మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలి..

బహుళ జాతి మొక్కజొన్న సాగు చేసి అప్పుల భారంతో యువ రైతు మృతి…

మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలి..

మృతుని కుటుంబానికి నష్ట పరిహారం ఇస్తానన్నుఆర్గనైజర్

ప్రభుత్వ అధికారులు ఎవరికి న్యాయం చేస్తారు.

రైతుల గోడు పట్టించుకోని అధికారులు…రైతులక, ఆర్గనైజర్లక,

మొక్కజొన్న నకిలీ విత్తనాల ఆర్గనైజర్ లను వెంటనే శిక్షించాలి..

ఈ ప్రాంతంలో ఆదివాసి ఐకాన్

ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి బాండ్ డీలర్ షిప్ ఆదివాసులకే ఇవ్వాలి..

ముందస్తు అరెస్టులు ప్రజలు ఖండిస్తున్నారు…

నూగుర్ వెంకటాపురం

నేటి ధాత్రి / మర్చి 22

 

బహుళ జాతి మొక్కజొన్న హైటెక్ విత్తనం వేసి అప్పుల భారంతో ఆదివాసీ యువ రైతు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా,వెంకటాపురం మండలం,చిరుతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.ఈ ఘటనతో చిరుతపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారంగా,లేకం మధు అనే వ్యక్తి(26),తండ్రి వెంకన్న వెంకటాపురం గ్రామానికి చెందిన,హైటెక్ బహుళ జాతి కంపెనీ చెందిన ఆర్గనైజర్ హైటెక్ సమస్ట మొక్కజొన్న సాగుచెయ్యమని,ఎకరాకు 4 నుండి 5 టన్నుల దిగుబడి వచ్చి అధిక లాభాలు వస్తాయని,మాయమాటలు చెప్పగా దీన్ని నమ్మివ్యవసాయం చేసి పంట నష్టం రావడం తో పురుగు మందు త్రాగి మృతి చెందాడు. లేకం మధు అనే రైతు రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని,అదే భూమిలో హైటెక్ అనే బహుళ జాతి విత్తన ఉత్పత్తి సాగు చేయగా,ఎకరానికి ఒకటన్ను చొప్పున రెండు టన్నులు రాగా ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టడంతో ఆ రైతు అప్పుల భారంతో ఏం చేయాలో తెలియని స్థితిలో గుర్తుతెలియని క్రిమి సంహారకం మందు తాగాడు. కుటుంబ సభ్యులుగమనించి ఏరియా ఆసుపత్రి తరలించారు, అక్కడ పరిస్థితి విషమంగా మారడంతో ములుగు ఆసుపత్రి కి తరలించారు. అక్కడ పరిస్థితి పూర్తి విషమంగా మారడంతో వరంగల్ ఎం జీ ఎం ఆసుపత్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం 5గంటలకు మృతి చెందాడు. దీనితో అతని కుటుంబ తీవ్ర దిగ్బాంతినికి గురయ్యారు. వారి ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం స్పందించి ఆర్గనైజర్లపై చట్టపరమైన చర్యలు తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని లేఖం మధు మృత దేహం తో ప్రధాన రహదారి పై రాస్తా రోకో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు.దీనితో ప్రధాన రహదారి పై ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసు కున్న పోలీస్ శాఖ అధికారులు సిఐ బండారి కుమార్, ఎస్సై కె తిరుపతి రావు, పోలీస్ సిబ్బంది, సీఆర్పీఫ్ సిబ్బంది తో ప్రజలకు, ఎవరి ఏ హాని జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.హైటేక్ బహుళ జాతి మొక్క జొన్న కంపెనీ ఆర్గనైజర్ వచ్చి చనిపోయిన ప్రతి రైతుకు నష్టం పరిహారం ఇస్తానని అనడం తో రాస్తా రోకో విరమింప జేశారు. ఈకార్యక్రమంలో ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, గ్రామ ప్రజలు, ఆదివాసీ రైతులు, పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version