శుభ స్వీకరణ కార్యక్రమానికి హాజరైన తుడా చైర్మన్..

*శుభ స్వీకరణ కార్యక్రమానికి హాజరైన తుడా చైర్మన్..

చంద్రగిరి(నేటి ధాత్రి) జూలై 29:

చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని మాతృమూర్తి కీ!!శే!! లక్ష్మి భారతి ఇటీవల వైకుంఠ ప్రాప్తి పొందారు. బుధవారం పులివర్తి వారి పల్లిలోని వారి స్వగృహమునందు జరిగిన శుభ స్వీకరణ కార్యక్రమానికి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరయ్యారుఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాతృమూర్తి లక్ష్మి భారతి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. లక్ష్మి భారతి అమ్మ
ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం ఎమ్మెల్యే నాని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని కలిసి..

*తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని కలిసి

వేద ఆశీర్వచనం అందజేసిన టిటిడి కాంట్రాక్ట్ అర్చకులు…

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 16:

తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్, టిటిడి ఎక్స్ ఆపిషియో సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి ని తిరుమల తిరుపతి దేవస్థానములలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అర్చకులు మర్యాదపూర్వకంగా కలిసి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం అందించారు.. మంచి మనసున్న డాలర్స్ దివాకర్ రెడ్డి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. వందమందికి పైగా టిటిడిలో కాంట్రాక్ట్ ఆర్చకులు పనిచేస్తున్నామని తమకు గుర్తింపు కార్డులు,లడ్డు కార్డు, హెల్త్ కార్డులు అందించాలని అర్చకులు దివాకర్ రెడ్డి ని కోరారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ అర్చకుల విన్నపాలను టిటిడి పాలకమండలిలో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version