న్యాల్కల్ దర్గా ఉర్సు జాతరలో భక్తజన సందోహం…

న్యాల్కల్ దర్గా ఉర్సు జాతరలో భక్తజన సందోహం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని హజ్రత్ పీరైబ్ సాహెబ్ దర్గా వద్ద బుధవారం జరిగిన ఉర్సు జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. జిల్లాలోని పలు గ్రామాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు పీరైబ్ సాహెబ్కు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దువ్వా, నియాజ్, మొక్కులు చెల్లించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, మహిళలు, పిల్లలు, వృద్ధులు కూడా హాజరై జాతర వాతావరణం భక్తిశ్రద్ధలతో నిండిపోయింది. భక్తుల రాకతో దర్గా పరిసరాల్లో సందడి నెలకొంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version