.
-:లబ్ధిదారులు:- రాజు మైకలి-47,500/- ఎండీ సోహైల్ షా-25,000/- అబ్దుల్ నబీ-27,000/- కళ్యాణ్ ఉమాదేవి-60,000/- దామావతి-60,000/- వోతి శ్రీనివాస్-29,500/- ఎస్ మహేష్ కుమార్-60,000/- దోమల రమేష్-60,000/- పర్వీన్ బేగం-35,000/- చౌహాన్ రవీందర్-50,000/- బేగరి దశరథ్-50,000/- బి.నవాబ్ మియా-24,000/- ఎండీ షాబుద్దీన్-60,000/- ఎదిగి దత్త గౌడ్-30,000/- ఎన్ అశ్వని-30,500/- ఎన్ అశ్వని-30,500/- పవార్ రేణుకా బాయి-20,000/- మంగలి సురేష్-60,000/- తలారి బిక్షపతి-55,000/- మొత్తం = 1,053,500/- ఈ సందర్భంగా యన్.గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.ఈ సహాయ నిధి చెక్కుల మంజూరు కై కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారికి,సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి చెక్కులు పొందిన లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రాంలింగా రెడ్డి,సిడిసి చైర్మన్ ముబీన్,మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి,మాజీ వైస్ యం.పి.పి వి.రాములు,డిసిసి ఉపాధ్యక్షుడు ముల్తాని,మైనార్టీ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భీమయ్య నర్సింహారెడ్డి,ప్రతాప్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి,కిరణ్ గౌడ్ జగదీశ్వర్ రెడ్డి మల్లికార్జున్ నర్సింహులు ఇమామ్ పటేల్,హన్మంత్ రెడ్డి బర్కత్ మరియు కౌన్సిలర్లు మాజీ సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లబ్దిదారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version