10 పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన అధికారులు.

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన అధికారులు

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండల కేంద్రంలో రెండవ రోజు జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు,తహసీల్దారు వనజా రెడ్డి,ఎస్సై శ్రీధర్ సందర్శించారు.పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు సరియైన సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకొని ఎలాంటి ఒత్తిడిలకు లోనవ్వకుండా సమయస్ఫూర్తితో తగు జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు బాగా రాయాలని ఉన్నత ఫలితాలను మండల కేంద్రానికి తీసుకురావాలని విద్యార్థులకు సూచనలు చేశారు.

బిఆర్ఎస్వి నాయకుల అక్రమ అరెస్టులు..

బిఆర్ఎస్వి నాయకుల అక్రమ అరెస్టులు..

నిజాంపేట, నేటి ధాత్రి

నిజాంపేట మండల కేంద్రంలో శనివారం బిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు బజార్ రంజిత్ గౌడ్ ని నిజాంపేట పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నుండి ఎలాంటి సమాచారం లేకుండానే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. ప్రతిపక్షాల నాయకుల మీద దృష్టి పెట్టకుండా ప్రభుత్వ పాలనపై దృష్టి సారించాలన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని ఈ అక్రమ అరెస్టులకు పాల్పడకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

నిజాంపేట, నేటిధాత్రి

 

నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి అన్ని తరగతుల్లో విద్యాబోధన అందించారు.వీరిలో ప్రధానోపాధ్యాయులుగా సింధు,
డీఈవోగా నవదీప్ గౌడ్, ఎంఈఓ గా సాత్విక్,లు ఉన్నారు. పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు చక్కటి విద్యను అందించారని ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించామన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు అరుణ, ఉపాధ్యాయులు వినోద్, శ్రీలత, రాజేందర్, శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్,ఇంతియాజ్ భాను, బాల్ లక్ష్మి,ప్రమీల,తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు అరెస్టులు…

ముందస్తు అరెస్టులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలలానికి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నిషేధంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన టిఆర్ఎస్వి నాయకులు ముందస్తుగా అడ్డుకొని ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు అరెస్టు చేసి తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్కు ట్రాఫిక్ జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో మాకు సంబంధించిన విషయాల గురించి అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మమ్మల్ని అరెస్టు చేసి తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగిందని ఈ సందర్భంగా అరెస్ట్ అయిన వారిలో చీమల ప్రశాంత్ యాదవ్ బొలవేణి ఎల్లం యాదవ్ పొందాల చక్రపాణి నందగిరి భాస్కర్ గౌడ్ తదితరులు అరెస్టు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు వీరిని మాజీ జెడ్పిటిసి బిఆర్ఎస్ నాయకులు కోడి యంతయ్య జిల్లెల్ల మాజీ సర్పంచ్ మాట్ల మధు తదితరులు పరామర్శించారు

చిన్నారి వైద్యచికిత్సల కోసం ఆర్ధిక సహాయం అందజేత.

చిన్నారి వైద్యచికిత్సల కోసం ఆర్ధిక సహాయం అందజేత

 

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:

 

గీసుకొండ మండల కేంద్రానికి చెందిన తాళ్లపెళ్లి రమేష్ – నాగమణిల కూతురు పుట్టిన కొన్ని రోజుల తర్వాత కడుపు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నది. నిరుపేద కుటుంబం కావడంతో ఆ చిన్నారి పాపకు వైద్య చికిత్స చేయించడానికి ఇబ్బందులు పడుతూ, సాయంఅందించాలని ప్రాధేయపడుతున్నారు.ఈ విషయాన్ని తెలుసుకున్న హన్మకొండలో ఉంటున్న గీసుకొండ గ్రామానికి చెందిన ఏనుగుల మంజుల -సాంబరెడ్డి దంపతులు మానవత్వంతో స్పందించి రూ.3వేలు పంపగా ఆ నగదును కర్ణకంటి రజిత -రాంమూర్తి దంపతులు ఆ చిన్నారి పాప తల్లికి అందజేశారు.ఈకార్యక్రమంలో స్థానికులు చాపర్తి రాజమ్మ పాల్గొన్నారు.

భగత్ సింగ్ 94 వ వర్ధంతి వారోత్సవాలను.

భగత్ సింగ్ 94 వ వర్ధంతి వారోత్సవాలను జయప్రదం చేయండి.
న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ*

నర్సంపేట,నేటిధాత్రి:

 

బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ఉరితాడును ముద్దాడిన యువ కిశోరులు కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ ల 94వ వర్ధంతి వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ నర్సంపేట పట్టణంలోని న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు.పిడిఎస్యు, పివైఎల్, సంఘాల రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 23వ తేదీ నుండి 30వ తేదీ వరకు 94 వ వర్ధంతి వారోత్సవాలను జరపాలని పిలుపునిచ్చాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచర్ల బాలరాజు, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజేందర్ లు మాట్లాడుతూ, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత విద్యార్థి నిరుద్యోగులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న దురాహంకారానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు.అలాగే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ఈపి 20-20 మరియు యుజిసి ముసాయిదాలను రద్దు కోసం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్స్ లర్ విద్యార్థి సంఘాలు చేసే ఆందోళన ఇతర కార్యక్రమాలపై నిషేధం ఎత్తివేతకు పోరాడాలని కోరారు.నేడు దేశంలో రోజురోజుకు పెరుగుతున్న బిజెపి మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు గట్టి కృష్ణ,ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు భోగి సారంగపాణి, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిలివేరు పూలక్క,గుగులోతు భద్రాజి భీమగాని మల్లయ్య,బరిగల కుమార్, గొర్రె ప్రదీప్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి పనికి వెళ్లిన కార్మికుడు మృతి.

ఉపాధి పనికి వెళ్లిన కార్మికుడు మృతి

చందుర్తి, నేటిధాత్రి:

 

ఈ రోజు అనగా శనివారం రోజున ఉదయం 9 గంటల 30 నిమిషాలకు చందుర్తి మండలం ఎన్గల్ గ్రామములో ఉపాధి హామీ పనులో భాగంగా రోడ్డు పనులు చేసి మధ్యలో అన్నం తినేటప్పుడు పసుల లచ్చయ్య s/o రాజయ్య, అకస్మాత్తుగా పడిపపోవడం జరిగినది వెంటనే అంబేలెన్స్ కి కాల్ చేసి తెప్పించి ఏరియా ఆసుపత్రి వేములవాడ కు తీసుకువెళ్లడం జరిగినది అక్కడ డాక్టర్లు ఇసిజి తీసిన తర్వాత లచ్చయ్య చనిపోయాడని తెలియజేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నవత విద్యాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు.

నవత విద్యాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు.
– పట్టణ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన
– లుసిడా చేతివ్రాతలో ప్రభంజనం
– ప్రోపెల్ డిజిటల్ తరగతుల బోధనలో జాతీయ మొదటి బహుమతి
– విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రతి నిమిషం కృషి
– ఉపాధ్యాయుల కృషి అభినందనీయం
– పాఠశాల కరస్పాండెంట్ పత్తిపాక నాగరాజు

చందుర్తి, నేటిధాత్రి:

 

చందుర్తి మండల కేంద్రంలోని నవత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా విద్యార్థుల ఆటపాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పత్తిపాక నాగరాజు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెందుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించడంలో పురోగతిని సాధిస్తున్నామని అన్నారు. పట్టణ ప్రాంత పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తున్నామని, అందుకు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి విద్యను అందించాలనే సత్సంకల్పంతో ఈ విద్యా సంవత్సరం పాఠశాలలో డిజిటల్ తరగతుల బోధనలు ప్రారంభించగా మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. ఆడియో వీడియో విజువలైజేషన్లో తరగతుల నిర్వహణతో విద్యార్థుల సామర్థ్యాలు పెరిగాయని అన్నారు. ప్రోపెల్ డిజిటల్ తరగతుల బోధనలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి శిక్ష అవార్డు పొందామని తెలిపారు. అలాగే విద్యార్థి భవిష్యత్తుకు చక్కటి చేతి వ్రాత ఎంతో అవసరమని అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో లుసిడ చేతి వ్రాత తరగతులు నిర్వహించామని, చేతివ్రత పోటీలలో నవత విద్యాలయం విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రభంజనం సృష్టించారని అన్నారు. నవత విద్యార్థుల ప్రతిభతో అక్షర చేతివ్రాత ఫౌండేషన్ అధ్యక్షులు మీరజ్ అహ్మద్ ఆశ్చర్యపోయారన్నారు. రాష్ట్రస్థాయి సూపర్ 10 లో మూడు బహుమతులు, స్టేట్ 50లో 12 బహుమతులతో పాటు వివిధ కేటగిరీలో మొత్తం 90 అవార్డులు సాధించి రాష్ట్రంలోనే మరే ఇతర పాఠశాల సాధించని ఘనత సాధించామని తెలిపారు. విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో తల్లిదండ్రులు ఎల్లవేళలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Anniversary Celebration

ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా.

ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా సునీల్ కు సన్మానం .

చిట్యాల, నేటిధాత్రి ;

 

వరల్డ్ పీస్ సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ అధ్వర్యంలో హన్మకొండ అశోక హోటల్ లో జరిగిన కార్యక్రమంలో చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన కవి రచయిత మ్యాదరి సునీల్ ను సన్మానించడం జరిగింది,సునీల్ ఇప్పటికే ఎన్నో పాటలు రాస్తూ జిల్లాలో మంచి పేరు పొందుతున్నాడు సునీల్ సామాజిక కోణంలో గాని సినిమా పరంగా గాని అనేక అంశాల మీద గాని సందర్భాన్ని బట్టి రాసే కవి మ్యాదరి సునీల్ అందులో భాగంగా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ప్రపంచానికి కవులు ఏమవుతారు అనే అంశం మీద సునీల్ తనదైన శైలిలో పాటను రాయడం జరిగింది అందుకు గాను ఆ సంస్థ అధ్యక్షులు మహమ్మద్ సిరాజుద్దిన్ మరియు ముఖ్య అతిథి వరంగల్ సైబర్ క్రైమ్ కూజ విజయ్ కుమార్ ఆచార్య రవికుమార్ విప్పనపల్లి రవి కుమార్ మ రియు ప్రముఖుల చేతుల మీదుగా కవి రచయిత మ్యాదరి సునీల్ కి ఘనంగా సన్మానం చేయడం జరిగింది జూకల్ గ్రామ ప్రజలు కూడా హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ సంస్థ ఇదివరకు
ప్రజా కవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు ప్రోపేసర్ జయశంకర్ సర్ లాంటి మహనీయులకు సన్మానం చేసిన సంస్థ నాకు చేయడం పూర్వజన్మ సుకృతంఅని అన్నారు,

చర్లపల్లి పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవం.

చర్లపల్లి పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవం.

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపా ధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ
పచ్చని చెట్లతో,పారే నదులతో,అందమైన పక్షులు, అలరించే జంతువులతో, ఎన్నో జీవుల్ని కలిగి వున్న గ్రహం ఈ భూమి.ఈ జీవులన్నిటి మనుగడకు కావలసినది నీరు.అటువంటి నీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని, ప్రజలకు అవగాహన కలిగించుటకు 1993వ సం॥లో ఐక్యరాజ్యసమితి మార్చి 22ని అంతర్జాతీయ జల దినోత్సవం’గా ప్రకటించిందని, భూమి ఏర్పడినప్పుడు ఎంత నీరయితే ఉందో,ఇప్పుడు కూడా అంతే నీరు ఉంది. పెరగడం కాని, తరగడం కాని లేదు.కానీ ప్రపంచ జనాభా నిత్యం పెరుగుతునే ఉంది. అందుకే కోట్లాది మంది నీటి కోసం కటకటలాడుతున్నారు. భూమి మీద ఉన్న నీటిలో 97% ఉప్పునీరు. కేవలం 3% మాత్రమే మంచినీరు. ఈ నీటిని మనం చాలా పొదుపుగా ఉపయోగించుకోవాలని, ప్రపంచంలో భారీయుద్ధాలలో చనిపోయిన వారికన్నా కలుషిత నీరు తాగడం వలన మరణించిన వారి సంఖ్య ఎక్కువని,సంవత్సరానికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి మరణిస్తున్నారని అన్నారు.
కాబట్టి,నీటిని పొదుపుగా వాడుట, కలుషితం అవకుండా కాపాడుట మన అందరి యొక్క బాధ్యత అని,సకల చరాచర జీవకోటికి ప్రాణాధారం నీరు,నీరు లేక జీవకోటి మనుగడ లేదని అన్నారు.అనంతరం జల ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కంచరాజు కుమార్,అంగన్వాడీ టీచర్స్ బీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్యా,విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

రక్తదాన శిబిరం విజయవంతం.

యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం

పరకాల నేటిధాత్రి

 

పట్టణంలోని గవర్నమెంట్ స్వతంత్ర సమరయోధులు షహిద్ భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి పురస్కరించుకొని సంవేదన 2లో భాగంగా నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్టిస్ట్స్ ఆక్టివిటీస్ (నిఫా), యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరకాల గవర్నమెంట్ హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ గౌతం చౌహాన్,నిఫా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కే.యాదవ రాజు,సామాజిక వేత్త టీ.వి అశోక్ కుమార్ లు హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుంచి దేశాన్ని రక్షించేందుకు ఎన్నో త్యాగాలు చేసిన మహానుభావులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని దేశ సమైక్యత సంస్కృతిక సాంప్రదాయాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.ఈ సందర్భంగా నిఫా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కే.యాదవ రాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ” గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ” సాధించడం కోసం 1,50,000 యూనిట్ల బ్లడ్ ను కలెక్ట్ చేయడం కోసం అంతర్జాతీయ స్థాయిలో 20 దేశాలలో,భారత్లో 28 రాష్ట్రాలు,6 కేంద్రపాలిత ప్రాంతాలు,800 జిల్లాలలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఈ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.గవర్నమెంట్ హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ గౌతం చౌహాన్,బ్లడ్ క్యాంపు ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ బ్లడ్ డోనర్ అండ్ బ్లడ్ మోటివేటర్,వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు ( స్విమ్మర్ రాజు ),కొత్తకొండ అరుణ్ కుమార్,ఎస్.కె ముస్తఫా ను అభినందించారు.ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా 35 మంది రక్తదానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పరకాల గవర్నమెంట్ హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ గౌతం చౌహాన్,నిఫా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కే.యాదవ రాజు,సామాజిక వేత్త టీ.వి అశోక్ కుమార్,బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలకృష్ణ,యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్,వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు),కానిస్టేబుల్ బొట్టు కమలాకర్,విజయ, చందర్రావు,సాధు ప్రసాద్, కునూరు గణేష్,బండి ప్రశాంత్,ఆనంద్,నరేష్, రాజేష్,రమేష్,సాంబరాజు, సంతోష్,శ్రీకాంత్,ఆనంద్, రాకేష్,వినయ్ కుమార్, రాజేష్,రంజిత్,రాజు,అనిల్, నాగరాజు,సాధు రోహిత్, అమర్నాథ్,సంతోష్,మధుకర్, సంజయ్ కుమార్,శివ సాయి, మడి కొండ సదానందం,మడి కొండ షిండే,ప్రవీణ్,రంజిత్, బండి శ్రీధర్,అన్వేష్, కోలా రాజేష్,ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజ్జెల సుమన్,అలువల పృథ్వి, ఉప్పరపల్లి రాజ్ కుమార్, మునిగాల రాంప్రసాద్,ఊరటి రవికుమార్,సృజన,జ్యోతి, భావన,బిటుకూరి యాకయ్య, పాలకుర్తి విష్ణు,ఎస్.కె ముస్తఫా,లీగల్ అడ్వైజర్ రాచకట్ల కృష్ణ (హైకోర్ట్ అడ్వకేట్),యాద రవి కుమార్, చెలిమల్ల అశోక్ కుమార్, తూనం రాము,సి.ఐ.ఎస్.ఎఫ్ కానిస్టేబుల్ వైనాల రమేష్, మండల భూపాల్,బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రోజా,ప్రమీల, ప్రశాంత్,సుమలత,రమేష్ విష్ణు లు పాల్గొన్నారు.

Blood donation

మురికి కాలువ నిర్మించిన తర్వాత రోడ్డు వేయాలి..

మురికి కాలువ నిర్మించిన తర్వాత రోడ్డు వేయాలి..

సంతకాలు సేకరించి మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేత..

రామాయంపేట మార్చి 22 నేటి ధాత్రి (మెదక్)

 

రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి బైపాస్ రోడ్డులో డబుల్ బెడ్ రూమ్ వద్దకు వెళ్లడానికి బీటి రోడ్డు మంజూరు అయింది. ఈ పనులు రెండు మూడు రోజుల్లో ప్రారంభిస్తారని తెలుసుకున్న కాలనీ ప్రజలు సంతకాలు సేకరించి మున్సిపల్ అధికారులకు అందజేశారు. ఈ ప్రాంతం చెరువు దగ్గర ఉండటం వల్ల చెరువుల నుండి , వర్షాలు పడితే వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చే పరిస్థితి ఉందన్నారు. ముందుగా సైడ్ డ్రెయిన్స్ నిర్మించిన తర్వాత రోడ్డు వేస్తే శాశ్వత పరిష్కారం ఉంటుందని కాలనీ ప్రజలు అన్నారు. ఒకవేళ ఇలా నిర్మించకుంటే మురికి నీరు వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చే దుస్థితి ఉందన్నారు. తాము అభివృద్ధికి ఏమాత్రం వ్యతిరేకం కాదని కానీ సైడ్ డ్రయిన్స్ నిర్మించిన తర్వాత రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై సదర్ కాంట్రాక్టర్ ను అడిగితే తమకు కేవలం రోడ్డు నిర్మాణానికి మాత్రమే తనకు నిధులు వచ్చాయని సైట్ డ్రీమ్స్ కు ఎలాంటి నిధులు రాలేదని కాంట్రాక్టర్ తెలిపారని వార్డు ప్రజలు అన్నారు. సైడ్ డ్రాయింగ్స్ వేయకుండా రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి అస్నుద్దీన్. ఎండి సల్మాన్. ఎస్.కె షకిల్. సయ్యద్ జియా. సయ్యద్ నాజర్ బాయ్. పల్లె పెంటయ్య. ఎరుకల పోచయ్య. పల్లె యాదగిరి. ఎరుకల మోహన్. శ్రీశైలం. పల్లె కృష్ణ. తదితరులు పాల్గొన్నారు.

Municipal officials.

ప్రపంచ నీటి దినోత్సవం…

ప్రపంచ నీటి దినోత్సవం

నిజాంపేట్, నేటి ధాత్రి

 

నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో శనివారం రోజున బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం కార్యక్రమాన్ని గ్రామంలో ర్యాలీతో విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించుకొని పాఠశాలలో నీటి వినియోగం గురించి విద్యార్థిని విద్యార్థులు మాట్లాడిన ఉపన్యాసంలో మొదటి బహుమతి రెండవ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా బాలవికాస సంస్థ నుండి ఈ గ్రామంలో గత 12 సంవత్సరాలుగా ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరును అందిస్తూ ప్రజల బాగోగులకు తోడ్పడింది.
జలమే జగతికిమూలఆధారం
జలమే ప్రగతికి ప్రణాధారం
జలమే మనకు ఆహారం
జలమే మనకు ఆరోగ్యం
జలాన్ని మనం రక్షిస్తే జలం మనం రక్షిస్తుంది.
నీరు కలుషితం కాకుండా నీటి స్వచ్ఛతను పెంచాలని తెలిపారు. నీటిని పొదుపుగా వాడాలి ఉన్న నీటిని కాపాడాలి. త్రాగునీరు సాగునీరు బాధలన్నీ అరికట్టుటకు యువత ముందడుగు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి,లలిత, సురేందర్, బాలవికాస సూపర్వైజర్ పరుశురాం,జోనల్ డైరెక్టర్ జీడి తిరుపతి గౌడ్, దుబాసి సంజీవ్, పాగాల ఎల్లం యాదవ్, బాలవికాస కమిటీ సభ్యులు మెట్టు వెంకట్, పోలు శ్రీనివాస్, దేవరాజు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

అక్రమ అరెస్టులను సహించేది లేదు…

అక్రమ అరెస్టులను సహించేది లేదు బిఆర్ఎస్వి కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి.

గంగాధర నేటిధాత్రి :

 

ఈరోజు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ముందస్తుగా అరెస్టు చేసి గంగాధర పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది, ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇలాంటి అరెస్టుల వాళ్ళ ప్రతిపక్షాల గొంతు నొక్కడం తప్ప వేరే ఏమీ లేదు అన్నారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని అడుగుతే అక్రమ అరెస్టుల అని తీవ్రంగా ఖండించారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో జారీ చేసిన సర్కులర్ ను వెంటనే వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాల రాస్తున్నారని ప్రజలు అన్నీ గమనిస్తున్నారు త్వరలో బుద్ధి చెప్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు
మధుసూదన్ రెడ్డి తో పాటు మండలాధ్యక్షుడు సాయిల్ల సంతోష్ అరెస్టయ్యారు

గడవు సమయంలో వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లను పూర్తి చేయాలి.

గడవు సమయంలో వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లను పూర్తి చేయాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి):

 

సిరిసిల్ల జిల్లా చేనేత వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం కేటాయించిన ఆర్డర్లను నిర్ణిత సమయంలో వస్త్ర ఉత్పత్తులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రభుత్వ ఆర్డర్ల పురోగతి పై సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వ్యాపారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ సమగ్ర శిక్ష శాఖ, సంక్షేమ శాఖలకు సంబంధించి ప్రభుత్వం వస్త్ర పరిశ్రమకు అందించిన ఆర్డర్ల వస్త్ర ఉత్పత్తిని నిర్ణీత సమయంలో పూర్తిచేసి సప్లై చేయాలని అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద మహిళా సంఘాలకు ఒక్కొక్కరికి రెండు చీరలు చొప్పున పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి సంబంధిత ఆర్డర్ ను సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కేటాయించడం జరిగిందని అన్నారు.
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద చీరల పంపిణీ కోసం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలకు వచ్చిన ఆర్డర్ పనులను వెంటనే ప్రారంభించి నిర్ణీత సమయంలో గడువులోగా ఉత్పత్తి చేసి సప్లై చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో చేనేత జౌళి శాఖ అధికారి రాఘవరావు, టెస్కో ప్రతినిధి శంకరయ్య,వస్త్ర పరిశ్రమ వ్యాపారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

లారీ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు.!

లారీ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు…

నేటి ధాత్రి / మర్చి 22

 

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని రాచూరు గ్రామంలో వింటేజ్ కంపెనీలో పని చేసే వంగూరు మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన శ్రీను మూడు నెలల క్రితం కల్వకుర్తి పట్టణంలో లారీ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న కంపెనీలో పని చేసే తోటి స్నేహితులు శనివారం రూ.60 వేలు బాధితుడికి అందజేశారు. శ్రీను కుటుంబానికి భవిష్యత్తులో అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొంగల్ల జగదీష్, గంగదారి శ్రీశైలం, రౌతు శ్రవణ్ కుమార్, బాలకృష్ణ, అనిల్ గౌడ్, మట్ట నరేష్, మల్లయ్య, వెంకటేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలి..

బహుళ జాతి మొక్కజొన్న సాగు చేసి అప్పుల భారంతో యువ రైతు మృతి…

మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలి..

మృతుని కుటుంబానికి నష్ట పరిహారం ఇస్తానన్నుఆర్గనైజర్

ప్రభుత్వ అధికారులు ఎవరికి న్యాయం చేస్తారు.

రైతుల గోడు పట్టించుకోని అధికారులు…రైతులక, ఆర్గనైజర్లక,

మొక్కజొన్న నకిలీ విత్తనాల ఆర్గనైజర్ లను వెంటనే శిక్షించాలి..

ఈ ప్రాంతంలో ఆదివాసి ఐకాన్

ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి బాండ్ డీలర్ షిప్ ఆదివాసులకే ఇవ్వాలి..

ముందస్తు అరెస్టులు ప్రజలు ఖండిస్తున్నారు…

నూగుర్ వెంకటాపురం

నేటి ధాత్రి / మర్చి 22

 

బహుళ జాతి మొక్కజొన్న హైటెక్ విత్తనం వేసి అప్పుల భారంతో ఆదివాసీ యువ రైతు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా,వెంకటాపురం మండలం,చిరుతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.ఈ ఘటనతో చిరుతపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారంగా,లేకం మధు అనే వ్యక్తి(26),తండ్రి వెంకన్న వెంకటాపురం గ్రామానికి చెందిన,హైటెక్ బహుళ జాతి కంపెనీ చెందిన ఆర్గనైజర్ హైటెక్ సమస్ట మొక్కజొన్న సాగుచెయ్యమని,ఎకరాకు 4 నుండి 5 టన్నుల దిగుబడి వచ్చి అధిక లాభాలు వస్తాయని,మాయమాటలు చెప్పగా దీన్ని నమ్మివ్యవసాయం చేసి పంట నష్టం రావడం తో పురుగు మందు త్రాగి మృతి చెందాడు. లేకం మధు అనే రైతు రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని,అదే భూమిలో హైటెక్ అనే బహుళ జాతి విత్తన ఉత్పత్తి సాగు చేయగా,ఎకరానికి ఒకటన్ను చొప్పున రెండు టన్నులు రాగా ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టడంతో ఆ రైతు అప్పుల భారంతో ఏం చేయాలో తెలియని స్థితిలో గుర్తుతెలియని క్రిమి సంహారకం మందు తాగాడు. కుటుంబ సభ్యులుగమనించి ఏరియా ఆసుపత్రి తరలించారు, అక్కడ పరిస్థితి విషమంగా మారడంతో ములుగు ఆసుపత్రి కి తరలించారు. అక్కడ పరిస్థితి పూర్తి విషమంగా మారడంతో వరంగల్ ఎం జీ ఎం ఆసుపత్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం 5గంటలకు మృతి చెందాడు. దీనితో అతని కుటుంబ తీవ్ర దిగ్బాంతినికి గురయ్యారు. వారి ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం స్పందించి ఆర్గనైజర్లపై చట్టపరమైన చర్యలు తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని లేఖం మధు మృత దేహం తో ప్రధాన రహదారి పై రాస్తా రోకో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు.దీనితో ప్రధాన రహదారి పై ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసు కున్న పోలీస్ శాఖ అధికారులు సిఐ బండారి కుమార్, ఎస్సై కె తిరుపతి రావు, పోలీస్ సిబ్బంది, సీఆర్పీఫ్ సిబ్బంది తో ప్రజలకు, ఎవరి ఏ హాని జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.హైటేక్ బహుళ జాతి మొక్క జొన్న కంపెనీ ఆర్గనైజర్ వచ్చి చనిపోయిన ప్రతి రైతుకు నష్టం పరిహారం ఇస్తానని అనడం తో రాస్తా రోకో విరమింప జేశారు. ఈకార్యక్రమంలో ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, గ్రామ ప్రజలు, ఆదివాసీ రైతులు, పాల్గొన్నారు.

అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం..

అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం

 

మందమర్రి నేటి ధాత్రి

 

బడ్జెట్లో విద్యా రంగానికి తీవ్రమైన అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్

 

బి ఆర్ ఎస్ వి మందమర్రి పట్టణ అధ్యక్షులు MD.ముస్తఫా ..

కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా విద్యా రంగానికి 15% బడ్జెట్ ను కేటాయించాలి.

అసెంబ్లీ ముట్టడి నిరసన గా ఈ రోజు ఉదయం 6 గంటలకు బి అర్ ఎస్ వి పట్టణ అధ్యక్షులు MD ,ముస్తఫా తో పాటు టౌన్ వైస్ ప్రెసిడెంట్ దాసరి నవీన్ మరియు md,తాజ్ గారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు.

అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం…

విద్యను పాతాళానికి తొక్కుతున్న రేవంత్ రెడ్డి సర్కార్

ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 7.53 శాతమే అనగా 23108 కోట్ల బడ్జెట్ ను విద్యా రంగానికి కేటాయించడం వల్ల విద్య పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన ముందు కనబడుతుంది అని అన్నారు.

ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్లు విద్యార్థులకు రావాల్సిన బకాయిలు అనగా స్కాలర్షిప్లు గాని ఫీజు రియంబర్స్మెంట్ గాని పెండింగ్లో ఉన్నాయి కానీ మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 23,108 కోట్లు మాత్రమే కేటాయించారు.ఈ బడ్జెట్ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా సరిపోని పరిస్థితి ఉన్నదని అని తెలిపారు.
హామీలు మాత్రం గంపేడిచ్చి బడ్జెట్ మాత్రం అరకొర కేటాయించి విద్యా వ్యవస్థను అందా:పాతాళానికి తొక్కడం దుర్మార్గం అని కోరారు.

ప్రతి విద్యార్థికీ 5 లక్షల విద్య భరోసా కార్డుకు బడ్జెట్ కేటాయింపు లో సున్నా అని కోరారు.ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఊసే లేదు..

ప్రతి మండలానికి ఒకటి అని చెప్పి నేడు నియోజకవర్గానికి ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామని అనడం దానికి బడ్జెట్ కేటాయించకపోవడం దుర్మార్గం.

ప్రతి మండలంలో నవోదయ విద్యాలయంతో పాటు సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం అని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కు సిగ్గు చేటు అని పేర్కొన్నారు.

ప్రతి మండల కేంద్రంలో హైస్కూల్ ఇంటర్ కాలేజీ మరియు ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ అదేవిధంగా జిల్లా కేంద్రంలో పీజీ కాలేజీ లను నిర్మిస్తామని చెప్పినారు కానీ బడ్జెట్ మాత్రం సున్నా కేటాయించారు ఎలా సాధ్యమవుతుందన్నారు.

3 లక్షల వార్షికో ఆదాయం లోపు ఉన్నవారికి బీసీలకు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు.
ఉన్నత చదువులు చదివే వారికి పది లక్షల వరకు రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.

ఉద్యమంలో చనిపోయిన విద్యార్థి అమరులకు 25వేల పింఛన్ హామీ పచ్చి మోసని తెలిపారు.

18 ఏళ్ల పైబడి చదువుకునే విద్యార్థినిలకు ఎలక్ట్రిక్ స్కూటీస్ ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు.

అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు 10 పాస్ అయితే 10000, ఇంటర్ పాస్ అయితే 15000, డిగ్రీ పాసైతే 25000, పీజీ పాస్ అయితే ఒక లక్ష, పిహెచ్డి ఎంఫిల్ పాస్ అయితే ఐదు లక్షలు ఇస్తా అని చెప్పడం పచ్చి మోసం. అని పేర్కొన్నారు.

ప్రశాంతంగా మొదటి రోజు పదవ తరగతి పరీక్షలు.

ప్రశాంతంగా మొదటి రోజు పదవ తరగతి పరీక్షలు

ముత్తారం :- నేటి ధాత్రి:

 

ముత్తారం మండలం ధర్యపూర్ మోడల్ స్కూల్ లో పదవ తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి పదో తరగతి పరీక్ష కేంద్రం వద్ద ముత్తారం ఎస్ ఐ నరేష్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీస్ సిబ్బంది పరీక్ష కేంద్రం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఎస్ ఐ నరేష్ తెలిపారు

ముత్యాల తలంబ్రాల కొరకు.!

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి ముత్యాల తలంబ్రాల కొరకు నగదు అందజేత

ఆలయ అభివృద్ధి కొరకు 10116నగదు అందజేత

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఏప్రిల్ ఆరవ తారీకు ఆదివారం నిర్వహించనున్న సీతారాముల కళ్యాణం కొరకు గణపురం వాస్తవ్యులు అయినా విశాఖపట్నంలో వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న తాళ్లపల్లి కిరణ్మయి రాజన్న దంపతులు స్వామివారి కళ్యాణానికి ముత్యాల తరంబ్రాల కొరకు 10116 రూపాయలను ఆలయ కమిటీ చైర్మన్ తాళ్లపల్లి గోవర్ధన్ కు అందజేయడం జరిగింది అదేవిధంగా రాజన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించనున్న సీతారామ కళ్యాణానికి ముత్యాల తలంబ్రాల ను పంపిస్తానని తెలపడం జరిగింది అదేవిధంగా గణపురం మండల కేంద్రానికి చెందిన కీర్తిశేషులు మేడిపల్లి ప్రమీల కొమరయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీనివాస్ శ్రీకాంత్ ఆలయ అభివృద్ధి కొరకు10116 రూపాయలను ఆలయ కమిటీ అధ్యక్షులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version