ఎల్ నినో నీడలో మనిషి

ఎల్ నినో నీడలో మనిషి— మంజుల పత్తిపాటి.
——————————- ————————-

అడవుల గుండెలో గొడ్డలి గాయంతో
స్వచ్చమైన చల్లని గాలి ఆవిరి అయిపోయింది..!
కాలుష్యపు పొగలు ఎగసి
పక్షుల పాటల మాధుర్యం
మాయమైపోయింది..!

పచ్చదనం పెరిగితే చల్లని రేపు వస్తుంది అని
గ్రహించలేకపోతున్నాం..!
పచ్చని పంట పొలాలను వెంచర్లు చేస్తూ…
నేలతల్లి శరీరానికి తూట్లు పొడుస్తున్నాం
అని గ్రహించలేకపోతున్నాం..!

ఎల్ నినో ప్రకృతి శ్వాసలో పుట్టిన అలజడే
కాని .. మన పాపాల వేడితో అది ప్రళయగర్జనయి
మన మీదకు వస్తుంది..!
ఒక వైపు ఎండల తుపాను నేలని కాలుస్తుంటే…
మరో వైపు వరదల రాక్షసి ఊర్లను ముంచేస్తుంది
ఇది ప్రకృతి కోపం కాదు మనం చేసిన పాపం
ప్రళయగర్జనయి మన మీదకు వస్తుంది..!

కాబట్టి ఇప్పటికైనా మేలుకో మనిషీ…
ఒక మొక్క నాటు…
భూమి నవ్వేలా ప్రేమతో మొక్కను కాపాడి…
బావితరాల భవిష్యత్తును నిలబెట్టు..!

రచన: మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
 చరవాణి 9347042218.

ఈ నెలలో భగభగలే..

ఈ నెలలో భగభగలే!

రాష్ట్రంలో ఈ వేసవి సీజన్‌ మొత్తం ఎండ మంట పుట్టించనుంది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు పగటి ఉష్ఱోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. ఈ మూడు నెలల్లో ఎక్కువ రోజులు వడగాడ్పులు వీయనున్నాయి.

కాంగ్రెస్‌తో స్నేహంగా ఉన్నా ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు: కూనం

 

చట్టబద్ధం.. కట్టుదిట్టం!

సమాధానం చెప్పేందుకు అసెంబ్లీకి రావాలా?

పోలవరానికి 1301 కోట్లు

ట్యాంక్‌బండ్‌ శివకు రూ.5లక్షల సాయం

ఉమ్మీద్‌ పోర్టల్‌లో నూతన మాడ్యూల్స్‌

పొంగులేటిపై తప్పుడు ఆరోపణలా?

డిమాండ్‌ లేని సమయంలో యూనిట్‌కు 50 పైసలు రాయితీ!

నేతన్నకు ‘పవర్‌’ గిఫ్ట్‌

నేటి నుంచి నల్లమల సలేశ్వరంలో జాతర

ఐదేళ్ల చిన్నారి అసభ్య దృశ్యాల చిత్రీకరణ

బాలుడిపై లైంగిక దాడి, వేధింపులు

ఉరేసుకున్న భర్త..17వ అంతస్తు నుంచి దూకేసిన భార్య

కాంగ్రెస్‌తో స్నేహంగా ఉన్నా ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు: కూనం

చట్టబద్ధం.. కట్టుదిట్టం!

సమాధానం చెప్పేందుకు అసెంబ్లీకి రావాలా?

పోలవరానికి 1301 కోట్లు

ట్యాంక్‌బండ్‌ శివకు రూ.5లక్షల సాయం

ఉమ్మీద్‌ పోర్టల్‌లో నూతన మాడ్యూల్స్‌

పొంగులేటిపై తప్పుడు ఆరోపణలా?

డిమాండ్‌ లేని సమయంలో యూనిట్‌కు 50 పైసలు రాయితీ!

నేతన్నకు ‘పవర్‌’ గిఫ్ట్‌

నేటి నుంచి నల్లమల సలేశ్వరంలో జాతర

ఐదేళ్ల చిన్నారి అసభ్య దృశ్యాల చిత్రీకరణ

బాలుడిపై లైంగిక దాడి, వేధింపులు

ఉరేసుకున్న భర్త..17వ అంతస్తు నుంచి దూకేసిన భార్య

  • వడగాడ్పులూ ఎక్కువే.. వర్షాలు కూడా..
  • నైరుతి సీజన్‌ ప్రారంభం నుంచే ఎల్‌నినో
  • రానున్న 3 నెలలకు ఐఎండీ బులెటిన్‌ విడుదల

 రాష్ట్రంలో ఈ వేసవి సీజన్‌ మొత్తం ఎండ మంట పుట్టించనుంది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు పగటి ఉష్ఱోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. ఈ మూడు నెలల్లో ఎక్కువ రోజులు వడగాడ్పులు వీయనున్నాయి. ఏప్రిల్‌లో సగటున మూడు, నాలుగు రోజులు, మే, జూన్‌ నెలల్లో పది, అంతకంటే ఎక్కువ రోజులు వడగాడ్పులు వీస్తాయి. రాత్రి వాతావరణం కూడా వేడిగానే ఉండనుంది. రానున్న మూడు నెలలకు దేశంలో వాతావరణ పరిస్థితులు, ఎండలు, వడగాడ్పులు, వర్షాలపై మంగళవారం భారత వాతావరణ శాఖ(ఐఎండీ) బులెటిన్‌ విడుదల చేసింది. వచ్చే మూడు నెలలు రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారే అవకాశం ఉంది. ఏపీతోపాటు ఒడిశా, తెలంగాణలో కొంత భాగం, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, యూపీ, ఈశాన్య రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదుకానున్నాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా అంతకంటే తక్కువగా నమోదవుతాయి.

దేశంలోని 95 శాతం ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదవుతాయి. ఎక్కువ రోజులు వడగాడ్పులు వీస్తాయి. ఏప్రిల్‌లో రాష్ట్రంలోని గోదావరి జిల్లాలు తప్ప మిగిలిన ప్రాంతాల్లో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదవుతాయి. ఇక ఏప్రిల్‌లో ఈశాన్య రాష్ట్రాలు తప్ప దేశంలోని అనేక ప్రాంతాల్లో సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకానుంది. మార్చిలో సాధారణ వర్షపాతం 29.9 మిల్లీమీటర్లకుగాను 33.7 మిల్లీమీటర్లు నమోదైంది. 1901 నుంచి ఇప్పటి వరకు మార్చిలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోద వడం ఇది 32వ సారి.

చివరిదశకు లానినా..

పసిఫిక్‌ మహాసముద్రంలో లానినా చివరిదశకు చేరుకుంది. కొద్దిరోజుల్లో తటస్థ పరిస్థితులకు చేరుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ మోడల్స్‌ వెల్లడిస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు తటస్థ పరిస్థితులు కొనసాగుతాయని, జూన్‌(నైరుతి రుతుపవనాల ప్రారంభం) నుంచే ఎల్‌నినో మొదలవుతుందని ఐఎండీ అంచనా వేసింది. జూన్‌ నుంచి ఆగస్టు వరకు ఎల్‌నినో బలపడడానికి 62 శాతం అవకాశాలు ఉన్నాయని, ఈ ఏడాది చివరి వరకు ఎల్‌నినో కొనసాగుతుందని పేర్కొంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version