ఎక్కిలి దేవికుంటలో కోనాపురం ఇందిరమ్మ ప్రచారం జోరు…

ఎక్కిలి దేవికుంటలో కోనాపురం ఇందిరమ్మ ప్రచారం జోరు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, కోహిర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎక్కిలి దేవికుంట (1వ వార్డు) బిఆర్ఎస్ అభ్యర్థి కోనాపురం ఇందిరమ్మ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. “అభివృద్ధిని చూడండి.. ఆశీర్వదించండి” నినాదంతో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. బుధవారం జరిగిన ప్రచారంలో మహిళలు, వార్డు ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గతంలో వార్డులో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈసారి ‘కారు’ గుర్తుపై భారీ మెజార్టీతో గెలుస్తామని, ఎక్కిలి దేవి కుంటను నంబర్ వన్ వార్డుగా తీర్చిదిద్దుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

కోహిర్ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం: తలారి సతీష్

కోహిర్ పట్టణంలోని 2వ వార్డు భీమ్ నగర్ కాలనీ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి తలారి సతీష్, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఇంటింటి ప్రచారానికి సిద్ధమైన ఆయన, కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేస్తూ పథకాలు అందరికీ అందుతున్నాయని, వార్డు ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని పేర్కొన్నారు. గతంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేశానని, మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే వార్డు సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని ప్రజలను కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version