3వ వార్డు అభ్యర్థి పిల్లలమర్రి శారద నారాయణ గెలిపించండి…

3వ వార్డు అభ్యర్థి పిల్లలమర్రి శారద నారాయణ గెలిపించండి

బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పిల్లలమర్రి శారద నారాయణ 16వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జ్యోతుల మంజుల ని గెలిపించాలంటు ప్రచారం నిర్వహించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గత 10 ఏళ్లుగా నిజాయితీతో, నిబద్ధతతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం పని చేశాం.
రాబోయే సంవత్సరాల్లో కూడా అవినీతికి తావు లేకుండా పనిచేస్తానని మాట ఇస్తున్నాం.అందుకే మీ అందరి ఆశీర్వాదం అవసరం. భూమి పట్టాల విషయంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే స్పష్టంగా చెప్పా, ప్రైవేట్ పట్టా భూముల విషయంలో, పట్టాదారులను ఒప్పించి ప్రభుత్వానికి గిఫ్ట్ డీడ్ ఇచ్చి, ఎమ్మార్వో ద్వారా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పడం జరిగింది ఆ దిశగా పనిచేసినం,త్వరలోనే వాళ్ళని ఒప్పించి మీకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
3వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్దిగా పోటీచేస్తున్న పిల్లలమర్రి శారద నారాయణ ని 16వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న జ్యోతుల మంజుల ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఎక్కిలి దేవికుంటలో కోనాపురం ఇందిరమ్మ ప్రచారం జోరు…

ఎక్కిలి దేవికుంటలో కోనాపురం ఇందిరమ్మ ప్రచారం జోరు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, కోహిర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎక్కిలి దేవికుంట (1వ వార్డు) బిఆర్ఎస్ అభ్యర్థి కోనాపురం ఇందిరమ్మ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. “అభివృద్ధిని చూడండి.. ఆశీర్వదించండి” నినాదంతో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. బుధవారం జరిగిన ప్రచారంలో మహిళలు, వార్డు ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గతంలో వార్డులో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈసారి ‘కారు’ గుర్తుపై భారీ మెజార్టీతో గెలుస్తామని, ఎక్కిలి దేవి కుంటను నంబర్ వన్ వార్డుగా తీర్చిదిద్దుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

కోహిర్ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం: తలారి సతీష్

కోహిర్ పట్టణంలోని 2వ వార్డు భీమ్ నగర్ కాలనీ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి తలారి సతీష్, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఇంటింటి ప్రచారానికి సిద్ధమైన ఆయన, కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేస్తూ పథకాలు అందరికీ అందుతున్నాయని, వార్డు ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని పేర్కొన్నారు. గతంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేశానని, మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే వార్డు సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని ప్రజలను కోరారు.

అంచున పొంచి ఉన్న ప్రమాదం…

అంచున పొంచి ఉన్న ప్రమాదం

ఆదమరిస్తే అనంత లోకాలకి

ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు
గుండాల,భద్రాద్రికొత్తగూడెం

జిల్లా,నేటిధాత్రి :

 

గుండాల నుండి మణుగూరు వెళ్లే ప్రధాన రహదారి సాయనపల్లి గ్రామ సమీపంలో రహదారి మృత్యు మార్గంగా మారింది, ఆ రహదారి నుంచి వెళ్లే ప్రయాణికులు ఆదమరిస్తే అనంత లోకాలకు పోవడం ఖాయమని ఆదివాసీ నాయకులు సాయనపల్లి గ్రామానికి చెందిన వాగబోయిన చంద్రయ్య దొర అన్నారు. అయన మాట్లాడుతూ గత వర్షాకాలం సీజన్లో వరద ప్రవాహానికి కలవాటు కోతకు గురై ప్రమాదకరంగా మారింది స్థానిక పంచాయతీ అధికారులు ఆర్ అండ్ బి అధికారులు ఇంతవరకు ఈ సమస్యపై దృష్టి సారించకపోవడంతో ప్రమాదకర మలుపుగా మారింది ప్రయాణికులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పలుమార్లు స్థానిక అధికార్ల కు చెప్పితే ఆర్ అండ్ బి అధికారలుకు తెలియజేసిన రెండు మూడు రోజులలో సరిచేస్తాం అని చెబుతున్నారే తప్ప సమస్యను పరిష్కరించడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకముందే ప్రమాదకరమైన ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన అన్నారు.

ప్రమాదకరమైన మూల మలుపు… హెచ్చరిక బోర్డు ఏది…

ప్రమాదకరమైన మూల మలుపు… హెచ్చరిక బోర్డు ఏది…?

ఆదమరిస్తే ఇక అంతే…!సరాసరి వాగులోకే…!

ఇది కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా…! లేక అధికారుల నిర్లక్ష్యమా…?

ప్రమాదాలు జరిగాకే హెచ్చరిక బోర్డులు పెడతారా…!

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలంలోని వెంకటగిరి గ్రామం నుండి కాట్రపల్లి గ్రామానికి పంచాయతీరాజ్ శాఖ నూతనంగా నిర్మించిన సరికొత్త తార్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగింది. ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులలో మారుమూల ప్రాంతాల ప్రజల యొక్క రవాణాకు సౌకర్యార్థం కొరకు పంచాయతీరాజ్ శాఖ ద్వారా రోడ్డు నిర్మాణ పనులు జరగగా రోడ్డు నిర్మాణ పనులలో భాగంగా మూల మలుపుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదని అటుగా వెళ్లే వాహనదారులు ఆరోపిస్తున్నారు. కొత్తగా నిర్మించిన రోడ్డు కావడంతో వాహనాలను స్పీడుగా దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్తగా ప్రయాణించే వాహనదారులకు అత్యంత ప్రమాదకరమైన మూలమలుపు లను గమనించలేరని అలాంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన మూలమలుపు వట్టి వాగు సమీపాన ఉన్నందున అలాంటి ప్రమాదకరమైన మూలమలుపు చోట అధికారులు ఎందుకు హెచ్చరిక మరియు మూలమలుపు సూచిక బోర్డు ఏర్పాటు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు చిన్న బోర్డు ఏర్పాటు చేసినా కానీ ఆ బోర్డు మీద సింబల్ కుడి వైపు వెళ్లాలని సూచించే విధంగా లేదని అది కూడా ప్రమాదం పొంచి ఉండే ఎడమవైపు చూపియ్యడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని మండిపడుతున్నారు. అత్యంత ప్రమాదకరంగా ఉండే మూలమలుపు వద్ద రోడ్డు పక్కనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి ఉన్నందున వాహనదారులు అదుపుతప్పితే సరాసరి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లోకి వాహనం దూసుకెళ్లే ప్రమాదం పొంచి ఉందని ట్రాన్స్ఫార్మర్ ప్రదేశంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, అత్యంత ప్రమాదకరమైన మూలమలుపు ఉందని సూచించే బోర్డులు ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి మనుషుల ప్రాణాలు బలి కావాల్సిందేనా అని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకముందే ప్రమాదాలను అరికట్టే విధంగా ప్రమాద సూచికల బోర్డును ఏర్పాటు చేయాలని అటుగా వెళ్లే వాహనదారులు కోరుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version