కేంద్ర బృందం పరిశీలించింది.
మరమత్తులు ఎప్పుడు?
నిజాంపేట: నేటి ధాత్రి
గత వర్షాలకు దెబ్బతిన్న నందిగామ 765 డీజీ రోడ్డు పై వంతెన, నిజాంపేట మల్కచెరువు మత్తడి రహదారి నేటికి పునర్నిర్మాణానికి నోచుకోలేదు. అధికారులు తాత్కాలిక మరమ్మత్తులు చేసినా, శాశ్వత పరిష్కారం లభించలేదు. కేంద్ర బృందం వచ్చి నష్టాన్ని పరిశీలించిన పనులు ప్రారంభం కాకపోవడం పై స్థానికులు మండిపడుతున్నారు. నిజాంపేట – నస్కల్ గ్రామాల మధ్య ప్రయాణం నరకప్రాయంగా మారిందని, వెంటనే నూతన బ్రిడ్జి ఏర్పాటు ఏర్పాటు చెయ్యాలంటున్నారు.
