కారేపల్లి టు పెరుపల్లి రోడ్డు నాసిరకంగా నిర్మాణం…

కారేపల్లి టు పెరుపల్లి రోడ్డు నాసిరకంగా నిర్మాణం.

వేసిన కోద్ది రోజుల్లోనే పాడైపోతున్న వైనం.

అధికారులు పట్టించు కోరా వాహనదారుల ఆవేదన.

కారేపల్లి. నేటి ధాత్రి

 

ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రము నుండి మాదారం వేళ్ళే ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణం కారేపల్లి రైల్వే గేటు వద్ద నుండి పెరుపల్లి వరకు ప్రజల సౌకర్యార్థం పాతరోడ్డు డ్యామెజీ అయిన దాన్ని తోలగించి కోత్త రోడ్డు నిర్మాణం చేపట్టారు వేసిన కోద్దిరోజుల్లోనే రోడ్డు పాడైపోయిన వైనం చూస్తే ఈరోడ్డు నిర్మాణం నాసిరకంగా నిర్మించినట్లుగా తెటతెల్లం అవుతుంది రోడ్డుని వేసిన కోద్దిరోజుల్లోనే పాడైపోయి వాహన దారులకు ప్రజలకు ప్రయాణంలో ఇబ్బందులు పడుతు యాక్సిడెంట్స్ కి గురి అవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డు నిర్మాణం నాసిరకంగా నిర్మించినందునే వేసిన కోద్దిరోజుల్లోనే పాడైపోయినదని దాన్ని వేసిన కాంట్రాక్టర్లు రిపేరు చేసిన ఫలితం లేకుండా పోయిందని మరల రోడ్డు మరమత్తులు చేసిన కోద్దిరోజుల్లోనే పాడైపోయిందని నాసిరకంగా నిర్మించినందునే రోడ్డు దెబ్బ తింటున్నదని ప్రజలు వ్యక్తం చేశారు వాహనాలపైన వెళ్ళే వారు ప్రమాదంలో పడి యాక్సిడెంట్స్ జరిగే దుస్థితి స్తితి నేల కోన్నదని వేంటనే అధికారులు చర్యలు చేపట్టి నాసిరకంగా రోడ్డు నిర్మించిన దాన్ని పరిశీలించి రోడ్డు మరమత్తులు వేంటనే చేయాలని వాహనదారులు ప్రజలు వారి ఆవేదనలు వ్యక్తపరుస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version