చిన్నారి వైద్యచికిత్సల కోసం ఆర్ధిక సహాయం అందజేత.

చిన్నారి వైద్యచికిత్సల కోసం ఆర్ధిక సహాయం అందజేత

 

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:

 

గీసుకొండ మండల కేంద్రానికి చెందిన తాళ్లపెళ్లి రమేష్ – నాగమణిల కూతురు పుట్టిన కొన్ని రోజుల తర్వాత కడుపు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నది. నిరుపేద కుటుంబం కావడంతో ఆ చిన్నారి పాపకు వైద్య చికిత్స చేయించడానికి ఇబ్బందులు పడుతూ, సాయంఅందించాలని ప్రాధేయపడుతున్నారు.ఈ విషయాన్ని తెలుసుకున్న హన్మకొండలో ఉంటున్న గీసుకొండ గ్రామానికి చెందిన ఏనుగుల మంజుల -సాంబరెడ్డి దంపతులు మానవత్వంతో స్పందించి రూ.3వేలు పంపగా ఆ నగదును కర్ణకంటి రజిత -రాంమూర్తి దంపతులు ఆ చిన్నారి పాప తల్లికి అందజేశారు.ఈకార్యక్రమంలో స్థానికులు చాపర్తి రాజమ్మ పాల్గొన్నారు.

విజయవంతంగా ముగిసిన ఫిజియోథెరపీ చికిత్సలు.

కామారెడ్డి జిల్లా/పిట్లం నేటిధాత్రి:

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో శుక్రవారం భవిత సెంటర్లో ఫిజియోథెరపిస్ట్ డా. సారిక ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ చికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 8 మంది విద్యార్థులకు ఫిజియోథెరపీ చికిత్సలు అందజేసినట్లు డా. సారిక తెలిపారు.
ఈ సందర్భంగా డా. సారిక మాట్లాడుతూ, “తల్లిదండ్రులు ఇంటి వద్ద పిల్లలకు రోజు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయించడం అనేది ఎంతో ముఖ్యమైందని” సూచించారు. పిల్లల శారీరక మరియు మానసిక ఎదుగుదలతో పాటు ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో మేలైన మార్గమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమల కిషోర్, వికలాంగ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version