కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించండి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి నేటిధాత్రి
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 24, 25, 23 వార్డులు టీ – 2 క్వార్టర్స్, కారల్ మార్క్స్ కాలనీ, 6 ఇంక్లైన్ రోడ్డు రాజీవ్ నగర్ కాలనీలల్లో సీపీఐ సీపీఐ(యం) పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు వేముల జ్యోతి – శ్రీకాంత్, పొనకంటి మేఘన – శ్రీనివాస్, శిరుప స్వప్న – అనిల్ ల గెలుపు కొరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజుకుమార్, సీపీఐ(యం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు, ముఖ్య నాయకులు ఆయా వార్డుల ఎన్నికల ఇంచార్జీ లతో కలిసి ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులల్లో నిర్వహించిన పబ్లిక్ కార్నర్ మీటింగ్ లలో ఎమ్మెల్యే మాట్లాడారు. అంతకుముందు 22వ వార్డుకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అంతకుముందు 22వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను ప్రారంభించారు. 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ముంజాల రవీందర్ గౌడ్ కు చెందిన ఎన్నికల ప్రచార రథాన్ని ఎమ్మెల్యే జీఎస్సార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
