3వ వార్డు అభ్యర్థి పిల్లలమర్రి శారద నారాయణ గెలిపించండి
బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పిల్లలమర్రి శారద నారాయణ 16వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జ్యోతుల మంజుల ని గెలిపించాలంటు ప్రచారం నిర్వహించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గత 10 ఏళ్లుగా నిజాయితీతో, నిబద్ధతతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం పని చేశాం.
రాబోయే సంవత్సరాల్లో కూడా అవినీతికి తావు లేకుండా పనిచేస్తానని మాట ఇస్తున్నాం.అందుకే మీ అందరి ఆశీర్వాదం అవసరం. భూమి పట్టాల విషయంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే స్పష్టంగా చెప్పా, ప్రైవేట్ పట్టా భూముల విషయంలో, పట్టాదారులను ఒప్పించి ప్రభుత్వానికి గిఫ్ట్ డీడ్ ఇచ్చి, ఎమ్మార్వో ద్వారా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పడం జరిగింది ఆ దిశగా పనిచేసినం,త్వరలోనే వాళ్ళని ఒప్పించి మీకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
3వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్దిగా పోటీచేస్తున్న పిల్లలమర్రి శారద నారాయణ ని 16వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న జ్యోతుల మంజుల ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
