విద్యా శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతులు
తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి
ప్రభుత్వ ఆదేశాల మేరకు తొర్రూరు మండలంలోని తొర్రూరు హై స్కూల్, చెర్లపాలెం హై స్కూల్, మాటేడు హై స్కూల్, అమ్మాపురం హై స్కూల్ మరియు హరిపిరాల హై స్కూల్ లలో పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతులు (సమ్మర్ క్యాంప్)తేదీ 6-05-2025 నుండి 20-05-2025 వరకు (15 రోజులు), ఉదయం 8 గంటల నుండి 10:30 వరకు నిర్వహించడం జరుగుతుంది.
సమ్మర్ క్యాంపులో ఈ క్రింద తెలుపబడిన కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము.
1 ఇండోర్ గేమ్స్
2 ఆటలు మరియు పాటలు
3 స్పోకెన్ ఇంగ్లీష్
4 బేసిక్ మ్యాథమెటిక్స్ స్కిల్స్
5 సైన్స్ ఎక్స్పెరిమెంట్స్
6 డ్రాయింగ్ స్కిల్స్
7 క్రాఫ్ట్ (కుట్లు మరియు అల్లికలు)
8 కమ్యూనికేషన్ స్కిల్స్
9 డాన్స్
10 వాలీబాల్ ,షటిల్ గేమ్స్
పైన సూచించిన కార్యక్రమాలతో పాటు ఇతర కొత్త కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది.
కావున తమరు అందరూ ఐదవ తరగతి నుండి పదో తరగతి చదువుతున్న ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరనైనది.
ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రధానోపాధ్యాయుల సమావేశంలో MEO మహంకాళి బుచ్చయ్య కోరారు.