అంత్యక్రియలకు హాజరై పాడే మోసిన.

అంత్యక్రియలకు హాజరై పాడే మోసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని లక్ష్మీ నగర్ 22వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ ముంజల రవీందర్ తండ్రి ఐలయ్య అనారోగ్య పరిస్థితులతో మృతి చెందడం జరిగింది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అంత్యక్రియలకు హాజరై పాడే మోసినారు అనంతరం మాజీ కౌన్సిలర్ ముంజాల రవీందర్ కు మనోధైర్యాన్ని కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ముంజాల రవీందర్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ పిసిసి మెంబర్ చల్లూరి మధు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు బుర్ర కొమురయ్య మాజీ జెడ్పిటిసి పులి తిరపతి రెడ్డి అంబాల శీను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు

అంగన్వాడి ఆయా దహన సంస్కారాలకు.!

అంగన్వాడి ఆయా దహన సంస్కారాలకు 10 వేల రూపాయల అందజేత.

డి డబ్ల్యు ఓ. మల్లేశ్వరి.

చిట్యాల నేటి దాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని అందుకు తండా గ్రామ మొదటి అంగన్వాడీ కేంద్రం ఆయా బానోత్ విమలమ్మ 56 సంవత్సరాలు మంగళవారం రాత్రి అనగా 27వ తేదీ రోజు రాత్రి 11 గంటలకు చనిపోయిన విషయం తెలుసుకున్న జిల్లా ఇన్చార్జి డీ డబ్ల్యు ఓ మల్లేశ్వరి విషయాన్ని జయప్రద సూపర్వైజర్ ద్వారా తెలుసుకొని జిల్లాకు మారుమూల ప్రాంతమైన అందుకు తండా గ్రామానికి హుటా హుటిన చేరుకొని దహన సంస్కారాల కోసం పదివేల రూపాయలను వారి కుటుంబ సభ్యులైన కొడుకులు కోడళ్ళకు అందించి నారు, ఒక జిల్లా అధికారిగా ఆమె ఔన్నత్యాన్ని చూపించి, చాలా బీద కుటుంబం అయినందున ప్రభుత్వం నుండి ముందు ముందు అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తామని కుటుంబ సభ్యులందరికీ ఓదార్పును కల్పించారు. డబ్ల్యు ఓ వెంట జయప్రద సూపర్వైజర్ అంగన్వాడీ టీచర్స్ రజిత,ప్రమీల ఆయాలు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version