నెక్కొండ మండలంలో వైద్య శిబిరం
#నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండల వైద్యాధికారి డా. సుమన్ ఆధ్వర్యంలో గొల్లపల్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 115 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేపట్టగా, 11 మందికి రక్త నమూనా పరీక్షలు నిర్వహించారు.
అదేవిధంగా గ్రామంలో వైద్య సిబ్బంది ఫీవర్ సర్వే నిర్వహించి, ‘ఫ్రైడే డ్రై డే’ పాటించేలా ప్రజలను అప్రమత్తం చేశారు. దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీజనల్ వ్యాధులు అయిన జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం వంటి సమస్యలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో పల్లె దవాఖాన వైద్యుడు డా. రాహుల్, హెల్త్ అసిస్టెంట్లు రవిచంద్ర రెడ్డి, నాగలక్ష్మి, ఆశ కార్యకర్తలు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
