బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూధన్ రెడ్డి
పరకాల నేటిధాత్రి
మంగళవారం రోజున బిఆర్ఎస్ పరకాల మండల పార్టీ అధ్యక్షులు చింతిరెడ్డి మధుసుధన్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలనీ ఈ మహోత్తర కార్యక్రమానికి పల్లెలు పట్టణాల ప్రజలు కదిలిరావాలని ఈ సభతో రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే సత్త చూపించాలని కోరారు.
కాంగ్రెస్ పరిపాలన ప్రజాపాలననే..! ప్రతీకార పరిపాలన కాదు…!
చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
Congress rule is people’s rule..!
కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజాపాలనే తప్ప ప్రతీకార పరిపాలన కాదని,ఎన్నికలవేళ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం రాజ్యాంగంలోని భాగమేనని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డ్ అమరవాది గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో కార్యకర్తలు, నాయకులు, కార్యక్రమ సమన్వయకర్త అంజన్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే వివేక్ భారీ ర్యాలీ నిర్వహించారు. భారత రాజ్యాంగ పీఠిక చిత్రపటాలకు ఎమ్మెల్యే పూలమాలవేసి రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు.
Congress rule is people’s rule..!
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వివేక్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బాపు అడుగుజాడల్లో నడుస్తూ రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని, ఆవశ్యకతను తెలుసుకోవాలని అన్నారు. రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. బిఆర్ఎస్ హయాంలో దాచుకోవడం, దోచుకోవడమే తప్ప అభివృద్ధి ఎక్కడ చేయలేదని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయించారని దుయ్యబట్టారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని తెలిపారు.
బిజెపి పాలకులు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, హక్కులను కాలరాస్తు, మహాత్మా గాంధీ చూపిన అహింస, శాంతి సిద్ధాంతాలను విస్మరిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పలువురు కాలనీవాసులు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జంగం కళ, పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టీపిసిసి ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకుబ్ ఆలీ, శ్రీనివాస్, పలిగిరి కనకరాజు, కుర్మ సురేందర్, బత్తుల వేణు, సంఘ రవి, మహిళా నాయకురాలు పుష్పా, శారద, రాజేశ్వరి, సునిత ,కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కల్వకుర్తి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కరుణాకర్ రెడ్డి తండ్రి బుచ్చి రెడ్డి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఠాకూర్ బాలాజీ సింగ్ గారు వారి నివాసానికి చేరుకొని స్వర్గస్థ బుచ్చి రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం అందించారు.
◆- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్. నేటి ధాత్రి:
రాజ్యాంగ పరిర క్షణ అందరి బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి అన్నారు.జైబాపు, జైభీం, జైసంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లీ, బూర్దీపాడ్ గ్రామాల్లో పాద యాత్ర నిర్వహించారు.డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ముప్పు తెచ్చే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.కేంద్ర ప్రభుత్వ విధానాలు రిజర్వేషన్లకు ముప్పు వాటిల్లే విధంగా ఉన్నాయన్నారు.
Congress Party leaders
అనంతరం జహీరాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచిన భారతదేశంలో రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని విమర్శించారు.కేంద్రం కుట్రలను ప్రజలకు వివరించేందుకు రాహుల్ గాంధీ గ్రామ గ్రామాన పాదయాత్ర చేపట్టాలని నిర్దేశించారని చెప్పారు.ఈకార్యక్రమంలో సిడిసి చైర్మన్ మహ్మద్.ముబీన్,జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ భీమయ్య,మాజీ సర్పంచ్ లు నర్సింహారెడ్డి,జగన్మోహన్,మాజీ కౌన్సిలర్ శేఖర్,మాజీ యం.పి.టి.సి లు హన్మంత్ రెడ్డి,నాగి శెట్టి,అశ్విన్ పాటిల్,నాథా నేయల్,మాజీ ఏ ఎం సి వైస్ చైర్మన్ అక్బర్,ఇమామ్ పటేల్,సునీల్ కుమార్,దిలీప్ కుమార్ మరియు మండల యూత్ కాంగ్రెస్ నాయకులు,ఆయా గ్రామాస్తులు,యువకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మహ్మద్ ఖాన్ పల్లి తాండా సమస్యలు తీరుస్తానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ నగరపాలక పరిధిలోని మహ్మద్ ఖాన్ పల్లి తాండా 16వ వార్డులో కొలువైన శ్రీ వీర ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో జరిగిన ధ్వజస్థంభం ప్రతిష్టాపన మహోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీ వీరాంజనేయ స్వామి సంపూర్ణ కటాక్షం గ్రామ ప్రజలందరి పైన ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ గ్రామంలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని అందరం కలిసి అన్నివిధాలా అభివృద్ధి చేసుకుందాం అన్నారు.
MLA
దేవాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలంతా కలిసి కట్టుగా ఉండాలని ఆయన సూచించారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వాదం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు మోతిలాల్, జాజి మొగ్గ నర్సింహులు, దేవేందర్ నాయక్, అబ్దుల్ హక్, శ్రీనివాస్ యాదవ్, జోజ్య నాయక్ , డి.ఎం.నాయక్, మాజీ ఎంపిటిసి గోపి నాయక్, శరత్ చంద్ర, హన్మంతు నాయక్ , కృష్ణ, కుమార్, రవి నాయక్, శంకర్ నాయక్, గోపాల్, చర్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాలమాజీ ఎంపీపీ ముక్తిసత్యం,గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
మండలంలో సోమవారం రాత్రి గాలి, దుమ్ముతోకురిసిన భారీ వర్షానికి మండలంలో పంటలు, ఇల్లులు, కరెంటు స్తంభాలు కూలిపోయాయని ప్రభుత్వం స్పందించి సంబంధిత అధికారులతో సర్వేలు చేపించి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని మండల తహసిల్దార్ ఇమ్మానియేల్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల మాజీ ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు మాట్లాడుతూ మండలంలో వందలాది ఎకరాల్లో పంట నేలమట్టం అయిందని, అనేక చోట్ల ఇల్లు కూలిపోయాయని, విద్యుత్ ట్రాన్స్ఫారాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని అన్నారు. మొక్కజొన్న నష్టపోయిన రైతుకు ఎకరాకు 50 వేలు, మిర్చి ఎకరాకు లక్ష రూపాయలు, వరి పంటకు 50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.మండలంలో కొడవటంచగ్రామంలో వర్షం కు దెబ్బతిన్న పంటను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు యా సారపు వెంకన్న, పర్శక రవి, మానాల ఉపేందర్, బానోతులాలు, వాగబోయిన సుందర్రావు, వాగబోయిన బుచ్చయ్య, ఎట్టి సుధాకర్, ఇసం రమేష్, ఇసం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
కనివిని ఎరుగని రీతిలో ప్రజాసేవకుడి జన్మదిన వేడుకలు
– దంతాలపల్లి మండలంలో ఘనంగా భూపాల్ నాయక్ జన్మదిన వేడుకలు. – – ప్రజానీకంలో అశేష ఆధారణ పొందుతున్న యువ నేత భూపాల్ నాయక్.
మరిపెడ/దంతాలపల్లి నేటిధాత్రి.
ప్రజా సేవకుడు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న కిసాన్ పరివార్ సేవా సంస్థ వ్యవస్థాపకులు నానావత్ భూపాల్ నాయక్ జన్మదిన వేడుకలను మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం దంతాలపల్లి మండలంలోని పెద్ద ముప్పారం గ్రామ అమ్మ ఒడి అనాధ శరణాలయంలో యువ దళపతి జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది.. అనంతరం వృద్ధులకు పండ్లను అందజేయడం అందజేసినారు.. అలాగే భూపాల్ నాయక్ జన్మదిన వేడుకలను ఆగపేట గ్రామ ఉపాధి హామీ కూలీలు,వాల్య తండా లో యువకులు,బిరిశెట్టి గూడెం లో భూపాల్ నాయక్ అభిమానులు,రేఖ్య తండాలో శ్రీరామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు..దంతాలపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో పేషెంట్లకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది…. దంతాలపల్లి మండలంలో బాణసంచాలు కాల్చి భూపాల్ నాయక్ జన్మదిన వేడుకల సంబరాలు జరుపుకున్నారు…పెద్ద ముప్పారం అనాధ ఆశ్రమ ఇంచార్జ్ మాట్లాడుతూ అనాధాశ్రమాలలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని,కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు భూపాల్ నాయక్ కు మా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. రైతుల పక్షాన నిలిచిన ప్రజా నాయకుడు,రైతు సంక్షేమం,అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించే ప్రజా సేవకుడు భూపాల్ నాయక్ అని అన్నారు..గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పక్షాన నిలబడి మద్దతు తెలిపారని గుర్తు చేశారు.. పల్లెల్లో పలకరింపు కార్యక్రమంలో ఆగపేట ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను అందజేసి,ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకొని పనులు చేయాలని సూచించారన్నారు.ఈ కార్యక్రమంలో మూడవత్ రవి నాయక్,ప్రవీణ్ కుమార్,యాకుబ్ నాయక్,పోలేపక మధు,ధర్మారపు సందీప్ ఇంకా తదితరులు పాల్గొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే నే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి.
సోషల్ మీడియా వేదిక గా ప్రచారం నిర్వహించాలి
మాజీమంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి నేటిదాత్ర
కె.సి.ఆర్ గారి నాయకత్వములో ఏప్రిల్ 27న వరంగల్ లో జరగనున్న బి.ఆర్.ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రన్ని అభివృద్ధి చేశారని మాజి మంత్రి అన్నారు వనపర్తి జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది.ఈ భారీగా వచ్చిన కార్యకర్తలకు నిరంజన్ రెడ్డి గారు దిశ నిర్దేశం చేశారు రజతోత్సవ సభను విజయవంతం చేయుటకు గ్రామగ్రామాన సమావేశాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించి కార్యకర్తలను,ప్రజలను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. 25.సంవత్సరాల బి.ఆర్.ఎస్ ప్రస్థానాన్ని రజతోత్సవ సభ ద్వారా భావితరాలకు స్పూర్తి కలిగించాలని కోరుకున్నారు. తెలంగాణ ఆస్తి కె.సి.ఆర్ అని 14ఏండ్ల ఉద్యమ చరిత్ర,10ఏండ్ల అధికారంలో తెలంగాణ కె.సి.ఆర్ నాయకత్వములో సుభిక్షంగా మారిందని కొంతమది కుట్రలు కుతంత్రాల వల్ల అధికారం కోల్పోయిన ప్రజలలో అభిమానం తగ్గలేదని అధికార కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని కె.సి.ఆర్ విలువ బి.ఆర్.ఎస్ పార్టీ అవసరం ప్రజలకు తెలిసివచ్చింది అని అన్నారు. 20రోజులలో నాయకులు మండల,గ్రామ సమావేశాలు పార్టీ పతాక ఆవిష్కరణ చేసి సభ విజయవంతం చేయుటకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు ఎల్లపుడు ప్రజల మధ్యన ఉండి వారి సమస్యలలో పాలుపంచుకోవాలని అటువంటి నాయకులకే పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రజతోత్సవ సభ విజయవంతంతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు రైతు బంధు రైతు రుణ మాఫీ రైతు భరోస,మహిళలకు 2500,తొలం బంగారం,నిరుద్యోగ భృతి వంటి అంశాలు ప్రజలకు వివరించాలని అన్నారు.రజతోత్సవ సభ విజయవంతంతో రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు వస్తాయని సకల జనులు బి.ఆర్.ఎస్ వైపు చూస్తారని గౌరవ నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ సమావేశములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షుడు పలస రమేష్ గౌడ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,మీడియా కన్వీనర్ నందిమల్ల. అశోక్, చంద్రశేఖర్ నాయక్,కురుమూర్తి యాదవ్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్,పార్టీ అధ్యక్షులు పలుస.రమేష్ గౌడ్,దిలీప్ రెడ్డి,వనం.రాములు,రాళ్ళ.కృష్ణయ్య,మాణిక్యం,వేణు యాదవ్,వెంకటస్వామి,మాజీ ప్రజాప్రతినిధులు రఘుపతి రెడ్డి,బోర్ల.భీమయ్య,కృష్ణా నాయక్, లక్ష్మమా రెడ్డి, కర్రేస్వామి, రాజశేఖర్,మాజీ కౌన్సిలర్లు బండారు కృష్ణ, పెండం నాగన్న యాదవ్,ఉంగ్లం. తిరుమల్ నాయుడు ,ప్రేమ్ నాథ్ రెడ్డి,సమద్, స్టార్.రహీమ్,ఇమ్రాన్,హేమంత్ ముదిరాజ్,సూర్యవంశం.గిరి జోహెబ్ హుస్సేన్, చిట్యాల రాము,సునీల్ వాల్మీకి మహిళా నాయకురాలు నందిమల్ల.శారద ,నాగమ్మ,జమ్ములమ్మ, సాయిలీలా,కవితా నాయక్ తదితరులు పాల్గొన్నారని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తెలిపారు
మాజీ ఎమ్మెల్యే ఓదన్న గారి ఆరోగ్యం బాగుపడాలని ప్రత్యేక పూజలు
మందమర్రి నేటి ధాత్రి
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ప్రాంతంలో బస్టాండ్ ఏరియా లోని అభయ ఆంజనేయ స్వామి గుడి లో ఎమ్మెల్యే మాజీ విప్ నల్లాల ఓదెలు గారు ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ మంగళవారం రోజున స్థానిక అభయాంజనేయ స్వామి మారుతి నగర్ మందమర్రి బస్టాండ్. ఆలయంలో కాంగ్రెస్ నాయకుడు ఏటూరి సత్యనారాయణ గారు మాజీ మా మాజీ విప్ మాజీ ఎమ్మెల్యే ఓదన్న గారు ఆరోగ్యంగా మహామృత్యుంజయడు గా తిరిగి రావాలని. అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకం, ప్రత్యేక అర్చనలు చేశారు. 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది.భక్తులకు ఓదన్న గారి అభిమానులు తీర్థప్రసాదాలను స్వీకరించి మాజీ ఎమ్మెల్యే కోలుకోవాలని వేడుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కొద్దిరోజుల నుంచి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ ఉన్నాడు. అరోగ్యం తొందరగా బాగా పాడాలని అభిమానులు కార్యకర్తలు భగవంతుని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరి సత్యనారాయణ తో పాటు ఓదన్న గారి అభిమానులు. ఆ ఏరియా ప్రజలు పెద్దలు అందరూ పాల్గొన్నారు
ధ్యానం వాకింగ్ చేయాలి జిల్లా జెడ్జి ఎమ్ ఆర్ సునీత. వనపర్తి నేటిదాత్రి :
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వాసవి వనిత క్లబ్ వనపర్తి గోల్డ్ ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో సమావేశము నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా జెడ్జి శ్రీమతి ఎమ్.ఆర్ సునీత లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ బి రజిని డిహెచ్ఎంఓ శ్రీనివాసులు ప్రోగ్రాం ఆఫీసర్ మంజుల న్యాయ వాది ఉత్తరయ్య పాల్గొన్నారు ఈసందర్భంగా జిల్లా జెడ్జి ఎమ్ ఆర్ సునీత మాట్లాడుతూ ప్రతిరోజు ధ్యానం ఉదయం నడక తప్పనిసరిగా చేయాలని ఆరోగ్యం గా ఉంటారని అన్నారు పిల్లలను మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా పిల్లలను గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు ఈ సమావేశంలో వాసవి క్లబ్ అధ్యక్షులు చిగుళ్లపల్లి శ్రీనివాసులు సెక్రెటరీ కే బుచ్చయ్య కోశాధికారి ఏ మధుసూదన్ ఆర్యవైశ్య సంగం కన్వీనర్ పూరి బాలరాజు పట్టణ బీజేపీ మాజి అధ్యక్షులు బచ్చు రాము వనితా క్లబ్ అధ్యక్షులు చిగుళ్లపల్లి సువర్ణ సెక్రెటరీ కొంపల్లి రజిత భార్గవి ఆర్యవైశ్య సంగం పట్టణ అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి సంధ్య మాధవి రాజశేఖర్ నరసింహస్వామి నవీన్ వనపర్తి ఆర్యవైశ్య లు పాల్గొన్నారు.
మహనీయుల ఆశయాలను కాపాడుకోవడంతో పాటు ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా జై-బాపు, జై-భీమ్, జై-సంవిధాన్ అభియాన్ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపు మేరకు జై-బాపు, జై-భీమ్, జై-సంవిధాన్ అభియాన్, కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలినేని లింగారావు మాట్లాడారు. భారతదేశం నేడు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుందని, గత 10 ఏళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బిజెపి పాలకులు రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ..రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ..అప్రజాస్వామ్య పాలన సాగిస్తున్నారని, రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుతూ..గౌరవిస్తూ..పాలన చేయాల్సిన పాలకులు..నేడు తమ ఆధీనంలోకి తీసుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తున్నారన్నారు. భారతదేశం మన కుటుంబమని, మనం అనే భావనే మన జాతీయత అని, జాతీయ భావనతో దృఢమైన సమాజాన్ని నిర్మించి, రాజ్యాంగం చూపిన మార్గంలో పయనిద్దామన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను, మన రాజ్యాంగాన్ని అవమానించే బిజెపి దాని అనుబంధ సంస్థల దాడులను తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అవమానించేలా పార్లమెంట్ లో హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అమిత్ షా రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తూ కాంగ్రెస్ కేంద్ర పెద్దలు జై-బాపు, జై-భీమ్, జై-సంవిధాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారన్నారు. జాతి ఐక్యత ముఖ్యమని మహాత్మా గాంధీ పేర్కొన్న మాటలను గుర్తు చేస్తూ..డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవించుకుందామన్నారు. మహాత్మ గాంధీ చూపిన బాటలో ముందుకు సాగాలని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ..మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగాలన్నారు.
ఎదురు గట్ల శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవానికి రావలసిందిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఆహ్వానం
వేములవాడ రూరల్ నేటిధాత్రి
వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో వైభవంగా నిర్వహించే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను రావాల్సిందిగా కోరుతూ దేవస్థాన కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎదురుగట్ల మాజీ సర్పంచ్ సోయినేని కరుణాకర్, దేవస్థాన కమిటీ ఛైర్మెన్ సంపేట గంగరాజు, వైస్ చైర్మన్లు పొన్నం బాలయ్య, నరేడ్ల రాఘవరెడ్డి, కమిటీ సభ్యులు కోడెం గంగాధర్, పొన్నం మల్లేశం సోయినేని రాజు పొన్నం నాగేందర్ అర్చకులు కార్తీక్, మకులభరణం శ్రీనివాస్ వంగపల్లి మల్లేశం బండ శ్రీనివాస్ సంఘ స్వామి పొన్నం రాజేశం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మహిళల ఆర్ధిక అభివృద్దే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 11 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలు సంబంధించిన చెక్కును అందించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అందజేశారు.
అదే విధంగా వరంగల్ జిల్లాలో 9 ఆర్టీసీ బస్సులు మంజూరు కాగా నర్సంపేట నియోజకవర్గంలో మంజూరైన 6 బస్సులకు మండలానికి ఒకటి చొప్పున ప్రతీ మండల సమాఖ్యకు రూ.30 లక్షల రూపాయలు సబ్సిడీ చెక్కు అందించడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
MLA
చెన్నరావుపేట మండలంలోని అక్షయ మహిళా రైతు ఉత్పత్తి సంఘానికి మరియు ఖానాపురం భారతీయ మహిళ రైతు ఉత్పత్తి సంఘానికి గోదాంల నిర్మాణం కొరకు ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ.30 లక్షల( ఒక్కొకంటి15 లక్షల చొప్పున)చెక్కులను సంఘాల బాధ్యులకు అందిజేసినట్లు పేర్కొన్నారు.2004 లో పావలా వడ్డీ రుణాలు మహిళకు అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుండి మహిళల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీర హామీల్లో మొదట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిందని .ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గుర్తుకు చేశారు.ఈకార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ రేణుకాదేవి,ఆర్డీవో ఉమారాణి, మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, డీపీఎంలో దయాకర్, సరిత, అనిత, అన్ని మండలాల మహిళ సమాఖ్య అధ్యక్షులు,ఏపీఎంలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీకార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం.
కల్వకుర్తి/నేటి దాత్రి:
కల్వకుర్తి నియోజక వర్గంలో కర్కల్ పహాడ్ గ్రామానికి చెంది ఎమ్మెల్యే అనుచరుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సిలివేరు శ్రీను గత నెల అనారోగ్యంతో మృతి చెందాడు. ఇవాళ ఉదయం శ్రీను భార్యను పిల్లను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఇంటికి పిలిపించుకుని మీకు మేము పార్టీ అండగా ఉంటుంది ఎవ్వరు అదర్యపడొద్దని భరోసా ఇచ్చి అపద్ధర్మం కింద కొంత రూ. 2 లక్షల ఆర్థిక సహాయ అందించారు . తన పిల్లల మంచి భవిష్యత్తు పై చదువులకోసం సహాకారం చేస్తా అన్నారు శ్రీను తనకోసం చాలా కష్టపడి పనిచేశాడు గుర్తుకు చేసుకుంటూ ఇలాంటి సంఘటనలు దురదృష్టకరం అని కుటుంబ సభ్యులను భరోసానిచ్చారు.
— ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది • కొనుగోలు కేంద్రం ప్రారంచిన ఎమ్మెల్యే
నిజాంపేట: నేటి ధాత్రి
రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందనీ మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం కె. వెంకటాపూర్ గ్రామంలో సోమవారం ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో రైతులను పట్టించుకున్న నాధుడే దిక్కు లేడనీ నేడు కాంగ్రెస్ హయాంలో నిరుపేదలకు సన్న బియ్యం తో పాటు ముందుగానే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రామాయంపేట మండల కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్” స్కూల్ ప్రారంభించుకోవడం కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుందన్నారు. అలాగే ప్రతి గ్రామంలో గల్లి గల్లికి సిసి రోడ్లను నిర్మించడం జరుగుతుందన్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ హేనని కొనియాడారు. అందరి సహకారంతో మండల కేంద్రాన్ని ముందుకు తీసుకువెళ్దామన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు, మండల ఇన్చార్జి ఎమ్మార్వో రమ్యశ్రీ, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఎంపీడీవో రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు చౌదరి సుప్రభాతారావు, నజురుద్దీన్, పంజా మహేందర్, లింగం గౌడ్, అమర సెనరెడ్డి, సిద్దారములు, గుమ్ముల అజయ్, శ్యామల మహేష్ , వెంకట్ గౌడ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
చేనేత కార్మికులకు మద్దతుగా బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )
ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ని స్థానిక అంబేద్కర్ చౌక్ లో సిఐటియు వారి ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు కూలి పెంచే విషయంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది అట్టి నిరాహార దీక్షలో పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన మద్దతు ఇస్తూ జిందాం చక్రపాణి మాట్లాడుతూ చేనేత కార్మికుల కోసం సిరిసిల్ల చేనేత చీరలకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చినటువంటి దానికి కూలి పెంచాలని, వైపని కార్మికులకు, వర్పిన్ కార్మికులకు మర మొగ్గల పవర్ లుమ్ కార్మికులకు కూలి పెంచాలని , తెలంగాణ రాష్ట్రంలోని చేనేత చీరలకు అత్యధికoగా ధర కల్పించాలని కోరుతూ ఈరోజు చేనేత కార్మికులకు మద్దతు పలకడం జరిగింది. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోదండ రమణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు ముషం రమేష్, మాజీ వార్డ్ కౌన్సిలర్ దార్ల సందీప్ కీర్తన, తదితర నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస పథకంలో భాగంగా మండల వ్యాప్తంగా యువత దరఖాస్తు చేసుకోవాలని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ వికాస పథకానికి ఈ నెల 14 వరకు గడువును పొడిగించిందని అర్హత గల ప్రతి ఒక్కరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పట్టణ అధ్యక్షుడు నజీరుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజా మహేందర్, ఎం ఎస్ ఎస్ మండల అధ్యక్షులువెంకట్ గౌడ్, జాల శ్రీకాంత్ లు ఉన్నారు.
నిరుపేదల పెన్నిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేవలు ఉన్నాయని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో నిజాంపేట గ్రామానికి చెందిన పాక ప్రియాంక కు చెందిన చెక్కును 60వేల రూపాయలు పాక స్వామికి సోమవారం మండల కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుపేదల పెన్నిధిగా సేవలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట పట్టణ అధ్యక్షులు నజీరుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజా మహేందర్, కాంగ్రెస్ నాయకులు వెంకట్ గౌడ్, జ్వాల శ్రీకాంత్, శ్రీకాంత్ గౌడ్ లు ఉన్నారు.
మిషన్ భగీరథ వాటర్ మెన్ లకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరిక.
జడ్చర్ల / నేటి ధాత్రి
మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు త్రాగునీటిని సరఫరా చేసే విషయంలో నిర్లక్ష్యం వహించే వాటర్ మెన్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. గతంలో కూడా హెచ్చరికలు చేసినా తమ వైఖరిని మార్చుకోని వాటర్ మెన్ లను విధుల నుండి తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం వేసవి కాలంలో ఎండలు ముదురుతున్న నేపథ్యంలో త్రాగునీటి ఎద్దడి ఏర్పడకుండా చూసుకోవల్సిన బాధ్యత మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది పైనే ఉందని చెప్పారు. ఈ విషయంగా శనివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మిషన్ భగీరథ వాటర్ మెన్ ల పనితీరుపై తమకు ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయని తెలిపారు. కొంతమంది వాటర్ మెన్ లు సకాలంలో నీటిని విడుదల చేయకపోవడం, నిర్ణీత వేళలలో తగినంత సమయం నీటి సరఫరా చేయకపోవడం వల్ల పలు గ్రామాలలో ప్రజలు త్రాగునీటి కి ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పరిశ్రమలు ఉన్న ప్రాంతాలలో ప్రజలకు తక్కువ నీటిని సరఫరా చేసి తమకు కావాల్సిన పరిశ్రమలకు ఎక్కువ నీటిని పంపిణీ చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు అందాయన్నారు.ప్రత్యేకించి బాలానగర్, జడ్చర్ల మండలాల్లో వాటర్ మెన్ లపై ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వాటర్ మెన్ లను ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉన్నా మానవతా దృక్పథంతో తాము ఆ పని చేయలేదన్నారు. అయితే ప్రస్తుతం వేసవిలో ఎండలు ముదురుతున్న నేపథ్యంలో వాటర్ మెన్ ల కారణంగా ప్రజలు నీళ్ల కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తే మాత్రం తాను సహించేది లేదని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. ఇకనైనా వాటర్ మెన్ లు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ నిర్ణీత వేళలలో నీటిని సరఫరా చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. కాగా మిషన్ భగీరథ వాటర్ మెన్ ల కారణంగా ఎక్కడైనా నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడి నీళ్ల కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉంటే ప్రజలు జడ్చర్ల లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని అనిరుధ్ రెడ్డి ప్రజలకు సూచించారు. మిషన్ భగీరథ అధికారులు కూడా నీటి సరఫరాను, వాటర్ మెన్ ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని ఎమ్మెల్యే కోరారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.