ఎమ్మెల్యే మేఘా రెడ్డి గృహప్రవేశానికి వ్యాపారుల హాజరు

ఎమ్మెల్యే మెగా రెడ్డి నూతన గృహప్రవేశానికి హాజరైన వ్యాపారులు
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నూతన గృహప్రవేశానికి వనపర్తి
కాంగ్రెస్ నేత నరహరి నరేష్ వ్యాపారులు లగిశెట్టి
చంద్రశేఖర్ సాకల్ పల్లి బొడ్డు శంకర్ తదితరులు హాజరయ్యా ఈ మేరకు ఎమ్మెల్యే మెగా రెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు

జర్నలిస్టుల దీక్షకు డాన్స్ అసోసియేషన్ మద్దతు

జర్నలిస్టులకు మద్దతు తెలిపిన డాన్స్ అసోసియేషన్

భూపాలపల్లి నేటిధాత్రి

 

గత రెండు సంవత్సరాల క్రితం జర్నలిస్టులకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చినా, ఇప్పటివరకు వారికి అసలు స్థలం చూపించకపోవడం చాలా బాధాకరం. ఈ న్యాయమైన డిమాండ్ కోసం జర్నలిస్టులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. జర్నలిస్టుల నిరసన కార్యక్రమానికి డ్యాన్స్ అసోసియేషన్ నాయకులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
జర్నలిస్టులు ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభం సమాజంలో నిజాన్ని లేవనెత్తి ప్రజల ముందు ఉంచేవారు మీరు.
ఎవరూ మాట్లాడలేని నిజాన్ని మీరు వెలుగులోకి తీసుకువస్తారు. రాత్రింబవళ్లు కష్టపడేది వార్త కోసం కాదు — సమాజంలో మార్పు కోసం. మీలాంటి గొప్ప వృత్తి ప్రతినిధులు ఇలాంటి సమస్యలతో నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరం.
మా డాన్స్ యూనియన్ మేమంతా మీ పోరాటానికి మద్దతు తెలుపుతున్నాము. మీ డిమాండ్ న్యాయమైనది, ప్రభుత్వం అధికారులు వెంటనే జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని స్పష్టంగా చూపించాలని మా యూనియన్ అధికారులను డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో
జయశంకర్ జిల్లా డాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ తోటకూరి గణేష్
దుర్గం రమేష్ గౌరవ అధ్యక్షులుడాన్స్ మాస్టర్
దుట తిరుపతి జాయింట్ సెక్రెటరీ
చాగర్ల రాకేష్ తదితరులు పాల్గొన్నారు

చేనేత ఎన్నికలు వెంటనే నిర్వహించాలి

వీలైనంత త్వరగా చేనేత సహకార ఎన్నికలు నిర్వ హించాలి

చేనేత కార్మికుల సంక్షేమం మెరుగుపడుతుంది

అఖిలభారత పద్మశాలి సంఘం జిల్లా ప్రచార కార్య దర్శి బాసాని బాలకృష్ణ

శాయంపేట నేటిధాత్రి:

 

ఎన్నికలతో చేనేత సహకార సంఘాలకు పూర్వ వైభవం వస్తుందోనని నేతన్నలో ఏండ్లు ఎదురుచూస్తున్న వారి కోరిక అందని ద్రాక్షలా మారుతుంది ఇప్పుడు అప్పుడు అంటూ 8 ఏళ్లుగా ఎన్నికలు ఊరిస్తూనే ఉన్నారు తాజాగా ప్రభుత్వం చేనేత జౌళి శాఖ సహకార సంఘాల గడువును పొడిగి స్తూనే కాలయాపన చేస్తుంటే దీంతో అసలు ఎన్నికలు జరు గుతాయో అనే అనుమానాలు కార్మికుల్లో వ్యక్తమౌతుంది. నాటి నుండి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వాయిదా వేస్తూ వస్తుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి గతంలో ఉన్న పాలకవర్గాలకే అధికారం అప్పగిస్తుంది ఇలా ఇప్పటివరకు 18 దఫాలుగా జరుగుతుంది. ఎన్నికలు జరగకపోవడం ప్రత్యేకంగా సంఘాలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో వాటి పరిస్థితి దుర్భరంగా మారి మనుగడకు ప్రశ్నార్ధకం అవుతోందని చేనేత కార్మికులు పేర్కొంటున్నారు.

చేనేత సంఘాలకు ఎన్నికల నిర్వహించాలి

స్థానిక సంస్థల ఎన్నికలతో పా టు చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని అఖిలభారత పద్మశాలి సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి బాసాని బాలకృష్ణ అన్నారు.మాట్లాడుతూ 8 సంవత్సరాల నుండి చేనేత సంఘానికి పర్సన్ ఇన్చార్జిగా పాలక వర్గాన్ని కొనసాగిస్తూ ఎన్నికలు పెట్టకుండా నిర్లక్ష్యా నికి గుర్తు చేస్తున్నారని తెలిపా రు. ఇప్పటికీ ఎన్నికలు జరగక చాలా కాలం అవుతుంది ఎన్నికల నిర్వహించడం వల్ల చేనేత కార్మికుల సంక్షేమం మెరుగు పడుతుంది అయిన ప్పటికీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని దానిపై స్పష్టత లేదు.చేనేత సంఘాలకు ప్రభు త్వం నుండి వచ్చిన నిధులపై విచారణ చేయాలని అధికారు లకు విన్నవించుకుంటే సంఘం పాలకవర్గం రాజీనామాను ఆమోదించి స్పెషల్ ఆఫీసర్ ను నియమించడం అన్నారు. ఇప్పటికైనా చేనేత సొసైటీ నిధులకు సంబంధించి విచా రణ చేసి స్థానిక సంస్థల ఎన్నిక లతో పాటు చేనేత సంఘానికి కూడా ఎన్నికలు నిర్వహిం చాలని కోరారు

వనపర్తిలో దీక్షా దివాస్ సమావేశం

దీక్షా దివాస్ సమావేశంలో మాజి మున్సిపల్ చైర్మన్ పలస

వనపర్తి నేటిదాత్రి .

 

కె సిఆ ర్ దీక్ష చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించామని వనపర్తి పట్టణ బీ ఆర్ ఎస్ అధ్యక్షుడు మాజీ మున్సిపల్ చైర్మన్ పలస రమేష్ గౌడ్ అన్నారు ఈ సందర్భంగా.రమేష్ గౌడ్ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా దీక్షా దివాస్ నిర్వహించాలని నాయకులు కార్యకర్తలు దీక్షా దివాస్ గురించి ప్రజలకు తెలుప లని కార్యకర్తలను కోరారు
14 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఉద్యమం,10.సంవత్సరాల కె.సి.ఆర్ పరిపాలన యువతకు అవగాహన కలి పి చెందిoదుకు బీ ఆర్ ఎస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు ఈ సమావేశంలో
జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మీడియా ఇంఛార్జి నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,ఆవుల.రమేష్,విజయ్ కుమార్,ఉంగ్లం. తిరుమల్,బండారు.కృష్ణ, కంచ.రవి,సమద్,ప్రేమ్ నాథ్ రెడ్డి,స్టార్.రహీమ్,గులాం ఖాదర్ ఖాన్, రమేష్ నాయక్,షేక్.జహంగీర్,జోహెబ్ హుస్సేన్,సునీల్ వాల్మీకి,ఎం.బాలరాజు,సుధాకర్,పెద్దముక్కుల.రవి,మంద.రాము,ముద్దసార్,నందిమల్ల.సుబ్బు వజ్రాల.సాయిబాబా తోట.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

రాహుల్ సిప్లిగంజ్ వివాహం

గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ వివాహం: బీజేపీ నేత శుభాకాంక్షలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ప్రముఖ గాయకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత రాహుల్ సిప్లిగంజ్ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తన ప్రియురాలు హరిణ్య రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ పట్టణ అధ్యక్షులు పూల సంతోష్ హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంఘటన రాహుల్ సిప్లిగంజ్ వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది.

హార్టికల్చర్‌లో పీహెచ్.డి సాధించిన ఊరటి మహేష్

హర్టికల్చర్ లో డాక్టరేట్ పొందిన ఊరటి మహేష్

వెంకటాపురం గ్రామస్తుల హర్షం వ్యక్తం

అతిచిన్న వయస్సులో పీహెచ్ డీ పొందిన డాక్టర్ మహేష్.

సంతోషం వ్యక్తపరిచిన తల్లిదండ్రులు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఉద్యానవన రంగంలో విశేష ప్రతిభ కనబరచి అతిచిన్న వయసులో డాక్టరేట్ పట్టా సాధించి అందరిమన్ననలు పొందాడు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామవాసి.వివరాల్లోకి వెళితే..దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన,మహమ్మదపురం వ్యవసాయ సహకార సొసైటి చైర్మన్ ఊరటి సునీత మైపాల్ రెడ్డిల కుమారుడు డాక్టర్ ఊరటీ మహేష్ ఆయన తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం కావడంతో వారికష్టంతో చదువుపై మక్కువ పెంచుకున్నాడు.చిన్ననాటి నుండే ఉన్నత చదువుల వైపుకు అడుగువేసి వ్యవసాయ ఉద్యానవన రంగం నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు.అనంతరం పిహెచ్ డి చేసేందుకు గాను మొదటి ప్రయత్నంలోనే సీటు సాధించిన యువ విద్యావేత్త పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టానందుకున్నాడు.ఈ యువ విద్యావేత్త 27 ఏళ్లకే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ నుండి హార్టికల్చర్‌లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్డి) లో పట్టా పొందేందుకు గాను పరిశోధన మార్గదర్శకులు డాక్టర్ కె.ఎం. యువరాజ్ ఆధ్వర్యంలో స్వాలో రూట్ (డికాల్పిస్ హామిల్టోనీ) పరిశోధన అంశంతో జన్యు వైవిధ్యం మరియు విలువ పెంపుపై అధ్యయనాలు పూర్తి చేశాడు. ఈ యువ విద్యావేత్త. 2016–2020 విద్యా సంవత్సరంలో కొండాలక్ష్మణ బాపూజీ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చరల్ యూనివర్సిటీలో బి.ఎస్‌.సి హార్టికల్చర్ లో తన ప్రతిభ తో 7.98 ఓ.జీ.పి.ఏ సాధించాడు. అనంతరం 2020–2022 కాలంలో కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్‌.సి హార్టికల్చర్ పూర్తి చేసి ఓ జీ పి ఏ 8.95 సాధించాడు. 2022–2025 లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో పీహెచ్.డి పూర్తి చేసి ఓ జీ పి ఏ 9.37 సాధించాడు.తన పరిశోధనలో స్వాలో రూట్ ఒక ఔషధ మొక్కగా ఉండడంతో జన్యు వైవిధ్యం, విలువ పెంపు అవకాశాలను లోతుగా అధ్యయనం చేసి శభాష్ అనిపించాడు. ఈ పరిశోధన ఉద్యాన ఉత్పత్తుల వినియోగం మరియు మార్కెట్ విలువ పెంపులో కొత్త మార్గాలను చూపనుందని విశ్వవిద్యాలయ అధ్యాపకులు మహేష్ ప్రతిభకు మంత్రముగ్ధులయ్యారు.

 

డాక్టరేట్ ప్రదానం చేస్తున్న డాక్టర్ వైయస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ

విద్యాభ్యాసం చేస్తూనే డాక్టర్ మహేష్
విద్యా ప్రయాణంలో దేశీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పేపర్లను ప్రజెంట్ చేసి అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు.పరిశోధన మరియు శాస్త్రీయ ప్రజెంటేషన్లలో తమ ప్రతిభను నిరూపించాడు. అచ్చిన వయసులోనే డాక్టర్ సాధించడంతో దుగ్గొండి మండల వివిధ శాఖల అధికారులు మండల ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు కుటుంబ సభ్యులు వర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.
సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని డాక్టర్ ఊరటీ మహేష్ ప్రస్తుత యువతకు సందేశం పంపారు.భవిష్యత్తులో పరిశోధన, బోధన,మరియు ఉద్యాన రంగ అభివృద్ధిలో సేవలను కొనసాగించాలనే ఆలోచనతో మహేష్ ముందుకెళ్తానన్నారు.చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

డాక్టర్ ఊరటి మహేష్ ఫైల్ ఫోటో

 

డాక్టరేట్ పొందడం గర్వంగా ఉన్నది..తల్లిదండ్రులు.

వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మా కుమారుడు డాక్టర్ మహేష్ తన కష్టాన్ని చూస్తూ ఉన్నత చదువులు చదివి నేడు ఉద్యానవన రంగంలో డాక్టరేట్ పొందడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు ఊరటి సునీత మైపాల్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

బిజెపి పోరాటంతో తగ్గిన ఇసుక ఛార్జీలు

ఫలించిన బిజెపి పోరాటం
ఇసుక క్వారీల్లో తగ్గిన లోడింగ్ చార్జీలు
హర్షం వ్యక్తం చేస్తున్న ఇసుక లారీ ఓనర్స్

మహాదేవపూర్ నవంబర్ 27 నేటి ధాత్రి *

 

మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ అధ్యక్షతన మహాదేవపూర్ మండల కేంద్రంలో నడుస్తున్న ఇసుక క్వారీలలో అధిక లోడింగ్ చార్జీలు వాసులు చేస్తున్నారనే లారీ డ్రైవర్ల సమాచారం మేరకు గత వారం రోజుల క్రితం ఇసుక క్వారీలను సందర్శించి,ఇసుక అధిక లోడింగ్ చార్జీలపై క్వారీ యాజమాన్యన్ని ప్రశ్నించడం జరిగింది వారు దొర్జన్యంగా మేము ఇలాగే వసూల్ చేస్తాం అని వారు మమ్మల్ని బెదిరియ్యడం జరిగింది, వారిపై మొదటగా ప్రాజెక్ట్ ఆఫీసర్ చర్యలు తీసుకోవాలని తెలుపగా వారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారికే వత్తస్ పలికేలా మాట్లాడరు,
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కాళేశ్వరం పర్యటన కి వచ్చిన్నపుడు వారికీ సరి అయినా ఆధారాలతో వినతి పత్రం ఇవ్వడం జరిగింది, వెంటనే స్పందించిన అధికర యంత్రాంగం ఇసుక లోడింగ్ ఛార్జిలను తగ్గించడం జరిగింది,4100 ఉన్న ఇసుక లోడింగ్ ఛార్జ్ ని 2500 తగ్గించడం జరిగింది,గవర్నమెంట్ అడర్స్ ప్రకారం అసలు లోడింగ్ ఛార్జ్ కి డబ్బులు చెల్లించవాల్సిన అవసరం లేదు కానీ క్వారీ కాంట్రాక్టర్లు సంబంధిత అధికారులు కుమ్మకై మీకు ఇంత మాకు ఇంత అని పంచుకుంటున్నారు, గవర్నమెంట్ అడర్స్ కంటే ఒక రూపాయి ఎక్కో తీసుకున్న కూడా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమలు చేసి మా ప్రాంత లో అక్రమాలకు తావు లేకుండా చేస్తామని అన్నారు, అలాగే అవినీతి గురించి తెలుపుగనే స్పందించి చర్యలు తీసుకున్న భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కు వారు ధన్యవాదములు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది

లక్ష్మీ దేవి అమ్మవారిని దర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

లక్ష్మీ దేవి అమ్మ వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మొగుడంపల్లి మండలం మాడిగి గ్రామంలో ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు లక్ష్మీ దేవి అమ్మ వారి ఆలయ 5వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమలలో పాల్గొని , తీర్థ ప్రసాదాలు స్వీకరించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ అమ్మ వారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో సుభాష్ రెడ్డి ,నారాయణ, ఉద్యమకారుడు సీనియర్ నాయకులు షకీల్, వార్డ్ మెంబర్ రాజు, మచేందర్,పార్టీ ప్రెసిడెంట్ రాజు ,నాయకులు ఏ.నారాయణ, సుభాష్,విశ్వనాథ్,గోపాల్ , భద్రనాథ్,హరికాంత్ రెడ్డి,రవి, శరణప్ప , గ్రామ పెద్దలు ,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

అమీర్ అలీ ఉమ్రా యాత్రకు శుభాకాంక్షలు

ఉమ్రా యాత్ర కోసం వెళ్తున్న సోదరుడు అమీర్ అలీ సాహెబ్

◆:- శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు….,

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్రా యాత్రకు వెళ్తున్న.ముస్లిం సోదరులందరి తరపున దర్శనం చేసుకొని.అల్లహ దయతో జహీరాబాద్ ప్రాంత ప్రజలు శాంతిగా ఉండాలని కాంక్షించాలని,ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకోవాలిని అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,గ్రామ మాజి సర్పంచ్ హబ్సీ రాజు,మాజి ఎంపీటీసీ లు విజయ్ రెడ్డి,రామన్న,మాజి ఉప సర్పంచ్ రాజు,పార్టీ ప్రెసిడెంట్ మాణిక్,ఉద్యమకారుడు షకీల్,నాయకులు ఓంకార్ రెడ్డి,సిదన్న,మాల్ రెడ్డి,బసవ,దశరథ్, గాలెప్ప, రేశాంత్ రెడ్డి, శేఖామత్,రఫీ, అఫ్రోజ్, ఫిరోజ్ , ఇస్మాయిల్, టీపు, అజ్జు, కైఫ్, సాంబి హాజీ, జుబేర్, సోహైల్, అన్వర్,
తదితరులు పాల్గొన్నారు.

ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ ఖాతాలోకే!

ఖైరతాబాద్‌ టిక్కెట్‌ ‘‘రోహిన్‌ రెడ్డి’’కే!

’’రోహిన్‌ రెడ్డి’’ వైపే ‘‘సీఎం రేవంత్‌ రెడ్డి’’ మొగ్గు!

`‘‘దానం’’ బరిలో నిలబడితే ‘‘కష్టమే’’!

`అభ్యర్థిని మార్చితే ‘‘కాంగ్రెస్‌’’ కు ‘‘గెలుపు’’ నల్లేరు మీద నడకే.

`‘‘విజయారెడ్డి’’ మద్దతు ‘‘రోహిన్‌ రెడ్డి’’కే!

`ప్రజలు కూడా అధికార కాంగ్రెస్‌ వైపే!

`‘‘రోహిన్‌ రెడ్డి’’ సీఎం ‘‘రేవంత్‌’’ కు అత్యంత సన్నిహితుడు.

`‘‘రోహిన్‌ రెడ్డి’’ ఖైరతాబాద్‌ నియోజకవర్గం స్థానికుడు.

`‘‘రోహిన్‌ రెడ్డి’’ ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు

`జూబ్లీ ని ఒంటి చేత్తో గెలిపించిన ‘‘సీఎం రేవంత్‌ రెడ్డి’’.

`‘‘రోహిన్‌ రెడ్డి’’ గెలిస్తే నియోజకవర్గానికి ‘‘ఇతోధిక నిధులు’’.

`‘‘సీఎం రేవంత్‌ రెడ్డి’’ కి అత్యంత సన్నిహితుడు కావడం నియోజకవర్గానికి మేలు.

`కాంగ్రెస్‌ చేయించిన సర్వేలో ‘‘దానం’’ కు తక్కువ మద్దతు.

`అభ్యర్థిని మర్చితే కాంగ్రెస్‌ కె ‘‘70 శాతం’’ జనం ఓట్లు.

’’విజయారెడ్డి’’కి ‘‘సిఎం రేవంత్‌ రెడ్డి’’ భవిష్యత్‌ మీద హామీ

హైదరాబాద్‌, నేటిధాత్రి:

రాజకీయంగా ప్రతిపక్షాలకు తన వ్యూహాలతో కౌకు దెబ్బలుకొట్టడంలో సిఎం. రేవంత్‌ రెడ్డి సిద్దహస్తుడు. అందుకే ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ పార్టీకి కళ్లు బైర్లు కమ్మేటు వంటి దెబ్బ కొట్టారు. అసలు జూబ్లీలో కాంగ్రెస్‌ పోటీచేసేందుకు భయపడుతుందని అసత్య ప్రచారం చేసిన బిఆర్‌ఎస్‌కు ఓడిరచి తనేంటో, తన రాజకీయ చతురత ఏమిటో మరోసారి రుచి చూపించారు. ఇప్పుడు ఉప ఎన్నికలు అంటే చాలు బిఆర్‌ఎస్‌ గజగజ వణికిపోయేలా చేశాడు. జూబ్లీలో గెలుస్తామా? లేదా? అనే అనుమానం కాంగ్రెస్‌ పార్టీలో అందరికీ వుండేది. కాని గెలిచి చూపించడం ఎలా వుంటుందో ఒక్క రేవంత్‌ రెడ్డికి మాత్రమే తెలుసు. అందుకే ఆ ఎన్నిక భారం మొత్తం తన భుజాన వేసుకొని సిఎం.రేవంత్‌ రెడ్డిగా ఒక్కసారి ఎవరెస్టుశిఖరమంతటి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. తెలిసీ తెలియకుండా మాట్లాడేవారి నోర్లు మూయించారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు అటు ప్రతిపక్షాలను, ఇటు సొంత పార్టీ నేతల సిఎం. రేవంత్‌ తన రాజకీయ చాణక్యం చూపించారు. ఇప్పుడు కూడా సరిగ్గా అదే చేయబోతున్నారు. జూబ్లీ ఎన్నికల సమయంలో చివరి క్షణంలో అభ్యర్ధిని ఎంపిక చేశారు. అంతకు ముందు ఎవరెవరు? టికెట్‌ ఆశిస్తున్నారో..వారికి ప్రజల్లో వున్న పలుకుబడి ఎంతో అంతా గమనించారు. ఆఖరుకు ఎవరిని నిలబెట్టి గెలిపిస్తే తన రాజకీయం బలం కొండంత పెరుగుతుందో ఆలోచించి అభ్యర్ధి నవీన్‌ యాదవ్‌ను ఎంపిక చేసి గెలిపించారు. తనను నాయకత్వ పటిమను మరోసారి చూపించారు. ఒకవేళ ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక వస్తే అందరికంటే ముందుగానే అభ్యర్దిని ప్రకటించి, ప్రతిపక్షాలను దెబ్బకొట్టాలనుకుంటున్నారు. జూబ్లీలో ఆఖరు వరకు ఎదురు చూసి అభ్యర్దిని ఎంపిక చేశారు. ఇప్పుడు మాత్రం అందరికంటే ముందుగానే అభ్యర్దిని ఎంపిక చేయాలనుకుంటున్నారు. అది కూడా సిఎం.కు అత్యంత సన్నిహితుడైనటు వంటి రోహిన్‌ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లే లెక్క అని విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే రోహిన్‌ రెడ్డి సిఎం. రేవంత్‌ రెడ్డికి అత్యంత దగ్గర సన్నిహితుడు. సిఎంకు శ్రేయోభిలాషి. రోహిన్‌ రెడ్డి ఉన్నత విద్యావంతుడు. పైగా వైద్యుడు. ప్రజా సేవ అంటే ఎంతో ఇష్టమైన వారు. కొన్ని దశాబ్దాలుగా ప్రజా సేవ చేస్తున్న నాయకుడు. రాజీకీయాలలోవున్నవారు. అన్నింటికన్నా మించి ఖైరతాబాద్‌ నియోజకవర్గ స్దానికుడు. కాంగ్రెస్‌ పార్టీలో ఖైరతాబాద్‌ నియోజకవర్గ అధ్యక్షుడుగా కూడాకొనసాగుతున్నారు. ఇన్ని రకాలుగా ఆయనకు అర్హతలున్నాయి. ఖైరతాబాద్‌ స్దానికుడు కావడం వల్ల ఆయనను ప్రజలు కూడా నేరుగా గుర్తుపడతారు. ఈ మధ్య సిఎం. రేవంత్‌ రెడ్డితోనే నిత్యం వుండడం వల్ల ప్రజలకు తెలిసిన నాయకుడయ్యారు. సహజంగా ఉప ఎన్నికలు అంటే ప్రజలు కూడా అధికార పార్టీ నాయకులను ఎన్నుకునేందుకు ఆసక్తిచూపుతారు. ప్రభుత్వం వున్నంత కాలం అధికార పార్టీ ఎమ్మెల్యే వుంటే నియోజకవర్గం అభివృద్ది చెందుతుంది. ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక వస్తే రోహిన్‌ రెడ్డి ఎమ్మెల్యే కావడం వల్ల నేరుగా సిఎంతో వుండే సాన్నిహిత్యం, సన్నిహిత సంబధాల వల్ల ఏ నియోజక వర్గానికి లేని అనేక అవకాశాలు వుంటాయి. వేల కోట్ల రూపాయలు నిదులు తెచ్చి నియోజకవర్గాన్ని బంగారుతునక చేసేందుకు వీలౌతుది. రోహిన్‌రెడ్డి కాకుండా ఇంకా ఎవరిని ఎంపిక చేసినా అన్ని నిధులు తేలేరు. ఖైరతాబాద్‌ను నెంబర్‌ వన్‌ నియోజకవర్గం చేయలేరు. అది ఒక్క రోహిన్‌ రెడ్డి వల్లనే సాద్యమౌతుంది. అందుకే ఒక వేళ దానం నాగేందర్‌కే టికెట్‌ ఇస్తే పరిస్దితి ఎలా వుంటుందనేది సర్వేలు చేశారు. మొత్తం నియోకజవర్గంలో కనీసం 13శాతం మంది కూడా దానం బెటర్‌ అన్నట్లు తేలలేదని సమాచారం. దానంకు కాకుండా మరెవరికి ఇచ్చినా, అందులోనూ రోహిన్‌రెడ్డికి ఇస్తే 70శాతం మంది ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించుకుంటామని చెప్పినట్లు ఆంతరంగిక సర్వేలో వెల్లడైంది. అందువల్ల ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక వస్తే మాత్రం టికెట్‌ ముందే రోహిన్‌రెడ్డికి ప్రకటించనున్నారు. ఇక పిజేఆర్‌ కూతరు విజయారెడ్డికి సిఎం. రేవంత్‌ రెడ్డి రాజకీయంగా ఆమె భవిష్యత్తుకు భరోసా ఇచ్చినట్లు కూడా సమాచారం. ఈసారి జిహెచ్‌ఎంసిపై కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయం. మేయర్‌ పదవి నీకే అని సిఎం. రేవంత్‌ రెడ్డి, విజయారెడ్డికి భరోసా కల్పించినట్లు తెలుస్తోంది. దాంతో విజయారెడ్డి ఎలాగూ దానం నాగేందర్‌కు సపోర్టు ఇవ్వరు. దానం నాగేందర్‌ వల్లనే పిజేఆర్‌ తర్వాత ఖైరతాబాద్‌ నియోజకవర్గం ఆ కుటుంబం నుంచి జారిపోయింది. అందువల్ల దానం నాగేందర్‌కు ఎట్టిపరిస్దితుల్లోనూ విజయారెడ్డి సపోర్టు వుండదు. అందవల్ల రోహిన్‌ రెడ్డికి గెలిపించే బాద్యత సిఎం. తర్వాత విజయరెడ్డి తీసుకుంటారు. దానం నాగేందర్‌ ఎప్పుడు ఏ పార్టీలో వుంటారన్నది ఆయనకే స్పష్టత వుండదు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వెంటనే కాంగ్రెస్‌లో చేరిపోయారు. 2014లో కాంగ్రెస్‌ ఓడిపోయిన తర్వాత బిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. 2023లో తాను గెలిచినా, బిఆర్‌ఎస్‌ ఓడిపోయింది. దాంతో కాంగ్రెస్‌లో చేరారు. ఒక వేళ బిఆర్‌ఎస్‌ గెలిస్తే ఆయన వచ్చే వారు కాదు. ఇప్పుడు కూడా ఆయన ఆలోచనలు పరిపరి విధాలుగా వుంటాయి. హైడ్రా విషయంలో ఏకంగా సిఎం. రేవంత్‌ రెడ్డిని కూడ ప్రశ్నించారు. ఒక వేళ మళ్లీ టికెట్‌ ఇచ్చి గెలిపించుకుంటే అది తన సొంత బలంతో గెలిచాననే అంటారు. తన వల్లే కాంగ్రెస్‌కు బలమొచ్చిందంటారు. హైదరాబాద్‌ రాజకీయాలు నా గుప్పిట్లో వుండాలని కోరుకుంటారు. ఆయన సొంత వర్గం ఏర్పాటు చేసుకొని రాజకీయ చికాకులు తెచ్చి పెడతాడని చెప్పడంలో సందేహం లేదు. అంతే కాకుండా హైకమాండ్‌ కూడా దానం నాగేందర్‌కు ఏదైనా పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపుతోందే కాని టికెట్‌ ఇచ్చేందుకు సుముఖంగా లేదు. పైగా సిఎం. రేవంత్‌ రెడ్డిని కాదని హైకమాండ్‌ టికెట్‌ ఇవ్వదు. సిఎం. రేవంత్‌ రెడ్డి ఈ అవకాశాన్ని వదులుకోరు. మిత్రుడ రోహిన్‌ రెడ్డికి టికెట్‌ ఇవ్వకుండా వుండరు. తనను నమ్మిన, నమ్ముకున్న వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిఎం. రేవంత్‌ రెడ్డి వెనుకాడరు. అందుకే రోహిన్‌ రెడ్డికి టికెట్‌ ప్రకటిస్తారు. గెలిపించుకుంటారు. మిత్రధర్మం మరోసారి ఎంత గొప్పదో చూపిస్తారు. అందరికంటే ముందే అభ్యర్దిని ప్రకటించి, ప్రతిపక్షాలను డైలమాలో పడేసి, కోలుకోకుండా చేయడంతోపాటు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వచ్చే వరకు ఖైరతాబాద్‌ నియోజకవర్గాన్ని అభివృద్ది పనులు పెద్దఎత్తున మొదలు పెడతారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వరకు చాల వరకు జెట్‌ స్పీడ్‌లో పనులు పూర్తి చేస్తారు. ప్రజల మన్ననలు పొంది ఓట్లకు వెళ్తారు. ప్రతిపక్షాలు నోళ్లు వెల్లబెట్టి చూస్తారు. ఇక ఎన్నికలన్నా, ఉప ఎన్నికలన్నా ప్రతి పక్షాలు జడుసుకునే పరిస్ధితి సిఎం. రేవంత్‌ రెడ్డి తెస్తారు.

“పంచాయతీ ఎన్నికలకు రెడీ ఏర్పాట్లు”

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని

ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు

నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు

మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ సజావుగా జారీ చేయాలి

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్

హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల(నేటి ధాత్రి ):

 

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని ఆదేశించారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని, డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండవ విడత, డిసెంబర్ 17న మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు.

పంచాయతీ ఎన్నికల సంబంధించి గ్రామానికి అప్ డేట్ చేసిన రిజర్వేషన్లు, ఏ విడత పోలింగ్ ఉంటుంది, పోలింగ్ కేంద్రాల జియో లోకేషన్ వివరాలు వెంటనే టి-పోల్ వెబ్ సైట్, యాప్ లో నమోదు చేయాలని అన్నారు. టి-పోల్ వెబ్ సైట్ , యాప్ లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని, ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఫిర్యాదులను మూడు రోజులలో పరిష్కరించాలని సూచించారు.

ఫైనల్ చేసిన ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రకారం పంచాయతీ ఎన్నికల నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 2 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న భవనం దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, వెబ్ క్యాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల వివరాలు పంపాలని , పోలింగ్ కేంద్రాలలో మంచి వెలుతురు, ఫర్నిచర్, పవర్ సరఫరా వంటి ఏర్పాట్లు చేయాలని అన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 27న ఉదయం 10.30 గంటల వరకు విడుదల చేయాలని అన్నారు. నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పంచాయతీ పరిధిలోని ఓటరు జాబితా వివరాలను ప్రచురించాలని అన్నారు .

నవంబర్ 27 నుంచి నవంబర్ 29 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు వద్ద నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.

నామినేషన్ల పరిశీలన నవంబర్ 30 న సాయంత్రం 5 గంటల వరకు పూర్తి చేసి చెల్లుబాటైనా నామినేటెడ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని అన్నారు. అభ్యర్థుల జాబితా పై అప్పిళ్ళ కోసం డిసెంబర్ 01, సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందని, డిసెంబర్ 2 నాడు ఆపిళ్ళ పరిష్కరించాలని, నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 03 మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంటుందని, అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ చేయాలని అన్నారు .

నామినేషన్ల స్వీకరణ, పరిశీలన,అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా అవసరమైన మార్గదర్శకాల జిల్లా ఎన్నికల అధికారులు జారీ చేయాలన్నారు.

జిల్లాలో ఉన్న ప్రింటర్లకు అనుమతి లేకుండా ఎన్నికల ప్రచార కరపత్రాల ముద్రణ చేయవద్దని ఆదేశాలు జారీ చేయాలని, ఎన్నికల ప్రచారం సంబంధించి అభ్యర్థుల వ్యయ వివరాలను నమోదు చేసేందుకు ధరలను ఖరారు చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ లకు ఎన్నికల కమిషనర్ సూచించారు.

ప్రతి జిల్లాలో ఎం.సి.ఎం.సి కమిటి, జిల్లా మీడియా సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో వినియోగించే ఎలక్ట్రానిక్ వీడియోలకు ముందుగా ఎం.సి.ఎం.సి అనుమతి ఉండాలని అన్నారు. ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించే నేపద్యంలో రైతులు పంట డబ్బులు తీసుకుని వెళ్లే సమయంలో తప్పనిసరిగా రశీదు పెట్టుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు.

ఎం.సి.సి అమలులో నిర్వహించే తనిఖీల లో నగదు, బంగారం, ఇతర పరికరాలు సీజ్ చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు అందించాలని, సీజ్ చేసిన పరికరాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు ఏ అధికారి ముందు హాజరు కావాలని వివరాలు ఆ రసీదు లో ఉండాలని అన్నారు.

ఇంచార్ట్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల రిజర్వేషన్ వివరాలు టి-పోల్ లో అప్ లోడ్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. మొదటి విడతగా గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నామినేషన్ల స్వీకరణ అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేసేందుకు ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టీ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఎం.సి.ఎం.సి , మీడియా సెల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శేషాద్రి, డీపీఓ శర్ఫుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

40 కోట్ల కార్మికులకు నూతన కార్మిక చట్టాల లాభం

నూతన కార్మిక చట్టాలు 40 కోట్ల కార్మికులకు ఆదర్శవంతమైనవి

బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య

శ్రీరాంపూర్,మంచిర్యాల నేటి ధాత్రి:

 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాలు 40 కోట్ల మంది కార్మికులకు ఆదర్శవంతం, చారిత్రాత్మకమైన చట్టాలు అని బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య వెల్లడించారు.బుధవారం శ్రీరాంపూర్-నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాజకీయ ప్రేరేపిత సంఘాలు రాజకీయ ప్రయోజనాల కోసం కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.భారత ప్రభుత్వం 49 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా సవరించడం కార్మిక హక్కుల, సంస్థల సంరక్షణ,పరిశ్రమల ప్రగతి,దేశ అభివృద్ధి, నిర్మాణాత్మకమైన పారదర్శకత కలిగిన ఆదర్శవంతమైన చారిత్రాత్మకమైన చట్టాలను సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ స్వాగతిస్తున్నామని తెలిపారు.వలస పాలన కాలంలోని పాత చట్టాలను మార్పు చేసిన చట్టాలను పూర్తిగా ఆధునిక,పారదర్శక, ఏకీకృత,కార్మిక-కేంద్ర వ్యవస్థను తీసుకువస్తున్నాయని తెలిపారు.14 జాతీయ కార్మిక సంస్థల వేదిక కన్సెంట్ ఈ సంస్కరణలను వికసిత భారత్ 2047 లక్ష్యానికి దారితీసే చారిత్రాత్మక అడుగుగా అభివర్ణిస్తోందని వివరించారు.అసంఘటిత, వలస,గిగ్, ప్లాట్‌ఫారమ్,అనధికా రంగాల దాదాపు 40 కోట్ల మంది కార్మికులు తొలిసారిగా చట్టబద్ధమైన సామాజిక భద్రత వ్యవస్థలోకి రావడం ఈ కోడ్ల అత్యంత కీలకమైన ప్రయోజనమని చెప్పారు.ఇఎస్ఐసి తరహా ఆరోగ్య సేవలు,పింఛన్-లింక్డ్ ప్రయోజనాలు,ప్రసూతి రక్షణ, వికలాంగుల సహాయం, సంక్షేమ పథకాల పోర్టబిలిటీ వంటి సేవలు ఇప్పుడు అందుబాటులోకి రానున్నాయి.ప్రతి కార్మికుడికి ఫార్మల్ అపాయింట్ లెటర్ తప్పనిసరి కావడం,అలాగే జాతీయ కనీస వేతనం కంటే తక్కువ వేతనం దేశంలో ఎక్కడ అమలు చేయకూడదనే నిబంధన వల్ల అనౌపచారిక ఒప్పందాలు,అన్యాయ కత్తిరింపులు,సేవా రికార్డు లేమి వంటి దోపిడీలు తగ్గిపోతాయని తెలిపారు.డిజిటల్ వేతన వ్యవస్థలు పారదర్శకత బాధ్యతను పెంచుతాయని చెప్పారు.కార్మిక భద్రత, వ్యవసాయక ఆరోగ్యం,భద్రత కమిటీలు,సాంకేతికత ఆధారిత తనిఖీలు,మహిళల కార్మికుల భద్రత వంటి అంశాలపై కోడ్లు తీసుకొచ్చిన మెరుగుదలలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగినవని పేర్కొన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు,యాజమాన్య సంస్థలు,కార్మిక సంఘాలు, నిపుణులతో జరిగిన విస్తృత సంప్రదింపుల ఫలితమని అన్నారు.కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే కార్మిక సంఘాలు కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షులు నాతాడి శ్రీధర్ రెడ్డి,ఏరియా కార్యదర్శి రాగం రాజేందర్, బోయిన మల్లేష్,జిల్లా తిరుపతి,రాజా రామ్ కిరణ్, శ్రీధర్,రామకృష్ణ,బాపు, మొగిలి,తిరుపతి,శేఖర్, సురేష్,మహేందర్ పాల్గొన్నారు.

కేంద్ర విధానాలపై ప్రజాసంఘాల ధర్నా

కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకాలను ప్రతిఘటించాలి

నృసంపేట,నేటిధాత్రి:

 

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోరబోయిన కుమారస్వామి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు హన్మకొండ శ్రీధర్ డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా పిలుపులో భాగంగా నర్సంపేట ఆర్డీవో కార్యాలయం ముందు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా అవలంబిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని పిలుపునిచ్చారు.మతం మత్తులో ముంచి ప్రజల ఆస్తులను ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం అంటకట్టుతున్నదని దీంతో దేశంలో ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గడ్డమీదీ బాలకృష్ణ,కందికొండ రాజు,కత్తి కట్టయ్య, పెండ్యాల సారయ్య, బసికె మొగిలి,గోనె మల్లారెడ్డి,కలకోట అనిల్, బుర్రీ ఆంజనేయులు, జినుకల చంద్రమౌళి,కట్కూరి శ్రీనివాసరెడ్డి, సూరయ్య , బాబు, కమతం వెంకన్న, ఎండీ ఫరీదా, విజయ, నాగమణి, స్వప్న, సరిత, కార్తీక్, దాసరి నరేశ్, తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌లో డయల్ 100 దుర్వినియోగం? ప్రజల్లో ఆందోళన

నగరంలో డయల్ 100కు కొత్త అర్థం: సేవకా? లాభమా?

ఆదాయవనరులుగా మార్చుకుంటున్న ప్రైవేట్ డ్రైవర్లు, కొందరు హోమ్ గార్డులు, కానిస్టేబుళ్లు, ర్యాంకర్ అధికారులు?

నేటిధాత్రి, వరంగల్ పోలీస్ కమిషనరేట్.

 

 

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలకు భద్రత కవచం కావాల్సిన డయల్ 100 సేవ, కొందరు రాత్రి పూట డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందికి లాభదాయక వనరుగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో నగరంలో రాత్రివేళ బరాత్‌లు, డీజే లు పెర్మిషన్ లేకుండా కొందరు, తీసుకొని కొందరు సాధారణంగా జరుగుతుంటాయి. రాత్రి పూట సౌండ్ కారణంగా నిద్రలో అంతరాయం కలుగుతోందని విసుగెత్తిన పౌరులు డయల్ 100 ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఆ ఫిర్యాదులు ప్రజలకు న్యాయం చేయడానికి కాకుండా, కొందరు ఖాకీలు చెల్లింపులు సేకరించడానికి వేదికలుగా మారుతున్నాయనే వాదనలు బలపడుతున్నాయి. ఫిర్యాదు సమాచారం వచ్చిన వెంటనే సంబంధిత బీట్ కానిస్టేబుళ్లకు తోడుగా ఒక హోమ్ గార్డ్ లేదా అధికారులకు తోడుగా ఒక ప్రైవేట్ డ్రైవర్ ఘటనాస్థలానికి చేరుతారు. అక్కడ ఫంక్షన్ చేసే వారితో అలాగే డీజే నిర్వాహకులతో హోమ్ గార్డు లేదా ప్రైవేట్ డ్రైవర్ వారి నిజస్వరూపం మొదలు పెడుతారు.. సారుకు నేను చెప్తా కానీ, అంటూ“మేము ఇద్దరం ఉన్నాం… మొత్తం ఆరు కాల్స్ వచ్చాయి…”అంటూ బేరసారాలు. చివరికి కొంత “సర్దుబాటు” జరగడం వల్ల డీజే మళ్లీ యధావిధిగా కొనసాగుతున్నాయని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
ప్రజల సహాయం కోసం నడుస్తున్న సేవ పేరు చెప్పి డబ్బులు తీసుకోవడం ఆందోళనకర విషయం. నెలకు 50 వేలకుపైగా వేతనం పొందుతూ ప్రజల భద్రత కోసం పనిచేయాల్సిన వారు, ఒక హోమ్ గార్డు, ప్రైవేట్ డ్రైవర్ ల పెత్తనానికి డయల్ 100ను అదనపు ఆదాయంగా మార్చుకుంటే ప్రజా విశ్వాసం ఎక్కడ ఉంటుంది? ఖాకీ వ్యవస్థపై నమ్మకం ఉంచి ఫిర్యాదు చేసే పౌరుల స్వరం అక్కడే మూగబోతుంది. న్యాయం కోరడమే తప్పు అని భావించే పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ తరహా చర్యలను కఠినంగా నిరోధించకపోతే, ప్రజాసేవ పట్ల ప్రజల విశ్వాసం కోల్పోవడం తప్పదు.

భూపాలపల్లిలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని బిజెపి నాయకుల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దొంగల రాజేందర్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందించిన మహానీయుడని అన్నారు ఈరోజు ఈ సమాజంలో ఉన్న ప్రజలందరూ విద్య ఉపాధి రాజకీయ రంగాలలో ఈ స్థాయికి ఎదిగారు అంటే భారత రాజ్యాంగం వల్లనే అని ఆయన అన్నారుదేశంలో ప్రతీ పౌరుడికి సమాన హక్కులు కల్పించి, అందరికీ స్వేచ్చను అందించిన రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకుంటూ..
దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బట్టు రవి బిజెపి అర్బన్ అధ్యక్షులు గీస సంపత్ కుమార్, అజ్మీరా రాజునాయక్, .టేకుమట్ల బిజెపి మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు.,పెదవెన కిరణ్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు

భూపాలపల్లి లో టీఆర్పీ నేతల ధర్నా

టి ఆర్ పి నాయకుల ధర్నా

భూపాలపల్లి నేటిధాత్రి

 

తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు భూపాలపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవి పటేల్ రోడ్డు మీద బైఠాయించి తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతరం మాట్లాడుతూ రవి పటేల్ పేర్కొన్నదేమనగా— తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని మాట ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే ఇప్పుడు పాత రిజర్వేషన్ విధానాలకే కట్టుబడి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం కాంగ్రెస్ మోసపూరిత ధోరణికి నిదర్శనమని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రాజకీయ సత్తా చాటే సమయం ఇదేనని, ఈ వర్గాల్ని ఒక్కటిగా కలుపుకొని తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలంగా ముందుకు సాగుతుందని రవి పటేల్ తెలిపారు. “65 శాతం బీసీలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సమూహ బలం కలిసి వస్తే మాత్రమే నిజమైన రాజ్యాధికారం సాధ్యం. ఈ అగ్రవర్ణ పార్టీలు బహుజనులకు న్యాయం చేయవు. కేవలం బీసీల కోసం పుట్టిన పార్టీ మా టీఆర్పీ,” అని అన్నారు.
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్పీ పార్టీ పోటీలో ఉన్నదని, ఆసక్తి ఉన్న వారందరూ తమను సంప్రదించాలని, ఎటువంటి భారీ ఖర్చులేమీ లేకుండానే గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని రవి పటేల్ హామీ ఇచ్చారు.
జిల్లాలో బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బహుజనులు కలసి బుద్ది చెప్పాల్సిన రోజులు వచ్చాయని, పెద్ద ఎత్తున యువత టీఆర్పీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు

భూపాలపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

 

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
బుధవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 27వ తేదీ ఉదయం 10.30 గంటల లోపు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రామపంచాయతీ ప్రధాన కూడళ్లలో ప్రదర్శింపచేయాలని అన్నారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటరు జాబితా కూడా ప్రదర్శింపజేయాలని సూచించారు. నామినేషన్లు ప్రక్రియ ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని ఈనెల 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించాలని తెలిపారు. 30వ తేదీన నామినేషన్లు పరీశీలన, డిసెంబర్ 1వ తేదీన అప్పీళ్లు, 2వ తేదీన డిస్పోజల్, 3వ తేదీన ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. నామినేషన్లు స్వీకరణకు 25 మంది 25 రిటర్నింగ్ అధికారులను నియమించామని తెలిపారు.
ప్రతి రిటర్నింగ్ అధికారుల కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఒక వ్యక్తి గరిష్టంగా నాలుగు సెట్లు నామినేషన్ సెట్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. నామినేషన్ లో ఖచ్చితంగా తేదీ, సమయం, క్రమ సంఖ్య నమోదు చేయాలని సూచించారు. నామినేషన్లలో అభ్యర్థి సంతకం, ధ్రువీకరణ ప్రతిపాదకుని సంతకం ఉండాలని తెలిపారు. మొదటి విడతలో 4 మండలాల్లోని 82 గ్రామపంచాయతీల పరిధిలోని 712 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారి విధులు చాలా కీలకమని ఎన్నికలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
అనంతరం మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల విదులపై పవర్ పాయింట్ ద్వారా అవగహన కల్పించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి , డిపిఓ శ్రీలత ఎంపీడీవోలు, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కేంద్రాలను సివిల్ సప్లై అధికారులు పరిశీలించారు

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన సివిల్ సప్లై అధికారులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

గాంధీనగర్, బుద్ధారం, ఘన్‌పూర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్‌కుమార్ డీఎం, సీఎస్‌సీ రాములు, యూడీఆర్‌ఐ అధికారులతో కలిసి. పరిశీలించారు
ఈ సందర్భంగా పౌర సరఫరాల అధికారి ఇన్‌చార్జీలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎఫ్‌ఏక్యూ (FAQ) ప్రమాణాల మేరకు మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే సంబంధిత బియ్యపు మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని, కేంద్రాలలో తూకం, బిల్లింగ్, రవాణా ప్రక్రియలను పర్యవేక్షిస్తూ పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా పూర్తిస్థాయిలో బాధ్యతతో పని చేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో
ఆర్ ఐ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తుడుం దెబ్బ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ అభివృద్ధి కోరింది

క్రీడా పాఠశాలలో వసతులు కరువు

ఆగ్రహం వ్యక్తం చేసిన తుడుం దెబ్బ నాయకులు

కొత్తగూడ, నేటిధాత్రి:

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలo లో ఉన్న మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ను ఆదివాసీ హక్కుల పోరాట సమితి “తుడుం దెబ్బ” నాయకులు సందర్శించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు…అనంతరం మాట్లాడుతూ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ లో 5 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు మొత్తం 240 మంది విద్యార్థులు ఈ స్కూల్ లో చదువుతున్నారు.స్పోర్ట్స్ స్కూల్ అంటే ముక్యంగా ఉండవలసింది మంచి రన్నింగ్ ట్రాక్, గ్రౌండ్ ఇక్కడ ఉన్న ట్రాక్ ఆధ్వనంగా ఉండడమే కాకుండా ట్రాక్ మొత్తం రావుతులు బయటికి వచ్చి గుంతలు పడి, ట్రాక్ పక్కన ఉన్న కాలువ నీళ్లు ట్రాక్ పై వచ్చి బురద అవుతుంది. గడ్డి మొలిసి ఇబ్బంది కరంగా ఉంది.
విద్యార్థులకు సరైన టాయిలెట్స్,ఫాన్స్, కరెంట్ సమస్యలతో స్నానం చేయడానికి నీళ్లు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు.గ్రౌండ్ లో పిచ్చి మొక్కలు పెరిగి ఆధ్వనంగా ఉన్నపటికీ గ్రౌండ్ లో ఉన్న స్టేజ్ దిమ్మలు పగిలి రాడ్స్ మొత్తం కూడా విరిగి కింద పడ్డాయి.
ఇంత ఆధ్వనంగా ఉన్న కూడా అధికారులు పట్టించుకోకుండo లేదు అని తీవ్రంగా మండిపడ్డారు.
ఏజెన్సీ గ్రామీణ క్రీడలు అయిన అర్చరి, వాలీ బాల్, ఖో-ఖో గేమ్స్ ని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ లో ఏర్పాటు చేసి కోచ్ లను నియమించాలని డిమాండ్ చేశారు.
డీడీ, ఐ టిడిపివో జిల్లా కలెక్టర్, స్థానిక మంత్రివర్యులు గార్లు స్పందించి కొత్తగూడ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ బాయ్స్ నందు సింతటిక్ ట్రాక్&గ్రౌండ్ చుట్టూ పెన్సింగ్,నూతన స్టేజ్ ఏర్పాటు చేయాలనీ ఇప్పుడు ఉన్న టాయిలెట్స్ ని రిపేర్ చేసి మరికొన్ని టాయిలెట్స్ ని ఏర్పాటు చేయాలి వసతి గృహంలో నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల కోసం అదనంగా 2 బోర్లు ఏర్పాటు చేసి ఫాన్స్ & కరెంటు సమస్యలు వేంటేనే పరిష్కరించి విద్యార్థుల బంగారు భవిషత్తు కు బాసటగా నిలవాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేసి మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ని అభివృద్ధి చేసి ట్రైబల్ స్టేట్ మీట్ గేమ్స్ జరిగేలా అధికారులు దృష్టి పెట్టాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి “తుడుం దెబ్బ” నాయకులు డిమాండ్ చేశారు.
కార్యక్రమం లో “తుడుం దెబ్బ” నాయకులు పూనేం సందీప్ కుంజ నర్సింగ రావు ఈసం వెంకన్న ఇర్ప రవి తదితరులు పాల్గొన్నారు

అప్పాని శ్రీనివాస్ కొత్త కార్మిక కోడ్లకు మద్దతు

తప్పుడు ఆరోపణలు చేస్తున్న కార్మిక సంఘాలు

అప్పాని శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి ఏరియా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో, భూపాలపల్లి ఏరియా ఉపా ధ్యక్షులు వెలబోయిన రజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ సి ఎంకెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
అప్పాని శ్రీనివాస్ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన నాలుగు కార్మిక చట్టాల కోడ్లు కార్మికులందరికీ అనుకూలంగా ఉండడంతో బి ఎం ఎస్ కార్మిక సంఘం వాటిని పూర్తిగా సాగదీస్తుంది భారత దేశంలో అసంఘటిత, వలస, గిగ్, ప్లాట్‌ఫారమ్ అనధికార రంగాలు దాదాపు 40 కోట్ల మంది కార్మికులకు తొలిసారిగా చట్టబద్ధమైన సామాజిక భద్రత వ్యవస్థలోకి రావడం. ఈ కోడ్ల అత్యంత కీలకమైన ప్రయోజనమని గ్రహించాలి.
వేజ్ కోడ్ కనీస వేతన హక్కు
సకాలంలో, పారదర్శకంగా జీతం చెల్లింపు సమాన పనికి సమాన వేతనం
బోనస్, అలవెన్సులపై స్పష్టమైన నియమాలు డిజిటల్ మీడియాలో కాంట్రాక్ట్ / స్ట్రింగర్ / ప్రాజెక్ట్ బేస్డ్ పనిచేసే వారికి ఇది అతిపెద్ద భద్రతా కవచం.
ఏమి మారింది? పాత్రికేయ నిర్వచనం విస్తృతమైంది
ఇప్పటివరకు “వర్కింగ్ జర్నలిస్ట్” అనే పదం ప్రధానంగా
ఇప్పుడు ఆ నిర్వచనం విస్తరించి మూడు పెద్ద రంగాలనూ జతచేసుకుంది:
డిజిటల్ / ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్
టీవీ న్యూస్ & ఎలక్ట్రానిక్ మీడియా
రేడియో / ఎఫ్‌ఎం / కమ్యూనిటీ రేడియో పాత్రికేయులు
ఫలితంగా డిజిటల్-ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌లపై వార్తా కంటెంట్ తయారుచేసే అతిపెద్ద వర్గం ఇక అధికారికంగా కార్మిక రక్షణ పరిధిలోకి వచ్చేసింది. ముందస్తు లేఖలు
ధర్నాలు-నిరసనలు
కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖతో చర్చలు
పార్లమెంటరీ కమిటీలకు సూచనలు కొత్త కోడ్ డ్రాఫ్ట్‌లపై అభ్యంతరాలు
ఈ అన్ని కృషే ఈ మార్పుకు పునాది వేశాయి. అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో వెలబోయిన సుజెందర్ బ్రాంచి ఉపాధ్యక్షులు. పాండ్రాల మల్లేష్ పని రమేష్ కొత్తూరు మల్లేష్ రఘుపతి రెడ్డి అన్నం శ్రీనివాస్. తాండ్ర మొగిలి. దాసరి ఓదెలు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version