విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
నిజాంపేట, నేటిధాత్రి
నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి అన్ని తరగతుల్లో విద్యాబోధన అందించారు.వీరిలో ప్రధానోపాధ్యాయులుగా సింధు,
డీఈవోగా నవదీప్ గౌడ్, ఎంఈఓ గా సాత్విక్,లు ఉన్నారు. పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు చక్కటి విద్యను అందించారని ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించామన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు అరుణ, ఉపాధ్యాయులు వినోద్, శ్రీలత, రాజేందర్, శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్,ఇంతియాజ్ భాను, బాల్ లక్ష్మి,ప్రమీల,తదితరులు పాల్గొన్నారు.