చివరి శ్వాస వరకు చొప్పదండి నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తాను
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తాం
పేదవారి సొంత ఇంటి కలలు నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది
రాష్ట్రంలో 99 శాతం మందికి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది
రూ. 43 కోట్లతో నారాయణపూర్ రిజర్వాయర్ పెండింగ్ పనులు పూర్తి చేస్తాము
గంగాధర మండలంలోని 33 గ్రామాలకు చెందిన 721 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ప్రమేలా సత్పతితో కలిసి మంజూరి పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర నేటిధాత్రి:
పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది.
ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఒక్క గంగాధర మండలంలోనే 721 మంది అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాము.
721 మందికే కాదు, చొప్పదండి నియోజకవర్గం లోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరి చేయడానికి కృషి చేస్తాము.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందజేశారు.
రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తాము.
సంక్షేమ పథకాల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎవరైనా మామూలు అడిగితే మా దృష్టికి తీసుకురండి, లేదా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయండి.
సంక్షేమ పథకాలు అందించడంలో అవినీతికి తావు లేదు.
మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం.
జ్యోతి పథకంతో 200 మీట్ల వరకు ఉచిత విద్యుత్ను అందజేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెట్టింది.
కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం 44 కిలోల వరకు తూకం వేసి రైతులను నిండా ముంచింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ గ్రామ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో 21 వేల కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
గంగాధర మండలంలో 2018 లో బిఆర్ఎస్ ప్రభుత్వం 2483 మంది రైతులకు రూ.17 కోట్ల 82 లక్షల రుణమాఫీ చేస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5744 మంది రైతులకు రూ. 48 కోట్ల రుణమాఫీ చేసింది.
బిఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు రుణమాఫీ కాలేదని ప్రజలను మభ్యపెడుతున్నారు. 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి రూ.43 కోట్లతో పూర్తి చేయబోతున్నాము.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం లోని ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రారంభించి వదిలేసిన ఓటీల నిర్మాణాల పనులను పూర్తి చేయిస్తున్నాం.
నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేసి కోనసీమగా మార్చుతాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 56 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది.
కుల మతాలతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.
అతి త్వరలోనే గంగాధర మండలంలో డిగ్రీ కళాశాలను ప్రారంభిస్తాము.