మున్సిపాలిటీ కార్మికులతో సమానంగా వేతనాలు చెల్లించాలి…

మున్సిపాలిటీ కార్మికులతో సమానంగా వేతనాలు చెల్లించాలి

మున్సిపాలిటీ కమిషనర్ కు వినతి పత్రం

10 వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట విలీన గ్రామాల కార్మికులను మున్సిపాలిటీ కార్మికులుగా గుర్తించి, మున్సిపాలిటీ కార్మికులకు చెల్లిస్తున్న వేతనాలతో పాటు చెల్లించాలని 10 వార్డ్ కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ అన్నారు.విలీన గ్రామాల కార్మికులతో కలిసి మున్సిపల్ కమిషనర్ గురువారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 2025 ఫిబ్రవరి 6 తేదీన 8 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుండి నర్సంపేట మున్సిపాలిటీ విలీనమైన 8 గ్రామల కార్మికులు 36 మంది గత సంవత్సర కాలంగా నర్సంపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు, విలీనం చేసిన 8 గ్రామల కార్మికులకు మున్సిపాలిటీ కార్మికులకు చెల్లిస్తున్న 16,600 వేతనాన్ని చెల్లించపోవడం దారుణమని అన్నారు.గత సంవత్సరకాలంగా చేస్తున్నది మున్సిపాలిటీ పని అయినప్పటికీ మున్సిపాలిటీ కార్మికులగా గుర్తించకుండా పంచాయతీ కార్మికులకు చెల్లిస్తున్న వేతనాలు చెల్లించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యను పరిష్కరించాలని 36 మంది కార్మికులు అనేకసార్లు మున్సిపల్ కమిషనర్ కు విన్నవించిన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వివరించడం సరికాదన్నారు.కొంతమంది మున్సిపాలిటీ అధికారులు మీకు జీతాలు పెంచే ప్రయత్నం చేస్తానని కార్మికుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి అవినీతికి పాల్పడడం సిగ్గుమాలిన చర్యఅని ఎద్దేవా చేశారు.ఇప్పటికైనా విలీన గ్రామాల కార్మికులను మున్సిపాలిటీ కార్మికులతో సమానంగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు 16600 జీతాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మున్సిపాలిటీ కార్మికుల సౌకర్యాలు అమలు చేయకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కార్మికులు ఎండీ యాకుబ్, నర్రా కృష్ణ,కొర్ర వీరన్న,నల్ల మహేందర్, ముత్తినేని రమేష్,పోలబోయిన శ్రీను,బొల్ల పరాశరములు,కల్వచర్ల రమణాచారి, జెట్టబోయిన మల్లయ్య కుమ్మరి రాజు తదితరులు పాల్గొన్నారు.

పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి…

పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి

నిజాంపేట: నేటి ధాత్రి

 

గ్రామంలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు గ్రామ సర్పంచ్ పొన్నబోయిన ప్రవీణ్ తెలిపారు. నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో గురువారం పారిశుద్ధ్య కార్మికులు మురికి కాలువలో గల మురికిని తీసేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు నేపథ్యంలో.. వ్యాధులు ప్రభలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాత్రిపూట దోమలకు పొగ వెయ్యడం జరుగుతుందన్నారు.

రాంపూర్ లో ఉచిత పశు వైద్య శిబిరం…

రాంపూర్ లో ఉచిత పశు వైద్య శిబిరం

నిజాంపేట: నేటి ధాత్రి

 

నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ పొన్నబోయిన ప్రవీణ్, జిల్లా పశు వైద్య గణనభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో పాడి పశువులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్య అధికారి మణికుమార్ మాట్లాడుతూ.. గర్భ కోశ వ్యాధి నివారణ వ్యాధి టీకాలు రైతులు పశువులకు వేయించాలన్నారు. 90 రోజుల ఎద లక్షణాలను గుర్తించి గోపాల మిత్ర ద్వారా కృత్రిమ గర్భాదారణ చేయించుకోవాలని రైతులకు సూచించారు. 15 రోజుల తర్వాత ఆరు నెలల వరకు నట్ట నివారణ మందులు వాడాలన్నారు.

అగ్ని ప్రమాదంలో వస్తువులు ఇల్లు దహనం….

అగ్ని ప్రమాదంలో వస్తువులు ఇల్లు దహనం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం ప్రకారం తంగళ్ళపల్లి మండలంలోని ఇందిరా నగర్ కాలనీలో వానరాశి. శ్రీనివాస్. అనే వ్యక్తికి చెందిన ఇంటిలో అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం ఇంటిలోని రిఫ్రిజిరేటర్ పెళ్లి అగ్గి ప్రమాదం జరిగినట్టు ఆనవాళ్లు ఉన్నాయని ఇంటి వారు తెలియజేశారు అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఇంటిలో ఎవరూ లేరని ఈ సందర్భంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇంటిలోని వస్తువులన్నీ కాలి.పోయాయని అలాగే ఇంటిలో 90 వేల నగదు కూడా .కాలిపోయినట్లు. ఇంటి వారు తెలిపారని తెలియజేయడం జరిగిందని. ఇంటిలో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు అనుమానం ఉందని వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పి ఎటువంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు అగ్నిప్రమాద సంఘటనపై పూర్తి వివరాలు సేకరించి తగిన దర్యాప్తు చేపడుతామని సంబంధిత అధికారులు పోలీసులు తెలియజేశారు

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎంపీ కావ్య..

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎంపీ కావ్య

భూపాలపల్లి నేటిధాత్రి

 

రేగొండ మండలం, కొడవటంచ గ్రామంలో ఈ నెల 21వ తేదీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము పున:ప్రతిష్ఠాపన నేపథ్యంలో గురువారం ఆలయానికి చేరుకున్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తో కలిసి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ… రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని తెలంగాణలో రెండవ యాదాద్రిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 12.15 కోట్ల భారీ నిధులతో పునరుద్ధరణ పనులు చేపట్టిందన్నారు. ఇటీవల ఫిబ్రవరి 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అభివృద్ధి పనులను, అతిథి గృహాన్ని ప్రారంభించారని తెలిపారు. యాదాద్రి తరహాలో కొడవటంచను తీర్చిదిద్ది, గ్రామీణ పర్యాటక రంగాన్ని, ఆర్థిక ప్రగతిని పెంపొందించడం ప్రభుత్వ లక్ష్యం అని ఎంపీ డా.కడియం కావ్య స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాయినేని సంపత్ రావు, మాజీ వరంగల్ డిసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ – వరద రాజేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శివాజీ జయంతి వేడుకల్లో గజవాడ లావణ్య సత్కారం..

శివాజీ జయంతి వేడుకల్లో గజవాడ లావణ్య సత్కారం..

రామాయంపేట ఫిబ్రవరి 19 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో గురువారం నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు చత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్యకు నిర్వాహకులు సత్కారం నిర్వహించారు.
జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ నవనీతతో పాటు పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, దేశభక్తి, పరిపాలనా నైపుణ్యం నేటి తరానికి ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. సమాజంలో స్వాభిమానం, స్వాతంత్ర్య భావాలు పెంపొందించడంలో శివాజీ పాత్ర చిరస్మరణీయమని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా గజవాడ లావణ్య మాట్లాడుతూ, శివాజీ చూపిన స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పట్టణాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం మున్సిపాలిటీ కృషి చేస్తోందని తెలిపారు. యువత శివాజీ ఆదర్శాలను ఆచరణలో పెట్టాలని సూచించారు.
కార్యక్రమం ముగింపులో శివాజీ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సి లర్లు గజవాడ నాగరాజు. దేవుని రంజిత్. రవి.డాకి స్వామి. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి. చింతల యాదగిరి. ఎనీశెట్టి అశోక్. రాధా కిషన్ బొందుగుల రాజు. తదితరులు పాల్గొన్నారు.

నల్లగండ్లలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు…

నల్లగండ్లలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
​ శివాజీ మహారాజ్ పరాక్రమం అందరికీ స్ఫూర్తిదాయకం: పల్లపు సురేందర్

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి

నల్లగండ్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లపు సురేందర్ ఆధ్వర్యంలో స్వరాజ్య స్థాపకుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​ఈ సందర్భంగా పల్లపు సురేందర్ మాట్లాడుతూ.. హిందూ ధర్మ రక్షకుడిగా, అపార ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిన శివాజీ మహారాజ్ దేశభక్తి మనందరికీ ఆదర్శమని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ముఖ్యంగా యువత శివాజీ జీవితం నుంచి స్ఫూర్తి పొంది సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, ధైర్యం కలిగిన సమాజం కోసమే శివాజీ నిరంతరం శ్రమించారని ఆయన గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో నల్లగండ్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు…

ఘనంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు :

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ యువజన సభ్యులకు శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకి కాళీ స్థలాన్ని ఇవ్వాలని కోరిన ఛత్రపతి శివాజీ మహరాజ్ యువజన సభ్యుల కోరికమేరకు గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ గ్రామకంఠంలోని కొంత కాళీ స్థలాన్ని కొల్లూరు గ్రామ పంచాయతీ అధ్వర్యం లో ఇవ్వడం జరిగింది…ఈ రోజు శివాజీ మహరాజ్ జయంతి సందర్బంగా కాళీ స్థలంలో శివాజీ మహారాజ్ జెండాను ఎగురవేసి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు…ఈ కార్యక్రమములో మాజీ ఎంపీటీసీ రాజ్‌కుమార్, గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్, మాజీ వార్డు సభ్యులు ఎం విష్ణు గ్రామ పెద్దలు మంగలి మొగులయ్య, చింతలగట్టు మొగులయ్య, డప్పూరు రాములు, డప్పూరు బీరప్ప మరియు శివాజీ మహారాజ్ యువజన సంఘ అధ్యక్షులు మరియూ నాయకులు,సభ్యులు యువకులు పాల్గొని శివాజీయహరాజ్ విగ్రహానికి పూలమాల వేసి పూజ చేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఛత్రపతి శివాజీ విగ్రహానికి భూమి పూజ, శోభయాత్ర…

ఛత్రపతి శివాజీ విగ్రహానికి భూమి పూజ, శోభయాత్ర

నిజాంపేట: నేటి ధాత్రి

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకొని నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో శివాజీ విగ్రహానికి భూమి పూజ , శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శివాజీ హిందూ మత స్థాపన కోసం పోరాటం చేసిన మహా యోధుడని కొనియాడారు. శివాజీ సేవలు మాటల్లో చెప్పలేనివని కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్, ఉప సర్పంచ్ దేవరాజ్ యాదవ్, మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, వార్డ్ సభ్యులు, చత్రపతి శివాజీ సభ్యులు, గ్రామ పెద్దలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

మున్సిపల్ కమిషనర్ ని కలిసిన నూతన బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ లు….

మున్సిపల్ కమిషనర్ ని కలిసిన నూతన బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ లు*

జహీరాబాద్ నేటి ధాత్రి:

రంజాన్ పండగ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు గారి ఆదేశాల మేరకు ప్రజల సౌకర్యార్థం పట్టణంలో తగు ఏర్పాట్లు చేయాలని ,ముఖ్యంగా ప్రార్థన మందిరాల వద్ద పరిశుభ్రత,స్ట్రీట్ లైట్ లు,రోడ్లు యొక్క మరమత్తులు ,ప్రతి రోజు త్రాగు నీరు సరఫరా, పండగ రోజు ఈద్గా వద్ద భద్రత ఏర్పాట్లకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు నూతన బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ లు మున్సిపల్ కమిషనర్ గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు 4వ వార్డ్ కౌన్సిలర్ స్వప్న – ప్రవీణ్ కుమార్ ,5వ వార్డ్ కౌన్సిలర్ ప్రేమలత శంకర్ రెడ్డి, 9వ వార్డ్ కౌన్సిలర్ పాండు ముదిరాజ్,11 వ వార్డ్ కౌన్సిలర్ గౌస్ఉద్దీన్ గోరి 12 వ వార్డ్ కౌన్సిలర్ తంజీమ్,20వ వార్డ్ కౌన్సిలర్ విజయ రాజు 24 వ వార్డ్ కౌన్సిలర్ పర్వీన్ జహాన్ యాకూబ్ ,31 వ వార్డ్ కౌన్సిలర్ జహీద్,32 వ వార్డ్ కౌన్సిలర్ సుజిత విశ్వేశ్వర్, 35 వ వార్డ్ కౌన్సిలర్ పర్వీన్ బేగం అబ్దుల్లా ,మైనారిటీ నాయకులు హంజా తదితరులు పాల్గొన్నారు..

పెరిగిన బంగారం ధరలు..

పెరిగిన బంగారం ధరలు..

దేశంలో బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 24క్యారెట్ల బంగారం మీద గ్రాముకు రూ.229 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం గ్రాముకు నిన్నటి ధరతో పోలిస్తే రూ.210 ఎక్కువైంది.

 నిన్న, మొన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇవాళ (గురువారం) పెరిగాయి. దేశంలో 24 క్యారెట్ల పసిడి ధర గ్రాము రూ.15,649గా ఉంది. ఇది నిన్నటి ధరతో పోలిస్తే రూ.229 అధికం. ఇక 22క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాము రూ.14,345గా ఉంది. ఇది నిన్నటి ధరతో పోలిస్తే రూ.210 ఎక్కువ. ఇక, 18క్యారెట్ల బంగారం గ్రాము రూ.11,737గా ఉంది. ఇది నిన్నటి ధరతో పోలిస్తే రూ.172 అధికం.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గ్రాముకు (24 క్యారెట్, 22 క్యారెట్)

హైదరాబాద్ రూ.15,649, రూ.14,345

విజయవాడ రూ.15,649, రూ.14,345

చెన్నై రూ.15,818, రూ.14,500

ముంబై రూ.15,649, రూ.14,345

ఢిల్లీ రూ.15,664, రూ.14,360

కోల్‌కతా రూ.15,649, రూ.14,345

బెంగళూరు రూ.15,649, రూ.14,345

కేరళ రూ.15,649, రూ.14,345

పూణే రూ.15,649, రూ.14,345

గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు, నగరాన్ని బట్టి, మేకర్/జ్యువెలర్ ఆధారంగా కొద్దిగా తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.

సమీప విజయమా… లేక చేజారిన అవకాశం…

సమీప విజయమా… లేక చేజారిన అవకాశం?

రామాయంపేటలో బీజేపీకి ఓట్ల జోరు – సీట్లలో మాత్రం చేదు అనుభవం..

రామాయంపేట ఫిబ్రవరి 19 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాలు స్థానిక రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ఓట్ల శాతంలో గణనీయమైన పెరుగుదల సాధించినప్పటికీ, సీట్ల పరంగా ఆశించిన ఫలితం రాకపోవడం భారతీయ జనతా పార్టీ శిబిరంలో మిశ్రమ స్పందనకు దారితీసింది. రాజకీయ విశ్లేషకుల మాటల్లో ఇది ఓటమి కాదని, “సమీప విజయాల పరంపర”గా చూడాల్సిన ఫలితమని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎక్కడ తప్పింది…?

ప్రారంభం నుంచే నియోజకవర్గ ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ హోదా, బస్ డిపో నిర్మాణం, పాలిటెక్నిక్, ఐటీఐ వంటి అభివృద్ధి అజెండాలతో ముందుకు వచ్చిన బీజేపీ, ప్రజల్లో చర్చ రేకెత్తించడంలో విజయవంతమైంది. గత ఎన్నికల్లో 4–5 శాతం వద్ద నిలిచిన ఓటు బ్యాంక్‌ను ఈసారి సుమారు 30 శాతానికి చేర్చుకోవడం చిన్న విషయం కాదు. కానీ ఆ ఓటు శాతం సీట్లుగా మారడంలో కీలక లోపం కనిపించింది.
పదో, రెండో, మూడో వార్డుల్లో కేవలం 16, 25, 35 ఓట్ల తేడాతో పరాజయం — ఇవే ఫలితాన్ని మలిచిన మలుపులు. ఆ మూడు సీట్లు దక్కివుంటే మున్సిపల్ పాలకవర్గంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగే స్థితి ఏర్పడేది. కానీ చివరి నిమిషంలో మద్దతు సమీకరణాలు ఇండియా నేషనల్ కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి వైపు మళ్లడం బీజేపీకి గట్టి దెబ్బగా మారింది.

వ్యూహంలో లోటా… లేక సమీకరణాల్లో మార్పా?

పార్టీ నాయకత్వం సమిష్టిగా కృషి చేసినప్పటికీ, బూత్ స్థాయిలో ప్రత్యక్ష అనుసంధానం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అభివృద్ధి అంశాలు యువత, విద్యావంతులను ఆకర్షించినా, చివరి క్షణాల్లో ప్రత్యర్థుల బూత్ మేనేజ్‌మెంట్ ఆధిక్యం ఫలితాన్ని తారుమారు చేసింది. ఓటు పెరిగింది… కానీ ఓటును సీటుగా మలిచే రాజకీయ గణితం పూర్తిగా కలిసిరాలేదు.

రాష్ట్ర నాయకత్వం ఫ్యాక్టర్
నియోజకవర్గ పునర్విభజన అంశంలో కేంద్ర మంత్రి G. కిషన్ రెడ్డి కమిటీ చైర్మన్‌గా ఉండటం, మెదక్ ఎంపీ M. రఘునందన్ రావు బీజేపీకి చెందినవారే కావడం పార్టీకి మానసిక బలాన్నిస్తోంది. “నియోజకవర్గం సాధన” అజెండాను మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం బీజేపీకి ఉంది.
అయినా సవాలు విసిరిందే….

కాంగ్రెస్, బీఆర్ఎస్ బలంగా ఉన్న రామాయంపేటలో బీజేపీ ప్రతి వార్డులో పోరాట పటిమ ప్రదర్శించింది. సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు కసితో పనిచేసిన తీరు గమనార్హం. ఒకే సీటుతో సరిపెట్టుకున్నప్పటికీ, ఓట్ల శాతం గణనీయంగా పెరగడం రాబోయే రోజుల్లో పార్టీకి పునాది వేస్తుందనే విశ్లేషణ వినిపిస్తోంది.

ఇక ముందేమిటి?

నియోజకవర్గ ఏర్పాటు, రెవెన్యూ డివిజన్, బస్ డిపో నిర్మాణం — ఈ మూడు అంశాలపై ఉద్యమరేఖ గీసుకుని ముందుకు వెళ్లాలని బీజేపీ వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. అధికార పక్షాన్ని నిలదీయడంలో, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేయడంలో పార్టీ మరింత దూకుడు ప్రదర్శించనుంది.

రామాయంపేట ప్రజల కల — ప్రత్యేక నియోజకవర్గం.

దాన్ని ముందుగా సాధించేది ఏ పార్టీ?

సమాధానం రాబోయే రాజకీయ పరిణామాల్లో దాగి ఉంది.
ఓట్లలో ఊపు తెచ్చుకున్న బీజేపీకి ఇది హెచ్చరికా… లేక హెచ్చరికతో కూడిన అవకాశమా?

రామాయంపేట రాజకీయాలు ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెట్టాయి.

కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి..

కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి..

బీసీలకు రూ.20,000 కోట్ల కేటాయింపే న్యాయం..

మెట్టు గంగారాం డిమాండ్..

రామాయంపేట ఫిబ్రవరి 19 నేటి ధాత్రి (మెదక్)

వచ్చే ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ బడ్జెట్‌లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీల సంక్షేమానికి రూ.20,000 కోట్లు కేటాయించి చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో భాగంగా మహాత్మా జ్యోతిబా పూలే పేరుతో చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని, కాంట్రాక్టుల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, బీసీ ఉపాధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఇప్పటివరకు ఆ హామీలు అమలు కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.9,200 కోట్లు, 2025-26 బడ్జెట్‌లో రూ.11,405 కోట్లు కేటాయించినప్పటికీ, వాస్తవంగా ప్రతి ఏడాది సుమారు రూ.300 కోట్లు మాత్రమే వినియోగించబడుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో సుమారు 60 శాతం జనాభా బీసీలే ఉన్నప్పటికీ, కేవలం మూడు శాతం నిధులు మాత్రమే కేటాయించడం, అందులోనూ ఒక్క శాతం కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధికి వినియోగించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.
ప్రభుత్వం బీసీ సంఘాలతో చర్చించి, రానున్న బడ్జెట్‌లో కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా రూ.20,000 కోట్లు కేటాయించి, చట్టబద్ధమైన బీసీ కార్పొరేషన్ ద్వారా అమలు చేయాలని కోరారు. కేటాయించిన ప్రతి రూపాయి కూడా బీసీల అభివృద్ధికే ఖర్చు అయ్యేలా పారదర్శక వ్యవస్థ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించి, వాస్తవ ఖర్చుల్లో వెనుకబడటం సరికాదని, ఇప్పటికైనా బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మెట్టు గంగారాం ప్రభుత్వాన్ని కోరారు.

చత్రపతి శివాజీ ని ఆదర్శంగా తీసుకోవాలి…

చత్రపతి శివాజీ ని ఆదర్శంగా తీసుకోవాలి

* విగ్రహ ఆవిష్కరణలో మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

యువత చత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా తుంకుంట మున్సిపాలిటీ మందయిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ఉమా ఆంజనేయులు, రాజ్ కుమార్ యాదవ్, బిఆర్ఎస్ అధ్యక్షుడు పాముల శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ నాలుక యాదగిరి, కృష్ణారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మందాయపల్లి వాసులు, యువకులు పాల్గొన్నారు.

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మరోసారి ఈడీ సమన్లు…

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మరోసారి ఈడీ సమన్లు

అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి మరోసారి సమన్లు అందాయి. గత కొంతకాలంగా విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘనల కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయనను.. ఈనెల 26వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది.

 రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నుంచి మరోసారి సమన్లు అందాయి. గత కొంతకాలంగా విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘనల కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయనకు, ఈనెల 26వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల ఈడీ జారీ చేసిన సమన్లకు అనిల్ అంబానీ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆయనకు రెండోసారి నోటీసులు పంపారు. ఆయన సతీమణి టీనా అంబానీని కూడా ఈడీ విచారించాల్సి ఉంది. అయితే ఆమె కూడా గతంలో రెండుసార్లు విచారణకు హాజరు కాలేదు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి అంబానీ కుటుంబంపై ఈ విచారణ కొనసాగుతోంది. విదేశాల్లోని వారి ఆస్తులు, లావాదేవీల గురించి ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.

కాగా, ఈనెల 26న అనిల్ అంబానీ విచారణకు హాజరవుతారా, లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వరుసగా విచారణకు గైర్హాజరు కావడం వల్ల భవిష్యత్తులో ఈడీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నది ఆసక్తికరంగా మారింది.

ఉపాధ్యాయురాలిగా ప్రతిభ, గానంతో మన్ననలు పొందుతున్న స్వరూపరాణి…

ఉపాధ్యాయురాలిగా ప్రతిభ, గానంతో మన్ననలు పొందుతున్న స్వరూపరాణి

జహీరాబాద్ నేటి ధాత్రి:.

ఝరాసంగం మండలం బిడేకన్న గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న కే. స్వరూపరాణి, బోధనలో తన ప్రతిభతో పాటు గాన మాధుర్యంతో అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఇటీవల శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో విడుదలైన ఆడియో, వీడియో ఆల్బంలో ఆమె పాడిన పాటలు విశేష ప్రశంసలు పొందాయి. ఈదులపల్లి గోరఖ్ నాథ్ బృందం స్వరపరిచిన పాటల ఆల్బంలో ఆమె గానానికి ఆలయ కార్యనిర్వాణాధికారి, రాజకీయ నాయకులు ఘనంగా సన్మానించారు. తన అభిమాన ఆశీర్వాదాలతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తెస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు..

రేవంత్ సహా కాంగ్రెస్ మంత్రులకు ఢిల్లీ పిలుపు

· నేడు ఏఐసీసీ ఆధ్వర్యంలో సమావేశం
· రేవంత్ పట్ల అధిష్టానం పూర్తి సానుకూలత
· సీనియర్ మంత్రుల్లో కొందరి పోర్ట్‌పోలియోలు మారే ఛాన్స్
· కొందరికి ఉద్వాసన తప్పదు
· కొత్త మంత్రివర్గంలో లంబాడా, ముస్లిం వర్గాలకు ప్రాధాన్యత
· మంత్రిపదవి రేసులో వెటరన్ నటి విజయశాంతి
· బీసీ మహిళగా ఆమెకు ప్రాధాన్యం దక్కే అవకాశం
· పార్టీ విధేయుల ఫిర్యాదుల పరిశీలన
· ఢిల్లీలో ఆశావహుల లాబీయింగ్
· మంత్రుల పనితీరుపై ఓ కన్నేసిన అధిష్టానం
· కోల్ బ్లాక్, మేడాడం జాతర టెంటర్ల వివాదంపై ప్రశ్నించే అవకాశం
· రిపోర్టుల తయారీలో మంత్రులు బిజీ
హైదరాబాద్, నేటిధాత్రి:
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అప్రతిహత విజయం సాధించిన నేపథ్యంలో, అధిష్టానంముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్ల అత్యంత సానుకూలతతో వున్నది. బీఆరఎస్, బీజేపీలను సమర్థ వంతంగా ఎదుర్కొని, అద్భుత వ్యూహాలతో పార్టీని విజయపథంలో నడిపించిన నేతగా రేవంత్ హైకమాండ్ దష్టిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆయన సమర్థ నాయకత్వాన్ని ఇతరరాష్ట్రాల నాయకులకు రోల్‌మోడల్‌గా అధిష్టానం పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు ముఖ్యమంత్రి రేవంత్‌ను ప్రశంసించారు. 90కి పైగా మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం కావడమంటే రేవంత్ అమలు చేస్తున్న ప్రజా ప్రాధాన్య కార్యక్రమాలు, ఆరు గ్యారంటీల అమలే ప్రధాన కారణమని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. ఈ వరుస విజయాలతో రేవంత్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు. ఇప్పుడిక పార్టీలో అసమ్మతి వాదుల ఫిర్యాదులను పరిశీలించినా, అధిష్టానం పెద్దగా వాటిని పట్టించుకోదనేది సుస్పష్టం. రాబోయే జీహెచఎంసీ ఎన్నికల్లో కూడా ఇదేమాదిరి విజయం సాధించాలని రేవంత్‌ను అధిష్టానం కోరినట్టు తెలు స్తోంది. ఇక 2034 వరకు తన ముఖ్యమంత్రి పదవికి ఢోకాలేదన్న ధీమాతో రేవంత్ వున్నారు.
ఇదిలావుండగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి సహా ఇతర మంత్రులకు ఢిల్లీనుంచి పిలుపు వచ్చింది. వీరితో కాంగ్రెస్ అధిష్టానం గురువారం సమావేశం కానుంది. ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న వివాదాలు ముఖ్యంగా నైనీ కోల్ బ్లాక్ కుంభకోణం, మంత్రుల మధ్య విభేదాలున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో మొత్తం రేవంత్ మంత్రివర్గ సభ్యులను ఢిల్లీకి పిలిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా కోల్ బ్లాక్ కుంభకోణం పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసిందన్న అభిప్రాయం ఏఐసీసీ పెద్దల్లో నాటుకున్నట్టు తెలుస్తోంది. మేడారం జాతర టెండర్ల వివాదం కూడా పార్టీ ప్రతిష్ఠను మసకబార్చింది. ఈ రెండు అంశాలు ఈ సమావేశంలో కీలకం కానున్నాయి. అంతేకాదు ఎంతోకాలంగా పార్టీకి విధేయులుగా వుంటున్న తమను పక్కన పెట్టేశారని, కేవలం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే అన్నిరకాల ప్రాధా న్యతలిస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు ఎప్పటినుంచో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు వీరి ఫిర్యాదులను కేంద్ర నాయకత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు వీటిపై దష్టి సారించే అవకాశముంది. దీనికితోడు మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ వుంటుందన్న ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యం కూడా ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకోవడానికి ప్రధాన కారణం. తెలంగాణ మంత్రివర్గంలో ప్రాంతీయ సమతుల్యత లేదన్న ఆరోపణలు నిజం. ఎందుకంటే కొన్ని జిల్లాలకు అత్యధిక ప్రాతినిధ్యం వుండగా మరికొన్ని జిల్లాలకు అసలు మంత్రివర్గంలో స్థానమే దక్కలేదు. ఉదాహరణకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3, కరీంనగర్‌కు 3, నý£్గండజిల్లాకు 2, వ రంగల్ జిల్లాకు చెందిన ఇద్దరికి మంత్రివర్గంలో స్థానాలు లభించాయి. ఇక హైదరాబాద్, రంగా రెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఆదిలాబాద్ జిల్లా కు జి.వివేక్ వెంకటస్వామి (చెన్నూరు)కు మంత్రివర్గంలో ఇటీవల స్థానం కల్పించినా, ఈ జిల్లా లోని ఇతర ప్రాంతాలను పట్టించుకోలేదు. ఈ వ్యత్యాసాలను భర్తీ చేసేరీతిలో అధిష్టానం ఈ సమావేశంలో తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇదిలావుండగా ఏఐసీసీ వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులతో ఢిల్లీలో సమావేశాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగానే తెలంగాణకాంగ్రెస్ నేతలకు కూడా పిలుపు వచ్చిందన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. నిజానికి మం త్రుల పనితీరును అధిష్టానం ఎప్పటినుంచో నిశితంగా పరిశీలిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో 90కి పైగా మున్సిపాలిటీల్లో పార్టీ గెలిచిన నేపథ్యంలో ఆయా మంత్రులు తమ శాఖలకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టును, మున్సిపల్ ఎన్నికల్లో పనితీరుకు సంబంధించిన వివరాలను సమర్పించాలని అధిష్టానం నుంచి ఆదేశాలందాయి. ఈ నివేదికల ఆధారంగా ఎవరిని మంత్రివర్గంలో కొనసాగించాలి లేదా పోర్టుఫోలియో మార్చాలి లేదా పూర్తిగా తొలగించాలన్న నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ బందానికి అధిష్టానం పిలుపుతో ఒక్కసారి గా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఢిల్లీ పిలుపుతో మంత్రులు ఈ రెండేళ్ల కాలంలో తమ ఆధీనంలోని మంత్రి త్వశాఖల పురోగతిపై నివేదికలు సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా తమ పై వచ్చిన ఆరోపణలు, వివాదాలకు సమాధానాలు రూపొందించుకొని అధిష్టానానికి సమర్పించే అవకాశముంది. ఇదిలావుండగా సీనియర్ మంత్రులు ఒక్కొక్కరి వద్ద చాలా మంత్రిత్వశాఖలున్న నేపథ్యంలో మంత్రి పదవులకు ఆశావహులు ఎప్పటినుంచో పట్టువదలని విక్రమార్కుల మాదిరిగా ఢిల్లీ స్థాయి లో లాబీయింగ్ చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికావడం, లాబీయింగ్ వత్తిడి నేపథ్యంలో అధిష్టానం కేబినెట్ విస్తరణపై తక్షణం దష్టి పెట్టనున్నది.
ఇప్పటివరకు మంత్రుల పనితీరుపై దష్టిపెట్టిన అధిష్టానం తనకు అందిన నివేదికల ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశముండటంతో, మంత్రుల్లో టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి వర్గంనుంచి తొలగించే అవకాశాలున్న వారిలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంక ట్‌రెడ్డి, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అటవీ పర్యావణ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎక్సైజ్Ê పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కష్ణారావుల పేర్లు వినిపిస్తున్నాయి. రాజ్‌గోపాల్‌రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరినప్పుడు మంత్రిపదవవి ఇస్తామని చెప్పిన హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయనకు మంత్రిపదవి ఇచ్చేందుకు వీలుగా సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని తప్పించవచ్చుని చెబుతున్నారు. ముఖ్యంగా ఇద్దరు సోదరులు మంత్రిపదవుల్లో వుండరాదన్న పార్టీ విధానం మేరకు ఈ చర్య వుంటుందంటున్నారు. ఇక పొన్నం ప్రభాకర్‌ను పార్టీసేవలకు వినియోగించుకోవాలన్న ఆలోచన వున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సామాజిక వర్గాల సమతుల్యతను పాటించేందుకు ఈ మార్పు చేసే అవకాశముంది. ఇక కొండాసురేఖ మొదట్నుంచీ పలు వివాదాýకు కారణమయ్యారు. ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిందన్న అభిప్రాయం వ్య క్తమవడం, పనితీరు సంతప్తికరంగా వుండకపోవడంతో ఆమె తొలగింపు తప్పదంటున్నారు. ఇక కొత్త వారికి అవకాశమిచ్చే ఉద్దేశంతో జూపల్లిని మంత్రిపదవినుంచి తొలగమని కోరవచ్చు. ముఖ్యంగా తక్కువ ప్రాతినిధ్యమున్న జిల్లాలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశమే ఇందుకు కారణం.ఏఐసీసీ ఈవిధంగా సర్జికల్ స్ట్రెíక్ చేయడానికి ప్రధాన కారణం, మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేయడంతోపాటు, మున్సిపల్ ఎన్నికల్లో వారి సామర్థ్యాన్ని తెలుసుకోవ డం. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన మంత్రులు ఇప్పుడు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. హైకమాండ్ ఇప్పుడు లంబాడా (ఎస్టీ), ముస్లిం వర్గాల వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న ఆలోచనలో వుంది. వీరితో పాటు మంత్రివర్గంలో ప్రాతిని ధ్యం లభించని జిల్లాలకు ప్రాధాన్యతనివాలన్న ఉద్దేశం మరో కారణం. ఈ నేపథ్యంలో మంత్రుల మధ్య నెలకొన్న విభేదాలు, పార్టీ విధేయులు ఇచ్చిన ఫిర్యా దులకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆదేశించినట్టు తెలుస్తోంది.
శాఖలు మారే మంత్రుల్లో ముందుగా వినిపిస్తున్న పేరు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.ఆయన్ను ీVAంశాఖకు బదిలీచేసే అవకాశముంది. ఇక మంత్రుల్లో అద్భుతమైన పనితీరు ప్రద ర్శిస్తున్నారని పేరు సంపాదించుకున్న దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఇప్పుడు నిర్వహిస్తున్న ఐటీ శాఖ నుంచి ప్రమోషన్‌పై ఆర్థిక శాఖ అప్పగించే అవకాశాలున్నాయి. ప్రభుత్వంలో వివాదరహితుడు, సమర్థుడుగా శ్రీధర్‌బాబుకు పేరుంది. పస్తుతం నీటిపారుదల శాఖను చూస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని రెవెన్యూశాఖకు బదిలీచేయవచ్చు. ఇక రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికే మూలస్తంభంగా వున్న నేపథ్యంలో ఆయన్ను ప్రస్తుత రెవెన్యూ శాఖ నుంచి నీటిపారుదల లేదా పౌరసరఫరాల శాఖకు బదిలీచేయవచ్చు. ఇక కోయ సామాజిక వర్గానికి చెందిన ధనసరిఅనసూయ (సీతక్క) మంచి పాపులారిటీ సంపాదించుకున్న నేపథ్యంలో ఆమె పదవికి ఎటువంటిఢోకా లేదు. ఎస్సీ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంత్రివర్గంలో కొనసాగే అవకాశాలే మెండు. మంత్రివర్గంలో అత్యంత సీనియర్ అయిన తుమ్మల నాగేశ్వరరావు పోర్ట్‌పోలియో మారవచ్చు. ఇక ఇటీవల మంత్రివర్గంలో చేర్చుకున్న జి.వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణకుమార్, వాకిటి శ్రీహరిల పదవులకు భయం లేదు.
ఇక మంత్రిపదవుల ఆశావహుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు), బి. మహేష్‌కుమార్ గౌడ్ (టీపీసీసీ ప్రెసిడెంట్), కె. మదన్‌మోహన్‌రావు (ఎల్లారెడ్డి), బాలూ నాయక్ (దేవరకొం డ), బీర్ల ఐలయ్య (ఆలేర్), ఆది శ్రీనివాస్ (వేములవాడ), అమర్ అలీఖాన్ (ఎమ్మెల్సీ), విజయ శాంతి (ఎమ్మెల్సీ) వున్నారు. ఇంకా పి. సుదర్శన్‌రెడ్డి (బోధన్), మల్‌రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంప ట్నం), కె. ప్రేమ్‌సాగర్‌రావు (మంచిర్యాల్) కూడా వున్నారు. నిజానికి వెటరన్ సినీనటి విజయ శాంతిని 2025 జూన్‌లోనే మంత్రివర్గంలోకి తీసుకుంటారని బలమైన అంచనాలున్నప్పటికీ, కేవలం ఎమ్మెలేలు, సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిచ్చిన నేపథ్యంలో ఆమె చివరి నిముషంలో అవ కాశం కోల్పోయారు. ఇది ఇప్పుడు ఆమెకు గొప్ప సావకాశంగా మారనున్నదనేది అంచనా. ముఖ్యంగా మహిళా నాయకురాలిగా ఆమెకు అవకాశం దక్కవచ్చు. పార్టీలో చేరినప్పుడు అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆమెకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చినట్టు వార్తలు వచ్చా యి. కానీ ఈ హామీ ఇప్పటివరకు అమలు కాలేదు. ఆవిధంగా రెండు సార్లు ఛాన్స్ మిస్ అయి న నాయకురాలిగా, మంత్రిపదవి రేసులో ముందు వరుసలో నిలిచారు. ప్రస్తుతం ఆమెకు హైకమాండ్ ఆశీస్సులు పుష్కలంగా వున్నాయి. అదీకాకుండా బీసీ వర్గానికి చెందిన మహిళ కావడం ఆమెకు తిరుగులేని అర్హతగా మారింది. కాగా ఆశావహులు, మంత్రుల భవితవ్యాన్ని 19వ తేదీన జరిగే సమావేశంలో పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు తేల్చనున్నారు. మంత్రిపదవుల్లో కొనసాగేవారికి ఈసారి పాలనాపరంగా మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుగా లక్ష్యాలు నిర్దేశించడం, ముఖ్యంగా విజన్`2047 సాధనకు వీలుగా తెలంగాణ రైజింగ్‌పై ప్రధానంగా దష్టి కేంద్రీకరించాలని ఆదేశించే అవకాశాలున్నాయి. 2027 నాటికి మూడు ట్రిలియన్ల ఎకానమీ లక్ష్యానికి అనుగుణంగా పాలన, అభివద్ధి కార్యక్రమాలను మంత్రులు అ మలు చేయాల్సి వుంటుంది. ఏఐ ఇన్నోవేషన్ హబ్, నెక్స్‌ట్ జెన్ లైఫ్ సైన్స్ పాలసీ ప్రాజెక్టులనువిజయవంతం చేయడానికి మంత్రులు కషిచేయాలని అధిష్టానం నిర్దేశించవచ్చు.

ఎమ్మెల్యేలకు చిట్ బాధితులు గోడు పట్టదా!

-“నేటిధాత్రి” వార్తకు సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు స్పందించారు.

-కూనమనేనికి ఉన్న బాధ్యత మిగతా ఎమ్మెల్యేలకు లేదా!

-కళ్ళముందు కష్టాలు పడుతున్న బాధితులు కనిపించడం లేదా!

-ఎమ్మెల్యేల చుట్టూ బాధితులు తిరుగుతున్నా ఎమ్మెల్యేలకు తీరిక లేదా?

-బాధితులకు న్యాయం చేయాలన్న ఉద్దేశ్యం లేదా?

-ముగ్గురు ఎమ్మెల్యేలు తీసుకున్న చొరవ మిగతా ఎమ్మెల్యే లు తీసుకోరా.

-చిట్టీలు కట్టి చితికి పోయారు!

-చిట్ కంపెనీలు బాధితులకు చితి పెర్చుతున్నారు!

-కార్యాలయాల ముందు నిప్పంటిచుకుంటున్న కనికరించడం లేదు.

-చిట్టీలు కట్టిన పాపానికి నరకం చూస్తున్నారు.

-చిట్ కంపెనీలను నమ్మి వేలాది మంది మోసపోయారు.

-నిండా మునిగి దినదిన గండంగా బతుకుతున్నారు.

-చిట్ కంపెనీల యజమానులు విలాసంగా బతుకుతున్నారు.

-విదేశాలు తిరుగుతూ విలసాలు చేస్తున్నారు.

-కంపెనీలు మూసి కోట్లతో పారిపోయారు.

-పొరుగు రాష్ట్రాలలో ఆస్తులు సంపాదించుకున్నారు.

-జనం సొమ్ముతో బంగాళాలు కట్టుకున్నారు.

-జనం సొమ్ము దిగమింగి దివాళా తీశామంటున్నారు.

-ప్రజల సొమ్ముతో జల్సా జీవితాలు గడుపుతున్నారు.

-బాధితులు గోసపడుతున్నా పట్టించుకునే వారు లేరు.

-కొంత మంది ఎమ్మెల్యేలు చొరవ తీసుకున్నారు.

-హరీష్ రావు బాధితుల పక్షాన నిలిచి సొమ్ములిప్పించారు.

-చిట్ బాధితుల ముందు కంపెనీల యాజమాన్యాలను నిలబెట్టారు.

-బాధితులకు దగ్గరుండి న్యాయం జరిపించారు.

-వరంగల్ ఎం ఎల్ ఏ నాయని రాజేందర్ రెడ్డి కొంత చొరవ తీసుకున్నారు.

-నేటిధాత్రి వార్తకు సిపిఐ ఎం ఎల్ ఏ కూనంనేని సాంబశివరావు స్పందించారు.

-కొత్తగూడెం లో వున్న చిట్ ఫండ్ బాధితుల పక్షాన నిలిచారు.

-ప్రభుత్వనికి ఉత్తరం రాశారు.. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

-చిట్ కంపెనీల బాధితులు తెలంగాణా మొత్తం వున్నారు.

-అన్ని జిల్లాలలో కలిసి లక్షలాది మంది బాధితులున్నారు.

-మిగతా ఎం ఎల్ ఏ లకు బాధితులు కనిపించడం లేదా.

-బాధితుల గోడు ఆ ఎమ్మెల్యే లకు పట్టదా!

-నేటిధాత్రి వరుస కథనాలు రాస్తున్న ఎమ్మెల్యే లు కదలరా.

-ఎమ్మెల్యే కూనం నేనికి వున్న బాధ్యత మిగతా ఎమ్మెల్యే లకు లేదా!

-లక్షలాది మంది చిట్ బాధితులు రోడ్డు మీద పడ్డ కనిపించడం లేదా.

-ఎమ్మెల్యే లకు బాధితుల బాధలు పట్టవా!

-ప్రభుత్వం చిట్ బాధితుల కోసం జీ వో జారీ చేసిన విషయమైనా ఎమ్మెల్యే లకు తెలుసా?

-బోర్డులు తిప్పేసిన కంపెనీల ఆస్తులు జాప్తు చేసైనా బాధితులకు న్యాయం చేయాలి.

-ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చడం కాంగ్రెస్ ఎమ్మెల్యేల బాధ్యత కాదా!

-చిట్ కంపెనీల మీద సిట్ వేసి దర్యాప్తు చేయించండి.

-దశబ్ద కాలంగా జరగని న్యాయం ప్రజా ప్రభుత్వం చేసి చూపించండి.

-సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు జారీ చేసిన జీ వో అమలుకు ఎమ్మెల్యే లు చొరవ తీసుకోండి.

-జీవితాంతం ఆ బాధితులు కాంగ్రెస్ పార్టీ కి రుణపడి వుంటారు చూసుకోండి.

 

హైదరాబాద్, నేటిధాత్రి: 

 చిట్ కంపనీల మోసాలు, బాదితులు పడుతున్న కష్టాలు, చిట్టి కట్టిన పాపానికి చితికిపోతున్న జీవితాలు తెలంగా ణలో ఎమ్మెల్యేలకు కనిపించడం లేదా? బాధితులు ఎమ్మెల్యేల వద్దకు వచ్చి గోడు వెళ్లబోసుకుంటున్నా కనికరించాలనిపించడ ంలేదా? వారికి న్యాయం చేయాలనిపించడం లేదా? వారి గోడు తీర్చే తీరిక ఎమ్మెల్యేలకు లేకుండాపోయిందా? గడచిన పదేళ్ల కాలంలో నాటి ఎమ్మెల్యేల నుంచి నేటి ఎమ్మెల్యేల దాకా బాదితులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఎమ్మెల్యేల కాళ్లా వేళ్లా పడుతున్నారు. అయినా ఎమ్మెల్యేలకు మనసు కరగడం లేదు? బాధితుల పక్షాన నిలిచే సమయం చాలడం లేదు? నిజం చెప్పాలంటే ఎమ్మెల్యేలు తల్చుకుంటే బాదితులకు సొమ్ములు అణాపైసాలతో సహా ఇప్పించొచ్చు. అలా నిరూపించిన ఎమ్మెల్యేలు కూడా వున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్‌రావు వద్దకు బాదితులు వెళ్తే ఆ సమస్యను నాన్చలేదు. జాప్యం చేయలేదు. చూద్దాం..చేద్దామని దాటేయలేదు. బాదితుల ఆయనకు పిర్యాదు చేసిన వెంటనే సమస్యలు తెలుసుకున్నారు. చిట్ కంపనీల మోసాలు తెలుసుకున్నారు. బాధితుల కష్టాలు విన్నారు. బాధితులకు ముందుకు చిట్ కంపనీ యాజమాన్యాలను పిలిపించారు. వారం, పది రోజుల గడువు మాత్రమే ఇచ్చిన నెల రోజుల్లో దాదాపు బాదితులందరి బకాయిలు వసూలు చేయించి ఇప్పించారు. ప్రజల పక్షాన నిలబడం అంటే ఇది. ప్రజలకు న్యాయం చేయడం అంటే ఇది. అలాగే వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి వద్దకు కొన్నేళ్లుగా బాధితులు తిరుగుతూ వున్నారు. ఆయన గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యారు. బాదితులకు న్యాయం చేయాలనుకున్నారు. చేస్తున్నారు. నిజం చెప్పాలంటే నాయిని రాజేందర్‌రెడ్డి గతంలోనే ఎమ్మెల్యే అయితే కూడా బాదితులకు ఐదారేళ్ల ముందే న్యాయం జరిగేదేమో? అంతలా బాధితుల కన్నీళ్లు తుడుస్తున్నారు. ఎన్నికల ముందు ఇదే చిట్ కంపనీలు నాయిని ఓడించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే నాయినికి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు. ఎందుకంటే నాయిని రాజేందర్ రెడ్డి గెలిస్తే బాదితుల పక్షాన నిలుచుంటాడని తెలుసు. అందుకే నాయినిని గెలవకుండా చిట్ కంపనీలు కుట్రలు కూడా చేశాయి. బాధితులు చేసుకున్న పుణ్యం కొద్ది నాయిని రాజేందర్ రెడ్డి గెలిచారు. బాధితులను న్యాయం చేయిస్తున్నారు. అందుకోసం. కషి చేశారు. సిఎం. రేవంత్‌రెడ్డిని అనేకసార్లు కలిశారు. బాదితుల సమస్యలు వివరించారు. రేవంత్‌రెడ్డిని ఒప్పించారు. మంత్రి పొంగులేటి దష్టికి బాదితుల గోడు తీసుకెళ్లారు. స్వయంగా గతంలోనూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా బాదితుల గోడు విన్నారు. అప్ప్పుడు అవకాశం వచ్చింది. సిఎం. రేవంత్‌రెడ్డితో మాట్లాడి, మంత్రి పొంగులేటి జీవో జారీ చేశారు. చిట్ బాదితులు తెలంగాణలో ఎక్కడ వున్నా వారికి న్యాయం జరిగేలా జీవో తెచ్చారు. అది నాయిని రాజేందర్‌రెడ్డి చొరవ వల్ల వచ్చింది. ఆ జీవోను వరంగల్ జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు నాయిని రాజేందర్ రెడ్డి చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటికే కొంత మంది బాదితులకు న్యాయం చేయించారు. ఆ వ్యవహారం కొంత కొలిక్కి వస్తోంది. అయితే ఇంకా అనేక కంపనీలు కూడా చిట్ ఖాతాదాలను ఇబ్బందులు పెట్టాయి. ఆ కంపనీల బాదితులకు న్యాయం జరిగేందుకు చొరవ తీసుకుంటున్నారు. చిట్ బాదితుల సమస్యలపై నేటి ధాత్రి కొన్ని సంవత్సరాలుగా అక్షర పోరాటం సాగిస్తూ వస్తోంది. అయినా గత ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆప్పటి పాలకులు చిట్ భాదితులను పట్టించుకోలేదు. వారి గోడు వినిపించుకోలేదు. కాని ప్రజా ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇది మంచి పరిణామం. తాజాగా కూడా నేటిధాత్రి కొన్ని వరుస కథనాలు రాసింది. దానికి ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరాలు స్పందించారు. నేటిదాత్రి కధనాలను చూశారు. కొత్తగూడెంలో వున్న బాధితులు ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావును కలిసి గోడు వెల్లబోసుకున్నారు. వెంటనే ఆయన ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. చిట్ కంపనీల మోసాలను ఉటంకిస్తూ, బాదితుల సమస్యలు విన్నవిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు. ఇలా ముగ్గురు ఎమ్మెల్యే స్పందించి బాదితుల పక్షాన నిలుచున్నారు. కాని తెలంగాణ వ్యాప్తంగా వున్న మిగత 116 మంది ఎమ్మెల్యేల కూడా చొరవ తీసుకుంటే బాధితులకు న్యాయం జరగుతుంది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం చిట్ కంపనీల మోసాలపై సిట్( స్పెషల్ ఇన్వెస్టిగేష్ టీమ్) ను ఏర్పాటు చేస్తే త్వరగా బాదితులకు న్యాయం అందే అవకాశాలున్నాయి. జిల్లాల చిట్ రిజిస్ట్రార్లు, చిట్ కంపనీలు ఆడుతున్న నా{కాలన్నీ వెలుగులోకి వస్తాయి. ప్రజల పక్షాన నిలవాల్సిన చిట్ రిజిస్ట్రార్‌లు కొంత మంది చిట్ కంపనీలకు వంత పాడుతున్నాయి. చిట్ కంపనీలు చెప్పినట్లు ఆడుతున్నారు. కమీషన్లకు Å£క్కుర్తిపడిన కొంత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు బాధితులకు మరింత అన్యాయం చేస్తున్నారు. వారి మూలంగా కూడా బాధితులు ఇంకా మోసపోతున్నారు. వరంగల్ లాంటి పెద్ద జిల్లాలో ఇన్‌చార్జి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ మాత్రమే కొనసాగుతున్నారు. వరంగల్ జిల్లాకు చిట్ రిజిస్ట్రార్‌ను ఎందుకు వేయడంలేదో అధికారులందికీ తెలుసు. ఇవన్నీ వెలుగులోకి రావాలంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లను ఏర్పాటు చేస్తే అసలు భండారం అంతా బైట పడుతుంది. చిట్ కంపనీలకు సహకరిస్తూ, బాధితులను వంచన చేస్తున్న అధికారుల వివరాలు కూడా వెల్లడౌతాయి. వారు చిట్ కంపనీల నుంచి ఎంత తిన్నారో కూడా తేలిపోతుంది. బాధితులకు చెక్కులు జారీ చేయాల్సిన డిఆర్‌లు చిట్ కంపనీలు సూచించిన వారికే ఎందుకు చెక్‌లు జారీ చేస్తున్నారు? చిట్ కంపనీలు సూచిస్తున్న పేర్లు బాదితులా? కాదా? చిట్ కంపనీలకు చెందిన వ్యక్తులా? కాదా? అనే విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి. అందువల్ల చిట్ కంపనీల బాగోతాలన్నీ బైటకు రావాలంటే ప్రభుత్వం సిట్ వేయాలని బాధితులు కోరుతున్నారు. ఎందుకంటే చిట్టిలు కట్టిన పాపానికి గత పదేళ్లుగా నరకం చూస్తున్నారు. రూపాయి, రూపాయి కష్టపడి సంపాంచిన సొమ్మును కంపనీల పాలు చేసి మోసపోయారు. బాదితుల క ష్టం దోచుకొని కంపనీల యాజమాన్యాలు విలాసాలు సాగిస్తున్నారు. చిట్టీలు కట్టిన పాపానికి ఖాతాదారుల కష్టాలు అనుభవిస్తున్నారు. ఎండనక, వాననక కష్టపడి సంపాదించిన సొమ్ము చిట్టీలు కడితే , ఇన్ని కష్టాలొస్తాయని వాళ్లు ఊహించలేదు. ఏజెంట్ల మాటలు నమ్మారు. మోసపోయారు. ఇప్ప్పుడు వారిని ఆదుకోవాలంటే ఒకటే దిక్కు. ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలు కావాలంటే ఎమ్మెల్యేలే కరక్టు. ఎందుకంటే వారి మాటలే వ్యవస్ధలో చెల్లుబాటౌతాయి. ఇతర నాయకులు ఎంత చొరవ తీసుకున్నా బాధితులకు న్యాయం జరగదు. ప్రజా ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతున్న నమ్మకం పెట్టుకున్న బాధితుల పక్షాన ఓ జీవో జారీ అయ్యింది. ప్రభుత్వ లక్ష్యం పేదలకు న్యాయం జరగడం. ఆ న్యాయం చేయడానికి పాలకపక్ష ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా రంగంలోకి దిగాలి. ఒక్క కొత్తగూడం నియోజకవర్గంలోనే కొన్ని వేలమంది బాదితులున్నారంటే , తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది బాదితులున్నారో అర్దం చేసుకోవచ్చు. కొన్ని లక్షల కుటుంబాల బాధలు తీర్చడం కంటే గొప్ప పని మరేదీ వుండదు. తెలంగాణ వ్యప్తంగా సుమారు 10లక్షల మంది చిట్ కంపనీల బాదితులుంటారని ఒక అంచనా. ప్రభుత్వంతోపాటు, ఎమ్మెల్యేలు చొరవ తీసుకుంటే ఆ కుటుంబాలకు ఎంతో మేలు చేసిన వారౌతారు. జీవితాంతం వారు ఆ ఎమ్మెల్యేలను గుర్తుంచుకుంటారు. ఈ పదేళ్ల కాలంలో బాధితులు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. చిట్టీలు కట్టి కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన వారున్నారు. చేస్తున్న పనులు మానుకొని కార్యాలయాల ముందు సాగిలపడిన వారున్నారు. చిట్టీలు కట్టి చితికిపోయిన వారు ఎంతో మంది వున్నారు. ఆఖరుకు కంపనీలే దగ్గరుండి బాదితులను చితికి పంపేలా వున్నారు. బాధితులు కొంత మంది వరంగల్‌లో కంపనీల మందు ఆహుతి అయ్యే ప్రయత్నాలు కూడా చేశారు. అయినా కంపనీలకు జాలి కలగలేదు. జనం సొమ్ము జనానికి ఇవ్వాలని అనుకోలేదు. పైగా కార్యాలయాల ముందుకు వచ్చిన బాదితుల మీద దౌర్జన్యాలు చేశారు. వారిని కొట్టి,తిట్టి కార్యాలయాల ముందు నుంచి గెంటేశారు. ఇలా అనేక అరాచకాలు చేసిన చిట్ కంపనీలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 287 వ జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్యే కలెక్టర్…

సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 287 వ జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్యే కలెక్టర్
వనపర్తి నేటిధాత్రి .

సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287 వ జయంతి ఉత్సవాలను బుధవారం వనపర్తి జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నాగవరం దగ్గర సేవా లాల్ బంజారా భవన్ లో సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు వనపర్తి జిల్లాలో తాండాల నుండి గిరిజనులు పాల్గొన్నారు ముందుగా సేవాలాల్ మహారాజ్, మేరమ యాడి దేవతకు మహాబోగ్ హోమం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖిమ్యా నాయక్, లంబాడి పూజారులు రాజ్ పవార్, బిక్ష్యా నాయక్ తో కలిసి సాంప్రదాయ బద్దంగా హోమంలో నెయ్యి కడావ్ ప్రసాదం వేసి నైవేద్యం సమర్పించారు. జిల్లాలోని సమస్త ప్రజలు ఆయురారోగ్యాలు, ధన ధాన్యాలతో వర్ధిల్లె విధంగా ఆశీర్వదించాలని మొక్కారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ అందరికీ ఆదర్షప్రాయుడని, జీవ హింస చేయరాదనిఅబద్ధం మాట్లాడవద్దుదొంగతనాలు చేయవద్దు,మాంసాహారం చేయవద్దని బోధించారని గుర్తు చేశారుబంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చూపిన సన్మార్గాలు ప్రతి ఒక్కరికీ ఆచరణీయమని అన్నారు ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ సేవాలాల్ 287వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారువనపర్తి నియోజకవర్గానికి రూ.2.68 లక్షలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. దౌర్జన్యానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారితో పోరాటం చేసిన యోధుడని అన్నారు.దొంగతనాలు చేయొద్దు, మాంసాహారం తినొద్దు అని బోధించారని గుర్తు చేశారు
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పిసీతారాం నాయక్ గిరిజన అభివృద్ధి అధికారి అధికారులు వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మిడిదొడ్డి మాధవి రమేష్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్ మార్కెట్ యార్డు చైర్మన్ బిన్ శ్రీనివాస్ గౌడ్ శంకర్ నాయక్ , గిరిజన సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, గిరిజన ఉద్యోగులు, గిరిజన మహిళలు, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు

రాష్ట్ర స్థాయి సీఎం కప్ ఖోఖో పోటీలకు ఇస్సిపేట క్రీడాకారుడు…

రాష్ట్ర స్థాయి సీఎం కప్ ఖోఖో పోటీలకు ఇస్సిపేట క్రీడాకారుడు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామానికి చెందిన గాజుల కేదారి, సుజాత కుమారుడు శ్రీ గాజుల మురళి కృష్ణ ఈ నెల 12వ తేదీన భూపాలపల్లి జిల్లా పోటిల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు జిల్లా యువజన క్రీడా అధికారి చిర్ర రఘు, సీనియర్ క్రీడాకారుడు పాడుగుల శివకుమార్, వ్యాయమ ఉపాధ్యయులు, రాజయ్య, అజయ్, సురేష్, ఆనంద్ తెలిపారు, ఈ కార్యక్రమాన్ని ఉద్యేశించి స్థానిక గ్రామ సర్పంచ్ యర ముకుంద రెడ్డి, అభినందనలు తెలిపారు ఈ నెల 20నుండి 23వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నల్గొండ లో జరుగుతాయి జిల్లా జట్టు నుండి మంచి ప్రతిభ కనబరిచి రానున్న రోజుల్లో గ్రామానికి జిల్లా కి మంచిపేరు తీసుకురావాలని సీనియర్ క్రీడాకారులు, గ్రామ ప్రజలు మరియు పెద్దలు తెలిపారు

error: Content is protected !!
Exit mobile version