దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతున్న.

దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతున్న నరేంద్రమోదీ విధానాలపై ఉద్యమిద్దాం

ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జూలై 2న ఛలో అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి – ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణ పెళ్లి యుగంధర్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

 

 

భారత దేశ ప్రయోజనాలను, ప్రతిష్టను అమెరికాకు తాకట్టు పెడుతున్న నరేంద్రమోదీ విధానాలపై ఉద్యమించాలని, భారతీయులపై అమెరికా దుర్మార్గపు చర్యలను ఆపాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) జూలై 2న ఛలో అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి పిలుపుని స్తున్నట్లు యుగంధర్ తెలిపారు.

ఈముట్టడి కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను కరీంనగర్ బస్టాండ్ వద్ద విడుదల చేశారు.

ఈసందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ మాట్లాడుతూ నరేంద్రమోదీ విధానాలు దేశానికి ప్రమాదకరమని, దేశాన్ని తిరోగమన దిశలో తీసుకెళ్లే విధానాలను అనుసరిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వత్తాసు పలుకుతూ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రతిష్టను నష్టపరిచే చర్యలను దేశ పౌరులు తిప్పికొట్టాలని వారు అన్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని చెప్పడం చూస్తే, మన దేశ ప్రతిష్టను మోడీ తాకట్టు పెట్టాడనడానికి ప్రత్యక్ష నిదర్శనమన్నారు.

మోడీ ట్రంప్ మాటలను సైతం ఖండించలేదని వారు అన్నారు.

భారత పౌరులపై అమెరికా దుర్మార్గంగా వ్యవహరించడాన్ని అభ్యంతరం చెప్పడంలో విఫలమవడం ద్వారా మరోసారి తన క్రూరమైన వైఖరిని బహిర్గతం చేసిన మోడీ ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటన్నారు.

ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రయోజనాలను కాపాడతామని గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి, ఇటువంటి కఠినమైన బహిష్కరణ చర్యల నేపథ్యంలో తన సొంత ప్రజలకు కనీస గౌరవాన్ని అందించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా ముందు లొంగిపోయారని మండిపడ్డారు.

మోదీ అమెరికా సందర్శించినప్పుడల్లా కోట్లాది రూపాయలు ప్రచారం కోసం ఖర్చు చేస్తారు.

‘హౌడీ మోడీ’, ‘నమస్తే ట్రంప్’ వంటి ప్రజా దుర్వినియోగ కార్యక్రమాలు చేపడుతున్నారే తప్ప, భారత దేశంలో యువతకు అవసరమైన నిర్దిష్ట ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని వారు ధ్వజమెత్తారు.

ట్రంప్ ను ప్రపంచ అధ్యక్షుడుగా చేసేందుకే మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు.

మోడీ, ట్రంప్ వల్ల ఆయా దేశాలకు ఒరిగిందేమి లేదని వారు ఉద్ఘటించారు.

అందుకే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.

ఈపోస్టర్ విడుదల కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు కనకం ప్రవీణ్, వినయ్, చరణ్, మధు, రాజేష్, కిరణ్ రాఘవేంద్ర,కుమార్, వినయ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి.

ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని గంగిపల్లి గ్రామ పంచాయతీ లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.సత్యనారాయణ గౌడ్,మండల తహసిల్దార్ వనజా రెడ్డి,మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు సోమవారం క్షుణ్ణంగా పరిశీలించడం జరిగినది.పరిశీలన అనంతరం అధికారులు మాట్లాడుతూ వీలయినంత త్వరగా ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలనీ లబ్దిదారులకు సూచించారు.నిర్మాణం స్టేజిల వారిగా ఫోటో కాప్చర్ పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని హౌసింగ్ ఏఈ కాంక్షని,పంచాయతీ కార్యదర్శి అరెల్లి సత్యనారాయణని ఆదేశించారు.

అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.

అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు

పారిశ్రామిక వాడలో జరిగిన అగ్నిప్రమాద ఘటన స్థలిని పరిశీలించిన హరీష్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి

 

 

 

 

 

పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన
అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కనీసం సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం అత్యంత దారుణమని ఎద్దేవా చేశారు.

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలిని ఎమ్మెల్యేలు మాణిక్ రావు,చింతా ప్రభాకర్, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ,ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో మాట్లాడి అందిస్తున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఘటన జరిగి ఐదు గంటలు గడుస్తున్నా సహాయక చర్యలు అందించడంలో, కుటుంబ సభ్యులకు వివరాలు తెలపడంలో వైఫల్యం అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం ఇంత పెద్ద పేలుడు జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.

వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, ప్రమాదం జరిగే సమయంలో కంపెనీలో మొత్తం 140 మంది పని చేస్తున్నట్లు తెలుస్తున్నది.

మొత్తం నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది.

8 మంది మృతి చెందగా, దాదాపు 26 మందిని పలు ఆసుపత్రులకు తరలించారు.మిగతా వారి పరిస్థితి తెలియరావడం లేదు.

ఎంత మంది బయటికి రాగలిగారు అనేది అర్థం కాని పరిస్థితి కుటుంబ సభ్యులు వచ్చి ఆందోళన చెందుతున్నారు.

తమవారి జాడ చెప్పాలని అధికారులను వేడుకుంటున్నారు.

కుటుంబ సభ్యులకు వివరాలు తెలిపే ప్రయత్నం చేయాలని కలెక్టర్, ఎస్పీ లను కలిసి చెప్పాను.

ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ పని చేస్తున్నారు.

కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు.

ప్రమాదం జరిగి 5 గంటలు గడుస్తున్నా, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.కంట్రోల్ రూం పెట్టండి, కామన్ ఫోన్ నెంబర్ పెట్టండి అని అధికారులకు సూచించారు.ప్రమాదం జరిగి 5 గంటలు అవుతున్నది ఏం చేస్తున్నారు?

వివరాలు తెలియక కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నరు?

ప్రమాదంలో చిక్కుకున్న వారి జాడ వెతికేందుకు ఎన్డీఆర్ఎఫ్ అద్బుతంగా పని చేస్తున్నది.

కానీ, ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వం, అధికార యంత్రాంగం పని చేస్తున్నది అని ప్రశ్నించారు.

ప్రత్యేక అధికారులను పెట్టుకోండి, అటెండెన్స్ లిష్ట్ పెట్టుకోండి.డ్యూటీలో ఎంత మంది ఉన్నరు అంటే కలెక్టర్ ఒక లెక్క, ఎస్పీ ఒక లెక్క చెబుతున్నారని ఆరోపించారు.

5 గంటల నుంచి ఏ వివరాలు లేవు, బాధ్యత రాహిత్యంగ పని చేస్తున్నది ప్రభుత్వం
అసలు కార్మిక శాఖ, ప్రభుత్వం ఏం చేస్తున్నది?

ఇక్కడకు వచ్చే కుటుంబ సభ్యులు ఎవరిని కలవాలో చెప్పండి.

హ్యాండ్ మైక్ పెటుకొని గైడ్ చేసే బాధ్యత లేదా?

గాయపడ్డ వారిని ప్రైమేరీ కేర్ ఆసుపత్రుల్లో జాయిన్ చేస్తున్నారు.

30శాతం కాలితే డేంజర్, కార్పొరేట్ ఆసుపత్రులకు వారిని ఎందుకు పంపడం లేదు ఏఐజీ, కేర్, అపోలో ఆసుపత్రులకు పంపండి.

మొదటి గంటలో ట్రీట్మెంట్ అందితే ప్రాణాలు కాపాడవచ్చు.

నిర్లక్ష్యంతో గోల్డెన్ అవర్ మిస్ చేస్తున్నారు.

క్షతగాత్రులకు మంచి వైద్యం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని పేర్కొన్నారు.

కుటుంబాలకు సమాచారం అందించడంలోనూ ఫెయిల్ ఎంత మంది డ్యూటీలో ఉన్నారో గుర్తించడంలో ఫెయిల్ పారిశ్రామిక వాడలో వరుసగా ఇది మూడో సంఘటన.

గతంలో జరిగిన సంఘటనలో 5గురు చనిపోయారు.

వరుస అగ్రి ప్రమాదాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు?

ఏడాదిలో మూడో సంఘటన జరగటం దురదృష్టకరం.

ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది.

సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ఫెయిల్ దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలి.

ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే కాపాడే విధంగా చర్యలు రూపొందించాలి.

చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు మంచి వైద్యం అందించి 50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు.

బుద్ధారం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

బుద్ధారం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం బుద్ధారం గ్రామంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ భవనాలకు అవసరమైన స్థలాలను ఈడబ్ల్యూఐడీసీ డీఈ రామకృష్ణ, ఏఈ జీవన్ కుమార్, గ్రామ నాయకులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు. అదేవిధంగా, పాఠశాల ప్రహారీ గోడ పునరుద్ధరణ పనులు, పాఠశాల ప్రాంగణంలో ఓపెన్ జిమ్, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు విద్యార్థులకు ఇతర మౌలిక వసతుల కల్పనల కొరకు అధికారులతో చర్చించారు. ఇట్టి అన్ని పనులకు త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు. త్వరలోనే ఇట్టి అన్ని పనులను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు. బుద్ధారం గ్రామ బస్టాండు సెంటర్లో కొడవటంచ వెళ్లే దారిలో కొత్తగా నిర్మించనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆర్చి పనులకు సంబంధించి అధికారులతో చర్చించారు._

కరెంటు కష్టాల నుండి కాపాడండి.

కరెంటు కష్టాల నుండి కాపాడండి.

ఆమనగల్లు/నేటి దాత్రి:

 

 

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా ఆమనగల్ మండలంలో ఆకాశంలో వర్షపు మబ్బులు కనబడితే మన ఆమనగలులో కరెంటు కష్టాలు…. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు వర్షాలు పడ్డాయి గాలిలో వచ్చినయ్ కానీ రెప్పపాటు లో కూడా కరెంటు పోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో కరెంటు ఎందుకు పోతుంది అని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ పత్య నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది BRS ప్రభుత్వం లొ కరెంటు పోతే వార్త ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో కరెంటు వస్తే వార్తా అవుతుంది ఇప్పటికైనా మేల్కొని రైతులకు న్యాయమైన 24 గంటల వ్యాపారస్తులకు మరియు గృహస్థులకు మీ డిపార్ట్మెంటు ఏ విధంగా కరెంటు బిల్లు వసూలు చేస్తుందో అదేవిధంగా తమరు కూడా వినియోగదారులకు 24 గంటల కరెంటు ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజల ఆగ్రహాన్ని రాబోయే రోజులలో తమరు చూడాల్సి వస్తుందనిBRS పార్టీ సీనియర్ నాయకులు పత్య నాయక్ ప్రభుత్వనీ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్క నిరంజన్ గౌడ్, మాజీ సర్పంచ్ సోనా శ్రీనునాయక్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుత్తి బాలస్వామి, మాజీ కౌన్సిలర్ రాధమ్మ, వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రమేష్ నాయక్, సైదుల్ గౌడ్, మల్యా నాయక్, కృష్ణవేణి నాయక్, శ్రీకాంత్ నాయక్, భాస్కర్, గణేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి దాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండలం.

టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీకి.

చెందిన సీఎం దారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్.

ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ లో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

మధుకర్ మాట్లాడుతూ.

నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించి వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయించుకోవాలని వారికి.

ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక పరంల ఉపయోగపడుతుందని అలాగే ఇందిరమ్మ కాలనీ గ్రామానికి చెందిన దోమల హరిత.

రాజు కి.(17,500 రూపాయల).

చెక్కులు అందజేయడం జరిగిందని చెక్కులు రావడానికి కృషి చేసిన.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి.

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ కి. ప్రభుత్వ శాసనసభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కి.

కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్చార్జి శ్రీ కేకే మహేందర్ రెడ్డి కి.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ కి వారికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో.

కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంపెల్లి శ్యాం.

బ ల్కం లక్ష్మీపతి.

అంబటి అంజయ్య.

వేముల కర్ర నరేష్.

దూస సత్తయ్య.

రాము మహిళా నాయకురాలు అడిగొప్పుల యమున.

ముందటి శారద.

దీకొండ జ్యోతి.

మౌనిక.

కనుకుంట్ల .

రే నవ్వ.

గుడ్ల వసంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

బిల్లు రాకపోవడంతో హాస్టల్లో చేర్చుకొని యజమాన్యం.

సంవత్సరాల నుండి బిల్లు రాకపోవడంతో హాస్టల్లో చేర్చుకొని యజమాన్యం తంగళ్ళపల్లి

నేటిధాత్రి:

 

 

 

లోని బెస్ట్ అవైలబుల్ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లిలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గత రెండు సంవత్సరాలుగా బిల్లులు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రెండు సంవత్సరాల నుండి శ్రీ సరస్వతి స్కూల్ బిల్లులు రాకపోవడంతో విద్యార్థులను హాస్టల్స్ కు తీసుకు రాకూడదని తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం సూచిందని దీనితో దిక్కుతోచని స్థితిలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ విద్యార్థులు తల్లిదండ్రులు కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు. ఎలాగైనా పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు కలెక్టర్ గాని చొరవ తీసుకొని వారికి బిల్లులు వచ్చే విధంగా చొరవ తీసుకొని వాళ్ల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ గారిని వేడుకున్నారు కలెక్టర్కు ఇచ్చిన ప్రజావాణి . సంబంధిత అధికారులకు పత్రంలో పేర్కొన్నారు ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

అనారోగ్య బాధితురాలికి యువజన కాంగ్రెస్ నాయకుడి.

అనారోగ్య బాధితురాలికి యువజన కాంగ్రెస్ నాయకుడి సాయం

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:

 

 

 

 

 

ఓదెల మండలం పొత్కపల్లి గ్రామానికి చెందిన గంగారపు రాజమ్మ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. వైద్య చికిత్స నిమిత్తం ఆమెను హాస్పిటల్ లో చేర్చగా ఆక్సిజన్ తప్పని సరిగా ఉపయోగించాలని చెప్పారు. అయితే బాధితురాలి ఆర్దికస్థితి సరిగా లేనందున రాజమ్మను ఇంటికి తీసుకవచ్చారు. ఆమె నిరుపేద దీనస్థితికి చలించిపోయిన ఓదెల మండల న్న యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సిరిసేటి రాహుల్ గౌడ్ తన సొంత ఖర్చుతో ఆక్సిజన్ యంత్రాన్ని కొనివ్వడం జరిగింది. రాహుల్ గౌడ్ దాతృత్వానికి రాజమ్మ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా యువజన నాయకుడు రాహుల్ గౌడ్ మాట్లాడుతూ.. తన శక్తి మేరకు బాధితురాలికి వైద్య సహాయం అందజేశానని ప్రభుత్వపరంగా అవకాశాలుంటే రాజమ్మకు మెరుగైన వైద్య సహాయం అందజేయగలమని తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అభ్యర్థి రామచందర్రావు కలిసిన బూరుగు సురేష్.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అభ్యర్థి రామచందర్రావు కలిసిన బూరుగు సురేష్

బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్

చేర్యాల నేటిదాత్రి

 

 

 

 

 

బిజెపి రాష్ట్రాల అధ్యక్షులు నియామకంపై లేక విడుదల చేసింది అధిష్టానం ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా నామినేషన్ వేయడానికి అధిష్టానం మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు పేరు సూచించింది హైదరాబాద్ వారి నివాసం దగ్గర కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా తెలంగాణ బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బురుగు సురేష్ శాలువాతో సత్కరించి తన అభిమానం చాటుకున్నారు సీనియర్ నాయకుడు అయిన రామచంద్ర రావు అధిష్టానం నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేశారు రానున్న రోజులలో తెలంగాణలో అధికారం తేవడానికి మేమంతా కలిసి కాషాయపు జెండా ఎగురవేసి సత్తా చాటుతామని అన్నారు

జులై 7న ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం.

జులై 7న ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం

గట్లకానిపర్తిలో నూతన జెండా గద్దె నిర్మాణ పనులు ప్రారంభం

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

శాయంపేట మండలం గట్లకా నిపర్తి గ్రామంలో మహాజననేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జూలై 7న ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గట్లకా నిపర్తి గ్రామంలో ఎమ్మెస్ పి మండల ఇన్చార్జ్ మామిడి భాస్కర్ మాదిగ ఆధ్వర్యంలో నూతన జెండా గద్దె నిర్మాణం సమావే శం జరిగింది.ఈ కార్యక్ర మంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఇంచార్జ్ కందుకూరి సోమన్న మాదిగ ,ఎమ్మెస్ పి జిల్లా అధ్యక్షులు బండారి సురేందర్ మాదిగ , ఎమ్మార్పీ ఎస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగలు హాజరై మాట్లాడి అనంతరం ఎమ్మార్పీ ఎస్ నూతన జెండా గద్దె నిర్మా ణం పనులను ప్రారంభించా రు.ఈ కార్యక్రమంలో ముక్కెర ముఖేష్ మాదిగ, ఎంఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎర్ర రాము మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు,బొమ్మకంటి రవీంద్ర మాదిగ ,ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి ,
మామిడి విజయ్ మాదిగ
ఏం వైయస్ మండల అధ్యక్షు లు మామిడి తిరుపతి మాదిగ ,బొమ్మకంటి కుమార స్వామి మాదిగ ,బొమ్మకంటి సాంబయ్య మాదిగ ,చింతం రాజేందర్ మాదిగ ,బొమ్మకంటి కుమారస్వామి మాదిగ ,చిలుక కిరణ్ మాదిగ,బొమ్మకంటి భద్రయ్య మాదిగ ,బొమ్మకంటి సుధాకర్ మాదిగ ,బొమ్మకట్టి సదానందం మాదిగ, బొమ్మకం టి కుమార్ మాదిగ ,బొమ్మకం టి సాంబయ్య మాదిగ ,బొమ్మ కంటి ఆనందం మాదిగ తదితరులు పాల్గొన్నారు.

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

◆: జహీరాబాద్ రాష్ట్ర నాయకులు ఉజ్వల్ రెడ్డి…!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

కాంగ్రెస్ అంటేనే రైతుల ప్రభుత్వం అని జహీరాబాద్ రాష్ట్ర నాయకులు ఉజ్వల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని సమయానికి ఎరువులు అందుబాటులో ఉండడం పంటలు వేసే సమయంలో రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయడం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం అనేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యమని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో 18 నెలలు రైతులకు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని తెలిపారు రైతు రుణమాఫీ ఉచిత విద్యుత్ 200 యూనిట్లు మహిళలకు ఉ చిత బస్సు సౌకర్యం గ్యాస్ సబ్సిడీ రైతు భరోసా బీసీ కమిషనర్ ఏర్పాటు కులగణన రైతు కమీషన్ ఏర్పాటు విద్య కమీషన్ ఏర్పాటు విద్యా కమిషన్ ఏర్పాటు వైశ్య కార్పొరేషన్ రైతు కూలీలకు రైతు భరోసా సన్న వడ్లకు 500 బోనస్ ఇలాంటి అనేక పథకాలు చేపట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని తెలిపారు.

మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా గాండ్ల సమ్మయ్య.

మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా గాండ్ల సమ్మయ్య

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా గాండ్ల సమ్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గద్దెరాగడి లోని భీమ గార్డెన్ లో ఏర్పాటుచేసిన మున్నూరు కాపు సంఘం సమావేశంలో నూతన కమిటీని, కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంఘం ప్రధాన కార్యదర్శి అలుగుల సత్తయ్య, కోశాధికారి గా మేకల సురేందర్ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా రామిడి కుమార్, ముఖ్య సలహాదారుగా పల్లె రాజు, ఉపాధ్యక్షులుగా సుధాకర్, మహేందర్, సత్తయ్య, సత్యనారాయణ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడారు. మున్నూరు కాపు సంఘం బలోపేతానికి కృషి చేస్తామని, సంఘంలో ఎలాంటి సమస్యలు ఉన్న సరే సంబంధిత బాధ్యులకు తెలియజేస్తే సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం.

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
శనివారం టేకుమట్ల మండలంలోని కస్తూరి భా గాంధీ గురుకుల పాఠశాలలో 2.30 కోట్ల తో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు, ప్రయోగ శాల భవనాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ , రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి తో కలిసి ప్రారంబించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ భూపాలపల్లి కలెక్టర్ గా విధులలో చేరిన సంవత్సర కాలంలో విద్యా, వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, జిల్లాలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట మండల ప్రత్యేక అధికారులు, జిల్లా కలెక్టర్ సైతం గురుకుల పాఠశాలల్లో తనికీలు చేపడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యా, భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు అడిగిన మేరకు పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి, చేతిపంపు, డయాస్ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని తెలిపారు. జిల్లా లోని అన్ని గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి గురుకుల పాఠశాలలో కావలసిన అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ…
విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకొని విద్యాశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారంలోకి వచ్చిన సంవత్సరన్నర కాలంలోనే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో గవర్నమెంట్ పాఠశాలలో సీట్లు కోసం రికమెండ్ చేసే రోజులు రాబోతున్నాయని అన్నారు. గురుకులాల నుండి పాఠశాలలకు బస్సులు ఏర్పాటు చేసి విద్యార్థులను తరలించే రోజులు త్వరలో రాబోతున్నాయని.
విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన విద్యా బోధన అందించేందుకు మన నియోజకవర్గంలో ఘనపురం మండలం గాంధీ నగర్ గుట్ట వద్ద 30 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ స్కూల్ క్యాంప్లెక్స్ ను నిర్మించబోతున్నామని తెలిపారు. తన ఎస్ డి ఎఫ్ నిధుల నుండి ఇప్పటి వరకు పాఠశాలలకు 7 కోట్లు వరకు కేటాయించడం జరిగిందని
ప్రభుత్వ గురుకుల పాఠశాలలులో విద్యార్థుల కు వేడి నీళ్లు కొరకు గీజర్లు , దుప్పట్లు అందించామని
త్వరలో గురుకులాల్లో కావలసిన బెడ్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
విద్యార్థులు చక్కగా చదువుకొని
తమ లక్ష్యాలను చేరుకోవాలని
ప్రభుత్వ పాఠశాలలలో చదివిన విద్యార్థులు ఎందులో తక్కువ కాదని నిరూపించాలని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు ఆకాంక్షించారు..
ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి స్థానిక సంస్థల
అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిసిడిఓ శైలిజ, తహసీల్దార్ విజయ లక్ష్మీ, ఎంపీడీవో అనిత, ప్రిన్సిపల్ సప్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సచివాలయంలో మంత్రి దామోదర్.

తెలంగాణ సచివాలయంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ను కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్

నేటి ధాత్రి, పఠాన్ చేరు

 

 

 

 

తెలంగాణ సచివాలయంలో పటాన్‌చెరు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ శనివారం నాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ని మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి గారితో చర్చించారు. మంత్రి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారాని ఆయన తెలిపారు

ఘనపూర్ లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్.

ఘనపూర్ లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు

వనపర్తి నేటిధాత్రి

 

 

 

 

ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ ఆధ్వర్యంలో బస్టాండ్ దగ్గర రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి జరుపుకున్నారు ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం చేశారు
ఈ వేడుకలలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్
జిల్లా వికలాంగుల కమిటీ అధ్యక్షుడు గంజాయి రమేష్ జిల్లా డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షులు నరేందర్ గౌడ్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఎం దేవన్న యాదవ్ మున్నూరు జయకర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దేవుజా నాయక్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు కే బాల్ రెడ్డి, చిట్యాల లింగస్వామి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జియంతి వేడుకలు.

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జియంతి వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు

వనపర్తి నెటిదాత్రి :

 

 

 

 

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే మేగారెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రాపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వేడుకలు ఘనంగా నిర్వహించామని టిపిసిసి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు కాంగ్రెస్ పార్టీనేతలు లక్కకుల సతీష్ బి కృష్ణ చందర్ నక్కరాములు చుక్కరాజు జి జె శ్రీనివాసులు పార్టీ నేతలు పాల్గొన్నారు

గత ప్రభుత్వంలో ఏ ఒక్కరి కూడా ఇల్లు మంజూరు చేయలేదు…

గత ప్రభుత్వంలో ఏ ఒక్కరి కూడా ఇల్లు మంజూరు చేయలేదు…

పిఎసిఎస్ వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వర్ రావు

కల్యాణ లక్ష్మి,.. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ… ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను లబ్ధిదారులకు అందజేత

కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుంది…

కేసముద్రం/ నేటిదాత్రి

 

 

 

 

కేసముద్రం మండలం పరిధిలో ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో రైతు వేదిక నందు మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్, ఆదేశాల మేరకు స్థానిక తహసిల్దార్ వివేక్ అధ్యక్షతన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది, మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి 50 మంది లబ్ధిదారులకు మరియు13 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు,కేసముద్రం మున్సిపాలిటీ చెందిన 100 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను అందజేసిన ధన్నసరి పిఎసిఎస్ వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వర్ రావు
మహబూబాబాద్ జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి,కేసముద్రం పిఎసిఎస్ వైస్ చైర్మన్ అంబటి మహేందర్ రెడ్డి,

ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ..నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల నిధులతో ఇందిరమ్మ మంజూరు చేస్తున్నారని,
అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు.

గత ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ఇండ్లు మంజూరు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందిస్తుందన్నారు. మూడు నెలల సన్న బియ్యం ఒకేసారి అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె ప్రసన్న రాణి, ఎమ్మార్వో జి వివేక్ , రెవెన్యూ అధికారులు ఎండీ మాజిద్,సౌజన్య,పిసిసి మెంబర్ దశ్రు నాయక్ ,,మాజీ ఎంపీపీ మల్సూర్ నాయక్,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ ఎండీ ఆయాబ్ ఖాన్, చింతకుంట్ల యాదగిరి,మాజీ సర్పంచ్ మధుగిరి సాంబయ్య, మాజీ ఉప్పసర్పంచ్ బానోత్ వెంకన్న, అధికారులు,గ్రామ పార్టీ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

 

 

పేదల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల ముగ్గు పోసే కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని నిర్దిష్ట సమయంలో ఇండ్లను పూర్తి చేయాలని ఆయన అన్నారు కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఘన స్వాగతం పలికిన.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఘన స్వాగతం పలికిన సుజిత్ రావు

మెట్ పల్లి జూన్ 28 నేటిదాత్రి

 

 

 

కోరుట్ల నియోజవర్గానికి మొట్టమొదటిసారిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ మైనార్టీ,వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి ఘన స్వాగతం పలికిన టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు

ఈ కార్యక్రమంలో మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ సేల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి,మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఖుతుబ్భుదిన్ పాషా,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి,మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి, ఏఎంసి డైరెక్టర్,కోరుట్ల నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అందే భవిత రాణి, పాషా,నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చెన్న మమత,నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ ఉప అధ్యక్షురాలు మైస లక్ష్మీ,నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యురాలు అందే లలిత,మహిళ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యురాలు చిప్ప సుభద్ర,కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోడిమ్యాల దీపక్ రాజ్,మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గంధం రాజేశం,మల్లాపూర్ మండల ఫిషర్మాన్ అధ్యక్షులు రోడ్డ రాజు, ఇబ్రహీంపట్నం మండల సేవాదళ్ అధ్యక్షులు గూడా సొల్లు ,ముత్యం రెడ్డి,మల్లాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మల రాజు,ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నల్లూరి సాగర్,కోరుట్ల మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కుంటాల వికాస్,కాంగ్రెస్ నాయకులు వెంకటగిరి,కల్లెడ గంగాధర్ మామిడి ,రాజశేఖర్ రెడ్డి ఇప్పపెల్లి గణేష్,మొగలి రాజేందర్ గోపిడి నరేశ్, మిట్ట పెల్లి మహేష్, మసూల చిన్నయ్య,బైండ్ల శ్రీకాంత్,పిట్టల వెంకటేష్ ,కోరే రాజ్ కుమార్, ముద్దం ప్రశాంత్,మజ్జు,వేల్పుల దాస్,కనుక దినేశ్,రెబ్బాస్ మల్లేష్ రమేష్,దాస్,బద్దం సుధాకర్ రెడ్డి, ఉప్పులుటి రమేశ్,బద్దం ఎల్లా రెడ్డి,పన్నాల జీవన్ రెడ్డి, నల్లపోతురాజు శ్రీకాంత్, జాకీర్,జగన్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు , మహిళా కాంగ్రెస్ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.

రైతు బందవుడు సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

◆ – 9 రోజుల్లో 9 వెయ్యిల కోట్లు విడుదల చేయడంపై రైతుల్లో హర్షం

◆ – రైతుల సంక్షేమం కోసం కృషి చేసేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే

◆ – బలహీనమైన నాయకత్వంతోనే పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేదు

◆ -పార్టీకి వ్యతిరేకంగా పని చేసినవారికి పెద్దపీట వేయడం దేనికి సంకేతం ?

◆ – మండల అధ్యక్షులుగా సీనియర్ నాయకులకు అవకాశం ఇవ్వాలి

◆ – ప్రస్తుతం ఉన్న మండల అధ్యక్షులకు జిల్లా పార్టీలో భాగస్వామ్యం చెయ్యాలి

◆- సీనియారిటీ, సమర్థతకు పెద్దపీట వేసి నూతన అధ్యక్షులను ఎంపిక చెయ్యాలి

◆- 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీని ఇప్పటినుంచే ప్రక్షాళన చెయ్యాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

 

రాష్ట్ర, దేశ చరిత్రలో రైతుల కోసం ఏకకాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా 9 రోజుల్లో 9 వెయ్యిల కోట్లు రైతు పంట పెట్టుబడి సాయంగా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని సంగరెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ముల్తానీ అన్నారు.

గురువారం నాడు ఝరసంగం మండలంలోని మన్నూర్ గ్రామంలో నియోజకవర్గ ముఖ్య కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి రైతులు పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మండల ఎంపిపి దేవదాస్ మాట్లాడుతూ బలహీనమైన నాయకత్వం వల్లే కాంగ్రెస్ పార్టీలో నైరాశ్యం నెలకొందని.

మండల అధ్యక్షులను మార్చి నూతన నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని, అప్పుడే కాంగ్రెస్ పార్టీ తిరిగి జహీరాబాద్ అసెంబ్లీ సీటు గెలవగలదని, గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించడానికి పెద్ద నాయకుల వద్దకు వెళితే కనీసం పాలకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్లమెంట్ ఎస్టీ సెల్ కో ఆర్డినేటర్ ఛానోత్ రాజు నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమపై ఎన్నో ఆక్రమ కేసులు నమోదు చేశారని, ఇప్పటికైనా అధినాయకత్వం సీనియర్లను గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

సీనియర్ నాయకులు కవేలి కృష్ణ కోహిర్ మండల ఎస్టీ సెల అధ్యక్షుడు వినోద్ రాథోడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారిని విస్మరించి పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికి అందలం ఎక్కించడం కరెక్ట్ కాదని, రాబోయే రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సవివరంగా కెలపాలని, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు, సన్నబియ్యం, నూతన రేషన్ కార్డుల మంజూరు, కళ్మాణాలక్ష్మి, షాది ముబారక్, రైబుభరోసా, రైతు భీమా, ఆడపిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు లాంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయలను ప్రజలకు తెలియజేద్దామని అన్నారు.

 

 

Farmers

 

కార్యక్రమంలో జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ముల్తానీ, మాజీ ఎంపీపీ దేవదాస్, జహీరాబాద్ పార్లమెంట్ ఎస్టీ సెల్ కో ఆర్డినెంటర్ థానోత్ రాజు నాయర్, మాజీ సర్పంచ్ మహేబూబ్ పటేల్, మాజీ ఎంపిటిసి దుర్గాప్రసాద్, మొహమ్మద్ శుకుర్, కృష్ణ, కోహిర్ మండల ఎస్టీ సెల్ రాథోడ్ వినోద్ కుమార్, సీనియర్ నాయకులు రవేలి కృష్ణ, మొహమ్మద్ యూనుస్ హత్నూర్, మొహమ్మద్ మస్తాన్, ముహమ్మద్ చష్మోద్దీన్ శేకపూర్, సుధాకర్ రెడ్డి.

భాస్కర్ రెడ్డి, నవాజ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి వెంకటా పూర్, రాజ కుడు సంగం, నగేష్ బొపన్ పల్లి, హత్నూర్ వెంకట్ రెడ్డి వెంకట్ హాద్నూరు, సంగన్న ఝారసంగం, మచ్నూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ రాపీయెన్షన్, విద్య సాగర్, ప్రశాంత్, గుండప్ప పటేల్, ఆయా మండలాల మాజీ సర్పంచులు. మాజీ ఎంపిటిసిలు, సీనియర్ కార్యర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version