సంఘ సేవల్లో యువత ముందుకు రావాలి.

సంఘ సేవల్లో యువత ముందుకు రావాలి.

ఘనంగా నేతాజీ పురుషుల పొదుపు సంఘం సిల్వర్ జూబ్లీ మహోత్సవం.

నర్సంపేట నేటిధాత్రి:

గ్రామీణ ప్రజల్లో సమిష్టిగా పొదుపు చేయు అలవాట్లు ప్రవేశపెట్టి సంఘటితంగా సహకార శక్తిని పెంపొందించడం కోసం స్వకృషి ఉద్యమం పనిచేస్తుందని ఈ క్రమంలో సంఘాలు మరింత అభివృద్ధి చెందాలంటే యువత సంఘానికి సేవలు అందించడానికి ముందుకు రావాలని దుగ్గొండి పురుషుల పొదుపు సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నీల రవీందర్,ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ అన్నారు.నర్సంపేట మండలంలోని కమ్మపల్లి గ్రామంలో గల నేతాజీ పురుషుల పొదుపు సంఘం 25 వ వార్షికోత్సవం సిల్వర్ జూబ్లీ మహోత్సవం కార్యక్రమం సంఘం అధ్యక్షుడు పెండ్యాల మల్లేశం అధ్యక్షతన సంఘం కార్యాలయం వద్ద జరిగింది.ముందుగా సంఘ 2024-25 వార్షిక ఆదాయ వ్యయాల నివేదికలను సంఘం అధ్యక్షుడు మల్లేశం,గణకుడు
ధూపటి వెంకటేశ్వర్లు ప్రవేశ పెట్టారు.1996లో వ్యవస్థాపక అధ్యక్షుడు ముఖ్య అతిథిగా వల్గుబెల్లి రంగారెడ్డి స్థాపించగా అనేక ఒడుదొలుగులతో నేడు ఉత్తమ సంఘంగా రజతోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషకరం అని సంఘం సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ముఖ్య అతిదులుగా హాజరైన నీల రవీందర్ మాట్లాడుతూ గ్రామాల్లో స్వకృషి ఉద్యమ పొదుపు సంఘాలు అంటే ఒక బంగారుబాతులాంటివని కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్యులే అని పేర్కొన్నారు.సభ్యులు సంఘాలను పునాదులుగా ఉంటే తల్లిదండ్రుల పాత్ర పాలకవర్గ సభ్యులు పోషించాల్సి ఉంటున్నదన్నారు.సహకార వికాస సంస్థ ఎలాంటి లాబార్జిత పొందకుండా సేవలు అందిస్తున్నదని సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో
సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు వల్గుబెల్లి రంగారెడ్డి,సంఘ ఉపాధ్యక్షులు గంగిడి రాజిరెడ్డి పాలకవర్గ సభ్యులు చిట్టోజు రాము, పంజాల భాస్కర్, వల్గుబెల్లి మోహన్ రెడ్డి, మిట్టగడపల సాంబయ్య,అన్నం లింగారెడ్డి,ఓదెల రవి,మెరుగు రాజు, ఒద్దుల బుచ్చిరెడ్డి, వంగపెల్లి కమలాకర్ రెడ్డి, మిట్టగడపల బాబు,మాజీ అధ్యక్షులు నరహరి కట్టారెడ్డి, సాంబరాతి శ్రీనివాస్, చిట్టొజు రమణ చారి,పెండ్యాల మల్లేశం,సాంబరాతి రమేష్, చిట్టోజు రాము,గంగిడి రాజిరెడ్డి, వ్యవస్థాపక పాలకవర్గం లింగాల నరసయ్య, దొడ్డు జయపాల్ రెడ్డి,మాజీ వ్యవస్థాపక పాలకవర్గం సభ్యులు,సమితి పరిది సంఘాల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్,ప్రభాకర్,రాయరాకుల రమేష్,బాబు,సమితి గణకుడు రమణాచారి,సభ్యులు పాల్గొన్నారు.

services

నూతన అధ్యక్ష,ఉపాధ్యక్షుల ఎన్నిక..

నేతాజీ పురుషుల పొదుపు సంఘం 2025-26 సంవత్సరానికి గాను అధ్యక్ష ఉపాధ్యక్షుల ఎన్నికల కోసం ఎన్నికల అధికారి కందుల శ్రీనివాస్ గౌడ్ చేపట్టగా అధ్యక్షులుగా అన్నం లింగారెడ్డి,ఉపాధ్యక్షులుగా మేర్గు రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్,సంఘం అధ్యక్షుడు మల్లేశం,ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి పాలకవర్గం పాల్గొన్నారు.

విద్యార్థుల పట్ల వివేక్షత చూపుతున్న సెక్రటరీ అలుగు వర్షిని.!

విద్యార్థుల పట్ల వివేక్షత చూపుతున్న సెక్రటరీ అలుగు వర్షిని సస్పెండ్ చేయాలి.

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా సెక్రెటరీ మారేపల్లి మల్లేష్.

చిట్యాల నేటిధాత్రి :

రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకులాలకు సంబంధించి 12 జూనియర్ కళాశాలను మూసివేయడానికి కుట్టలు చేస్తున్న ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తూ ఎస్సి విద్యార్థుల పట్ల వివక్షత చూపుతున్న సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని తొలగించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ డిమాండ్ చేస్తున్నా ము. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఎస్సీ విద్యార్థుల కోసం పెద్ద పీఠం వేస్తున్న తరుణంలో సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని జోగులాంబ గద్వాల కరీంనగర్ చొప్పదండి ఖమ్మం మహబూబాద్ సిద్దిపేట సంగారెడ్డి కామారెడ్డి జయశంకర్ భూపాలపల్లి జనగాం మేడ్చల్ మల్కాజిగిరి ఈ 12 జిల్లాల ఎస్సీ గురుకులాల కళాశాలలను సరిపడా విద్యార్థులు లేరని సాకులతో మూసివేయడం సరికాదన్నారు విషయం సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ గురుకుల మంత్రి పొన్నం ప్రభాకర్ కు తెలియపరుస్తాం అలాగే 2025 విద్య సంవత్సరంలో నుండి అక్కడ చదువుతున్న విద్యార్థులు ఎక్కడికి పోవాలి తెలియక ఆందోళన చెందుతున్నారని వాపోయారు ఆమె నిర్ణయం పట్ల దళిత విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వాపోయారు ఒకే కాలేజీలో రెండు కోర్సుల చొప్పున ఇంటర్ ప్రాథమిక సంవత్సరంలో 120 ద్విత సంవత్సరంలో 120 మంది మొత్తం 240 సీట్లు ఉంటాయన్నారు 12 గురుకులాల్లో జూనియర్ కళాశాలలు మూసివేయడం వల్ల సీట్లు రద్దు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు దీనివల్ల నిరుపేద దళిత విద్యార్థులు గురుకుల విద్యను కోల్పోతారన్నారు. ఈ విషయాన్ని గమనించి సీఎం స్పందించి ఎస్సి విద్యార్థులను ఆదుకోవాలని అన్నారు లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాం.

బీడీ కార్మికులకు వెయ్యి బీడీలకు 261.

బీడీ కార్మికులకు వెయ్యి బీడీలకు 261. పైసల. కూలి ఏప్రిల్ నెల నుండి చెల్లించాలి

కార్మికుల వద్ద నుండి ప్రతి నెల
2000 బీడీల వేతనం దోపిడి చేస్తున్న యజమాన్యంపై కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి

సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బి.వై నగర్ అమృత లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ సి.ఐ.టి.యు అధ్యక్షులు ముశం రమేష్
మాట్లాడుతూ బీడీ కార్మికులకు ప్యాకర్ నెలసరి ఉద్యోగులందరికీ కరువు భత్యం డి.ఏ అన్ని కలుపుకొని. 1000 బీడీలకు పది రూపాయల 40 పైసలు పెరగడం జరిగింది ప్రస్తుతం ఉన్న కూలి పెరిగిన కూలి కలుపుకుంటే 1000 బీడీలకు మొత్తం కూలి 261. 40 రూపాయల పైసలు. కార్మికులకు. నాలుగో నెల నుండి బీడీ యజమాన్యం చెల్లించాలని అన్నారు ప్యాకర్ కు రోజుకు పది రూపాయలు 40 పైసలు పెంచడం జరిగింది
బీడీ కార్మికుల నుండి యజమాన్యం పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతుందని కార్మికుల. వద్దనుండి నెలకు ఎన్ని బీడీలు చేసినా కూడా 2000 బీడీల వేతనం కట్ చేసుకుని ఇస్తున్నారు 2000 బీడీల వేతనం అంటే 552 కూలి కార్మికులు కోల్పోతున్నారు. ఈ లెక్కన కార్మికుల వద్ద నుండి బీడీ ఏమో అని కొన్ని కోట్ల రూపాయల శ్రమను దోచుకుంటున్నది దానికి తోడు గంపకట్ట పేరుతోటి అదేవిధంగా అనేక రకాల పేర్లు చెప్పుకుంటూ కార్మికుల వద్ద నుండి నెలకు 40.50 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది కార్మికులకు పని చేస్తే 3000 వరకు వేతనం వస్తే అందులోకి అన్ని కటింగ్లు పోను 1500 కూడా కార్మికుల చేతిలోకి రావడం లేదు ఈ రకంగా బీడీ కార్మికులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు.బీడీ పరిశ్రమలపై లేబర్ అధికారుల తనిఖీలు లేకపోవడంతో బీడీ యజమానుల ఇష్టారాజ్యంగా మారింది కంపెనీల .బీడీలనే నగదు బీడీల పేరుతో కార్మికులతో చేయించుకుని ఒక వెయ్యికి 50 రూపాయల కూలీ తక్కువ చెల్లిస్తున్నారు
దాంతో పాటు పి.ఎఫ్ ఎగ్గొడుతున్నారు.
నగదు బీడీలు చేయిస్తున్న వారిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటే ఎల్లారెడ్డి,బీడీ నాయకులు సూరం పద్మ, జిందం కమలాకర్ పాల్గొన్నారు

గ్రామపంచాయతీ నూతన భవనానికి మోక్షం ఎప్పుడో.

గ్రామపంచాయతీ నూతన భవనానికి మోక్షం ఎప్పుడో!

ఏండ్లు గడుస్తున్న భవన నిర్మాణం కలగానే మిగిలి పోయిందా!

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలో నూతన గ్రామపంచాయతీ భవనానికి మోక్షం ఎప్పుడో అనేది మండల ప్రజలు ఆలోచనలో పడ్డారు. గత ప్రభుత్వం నూతన భవనానికి శంకుస్థాపనలు చేసి పనులు మొదలు పెట్టకపోవడం వల్ల ప్రజాప్రతినిధులు అధికారుల మీద ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు.మెరుగైన పాలన అందించేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయాలను నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి భవనాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక రూపొందించాలి.గత ప్రభు త్వం పంచాయితీ కార్యాల నిర్మాణానికి నిధులు మంజూ రు చేసిన కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గ్రామాల అభివృద్ధి ద్యేయం కాబట్టి స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని నూతన భవన నిర్మాణానికి అవకాశం కల్పించి, త్వరగా నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని ప్రజలు కోరుతు న్నారు.గత ప్రభుత్వం అభి వృద్ధి చేయని ఘనత. ఎక్కడ ఉన్న గొంగడి అక్కడే ఉన్నట్టు అనిపించింది. దీంతో గ్రామపం చాయతీ నూతన భవనానికి మోక్షం కలుగుతుందా.

Panchayat

నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మించండి

కందగట్ల సంతోష్ శాయం పేట మండల నివాసి

శాయంపేట మండల కేంద్రంలో నివసిస్తున్న కందగట్ల సంతోష్ మాట్లాడుతూ గ్రామపంచాయ తీ కార్యాలయంలో గదులు లేక ఆరు బయటనే సమావే శాలు, వస్తువులను భద్రపర చడం, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం, వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం సాధ్యం కావట్లేదు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి.మండల మేజర్ గ్రామపంచాయతీ కాబట్టి నూతన భవనాన్ని ప్రత్యేక హంగులతో ప్రభుత్వం భవన నిర్మాణం చేపట్టాలి. నూతన భవన నిర్మాణం పూర్తి చేస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతుంది కాబట్టి భవన నిర్మాణ పనులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతు న్నారు.

అంగన్వాడి ఆయా దహన సంస్కారాలకు.!

అంగన్వాడి ఆయా దహన సంస్కారాలకు 10 వేల రూపాయల అందజేత.

డి డబ్ల్యు ఓ. మల్లేశ్వరి.

చిట్యాల నేటి దాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని అందుకు తండా గ్రామ మొదటి అంగన్వాడీ కేంద్రం ఆయా బానోత్ విమలమ్మ 56 సంవత్సరాలు మంగళవారం రాత్రి అనగా 27వ తేదీ రోజు రాత్రి 11 గంటలకు చనిపోయిన విషయం తెలుసుకున్న జిల్లా ఇన్చార్జి డీ డబ్ల్యు ఓ మల్లేశ్వరి విషయాన్ని జయప్రద సూపర్వైజర్ ద్వారా తెలుసుకొని జిల్లాకు మారుమూల ప్రాంతమైన అందుకు తండా గ్రామానికి హుటా హుటిన చేరుకొని దహన సంస్కారాల కోసం పదివేల రూపాయలను వారి కుటుంబ సభ్యులైన కొడుకులు కోడళ్ళకు అందించి నారు, ఒక జిల్లా అధికారిగా ఆమె ఔన్నత్యాన్ని చూపించి, చాలా బీద కుటుంబం అయినందున ప్రభుత్వం నుండి ముందు ముందు అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తామని కుటుంబ సభ్యులందరికీ ఓదార్పును కల్పించారు. డబ్ల్యు ఓ వెంట జయప్రద సూపర్వైజర్ అంగన్వాడీ టీచర్స్ రజిత,ప్రమీల ఆయాలు ఉన్నారు.

బండిల దొడ్డి లాగా మారుతున్న ప్రభుత్వ బడులు.

బండిల దొడ్డి లాగా మారుతున్న ప్రభుత్వ బడులు , కనీసం పాఠశాలలు ప్రారంభమయ్యే వరకైనా కనీస మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్……….

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిటిఎల్ రవి

మంగపేట నేటి ధాత్రి:

 

ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభం అయ్యేవరకు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలని భారతీయ విద్యార్థి ఫెడరేషన్ మండపేట మండల కమిటీ మంగపేట తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ఐ ఏసుపాదం కి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి, ఎల్. రవి మాట్లాడుతూ. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.. కనీసం పాఠశాల ప్రారంభం అయ్యేవరకు మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇప్పటికే వర్షాలు ప్రారంభమై పాఠశాల ఆవరణ లో గదులలో ప్లడ్డు చేరి విష జ్వరాలు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని ఆ ఆవరణలో పాఠశాలలను పరిశుభ్రం చేసి మరుగుదొడ్లు నిర్మించి , కరెంటు, త్రాగు నీరు, ఉచిత టెక్స్ట్ ,బుక్స్ నోట్, యూనిఫార్మ్స్, నాణ్యమైన మధ్యాహ్న భోజనం విద్యార్థులకు కావలసిన అన్ని రకాల మౌలిక వసతులను పరిశుభ్రంగా ఉంచాలి ,అలాగే పాఠశాలలో పరిశుభ్రం లేకపోవడం, టీచర్ పోస్టులు ఖాళీగా ఉండటం వలన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చేరే పరిస్థితి చేయి దాటిపోయిందని ఇలాగే జరిగితే ముందు ముందు ప్రభుత్వ పాఠశాలలో కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదని వెంటనే బాత్రూంలు ,మరుగుదొడ్లు అదేవిధంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని వారన్నారు అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఇసుక ర్యాంపు లు ఎక్కువ ఉండటం వలన లారీలు విపరీతంగా రావడం వల్ల ఆక్సిడెంట్లు బాగా అవుతున్నాయి జూన్ 12న నుంచి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సాయంత్రం మూడు గంటల నుంచి 5 గంటల వరకు లారీలను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు లేనియెడల విద్యార్థులంతా ఏకమై భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.. అదేవిధంగా మంగపేట మండలంలో ఉన్న ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులనువారి వారి మాతృ పాఠశాలలోనే ఉంచాలని కానీ ఎటువంటి డిప్యూటీషన్లో ఇతర పాఠశాలకు అధికారులు పంపించకూడదు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు లంజపల్లి సిద్దు, కాట ముకుందం, తోకల మురళి తదితరులు పాల్గొన్నారు

శ్రీ మైసమ్మ తల్లి జాతర మహోత్సవము.

శ్రీ మైసమ్మ తల్లి జాతర మహోత్సవము.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల్ మరియు ఝరాసంగం మండల సరిహద్దు ప్రాంతందిగ్వాల్. ఈదులపల్లి ప్రాంతం లో గల శ్రీ మైసమ్మ దేవాలయం లో జరిగే జాతర ఉత్సవాలసందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని స్థానిక యం యల్ ఏ మాణిక్ రావ్ ఆఫీస్ .లో ఝరాసంగం మండలం మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ .ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరణ చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగా ఉస్త వాలు ఘనంగా నిర్వహిస్తారాని ఇట్టి కార్యమం లో ప్రజా ప్రతినిధు స్థానిక అధికారులు నాయకులు .మైసమ్మ తల్లి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి ఉస్తావాలను విజయవంతం చెయ్యాలని పరమేశ్వర్ పాటిల్ పిలుపు నిచ్చారు.

కొనుగోలు వేగవంతం చేయాలి.

కొనుగోలు వేగవంతం చేయాలి

తాసిల్దార్ శ్రీనివాసులు

నిజాంపేట నేటి ధాత్రి:

ఐకెపి, సోసైటీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు వేగవంతంగా కొనుగోలు జరుగుతుందని మండల తాసిల్దార్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా 15 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చెయ్యగా 7 సెంటర్లు పూర్తయ్యాయని 8 సెంటర్లు పూర్తి కాలేవున్నారు. మరో మూడు రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేస్తాం అన్నారు.

నిధులు లేక గ్రామాల్లో నిలిచిన పనులు.

నిధులు లేక గ్రామాల్లో నిలిచిన పనులు

-బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు
మొగులపల్లి నేటి ధాత్రి:

 

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కళకళలాడిన గ్రామపంచాయతీలు..ప్రస్తుతం పట్టించుకునే నాథులు లేక అస్తవ్యస్తంగా మారుతున్నాయని బీఆర్ఎస్ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు ఆరోపించారు. మంగళవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పాలక వర్గాలు లేక పాలన పడకేసిందన్నారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కరువై గ్రామాలు సమస్యల్లో చిక్కుకొని కొట్టుమిట్టులాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఏడాదిన్నరగా నిధులు ఇవ్వకపోవడంతో..నిర్వహణ భారం మోయలేక పంచాయతీ కార్యదర్శులు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఈ కాంగ్రెస్ పాలనలో దాపురించాయన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో ట్రాక్టర్, ట్యాంకర్ ఉండాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ట్రాక్టర్లను కొనుగోలు చేయించిందని, పారిశుద్ధ్య నిర్వహణకు, ఇతర పనులకు వాహనం తప్పనిసరి కావడంతో ఆ భారం పంచాయతీ కార్యదర్శులకు తప్పడం లేదన్నారు. రుణం పై వాహనాలను కొనుగోలు చేయడంతో..ప్రతి మూడు నెలలకోసారి వాయిదాల పద్ధతిలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. నిధులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారన్నారు. కొన్ని సందర్భాల్లో డీజిల్ కు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సిబ్బంది తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిధులు రాకపోవడం..వసూలు చేసిన పన్నులు సరిపోకపోవడంతో పారిశుద్ధ్య, మంచినీటి నిర్వహణ, ట్రాక్టర్ ఇతర వాటికోసం తప్పనిసరిగా తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేయించాల్సి వస్తుందని పలువురు పంచాయతీ కార్యదర్శులు తనతో వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నిధులు వచ్చిన తర్వాత తీసుకోవచ్చన్న ఉద్దేశంతో పలుచోట్ల లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్తున్నారని, ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టడంతో..బదిలీ అయిన అనంతరం ఖర్చు చేసిన డబ్బులను ఎలా తీసుకోవాలన్న ఆందోళన కార్యదర్శుల్లో నెలకొందన్నారు.

పెన్షన్ల కోసం ఎదురు చూపులు.

పెన్షన్ల కోసం ఎదురు చూపులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రైకటించిన ఆరు గ్యారంటీ పథకాల్లో భాగమైన వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. బుధవారం ఉదయం జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలానికి చెందిన పలువురు వృద్ధులు తెలిపారు.

యాదాద్రి నరసింహస్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్.

యాదాద్రి నరసింహస్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి:

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.అంతకుముందు ఆలయ అధికారులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగాణంలో ఉన్న వేదాశీర్వచన మండపంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు పండితులు ఆశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్యే వెంట ఆలయ అధికారులు, ప్రోటోకాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

నేటి కార్యక్రమం విజయవంతం చేయాలి.

నేటి కార్యక్రమం విజయవంతం చేయాలి

పిప్పాల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్

భూపాలపల్లి నేటిధాత్రి:

గురువారం భూపాలపల్లి జవహర్ నగర్ కాలనీలోని 8వ వార్డు 27వ వార్డు కాలనీలో గత 30సంవత్సరాల నుండి కాలనీలో రేషన్ షాపు లేదని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు దృష్టికి తీసుకువెళ్లిన కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి నేడు ఉదయం 9:00 గంటలకు ఐస్క్రీం కంపెనీ దగ్గర రేషన్ షాపు ఓపెన్ చేయాలని అధికారులు ఆదేశించడం జరిగింది రేషన్ షాప్ ఓపెనింగ్ తో పాటు పోచమ్మ టెంపుల్ ఆలయం లో బోరు ఓపెనింగ్ కార్యక్రమం కూడా ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా కాలనీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అనంతరం జై బాపు జై భీమ్ జై సంవిధానం అభియాన్ వార్డు బాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐత ప్రకాష్ రెడ్డి హాజరవుతారు
కావున కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు ఐఎన్ టియుసి యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్ యుఐ నాయకులకు కార్యకర్తలకు అండ్ వార్డు ప్రజలకు పిలుపునిస్తున్నాం

ఇండియన్ గ్యాస్ వినియోగదారుల ఈ-కె వై సి అవగాహన.

ఇండియన్ గ్యాస్ వినియోగదారుల ఈ-కె వై సి అవగాహన సదస్సు

మందమర్రి నేటి ధాత్రి:

ఇండియన్ డిస్ట్రిబ్యూటర్ సింగరేణి కాలరీస్ కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్ మందమరి నందు డెలివరీ బాయ్స్ సిస్టం ఆపరేటర్స్ ను ఉద్దేశించి డివిజనల్ మేనేజర్ సింగరేణి సూపర్ బజార్ శ్రీరాంపూర్ బెల్లంపల్లి పాలకుర్తి రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడినది ఇండియన్ ఆయిల్ కంపెనీ వారు ఆదేశానుసారము ప్రతి ఒక్క వంటగ్యాస్ వినియోగదారుడు వారి గ్యాస్ కనెక్షన్ నిమిత్తము.

Indian Gas

ఈ-కేవైసీ అనుసంధానం చేసుకునే కొరకై సహకరించాలని కాల పరిమితి అయిపోయిన గ్యాస్ పైప్ ను వెంటనే మార్చుకోవాలని లేని యెడల ప్రమాదాలు సంభవిస్తాయని ఆయన తెలిపారు ఇందులో భాగంగా ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో సింగరేణి సూపర్ బజార్ డివిజనల్ మేనేజర్ పాలకుర్తి రాజు బ్రాంచ్ మేనేజర్ సుదర్శన్ ఎల్ పి జి కోఆర్డినేటర్ రాజు ఇండియన్ డిస్ట్రిబ్యూటర్ ఇన్చార్జ్ మాధవరావు ప్రసాద్ మరియు డెలివరీ బాయ్స్ సిస్టం ఆపరేటర్స్ రామకృష్ణాపురం, మందమరి, బెల్లంపల్లి పాల్గొన్నారు.

భూసేకరణ వేగవంతం చేయండి కలెక్టర్.

భూసేకరణ వేగవంతం చేయండి కలెక్టర్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జిల్లాలో రీజనల్ రింగ్ రోడ్డు, నిజ్జా భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. శంకర్ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ రెండు పనులు పూర్తయితే జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. నిమ్స్ కు 12, 500 ఎకరాలకి 7500 ఎకరాల భూ సేకరణ చేసి సేకరించిన భూమికి రక్షణ కంచె ఏర్పాటు చేయాలన్నారు.

ఏం తినేటట్లు లేదు ఏముకునేటట్లు లేదు.

ఏం తినేటట్లు లేదు ఏముకునేటట్లు లేదు

మందమర్రి నేటి ధాత్రి:

మందమర్రి సింగరేణి కాంట్రాక్టు కార్మికుల బ్రతుకులు మాటలకే పరిమితమా సింగరేణిలో కాంట్రాక్టు అంటే ఎగిరి గంతేస్తున్న బడా కాంట్రాక్టర్లు ? 8 రాష్ట్రాలలో అమలైనా హై పవర్ కమిటీ వేతనాలు మన తెలంగాణ రాష్ట్రం సింగరేణి బొగ్గు బావిలో ఎందుకు అమలు కాలేదు ఎవరిది వివక్షత సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు జీతాలు పెరిగితే జీర్ణించుకోలేకపోయే అప్పుడున్న పెద్దలు ఎవరు ఐ పవర్ కమిటీ వేతనాలలో సంతకాలు ఎందుకు చేయలేదు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టు కార్మికులు కట్టు బానిసల వల్లే పని చేయాలని అర్థమా
తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ మా శ్రమ మా కష్టం కడుపు మార్చుకో నీ పని చేస్తేనే దేశానికి వెలుగులు సింగరేణి పర్మనెంట్ కార్మికులకు తో సమానంగా పనిచేస్తున్న కానీ కాంట్రాక్టు కార్మికులకు సరైన వేతనం లేక హరి గౌస పడుతున్న విషయాన్ని సింగరేణి యాజమాన్యానికి తెలియదా ఎన్నో ప్రభుత్వాలు మారుతున్న సింగరేణి కాంటాక్ట్ కార్మికుల ఓటు బ్యాంక్ తో చెలగాటలాడుతున్నారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారు పర్మినెంట్ కార్మిక సంఘాలు స్టేజీల మీద మాటలకే పరిమితం అవుతున్నాయి వేజ్ బోర్డు సమావేశాలలో ఏ ఒక్కరోజు కూడా కాంట్రాక్టు కార్మికుల హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయించలేని దుస్థితిలో ఈరోజు మనము ఉన్నామంటే సిగ్గుచేటు 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న కానీ ఈరోజు కూడా మాటలకే పరిమితం అవుతున్న కార్మిక హక్కులను కాలరాస్తున్నారు అని కార్మికులు గుసగుసలాడుతున్నారు సింగరేణి యాజమాన్యం ప్రభుత్వాలు కాంట్రాక్టు వ్యవస్థని కట్టు బానిసలుగా మార్చే దిశగా పయనిస్తున్న ఆశ్చర్యపడేది లేదు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న హై పవర్ కమిటీ వేతనాలు ఈరోజు బిజెపి ప్రభుత్వం కేంద్రంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి మాత్రం సింగరేణి బొగ్గు బావుల్లో పదకొండు డివిజన్లో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల ఎదురుచూపు కె పరిమితం తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాలు పేరుతో ఉద్యమాన్ని మొదలుపెట్టిన కేసీఆర్ గారు సకల జనుల సమ్మెలో ప్రతి బొగ్గు బై పైన 11 డివిజన్లలో సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడి సకల జనుల సమ్మెలో 42 రోజుల సమ్మెను కాంట్రాక్టు కార్మికులు జీతం లేకుండా కుటుంబాలను ఆకలితో మార్చి సమ్మెలో విజయవంతం చేసిన ఘనత సింగరేణి కాంటాక్ట్ కార్మిక సోదర సోదరీమణులది కదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిపై కూర్చొని సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల లేరు అని నిండు అసెంబ్లీలో చెప్పి అవమానపరిచి కార్మికుల గొంతు కోశారు.నిజం కాదా
టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కొట్టుకపోయి మార్పు జరగాలని ప్రజలు నిర్ణయాన్ని సింగరేణి కాంటాక్ట్ కార్మికులు ఏకతాటిగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన విషయాన్ని ఈరోజు తెలియజేస్తున్నాము సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లో టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించిన ఘనత చరిత్ర సింగరేణి ప్రాంత బిడ్డలది కాదని ఈరోజు అడుగుచున్నాము కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు 11 రివిజన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకసారి ఆలోచించుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని మాట్లాడి ఒక తాటిపైన ఉండి సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు 22 జీవో.ఐ పవర్ వేతనాలు ఇప్పించే దిశగా మీరు ముందుండి కార్మికులకు అండగా ఉంటారని గడిచిన సంవత్సరం నెలలో రామగుండం ఎమ్మెల్యే ఒక్కడు రెండుసార్లు మాట్లాడడం జరిగింది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఆశతో ఉన్నారు వారికి అతి తక్కువ వేతనాలు ఉన్నాయి వారికి కచ్చితంగా మనము ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని.22వ జీవో అమలు చేయాలని చెప్పడం సంతోషకరమైన విషయం కానీ అదే పది డివిజన్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా ఆరోజు ప్రస్తావించి ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కి తెలియజేసి ఉంటే ఈరోజు కాంట్రాక్టు కార్మికులకు ఇంత అంత మేలు జరిగేది కూల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలకు ఈరోజు తెలియజేస్తున్నాం కార్మికుల పక్షాన విన్నమిస్తున్నాము అర్ధిస్తున్నాము వేడుకుంటున్నాము సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి కాంటాక్ట్ కార్మిక సోదర సోదరీమణులకు జీతాలు పెంచే దిశగా మీరు అడుగులు వేయాలని మీ వెనకాల మేము ఉంటామని కాంగ్రెస్ పెద్దలకు మా తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం ద్వారా విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాము

విత్తన దుకాణాలలో తనిఖీలు.

విత్తన దుకాణాలలో తనిఖీలు

ఎం ఏ ఓ సోమలింగారెడ్డి

నిజాంపేట నేటి ధాత్రి:

మండల కేంద్రంలో గల విత్తన దుకాణాలను వ్యవసాయ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఇన్చార్జ్ ఎస్సై సృజన మాట్లాడుతూ.. విత్తన డీలర్లు విత్తన చట్టం ప్రకారం వ్యాపారం నిర్వహించాలన్నారు. రైతులకు అమ్మిన విత్తనాలను బిల్లు రూపంలో అందించాలన్నారు.

సిరిసిల్లలో పిడుగుపాటుకు పశువులు మృతి.

సిరిసిల్లలో పిడుగుపాటుకు పశువులు మృతి

సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చిన్న బోనాల మున్సిపల్ పరిధిలో ఉన్న వార్డు మాజీ కౌన్సిలర్ బొల్గాం నాగరాజు గౌడ్ మాట్లాడుతూ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి, మరియు జిల్లా కలెక్టర్ కి , సంబంధిత జిల్లా పశు వైద్యాధికారులకు విన్నవించడం ఏమనగా, నిన్నటి రోజున కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో, సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని చిన్న బోనాల లో నిన్న మమిండ్ల నాగరాజు అనే రైతు యొక్క ఆవు పిడుగుపాటు గురై మరణించడం జరిగినది తెలిపారు. ఆ రైతు యొక్క జీవన ఉపాధి పశువులపైనే ఆధారపడి ఉన్నందున, సుమారు 50 వేల నుండి 80 వేల విలువగల ఆవు మరణించినందునకు, ఆ రైతు రోధిస్తున్నాడు తెలిపారు.కావున వెంటనే ప్రభుత్వం తరఫున రైతుకు నష్ట పరిహారాన్ని చెల్లించి, జీవన ఉపాధిని కల్పించాలని స్థానిక మాజీ కౌన్సిలర్ గా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను తెలిపారు.

50 కేజీల బియ్యం అందజేసిన పార్టీ కాంగ్రెస్ నాయకులు.

చనిపోయిన కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన పార్టీ కాంగ్రెస్ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి.మండలం కస్పే కట్కూరు గ్రామానికి చెందిన శనిగరం దిలీప్ గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించగా. వారి. తల్లిదండ్రులను . కుటుంబ సభ్యులను. పరామర్శించి. మనోధైర్యం ఇచ్చి. వారి కుటుంబానికి. జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ. సత్తు శ్రీనివాస్ రెడ్డి తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేసిన సత్తు శ్రీనివాస్ రెడ్డి. ఈ oదుకుగాను బాధిత కుటుంబ సభ్యులు బియ్యం అందజేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాన్ని పరామర్శించి. వారి కుటుంబానికి. పార్టీ పరంగా కాను ప్రభుత్వపరంగా కాను. అన్ని సహాయ సహకారాలు అందించే విధంగా. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి. బాధిత కుటుంబానికి సహాయం అందించేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్పష్టం చేశారు. ఇట్టి కార్యక్రమంలో. మాజీ సర్పంచ్ పొన్నం లక్ష్మణ్ గౌడ్. కే రాజేశ్వరరావు. కిషన్ కుటుంబ సభ్యులు. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

సిపిఐ హనుమకొండ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా లంక దాసరి అశోక్

సిపిఐ హనుమకొండ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా లంక దాసరి అశోక్

పరకాల నేటిధాత్రి:

 

ఈ నెల 26,27 న హసన్ పర్తిలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ హనుమకొండ జిల్లా మహాసభలలో భాగంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా లంక దాసరి అశోక్ ను ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ తక్కలపల్లి శ్రీనివాసరావుకి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కర్ర బిక్షపతికి అశోక్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ సహకరించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ,పరకాల కార్మికులకు పక్షాన నియోజకవర్గంలో ఉన్న చర్లపల్లి,పోచారం తదితరుల గ్రామాలలో కార్మికులు సంఘాలకు నాయకత్వం వహించి అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని మున్సిపాలిటీ భవన నిర్మాణం,హమాలీ బజార్,అమాలి ఐకెపిఆర్ లకోసం నా వంతు పనిచేస్తానని నాపై నమ్మకంతో ఈ పదవిని నాకు అప్పగించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు.

పార్టీ పదవులు కొలిక్కి..మంత్రి పదవులు వెనక్కి!!

`మంత్రి పదవుల కోసం మరింత సమయం!

`పార్టీ పదవులు మాత్రం సిద్దం!

`దాదాపు కార్యవర్గ పదవుల జాబితా సిద్ధం!

`పార్టీ పదవులు కూడా మరో మూడురోజుల తర్వాత విడుదలయ్యే అవకాశం.

`రోహిన్‌ రెడ్డి కి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.

`సీనియర్లకు పార్టీ పదవులలో సముచిత స్థానం.

`నాయకులలో అసంతృప్తి లేకుండా పదవుల పంపకం.

`పార్టీ క్రియాశీల బాధ్యతలతో నాయకులు సంతృప్తి చెందుతారని అధిష్టానం నమ్మకం.

`అన్ని జిల్లాల నాయకుల సూచనల మేరకు పార్టీ నిర్మాణం.

`స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యం.

`ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు తక్కువ రాకుండా నాయకత్వం పటిష్టం.

`ప్రతి పక్షాల కన్నా ముందే ప్రజల్లోకి నాయకులు వెళ్లాలని ఆదేశం.

`ప్రభుత్వ పథకాలపై, నిర్ణయాలపై పకడ్బందీగా ప్రచారం.

`సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్‌ యువ వికాసం, రేషన్‌ కార్డులపై ప్రజల్లో అవగాహన పెంచడం.

`మంత్రి వర్గ విస్తరణపై ఎటూ తేల్చలేకపోతున్న అధిష్టానం!

`ఎటూ తేల్చుకోలేకపోతున్న రాష్ట్ర యంత్రాంగం.

`కావాలనే వాయిదా పడుతున్నట్లు సంకేతం.

`తప్పని పరిస్థితుల్లోనే దూరం జరుపుతున్నట్లు సందేశం.

`ఆరు పదవులు అందరికీ పంచలేక తల పట్టుకుంటున్న అధిష్టానం

హైదరాబాద్‌ ,నేటిధాత్రి:
ఒక రకంగా కాంగ్రెస్‌ పార్టీలో వున్న కొంత మంది నాయకులకు సంతోషకమైన వార్త. మరో రకంగా మంత్రి పదవులు ఆశిస్తున్న నాయకులకు కొంత చేదు గుళిక. ఎందుకంటే మంత్రి పదవుల పంపకం మరికొంత ఆలస్యమయ్యే సూచనలు కనిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఎంత వడబోసినా, ఎక్కడో సరైన సమ ప్రాధాన్యత అందరికీ కలిగించాలన్న ఆలోచనతోనే కాస్త ఆ ముహూర్తం దూరం జరుగుతోంది. కాకపోతే ఎంత ఆలస్యమైనా, సరే బెస్ట్‌ అనిపించుకునేలా విస్తరణ వుండాలన్నదే కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కోరుకుంటోంది. సహజంగా ఎమ్మెల్యేలందరికీ మంత్రులు కావాలని కోరిక వుంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే అయ్యేదాకా అదో తంటా. ఏళ్లకేళ్లు ఎదురుచూసి, చూసి, అవకాశం వచ్చినా రాజకీయ పరిస్ధితులు అనుకూలించక ఎమ్మెలు కాని వాళ్లు చాల మంది వుంటారు. వాళ్లలో అనేక సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి, ఓడిపోయి, గెలిచిన వాళ్లుంటారు. మరికొంత మంది ఎమ్మెల్యే కావడానికి పెద్దగా ఇబ్బందులు పడే పరిస్ధితి రాదు. అలాంటి వారు మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేలు అవుతుంటారు. రాజకీయ పరిస్దితులు రాష్ట్రంలో ఎలా వున్నా, ఎమ్మెల్యేలుగా గెలుస్తూనే వుంటారు. అటు ఓడిపోయిన వారైనా, ఇటు ఎప్పుడూ గెలుస్తుండేవారైనా పార్టీకి సేవ చేస్తూనే వుంటారు. అలా అవకాశాలు వచ్చి, ఎమ్మెల్యేలు అయిన వారు మంత్రులు కావాలనుకోవడం తప్పు కాదు. మంత్రులు కావాలన్న వారి కోరిక మొదటిసారే తీరే వారు కొందరుంటారు. ఎన్ని సార్లు ఎమ్మెల్యేలు అయినా మంత్రులు కాని వారు కూడా చాలా మంది వుంటారు. అయినా ఎక్కడో ఆశ వారిలో సజీవంగా వుంటంది. ఒక్కసారైనా మంత్రి కావాలని బలంగా కోరుకుంటారు. కాని ఇక్కడ మరో మతలబు వుంటుంది. ఒక్కసారి మంత్రి అయిన నాయకుడు సీనియర్‌ మంత్రిగా పదే పదే పార్టీ అధికారంలో వున్నంత కాలం మంత్రులుగా పనిచేయాలని కోరుకుంటారు. అలా అవకాశాలు దక్కుతుంటాయి. ఇప్పుడున్న కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జానారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనే అందరికన్నా ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసిన నాయకుడిగా చిరిత్ర సృష్టించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో మంత్రిగా వున్న తుమ్మల నాగేశ్వరరావు కూడా అంతే..ఆయన ఏ పార్టీలో వున్నా మంత్రిగా వుంటూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నుంచి, తర్వాత బిఆర్‌ఎస్‌ నుంచి, ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి మంత్రి పదవి అందుకున్నారు. ఇలాంటి అవకాశం అందిరికీ రాదు. చాలా అరుదుగా వస్తుంది. గతంలో మంత్రిగా పనిచేసిన మంధని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఇప్పుడు మరోసారి మంత్రి అయ్యారు. ఇలా కొంత మందిని పదవులు వాటంతటవే వరిస్తుంటాయి. చాలా మందికి మంత్రి పదవి దక్కినట్లే దక్కి చేజారిపోతుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడో మంత్రి కావాల్సిన కమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ 2009 ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు. నల్లగొండ నుంచి మరో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కూడా అలా అవకాశాలు కలిసివచ్చి ఇప్పుడు కూడా మంత్రులుగా పనిచేస్తున్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ఇప్పుడు మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో పలుసార్లు మంత్రిగాపనిచేసిన నిజాబామాద్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన మైనార్టీ నాయకుడు షబ్బీర్‌ అలీ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు అధికారంలో వున్నా అదృష్టవంతుడు అనే పేరు వుంది. కాని ఈసారి ఆయన మంత్రి కాలేకపోతున్నారు. కాని ఆయన పేరు కూడా వినిపిస్తూనే వుంది. కాని ఆయనకు దక్కకపోవచ్చు. అయితే ఈసారి కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వస్తే, తాను గెలిస్తే మంత్రి కావాలనుకున్న మరో నాయకుడు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆయన గతంలో విప్‌గా పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీని వదిలి బిజేపిలో చేరారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ పార్టీకి వీర విధేయుడు అనే పేరు వుంది. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి కావాలన్న ఆశ కూడా వుండేది. కాని దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే కాలేకపోయారు. నిజంగా ఆయన గత ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్‌ రాజకీయమే వేరేలావుండేదని ఆయన సన్నిహితులు అంటుంటారు. అలా అదృష్టం ఖాతలో మొదటిసారి ఎమ్మెల్యే అయినా బిసి నాయకుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ మంత్రి అయ్యారు. అంటే రాజకీయ పదవులు కూడా అదృష్టంతో ముడిపడి వుంటాయని చెప్పడానికి ఇవన్నీ సాక్ష్యాలనే అని చెప్పాలి. గతంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడూ కూడా గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆందోల్‌ ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహ ఈసారి మంత్రి అయ్యారు. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు మంత్రులౌతారన్న వాటికి కొన్ని లెక్కలుంటాయి. ఆ లెక్కలు దాటితేనే మరి కొంత మందికి అవకాశం వస్తుంది. మంత్రులయ్యే ఛాన్సు వస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఆరు మంత్రి పదువులు ఖాళీగా వున్నాయి. వాటిలో ఓ నలుగురైదుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌ పార్టీలో ఎవరు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు. ఎందుకంటే మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపిగా, ఒకసారి ఎమ్మెల్సీగా, పిపిసి. అధ్యక్షుడుగా పనిచేసిన వి. హనుమంతరావు మంత్రి కావాలని, ముఖ్యమంత్రి కావాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. కాని ఆయన పలుసార్లు టికెట్‌ ఇచ్చినా గెలవలేదు. ఆయనకు చాలా కాలంగా కాలం కలిసి రావడం లేదు. ఆయన ఆశ తీరే పరిస్దితి ఇక కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడున్న పరిస్దితుల్లో నిజామాబాద్‌ జిల్లాకు ప్రాదాన్యత లేకపోవడంతో సుదర్శన్‌రెడ్డి పేరులో ఎలాంటి మార్పు లేకుండా వినిపిస్తోంది. అయితే షబ్బీర్‌ అలీ పేరును ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటారన్నది వేచి చూడాలి. ఇక కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మంత్రి పదవి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఆయన ఆశ తీరుతుందా? లేదా? అన్నది ఎవరూ చెప్పలేని పరిస్ధితి. ఇటీవల పార్టీ అధిష్టానం భుజ్జగించిందని, ఆయన అందుకు ఒప్పుకున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అది ఎంత వరకు నిజమన్నది ఎవరికీ తెలియదు. ఆయనను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి తీసుకొమ్మని చెప్పినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. కాకపోతే చాల మందికి తెలియని విషయం ఏమిటంటే జాతీయపార్టీలలో ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేలు సహజంగానే పార్టీ ఉపాధ్యక్షులు అని చెప్పుకుంటారు. ఎంత మంది ఎమ్మెల్యేలున్నారో వాళ్లంతా ఉపాధ్యక్షులే అవుతారు. అలాంటి వారికి ప్రత్యేకంగా వర్కింగ్‌ ప్రెసిడెంటు ఇచ్చినంత మాత్రాన బాద్యతలు ఎక్కువగా వుండకపోవచ్చు. కాని గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా వున్న జగ్గారెడ్డికి ప్రత్యేకంగా వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి ఇచ్చారు. దాంతో ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డికి వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి ఇచ్చి బుజ్జగించే అవకాశాలున్నాయి. కాకపోతే వర్కింగ్‌ ప్రెసిడెంటు అనేది ఆరో వేలు లాంటిదే..అలాంటి పదవిని రాజగోపాల్‌రెడ్డి తీసుకుంటారా? లేదా? అన్నది చూడాలి. ఇక మరో జిల్లా ఆదిలాబాద్‌ నుంచి ఎమ్మెల్యే గడ్డం సోదరులు ఇద్దరూ మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇద్దరూ తగ్గేదేలే అన్నట్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కాని వివేక్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ పేర్లు మాత్రంపదే పదే వినిపిస్తున్నాయి. కాని పదవులు పంపకాలు ఆలస్యమౌతున్నాయి. ఇదే సమయంలో పార్టీ పదవుల పంపకాలకు మాత్రం ముహూర్తం ఫిక్స్‌ అయిందనే అంటున్నారు. నిజానికి మంగళవారం పార్టీ పదవుల జాబితా విడుదలౌతుందన్న ప్రచారం విసృతంగా జరిగింది. అందులో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు వున్నట్లు తెలుస్తోంది. పూర్తి జాబితాను ఈ నెల 30లోగా ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం వుందని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఖైరతాబాద్‌ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ఏది ఏమైనా మంత్రి పదవులు ఇంకా ఆలస్యమైనా సరే, పార్టీ పదవులు తొందరగా పంపకాలు జరుగుతాయని తెలుస్తున్నందుకు నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!
Exit mobile version