బండిల దొడ్డి లాగా మారుతున్న ప్రభుత్వ బడులు.

బండిల దొడ్డి లాగా మారుతున్న ప్రభుత్వ బడులు , కనీసం పాఠశాలలు ప్రారంభమయ్యే వరకైనా కనీస మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్……….

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిటిఎల్ రవి

మంగపేట నేటి ధాత్రి:

 

ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభం అయ్యేవరకు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలని భారతీయ విద్యార్థి ఫెడరేషన్ మండపేట మండల కమిటీ మంగపేట తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ఐ ఏసుపాదం కి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి, ఎల్. రవి మాట్లాడుతూ. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.. కనీసం పాఠశాల ప్రారంభం అయ్యేవరకు మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇప్పటికే వర్షాలు ప్రారంభమై పాఠశాల ఆవరణ లో గదులలో ప్లడ్డు చేరి విష జ్వరాలు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని ఆ ఆవరణలో పాఠశాలలను పరిశుభ్రం చేసి మరుగుదొడ్లు నిర్మించి , కరెంటు, త్రాగు నీరు, ఉచిత టెక్స్ట్ ,బుక్స్ నోట్, యూనిఫార్మ్స్, నాణ్యమైన మధ్యాహ్న భోజనం విద్యార్థులకు కావలసిన అన్ని రకాల మౌలిక వసతులను పరిశుభ్రంగా ఉంచాలి ,అలాగే పాఠశాలలో పరిశుభ్రం లేకపోవడం, టీచర్ పోస్టులు ఖాళీగా ఉండటం వలన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చేరే పరిస్థితి చేయి దాటిపోయిందని ఇలాగే జరిగితే ముందు ముందు ప్రభుత్వ పాఠశాలలో కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదని వెంటనే బాత్రూంలు ,మరుగుదొడ్లు అదేవిధంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని వారన్నారు అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఇసుక ర్యాంపు లు ఎక్కువ ఉండటం వలన లారీలు విపరీతంగా రావడం వల్ల ఆక్సిడెంట్లు బాగా అవుతున్నాయి జూన్ 12న నుంచి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సాయంత్రం మూడు గంటల నుంచి 5 గంటల వరకు లారీలను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు లేనియెడల విద్యార్థులంతా ఏకమై భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.. అదేవిధంగా మంగపేట మండలంలో ఉన్న ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులనువారి వారి మాతృ పాఠశాలలోనే ఉంచాలని కానీ ఎటువంటి డిప్యూటీషన్లో ఇతర పాఠశాలకు అధికారులు పంపించకూడదు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు లంజపల్లి సిద్దు, కాట ముకుందం, తోకల మురళి తదితరులు పాల్గొన్నారు

ప్రమాదాలకు స్వాగతం పలుకుతున్న మూలమలుపులు.

ప్రమాదాలకు స్వాగతం పలుకుతున్న మూలమలుపులు

హెచ్చరిక బోర్డులు స్టిక్కర్లు ఏర్పాటు చేయాలి

రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లకు కొమ్ములను తొలగించాలి

పరకాల నేటిధాత్ర:

మండలంలో పలుచోట్ల మూల మలుపులతో రోడ్లపై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.హన్మకొండ జిల్లా పరకాల నుండి మొగుళ్లపల్లికి వెళ్లే రహదారి డిపో సమీపం నుండి మొదలుకొని నాగారం గ్రామ ప్రారంభం నుండి లక్ష్మీపురం వరకు మూలమలుపుల వద్ద కనీసం ప్రమాద సూచిక బోర్డులు లేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.మూలమలుపుల వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలు దగ్గరకు వచ్చే వరకు కనిపించకపోవడంతో సూచిక బోర్డులు లేకపోవడంతోనే పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు.రాత్రి సమయంలో ప్రయాణం ఇబ్బందికరంగా మారుతున్నాదని ఎదురుగ వచ్చే వాహనాలు కనిపించక ఇప్పటికే చాలామంది ప్రమాదాలకు గురికావడం,ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయని,కొన్ని స్థలాలలో ప్రమాద సూచిక బోర్డులు ఉన్నప్పటికీ చెట్లకొమ్మలు పెరగడంతో బోర్డులు కనిపించడం లేదని,రోడ్లకు ఇరువైపులా పెరిగిన చెట్లకొమ్మలను తొలగించాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు.సంబంధిత అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించి ప్రమాదాల శాతం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని రహదారుల మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేయాలని ప్రజలు,వాహనదారులు కోరుతున్నారు.

శ్రీపాల్ రెడ్డి గెలుపు పిఆర్టీయూ కు మలుపు.

శ్రీపాల్ రెడ్డి గెలుపు పిఆర్టీయూ కు మలుపు

మరిపెడ నేటిధాత్రి.

నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలలో విజయ దుందుభి మోగించిన పింగిలి శ్రీపాల్ రెడ్డి గెలుపు పిఆర్టీయూ సంఘానికి మలుపు లాంటిదని అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కీసర రమేష్ రెడ్డి,లింగాల మహేష్ గౌడ్ లు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గత నెల రోజులుగా శ్రీపాల్ రెడ్డి విజయం కోసం అహర్నిశలు శ్రమించిన పిఆర్టీయూ సంఘ రాష్ట్ర,జిల్లా,మండల బాధ్యులకు,మండల కార్యవర్గ సభ్యులకు, సంఘానికి పట్టుకొమ్మలైన ప్రాథమిక సభ్యులందరికీ మరియు ఈ ఎన్నికలలో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లందరికి కూడా పేరుపేరున పిఆర్టీయూ మరిపెడ మండల శాఖ పక్షాన హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నమని అన్నారు. రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న అపరిష్కృత సమస్యలు పరిష్కరించే విధంగా పిఆర్టీయూ సంఘం చొరవ తీసుకుంటుందని అన్నారు.

ఢీల్లీలో భాజపా గెలుపు..దేశానికి మలుపు

కోలాహాలంగా బీజేపీ శ్రేణుల విజయోత్సవ వేడుకలు

శాయంపేట నేటిధాత్రి

శాయంపేట మండల కేంద్రంలో కూడలి వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో విజయోత్సవ వేడుకలు జరిగాయి. టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భం గా బిజెపి మండల అధ్యక్షుడు మాట్లాడుతూ రాహుల్ గాంధీ అరవింద్ క్రేజీ వాల్ హామీలు ప్రజలు నమ్మలేదని ఆఫ్ మరియు కాంగ్రెస్ ఎంత వ్యతిరేకత ఉందో తాజా ఫలితాలను బట్టి అర్థమవు తుంది. గత పార్లమెంటు ఎన్నికల్లోను ఢిల్లీ ప్రజలు బిజెపికి పూర్తి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు భారతీయ జనతాపార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కారు వలన ఢిల్లీ అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేస్తే కేజ్రీవాల్ ఢిల్లీని భ్రష్టుపట్టించా రు. వాయు,రాజకీయ కాలుష్యంతో కలుషితం జరిగిందన్నారు.ఈ గెలుపు ఢిల్లీ అభివృద్ధికీ మలుపని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ రాయ రాకులమొగిలి,మండల బిజెపి నాయకులు, మండలమంతా బిజెపి నాయకులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.

ఢీల్లీలో భాజపా గెలుపు..దేశానికి గొప్పమలుపు

* శ్రీకాళహస్తిలో కోలాహాలంగా బీజేపీ శ్రేణుల విజయోత్సవ వేడుకలు

* బీజెపి రాష్ట్ర కార్యదర్శి,అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్

శ్రీకాళహస్తి (నేటి ధాత్రి) ఫిబ్రవరి 08:

పట్టణంలోని బెరివారి మండపం కూడలి వద్ద బీజేపీ నేత కోలా ఆనంద్ నేతృత్వంలో భారీ స్థాయిలో శనివారం విజయోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కారు వలన ఢిల్లీ అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేస్తే.. కేజ్రీవాల్ ఢిల్లీని భ్రష్టుపట్టించారన్నారు.
వాయు, రాజకీయ కాలుష్యంతో కలుషితం జరిగిందన్నారు.ఈ గెలుపు ఢిల్లీ అభివృద్ధికి మలుపని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కో-కన్వీనర్ మేళాగారం సుబ్రమణ్యంరెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి గోపాల్,రాష్ట్రకార్యవర్గ సభ్యులు ఎస్వీ రమణ, పట్టణ అధ్యక్షులు ఆర్.హరీష్ రెడ్డి,వేడం కృష్ణయ్య,చిలకా రంగయ్య,సొట్ట సుకుమార్,బగీర్తి వెంకటేష్,కోలా గోవర్ధన్,కుప్పప్రసాద్,గాలి రమేష్ నాయుడు,
పేటసుబ్రమణ్యం తదితులున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version