మాదన్నపేట చెరువుకట్టపై విద్యుత్ పనుల ప్రారంభం

మాదన్నపేట చెరువు కట్టపై విద్యుత్ లైన్ పనుల ప్రారంభం

నర్సంపేట, నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట చెరువు కట్టపై శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం నుండి కంఠ మహేశ్వర స్వామి ఆలయం వరకు నూతన ఎల్.టి విద్యుత్ లైన్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. 16వ వార్డు కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్, 1వ వార్డు కౌన్సిలర్ కొత్తకొండ మేఘన శ్యామ్ రాజ్ ముఖ్య అతిథులుగా హాజరై పనులను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ… మాదన్నపేట, నాగూర్లపల్లి, పర్ష నాయక్ తండా గ్రామ ప్రజల దశాబ్దాల కాలం నాటి సమస్యకు నేటితో శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. ప్రతి ఏటా ఇక్కడ జరిగే మహా శివరాత్రి ఉత్సవాలకు విద్యుత్ దీపాలు లేకపోవడం వల్ల, భక్తులు చీకట్లోనే తీవ్ర ఇబ్బందులు పడేవారని గుర్తుచేశారు.ఈ ఎల్.టి లైన్‌ ను కంఠమహేశ్వర స్వామి ఆలయం వరకు మంజూరు కొరకు మాదన్నపేట, నాగూర్లపల్లె గౌడ సంఘాల కృషి ఎంతో అభినందనీయమని వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ జిసిసి డైరెక్టర్ కొర్ర రాజన్న నాయక్, మాజీ ఎంపిటిసి మచ్చిక నరసయ్య, గౌడ సంఘం నాయకులు గాదుగోని సుదర్శన్, వేముల చంద్రమౌళి గౌడ్, నాతి శ్రీను, మేడేపల్లి ప్రసాద్, మచ్చిక సతీష్, పల్లె ప్రశాంత్, తనుగుల విష్ణు, నాతి రమేష్, ఎన్పీడీసీఎల్ లైన్ మాన్ విష్ణు, జూనియర్ లైన్మెన్ ప్రశాంత్, హెల్పర్ రాజేష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version