ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

 

బుధవారం రేగొండ మహాత్మా జ్యోతి భా పూలే బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన సామాజిక న్యాయ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతి బా పూలే చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాలు, మహిళలు, దివ్యాంగులు, వెనుకబడిన తరగతుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.
సామాజిక న్యాయం ద్వారా సమానత్వం, సమాన అవకాశాలు, గౌరవప్రదమైన జీవనం సాధ్యమవు తాయని తెలిపారు. ప్రతి పౌరుడు చట్టపరమైన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. వివక్షకు తావు లేకుండా సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అనంతరం సామాజిక న్యాయం పాటింపుపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేపించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ హరికృష్ణ, సహాయ బిసి సంక్షేమ అధికారి క్రాంతి కిరణ్, తహసీల్దార్ శ్వేతా, ఎంపిడిఓ వెంకటేశ్వర రావు, డిసిఓ స్వప్న, ప్రిన్సిపాల్ అపర్ణ, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version