రేజింతల్ శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో అంగారక చతుర్థి సందడి…

రేజింతల్ శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో అంగారక చతుర్థి సందడి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జనవరి 6, 2026న సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని రేజింతల్ గ్రామంలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయం అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుండే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ఆలయ నిర్వాహకులు స్వామివారికి అభిషేకం, అలంకరణ, పుష్పార్చన, కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు.

శివ దీక్ష స్వీకరించిన చిల్లపల్లి గ్రామ స్వాములు…

శివ దీక్ష స్వీకరించిన చిల్లపల్లి గ్రామ స్వాములు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో శివ దీక్ష స్వీకరించిన చిల్లపల్లి స్వాములు ఝరా సంఘం మండలంలోని చిలేపల్లి గ్రామ యువకులు సోమవారం ఉదయం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామిని దర్శించుకొని ఆలయ అర్చకుల సమక్షంలో నియమనిష్టాలతో మాలధారణ వేశారు 41 రోజులు పాటు కొనసాగే మండల శివ దీక్షను శివ స్వాములు భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. శివదీక్ష ప్రారంభించిన చీలపల్లి స్వాములు చిలపల్లి గ్రామంలోని శ్రీ సిద్దేశ్వర దేవాలయంలో 41 రోజు పాటు మండల దీక్షను కొనసాగిస్తారు. అక్కడ నాగిరెడ్డి గురుస్వామి గారి ఆధ్వర్యం అనిల్ శివ స్వామి నర్సింలు శివ స్వామి నరేందర్ రెడ్డి శివ స్వామి భాస్కర్ రెడ్డి శివ స్వామి సిద్దు స్వామి సంగమేశ్వ రెడ్డి స్వామి కార్తిక్ స్వామి తదితర స్వాములు ఉంటున్నారు,

శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు బంగారు కవచాల సమర్పణ..

శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు బంగారు కవచాల సమర్పణ..

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంజూరు నగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు తమ భక్తిని చాటుకున్నారు.
స్వామివారి ఉత్సవ మూర్తులకు భక్తులు భవానంద రెడ్డి – జ్యోతి దంపతులు బంగారు కవచాలను విరాళంగా ఆలయ ధర్మకర్తలు గండ్ర జ్యోతి వెంకట రమణా రెడ్డి కి అందచేశారు.
స్వామివారి సేవలో భాగంగా ఈ విరాళం అందజేసిన దాతలను ఆలయ కమిటీ వారు అభినందించారు. స్వామివారి సేవలో భక్తులు భాగస్వాములు కావడం సంతోషకరమని,దాతల కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు స్థానిక భక్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version